ట్రాక్టర్ బోల్తా : ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు | 1 died, 2 injured in road accident at kadapa distirict | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా : ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

Feb 10 2015 12:40 PM | Updated on Oct 30 2018 7:25 PM

ట్రాక్టర్ బోల్తా : ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు - Sakshi

ట్రాక్టర్ బోల్తా : ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

కడప జిల్లా చక్రాయ పేట మండలంలోని కే ఎర్రగుడి వద్ద మంగళవారం ట్రాక్టర్ బోల్తాపడింది.

కడప : కడప జిల్లా చక్రాయ పేట మండలంలోని కే ఎర్రగుడి వద్ద మంగళవారం ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నాగరాజు(28) అనే వ్యక్తి మృతి చెందాడు. లక్కిరెడ్డిపల్లె మండలం కోనంపేట అడవి నుంచి నల్లేరు మొక్కల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ముందు టైరు విరగడంతో రెండు పల్టీలు కొట్టి బోల్తాపడింది.

ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్తానికులు వెంటనే స్పందించి 108 కు సమాచారం అందించారు. గాయాలైన వారిని  కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్నపోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
(చక్రాయపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement