ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి | 1 person died in a accident | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి

May 13 2015 9:06 AM | Updated on Sep 29 2018 5:26 PM

చిత్తూరు జిల్లా యాదమరి మండలం కాశీరాలగొల్లపల్లి గ్రామం వద్ద ఓ ఇంట్లోకి లారీ దూసుకుపోవడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు.

యాదమరి (చిత్తూరు): చిత్తూరు జిల్లా యాదమరి మండలం కాశీరాలగొల్లపల్లి గ్రామం వద్ద ఓ ఇంట్లోకి లారీ దూసుకుపోవడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఒక గొర్రె మృతిచెందగా, ఆరు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. వివరాలు...చిత్తూరు నుంచి తమిళనాడులోని గుడియాత్తం వైపు వెళుతున్న లారీ కాశీరాలగొల్లపల్లి వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.

ఈ సంఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న గొర్రెలకాపరి కన్నయ్య మందడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందిన వెంటనే యాదమరి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారయ్యడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement