స్కూలు నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటనలో ఆరుగురు చిన్నారులు గాయాలపాలయ్యారు.
పెద్దముడియం: స్కూలు నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటనలో ఆరుగురు చిన్నారులు గాయాలపాలయ్యారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. జమ్మలమడుగుకు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు రోజూ ఆటోలో వచ్చి వెళ్తుంటారు. బుధవారం మధ్యాహ్నం ఆరుగురు విద్యార్థులతో బయలుదేరిన ఆటో చిన్నముడియం సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో చిన్నముడియం, చిన్నపసుపుల గ్రామాలకు చెందిన మూడు, నాలుగో తరగతుల చిన్నారులు గాయపడ్డారు. వారిని జమ్మలమడుగు ఆస్పత్రికి తరలించారు.