రెండు ఆటోలు ఢీ: 10 మందికి గాయాలు | 10 injured in road accident at guntur distirict | Sakshi
Sakshi News home page

రెండు ఆటోలు ఢీ: 10 మందికి గాయాలు

Mar 13 2015 10:27 AM | Updated on Aug 30 2018 3:56 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ కొనడంతో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి.

గుంటూరు: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు  ఢీ కొనడంతో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఈపురు మండలంలో శుక్రవారం జరిగింది. వివరాలు..గొల్లపల్లి మండలం నుంచి వినుకొండ వెళ్తున్న ఆటోను కొండ్రమట్ల నుంచి కూలీలతో వస్తున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని వినుగొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్నపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(ఈపురు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement