breaking news
-
చిత్ర కథలు (ఫొటోలు)
‘ఉద్యోగ’ దీక్షబూని..‘కొడితే కొట్టాలిరా.. సిక్స్ కొట్టాలి.. పడితే పట్టాలిరా.. కొలువు పట్టాలి’ అన్నట్టుగా ఉద్యోగ సాధన దీక్ష చేపట్టారు విజయనగరంలోని నిరుద్యోగులు. ప్రశాంత వాతావరణంలో తదేక దీక్షతో చదువుతూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. విజయనగరం కోటలోను, చుట్టుపక్కల గట్లు, చెట్ల కింద పదుల సంఖ్యలో నిరుద్యోగ యువత ఇలా చదువుతూ కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం రైల్ బస్సు.. ప్రయాణం మిస్సుప్రకృతి అందాల నడుమ విశేష సేవలందించిన రైల్ బస్సు మూలనపడింది. బొబ్బిలి–సాలూరు మధ్య 21 కి.మీ. మేర ఒక ఇంజిన్, రెండు బోగీలతో నడిచే ఈ రైల్ బస్సును 1993లో ప్రారంభించారు. 15 గిరిజన గ్రామాల మధ్య ఇది నడిచేది. ఈ రైలు బస్సును నడపలేక రైల్వే అధికారులు మూలనపెట్టేశారు. ప్రస్తుతం ఇది విశాఖలోని రైల్వే స్విమ్మింగ్ పూల్ ప్రాంతంలో ఇలా ఉండిపోయింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం ఇదేంటన్నా.. పోలీసన్నావాహన చోదకులు రహదారి నిబంధనలను అతిక్రమిస్తే.. అడ్డుకోవాల్సిన పోలీసులే నిబంధనల్ని అతిక్రమిస్తే ఏమనాలి. ఏమైనా అందామంటే.. వాళ్లు ఊరుకుంటారా. హెల్మెట్ ధరించకుండా మోటార్ సైకిల్పై నడపడమే కాకుండా.. సెల్ఫోన్ మాట్లాడుతూ కొందరు పోలీసులు ఇలా ముందుకు సాగిపోతున్నారు. నిబంధనల్ని తోసిరాజని నెల్లూరు ఓ కానిస్టేబుల్ మాగుంట లేఅవుట్ ప్రాంతంలో కెమెరా కంటికి చిక్కారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు ఫిలిప్పీన్స్ను భీకర తుపాను క్రతోన్ వణికిస్తోంది. ఇలొకొస్ నార్టె ప్రావిన్స్లోని బకర్రాలో వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను తరలిస్తున్న సహాయక సిబ్బంది క్రతోన్ తుపానుతో ఓ వైపు వర్షం కురుస్తుండగా ఆకాశంలో ఆహ్లాదం కలిగిస్తున్న ఇంద్రధనుస్సు. తైవాన్ రాజధాని తైపీలోనిదీ దృశ్యం. గ్రీస్లో కార్చిచ్చు వ్యాపించింది. ఆదివారం కొరింతియా ప్రాంతంలోని అనో లౌట్రో గ్రామం వైపు దూసుకొస్తున్న మంటల దృశ్యమిది. పితృ పక్షం సందర్భంగా సోమవారం బిహార్ రాష్ట్ర గయలోని దేవ్ఘాట్లో పిండ ప్రదానం చేస్తున్న ఓ విదేశీ భక్తురాలు దక్షిణ కొరియా రాజధాని సియోల్లో సోమవారం ‘మిస్ యూనివర్స్ కొరియా’ పోటీల్లో హొయలొలికిస్తున్న 81 ఏళ్ల చోయి సూన్ హ్వా. -
పాత, కొత్తల గందరగోళం..
భారతదేశంలో నేరాల దర్యాప్తులో సుదీర్ఘమైన ఆలస్యం ఒక మహమ్మారిలా పరిణమించింది. ఇందువల్ల నిందితులైన అనేకమంది అమాయకులు అనవసరంగా జైళ్లలో విచారణ ఖైదీలుగా మగ్గ వలసి వస్తోంది. కొందరైతే పది పదిహేనేళ్లు జైల్లో ఉండి చివరకు నిర్దోషిగా విడుదలయినవారూ ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు ఇలాంటి అమాయకుల సంఖ్య పెరగడానికి దోహదపడ తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ చట్టాలు పోలీసులకు అరెస్ట్ చేసి నిర్బంధించేందుకు అపరిమిత అధికారాలను కట్ట బెడుతున్నాయి.నేర విచారణ అత్యంత ఆలస్యంగా జరగడం వల్ల కొందరు డబ్బున్న పెద్దవాళ్లు బెయిలుపై బయటికి వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తున్నారు. అదేసమయంలో అమాయకులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఆ విధంగా కొత్త చట్టాలు ఉన్నవారికి చుట్టాలు కాబోతున్నాయి. చట్టాలలో మార్పులు తెస్తే మంచిదే. ఈనాటి అవసరాలకు అనుగుణంగా వాటిని సవరించాలనే లక్ష్యం ఉంటే సంతోషం. చట్టాల మరింత ఆధునికీకరణ, సరళీ కరణ నేటి సమాజానికి అవసరం. కానీ కొత్త నేరాల చట్టాల వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరిగేలా ఉంది. ఈ చట్టాల ద్వారా జరిమానాలను చాలా పెంచారు.ఇది సరికాదు. పోనీ కనీసం కొత్త చట్టాల అమలు ద్వారా అయినా సత్వర తీర్పులు వచ్చే అవకాశం కలిగితే కొంత సంతోషం కలిగేది. కానీ కనుచూపు మేర అది సాధ్య మయ్యేలా కనిపించడంలేదు. ఎందుకంటే కొత్తగా నమోదయ్యే కేసులను కొత్త చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న లక్షలాది కేసులను పాత క్రిమినల్ చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఒకే సమయంలో పాత, కొత్త చట్టాల కింద విచారించడానికి తగిన సిబ్బంది, వసతులూ భారతీయ న్యాయ వ్యవస్థకు లేకపోవడం ఇక్కడ గమనార్హం.కొత్త మూడు చట్టాల్లో రెండింటిలో కొంచెం మార్పులు చేసినట్లు కనిపించినా మూడోదైన సాక్ష్య చట్టం మక్కీకి మక్కీ పాతదే. ఇండియన్ శిక్షాస్మృతి అనే 1860 నాటి పరమ పాత (లేదా సనాతన) చట్టం... ‘భారతీయ న్యాయ సంహిత– 2023’ పేరుతో మళ్లీ తీసుకురావడం విడ్డూరం. ఏం సాధించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టాలను కొత్తగా తీసుకువచ్చిందో అర్థం కావడం లేదు. పార్లమెంట్లో స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితిలో లేని బీజేపీపై... భాగస్వామ్య పక్షాల్లో బలమైన టీడీపీ, జేడీయూ వంటివైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోవడం విచారకరం. ఇందువల్ల ఈ కొత్త చట్టాలు నిరా ఘాటంగా కొనసాగేందుకు అడ్డంకీ లేకుండా పోయింది. ఇప్పటికే పౌర హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలను దారుణ నిర్బంధానికి గురి చేస్తున్నారు.రాజకీయ కక్ష సాధింపులకు పాత నేరచట్టాలను ఉపయోగించే ఎన్నో దారుణాలకు పాల్పడింది బీజేపీ సర్కార్. ఇప్పుడు కొత్త చట్టాలను ఉపయోగించి మరెంత అన్యాయంగా వ్యవహరిస్తుందో అనే భయం ఎల్లెడలా కనిపిస్తోంది. వీటిని అడ్డుపెట్టుకొని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి మరింతగా ప్రయత్నించవచ్చు. ఇప్పటికే అనేక కేసులు బనాయించిన ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు తమ పార్టీలో చేరిన తరువాత వారిపై కేసులు ఎత్తివేయడమో, లేక విచారణను వాయిదా వేసేలా చూడడమో బీజేపీ చేస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో అమలులోకి వచ్చిన కొత్త చట్టాలు కేంద్ర పాలకు లకు ఇంకెంత మేలు చేకూర్చనున్నాయో! అంతి మంగా సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారనేది సుస్పష్టం.– మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త, మహేంద్ర యూనివర్సిటీ, ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
క్షయ.. వ్యాధి నిర్మూలనకై ప్రభుత్వం పటిష్ట చర్యలు!
కాకినాడ: క్షయ.. నోటి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణం మీదకు తెస్తుంది. ఈ వ్యాధికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతి సీహెచ్సీలో టీబీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఈవిధంగా జిల్లాలో మొత్తం 9 యూనిట్లు ఉన్నాయి. వీటిల్లో ఒక సీనియర్ టీబీ సూపర్వైజర్, ఒక సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు 10 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. క్షయ కేసులను గుర్తించేందుకు ప్రతి సీహెచ్సీలో ఎక్స్రే యూనిట్లు ఏర్పాటు చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 10 మంది టీబీ హెల్త్ విజిటర్లు పని చేస్తున్నారు. క్షయ వ్యాధిని నిర్ధారించేందుకు కాకినాడ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో రెండు సీబీ నాట్ మెషీన్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీలు, పీహెచ్సీల్లో 19 ట్రూనాట్ మెషీన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఆరోగ్య కేంద్రాన్ని మైక్రోస్కోప్ సెంటర్గా మార్చి టీబీ లక్షణాలున్న వ్యక్తి నుంచి కళ్లె (ఉమ్ము) సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఆ శాంపిల్లో టీబీ క్రిములుంటే ఆ వ్యక్తికి డాట్ ప్రొవైడర్ ద్వారా మందులు ఇస్తూ వ్యాధిని తగ్గించేందుకు 6 నుంచి 8 నెలల పాటు చికిత్స అందిస్తున్నారు. ఉచితంగా మందులు.. టీబీ చికిత్సకు జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా మందులు అందజేస్తున్నారు. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యులు సూచించిన విధంగా నిర్ణీత కాలం మందులు వాడకపోతే అది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారుతుంది. దీనికి రెండేళ్ల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. టీబీ నిర్మూలనకు రూ.2 లక్షల నుంచి రూ.18 లక్షల విలువ జేసే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. మందులు మింగించిన పర్యవేక్షకులకు (డాట్ ప్రొవైడర్కు) రూ. వెయ్యి నుంచి రూ.5 వేల పారితోషికం అందిస్తున్నా రు. క్షయ వ్యాధిగ్రస్తులకు నెలవారీ వైద్య ఖర్చులకు నిక్షయ పోషణ యోజన ద్వారా రూ.500 చొప్పున అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా క్షయతో బాధ పడుతున్న 1,743 మందికి గత ఏడాది ప్రతి నెలా రూ.500 చొప్పున రూ.4,19,7000 జమ చేశారు. ఆధునిక పరికరాలతో పరీక్షలు.. వ్యాధిని కచ్చితంగా నిర్ధారణ చేసే సీబీ నాట్ మెషీన్లు కాకినాడ జీజీహెచ్తో పాటు తాళ్లరేవు, పెద్దాపురం, పండూరుల్లోని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశారు. ఈ మెషీన్ హెచ్ఐవీ రోగులు, ఊపిరితిత్తుల వ్యాధులున్న వారు, చిన్న పిల్లలల్లో క్షయ, ఎండీఆర్ టీబీని గుర్తించడంలో కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,244 మంది క్షయ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వీరికి నిక్షయ్ మిత్ర ద్వారా, దాతల సహకారంతో పోషకాహార కిట్లు అందజేసేలా చర్యలు చేపట్టారు. ఇందులో 673 మంది నమోదు చేసుకుని రోగులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. వీరిలో కొంతమంది కొందరు రోగులను దత్తత తీసుకుని, మరీ వారికి కావాల్సిన పౌష్టికాహార కిట్లు అందజేస్తూండటం విశేషం. క్షయ నిర్మూలనే లక్ష్యం జిల్లాను క్షయ రహితంగా చేయడ మే లక్ష్యంగా టీబీ రోగులకు చికిత్స అందిస్తున్నాం. అదే సమయంలో నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2030 నాటికి క్షయ ముక్త భారత్ లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ జె.నరసింహ నాయక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, కాకినాడ. -
AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం
విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్. జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ మేరకు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్, కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జీ. శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెహానా గురించి.. రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యూరు. జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోధనాత్మక కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాలు, 2008 ముంబాయి మారణహోమం లైవ్ కవరేజ్, ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ వంటివి వీటిలో కొన్ని.. దక్షిణాన తమిళనాడు మొదలు ఉత్తరాన జమ్ము-కాశ్మీర్, పశ్చిమాన గుజరాత్ మొదలు తూర్పున త్రిపుర వరకు 17 రాష్ట్రల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచినప్పుడు నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు రెహానా ఖాతాలో ఉన్నాయి. భారత భూభాగంలో భారత-పాక్, భారత-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణం చేసి ప్రత్యేక కథనాలు అందించారు. గత ఏడాది టర్కీలో జరిగిన భూకంప ప్రళయాన్ని సాహసోపేతంగా కవర్ చేశారు రెహాన. రెహానా రాసిన పుస్తకాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో "సరిహద్దుల్లో.." పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం "ఫ్రాంటియర్" పేరుతో ఇంగ్లీషులో అనువాదం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనాన్ని "పెన్ డ్రైవ్" పేరుతో వెలువరించారు. టర్కీ భూకంప కవరేజ్ అనుభవాలతో టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు. అవార్డులు-రివార్డులు.. తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, తెలంగాణా ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, వివిధ సంస్థల పురస్కారాలు, అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. నిర్వర్తించిన ఇతర బాధ్యతలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యురాలు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ సభ్యురాలిగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇవి చదవండి: మనబడి ‘ఐబీ’కి అనుకూలం! -
Sakshi Whatsapp Channel: ఫాలో సాక్షి @ వాట్సాప్
వాట్సాప్ వాడుతున్నారు కదా.. ఓ అడుగు ముందుకేయండి. ఇప్పుడు వాట్సాప్ ఛానల్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటే మీకు నచ్చిన కంటెంట్ను, మీకు అనుకూలమైన సమయంలో, మీకు నచ్చినట్టుగా చూడొచ్చన్నమాట. దీనికోసం మీరు లోతుగా సెర్చ్ చేయాల్సిన పనే లేదు. మీ ఛాయిస్ .. వాట్సాప్ ఛానల్ వాట్సాప్ అంటే మెసెజ్లు, ఫోటోలు, వీడియోలే కాదు. గ్రూప్లు వచ్చినా.. చాలా లిమిటేషన్స్. కొత్తగా వచ్చిన ఫీచరే వాట్సాప్ ఛానెల్. దీని ద్వారా మీకు నచ్చిన మీడియాను ఎంచుకుని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాలో ఎలాగైతే ఎంపిక చేసుకుంటున్నామో.. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ కనిపించవు. సాక్షి వాట్సాప్ ఛానల్ ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం, సమకాలీన రాజకీయాలు, విశ్లేషణలు, పిక్టోగ్రాఫ్స్ వివరణలు, లేటేస్ట్ అప్డేట్స్ ఒకటేంటీ.. కావాల్సిన ముఖ్యమైన సమాచారన్నంతా.. వేగంగా మీ ముందుంచుతోంది సాక్షి. తెలుగు ప్రజలు కోరుకునే న్యూస్ను అత్యుత్తమ స్థాయిలో ఎంపిక చేసి సాక్షి వాట్సాప్ ఛానల్ మీకందిస్తోంది. ఫాలో అవ్వండిలా.. వాట్సప్లో మీకు పైన మూడు ఆప్షన్లు కనిపిస్తాయి... Chats, Updates, Calls. వీటిలో Updates క్లిక్ చేయండి. స్టేటస్లు దాని దిగువన ఛానెల్స్ కనిపిస్తాయి. మీకు Find Channel ఫైండ్ ఛానెల్ ఆప్షన్ కనిపిస్తుంది. సెర్చ్ చేస్తే Sakshi Telugu News మీకు కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్న ప్లస్ (+) సింబల్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఛానెల్ను ఫాలో కావొచ్చు. లేదా కింద కనిపిస్తోన్న QR కోడ్ స్కాన్ చేస్తే నేరుగా చేరొచ్చు. ప్రయోజనాలేంటీ? ఒక సారి ఫాలో అయితే అప్డేట్స్ వాటంతటే అవి కనిపిస్తాయి నోటిఫికేషన్స్ తరహాలో మిమ్మల్ని ఎక్కడా చికాకు పెట్టవు మీకు నచ్చిన సమయంలోనే లింకు క్లిక్ చేసి చూడొచ్చు లేటేస్ట్ అప్డేట్స్ క్షణాల్లో అందుకోవచ్చు వార్తలపై ఎమోజీ ద్వారా ఫీడ్బ్యాక్ ఇవ్వొచ్చు మీ వ్యక్తిగత సమాచారం ఎవరికీ కనిపించదు మీ ఫోటో, నెంబర్ కూడా కనిపించవు -
దేవరగట్టు బన్నీ ఉత్సవం.. ఈసారైనా ప్రశాంతంగా జరుగుతుందా..!?
సాక్షి, కర్నూలు: దేవరగట్టులో ప్రతీ ఏడాది దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం కర్రల యుద్ధంగా జరుగుతుంది. అర్ధరాత్రి వేళ మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో అక్కడి స్థానిక ప్రజలు బన్నీ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాంప్రదాయం, ఆచారం పేరిట ఈ భక్తి పోరాటం కొనసాగుతుంది. ఈ ఉత్సవంతో అక్కడి వాతావరణం ప్రతీసారి ఓ వైపు కోలాహలంగానూ, మరోవైపు నెత్తురుమయంగానూ వేడుక జరుగుతుంది. ఈ వేడుక ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. అక్కడి ఆచార సాంప్రదాయం ఇలా.. ఈ బన్నీ ఉత్సవ యుద్దానికి పూర్వ చరిత్ర ఉంది. మాలమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకంతో.. ఉత్సవం యుద్ధానికి సిద్ధమవుతున్నారు అక్కడి ప్రజలు. ప్రతీ ఏడాది జరుగుతున్న ఈ సమరంలో అనేక మందికి గాయాలయ్యి, తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇదివరకూ అనేకసార్లు జరుగుతూ వస్తుంది. అయినా ఈ ఉత్సవం ఇలా జరగడంలోనే బాగుందంటున్నారు అక్కడి స్థానికలు. మా ఆచార సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తాం.. మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో వెనుకడుగు వేసేది లేదంటున్నారు స్థానిక భక్తులు. పూర్తి బందోబస్తు.. ప్రతి ఏటా ఇలాగే జరుగుతున్న బన్నీ ఉత్సవాలలో ప్రశాంతత నెలకొల్పడానికి పోలీసు, పై అధికారశాఖ సిద్ధంగా ఉందా? అనే విషయాలపై పోలీసుశాఖ అవుననే అంటుంది. దేవరగట్టులో రక్తపాతం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈసారి బందోబస్తు ముమ్మరం చేశామన్నారు. ఆచారం పేరిట కొనసాగుతూ వస్తున్న ఈ అపశ్రుతి పోరాటాన్ని నిలపనున్నారు. భక్తులు నాటుసారా సేవించకుండా కట్టడి చేయనున్నారు. ఇనుప చువ్వల కట్టెలు వాడకుండా చర్యలు తీసుకుంటూ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రశాంతమైన వేడుక జరిగేలా ఉత్సవ కమిటీతో మాట్లాడారు. ఈ ఏడాది కఠినమైన రక్షణ చర్యలు తప్పవంటున్నారు. ఈ ఉత్సవంలో వేల సంఖ్యల్లో భక్తులు పాల్గొననున్నారు. ప్రమాదమైన ఈ సంప్రదదాయ ఆచారాన్ని ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నానికి పూనుకుంటున్నారు అక్కడి పొలిసు అధికారులు. -
‘పరిపాలన’కు విశాఖ ముస్తాబు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దసరా వచ్చిందయ్యా.. పరిపాలన రాజధాని తెచ్చిందయ్యా అంటూ విశాఖ నగరం అందంగా ముస్తాబవుతోంది! వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అధికారులకు నివాస భవనాలను సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతమైంది. హిల్–3లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని గుర్తించినట్లు తెలుస్తోంది. హిల్ 1, 2ల్లో నివాసయోగ్యమైన భవనాలను అధికారులకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అక్టోబరు చివరినాటికి నిర్మాణం పూర్తయ్యే పలు భవనాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. తుది దశ భవనాల వివరాల సేకరణ విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. హిల్ 1, 2ల్లో నివాసయోగ్యమైన భవనాల విస్తీర్ణం సుమారు 40 వేల చదరపు అడుగుల మేర ఉంటుందని లెక్కగట్టారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ ప్రైవేట్ భవనాలను కూడా గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రధానంగా రానున్న రెండు నెలల్లోగా పూర్తయ్యే భవనాలపై దృష్టి సారించారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంతో పాటు స్థానిక సచివాలయాల ద్వారా ఈ వివరాలను సేకరిస్తున్నారు. వీటి విస్తీర్ణం ఎంత మేర ఉంటుందనే వివరాలు ఈ నెలాఖరు నాటికి సిద్ధమవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వివరాలు అందుబాటులోకి వచి్చన తర్వాత వాటిని లీజుకు తీసుకుని ఏయే విభాగాలను ఏర్పాటు చేయవచ్చనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఇప్పటికే ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న అదనపు విస్తీర్ణం ఎంత? అక్కడ ఏ విభాగాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది? అనే వివరాలను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. -
ప్రపంచ బ్యాంకులో ఏపీ పలుకు‘బడి’
సాక్షి, అమరావతి: పేదరికం, అసమానతలను తగ్గించేందుకు విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని, అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విద్యా సంస్కరణలను చేపట్టారని రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న 10 మంది విద్యార్థుల బృందం అమెరికాలో ఐక్యరాజ్యసమితి సదస్సుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ నేతృత్వంలో వాషింగ్టన్ వెళ్లిన విద్యార్థుల బృందం అక్కడ ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో సోమవారం బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, సీఎం జగన్ సంక్షేమ పథకాల ద్వారా అందిస్తున్న మేలును ఇంగ్లిష్లో చక్కగా వివరించారు. ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్థులు సోదాహరణంగా సమాధానాలు చెప్పారు. విద్యా సంస్కరణలతో ఎంతో మార్పు.. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు సమాజంలో ఎంతో మార్పును తీసుకొచ్చాయని రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా మారాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న తాము నేడు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు వరకు వచ్చి మాట్లాడుతున్నామంటే.. ఏపీలో పేదరిక నిర్మూలన, విద్యకు సీఎం వైఎస్ జగన్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నాడు–నేడు: మనబడి, పేద పిల్లలు అంతర్జాతీయంగా ఉన్న పోటీని తట్టుకుని ఎదిగేందుకు విద్యకు ఇస్తున్న ప్రాధాన్యం, డిజిటల్ ఎడ్యుకేషన్, టోఫెల్ శిక్షణ, ట్యాబ్స్ పంపిణీ వంటి అంశాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు విద్యార్థులు వివరించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలవారు ఉన్నత చదువులు అభ్యసించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. నాడు నేడు కింద పాఠశాలల్లో సకల వసతులు కల్పించడమే కాకుండా జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, ట్యాబ్స్ పంపిణీ తదితరాల గురించి వివరించారు. సాధారణ ప్రభుత్వ స్కూళ్ల నుంచి వచ్చిన తాము ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై మాట్లాడడం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు అందిన గౌరవంగా పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సహకారం అందిస్తాం! ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు.. విద్యార్థులు చెప్పిన అంశాలను ఆసక్తిగా విని విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పేదరిక నిర్మూలన, విద్యారంగం అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషిని వారు అభినందించారు. ఈ రంగంలో తాము కూడా పాలుపంచుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు. విద్యా సంస్కరణలను ప్రభావవంతంగా అమలు చేసేందుకు కావాల్సిన యంత్రాంగంపై అభిప్రాయాలు చెప్పాలని విద్యార్థులను కోరారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు విజయవంతం కావడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా తల్లులను చైతన్యవంతం చేసిందని విద్యార్థులు వెల్లడించారు. ఈ విధానం ఎంతో ఉత్తమమైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తమ ఆలోచనలను మారి్పడి చేసుకునేందుకు, వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై చర్చించేందుకు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను కోరారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో విద్యా మారి్పడి కార్యక్రమాలను ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణం, సంస్కృతిపై క్లబ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని దేశాల్లో మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టి రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించాలని విద్యార్థులు కోరారు. చరిత్ర సృష్టించిన ప్రభుత్వ పాఠశాలల విధ్యార్ధులు భారత్లో సాంకేతిక విద్యను మెరుగుపరచడం, విద్యార్థులకు మరిన్ని కెరీర్ అవకాశాలను అందించడం కోసం జూన్ 23న ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు 255.5 మిలియన్ల డాలర్ల రుణాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారత్లో పేద విద్యార్థుల ప్రగతి కోసం సహకారం అందిస్తామని హామీ కూడా ఇచి్చంది. ఈ క్రమంలో ఏపీ విద్యార్థులు ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ప్రసంగించడం, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, విద్యా సంస్కరణలను లబ్ధి పొందిన విద్యార్థులే స్వయంగా వివరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థుల బృందం అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. వరల్డ్ బ్యాంకు ప్రతినిధులతో సమావేశంలో ప్రపంచ బ్యాంక్ సీనియర్ అనలిస్ట్ ట్రేసీ విల్లిచౌస్కీ, సీనియర్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ లారా గ్రెగొరీ, లీడ్ హెల్త్ స్పెషలిస్ట్ రిఫత్ హసన్, పబ్లిక్ ఎంగేజ్మెంట్ ఆఫీసర్ లిలౌతో పాటు సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ పాల్గొన్నారు. -
కవిత్రయం తరువాత సిసలైన కవి జాషువా
ఏఎన్యూ: కవిత్రయం తరువాత తెలుగులో సిసలైన కవి గుర్రం జాషువా అని అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు అన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యూనివర్సిటీ తెలుగు విభాగం, ఏపీ అధికార భాషా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి ముందస్తు వేడుకలు మంగళవారం జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన విజయబాబు మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న ఛీత్కారాలను సత్కారాలుగా మలచుకున్న దార్శనికుడు జాషువా అని చెప్పారు. వీసీ పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. జాషువా విశ్వజననీయమైన రచనలు చేశారన్నారు. జాషువా తన సాహిత్యం ద్వారా విశ్వాన్ని జాగృతం చేశారన్నారు. రెక్టార్ పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ బి.కరుణ, పాలక మండలి సభ్యురాలు సీహెచ్.స్వరూపరాణి, సీడీసీ డీన్ కె.మధుబాబు, ప్రిన్సిపాల్స్ పి.సిద్దయ్య, శ్రీనివాసరెడ్డి, ప్రమీలారాణి ప్రసంగించారు. సాహితీ పురస్కారాలు ప్రదానం తెలుగు భాషా సాహిత్యంలో విశేష సేవలు అందించిన దుగ్గినపల్లి ఎజ్రయ్య, కొమ్మవరపు విల్సన్రావు, విడదల సాంబశివరావు, పోగుల విజయశ్రీ, కొండపల్లి సుదర్శనరాజు, గుమ్మ సాంబశివరావు, కాకాని సుధాకర్, సీహెచ్ స్వరూపరాణి, గుమ్మడి విజయ్కుమార్, డి.అనిల్కుమార్, పీవీ సుబ్బారావుకు సాహితీ పురస్కారాలు ప్రదానం చేశారు. వ్యాసరచన, వక్తృత్వం పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. -
ఫుట్బాల్కు అత్యంత ఆదరణ కల్పిస్తాం..!
అనంతపురం: రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడకు అత్యంత ఆదరణ కల్పిస్తామని ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. అనంతపురం నగర శివారులోని అనంత క్రీడా గ్రామం (ఆర్డీటీ స్టేడియం)లో మంగళవారం ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలుర జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్–2023 పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. మన గ్రామీణ ప్రాంతాలకు సరిపోయే క్రీడ ఫుట్బాల్ అని, ఇందులో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వివిధ స్థాయిల్లో పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇకనుంచి క్రికెట్తో పాటు ఫుట్బాల్ కూడా ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలకమైన క్రీడగా ఉండాలని భావిస్తున్నామన్నారు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఫైనల్కు చేరితే మ్యాచ్ను వీక్షించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్దరెడ్డిని ఆహ్వానిస్తామని చెప్పారు. కలెక్టర్ ఎం.గౌతమి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ, శాప్ బోర్డు డైరెక్టర్ డానియల్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్, సిక్కిం జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ 1–1 స్కోరుతో డ్రాగా ముగిసింది. -
ఇద్దరు ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ఉత్తమ సేవా పురస్కారాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు జాతీయ ఉత్తమ సేవా పురస్కారాలకు ఎంపికైనట్లు ఏపీ జాతీయ సేవా పథకం అధికారి డాక్టర్ పి.అశోక్రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని జాతీయ సేవా పథకం కింద వివిధ సేవలను సమర్థవంతంగా నిర్వహించినందుకు 2021–22గానూ కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ పురస్కారాలను ప్రకటించిందన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి వర్సిటీ పరిధిలోని జగన్స్ డిగ్రీ–పీజీ కళాశాలకు చెందిన పెళ్లకూరు సాత్విక, అనంతపురం జిల్లా శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీకి చెందిన కురుబ జయమారుతి ఉత్తమ వలంటీర్లుగా ఎంపికయ్యారని చెప్పారు. ఈ నెల 29న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ఇద్దరు వలంటీర్లకు రూ.లక్ష నగదు, మెడల్, సర్టిఫికెట్తో కూడిన పురస్కారాన్ని ప్రదానం చేస్తారన్నారు. -
జస్టిస్ సోమయాజులు పదవీ విరమణ!
సాక్షి, అమరావతి: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు çపలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ సోమయాజుల కుటుంబ సభ్యులు, విశ్రాంత న్యాయమూర్తు లు, రిజి్రస్టార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. అడ్వొ కేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎన్. హరినాథ్ మాట్లాడారు. అన్ని రకాల కేసులను పరిష్కరించారు : సీజే తొలుత.. సీజే జస్టిస్ ధీరజ్సింగ్ మాట్లాడుతూ, న్యాయవ్యవస్థకు జస్టిస్ సోమయాజులు అందించిన సేవలను కొనియాడారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా విజయవంతంగా విధులు నిర్వర్తించారన్నారు. కుటుంబం నుంచి న్యాయ వారసత్వాన్ని కొనసాగించారని తెలిపారు. జిల్లా కో ర్టులో న్యాయవాదిగా ఉంటూ న్యాయమూర్తి అయి న తొలి వ్యక్తి రాష్ట్రంలో సోమయాజులేనన్నారు. ఆయన పదవీ విరమణతో న్యాయవ్యవస్థ ఓ మంచి న్యాయమూర్తి సేవలను కోల్పోయిందన్నారు. ఆయన విశ్రాంత జీవితం ప్రశాంతంగా, ఆయురారోగ్యాలతో కొనసాగాలని సీజే ఆకాక్షించారు. మంచి వాదనలతోనే మంచి తీర్పులు : జస్టిస్ సోమయాజులు అనంతరం.. జస్టిస్ సోమయాజులు మాట్లాడుతూ, ఓ న్యాయమూర్తిగా కక్షిదారులకు న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశానన్నారు. న్యాయమూర్తిగా తన ఇన్నేళ్ల ప్రస్తానంలో తనకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదులు వినిపించే మంచి వాదనలతోనే మంచి తీర్పులు ఇవ్వడం సాధ్యమైందన్నారు. జస్టిస్ సోమయాజులు దంపతులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. వారికి శాలువా కప్పి చిత్రపటం బహూకరించారు. -
ఇండియా రికార్డ్స్లో ‘వేదాన్షి’కి స్థానం!
కాకినాడ: రౌతులపూడి మండలంలోని ములగపూడి గ్రామానికి చెందిన యామల గజ్జన్నదొర, వరలక్ష్మి దంపతుల రెండున్నరేళ్ల కుమార్తె ‘వేదాన్షి’కి ఇండియా రికార్డ్స్–2023లో స్థానం లభించింది. ఈ విషయాన్ని చిన్నారి తండ్రి గజన్నదొర గురువారం విలేకర్లకు తెలిపారు. అతి చిన్న వయస్సులో జంతువులు, పండ్లు, కూరగాయలు, వాహనాలు, రంగులు, ఆకారాలు, శరీర అవయవాలు వంటి 26 రకాల పేర్లను సులభంగా గుర్తించి, పలకడంతో ఆమెకు ఇండియా రికార్ుడ్సలో స్థానం లభించినట్టు వివరించారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి అవార్డును కొరియర్ ద్వారా అందుకున్నట్లు తెలిపారు. ఇండియా రికార్డ్స్లో స్థానం సాధించిన వేదాన్షి, ఆమె తల్లిదండ్రులను పలువురు అభినందించారు. -
ఇది సీఎం జగన్ పట్టుదల, దక్షతలకు నిదర్శనం
పేదలకు మేలు జరుగుతుందన్న విశ్వాసం కలిగితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతదాకా అయినా వెళ్లడానికి వెనుకాడరు అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లేదేమో. తను నమ్మిన న్యాయం కోసం ఆయన పోరాడతారు. సాధించి తీరుతారు.రాజధాని అమరావతి గ్రామాలలో పేదలకు 50 వేలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన తీరు, తదుపరి వారందరికి ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించిన వైనం చూసిన తర్వాత ఏపీలో పేద వర్గాలకు మరింత భరోసా దక్కినట్లయింది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, మరో పక్క ఈనాడు వంటి మీడియా సంస్థలు వేటకుక్కల మాదిరి వెంబడిస్తున్నా జగన్ ఎక్కడా తొణకలేదు. బెణకలేదు. పేదల పట్టాల పంపిణీ కి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడితే దానిని చెడగొట్టాలని కొందరు ప్రయత్నం చేయకపోలేదు. కాని పోలీసులు సమర్ధంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చేశారు.కాని రైతుల ముసుగులో కొంతమంది నల్లజెండాలు, నల్ల బెలూన్లు వంటివాటితో నిరసన తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిరసనగా కూడా సరిగ్గా ఇలాగే బెలూన్ లు ఎగురవేశారు. కాని ఆ తర్వాత ఏమైందో అంతా చూశారు. మోదీ మరోసారి ఎన్నికై దేశానికి ప్రదానమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా కూడా జరిగే ప్రయత్నాలు అలాగే ఉన్నాయి. అమరావతిలో పేదలకు భూములు ఇవ్వడానికి అడ్డుతగులుతున్నారన్న విషయం రాష్ట్రం అంతా తెలిసిపోవడం వల్ల టీడీపీకి భారీగా నష్టం వాటిల్లిందట. ఈ విషయం వారి సొంత సర్వేలలో తేలిందట. దాంతో అమరావతి గ్రామాలలో శుక్రవారం చాలా తక్కువ స్థాయిలోనే ఈ నిరసనలు జరిగాయని చెప్పాలి. టీడీపీ నేతలు నేరుగా రంగంలోకి రాకుండా కొంతమేర జాగ్రత్తపడ్డారని అనుకోవచ్చు. జెఎసి నేతల పేరుతోనో, ఊరు,పేరు లేని రాజకీయ పార్టీ నేత పేరుతోనో ఆందోళన చేయించాలని చూశారు. వారి దీక్ష శిబిరాల వద్ద ఉద్రిక్తత సృష్టించాలని యత్నించారు. పోలీసు అధికారులు మహిళలను ఏదో అన్నారని ప్రచారం చేశారు. వాటిని పెద్ద,పెద్ద అక్షరాలతో ఈనాడు పత్రికలో అచ్చేయించారు. అయినా ప్రజలలో పెద్ద కదలిక రాలేదు. యధాప్రకారం పది, ఇరవై మంది వారి శిబిరంలో కనిపించారు. పేదల పట్టాల విషయంలో తెలుగుదేశం కు కొమ్ముకాసిన వామపక్షాలు కూడా కాస్త సిగ్గుపడినట్లుగా ఉంది. వారు ఎక్కడా ప్రత్యక్ష నిరసనలలో కనిపంచలేదు. మరో వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలకు పట్టాల పంపిణీకి కార్యక్రమం నిర్వహిస్తే వేలాది మంది తరలివచ్చి ఆయనకు జేజేలు పలికారు. జగన్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సామాజిక అమరావతికి శ్రీకారం చుట్టామని అన్నారు. అంటే ఏదో ఒక కులం, ఒక వర్గం ప్రాధాన్యత కాకుండా, అందరికి సమప్రాతినిద్యం లబించేలా పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం అన్నమాట. గతంలో పేదలకు పట్టాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రైతుల పేరుతో తెలుగుదేశం నేతలు కోర్టుకు వెళ్లినప్పుడు సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వాదించారు. దానికి జగన్ ఇప్పుడు సమాదానం ఇచ్చినట్లయింది.పేదలకు, పెత్తందార్లకు మద్య పోరాటంగానే జగన్ తీసుకువెళుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సెంటు స్థలం స్మశానం, అని సమాధి అని చేసిన తెలివితక్కువ వ్యాఖ్యల ప్రభావం కూడా బాగానే ఉందనిపించింది. లబ్దిదారులు కొందరు దీనిపై ఆయన మీద మండిపడ్డారు. ఒక మహిళ అయితే ముసలినక్కలు తమకు స్థలాలు రాకుండా అడ్డుకోవాలని చూశాయని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం నేతలు కాని, జెఎసి నేతలు కాని గతంలో హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పులు వస్తే తమదే విజయం అని, ప్రభుత్వం దానిని పాటించాలని అంటుండేవారు. కాని ఇప్పుడు ఇళ్ల పట్టాల కేసులో సుప్రింకోర్టు తీర్పు పేదలకు అనుకూలంగా అంటే ప్రభుత్వ వాదనను బలపరిచేలా వచ్చినా వీరు ఆందోళన వీడడం లేదు. విమర్శలు ఆపడం లేదు. పేదల స్థలాల పంపిణీని ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఇదంతా చంద్రబాబు చేసిన నిర్వాకమే అని చెప్పాలి. ఆయన అనవసరంగా వేల ఎకరాల పచ్చని పంటల భూమిని సమీకరించి ,రైతులకు పని లేకుండా ఏడాదికి ఏభైవేల రూపాయల కౌలు ఇవ్వడానికి అంగీకరించిన ఫలితమే ఈ తలనొప్పి అని చెప్పాలి. అదే ఏ వెయ్యో, రెండువేల ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే ఏ గొడవ ఉండేదికాదు. అప్పుడు ఏ పేదలకు ఎక్కడ నివాస స్థలాలు ఇచ్చినా ఎవరూ కాదనేవారు కాదు. అలాకాకుండా మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చడంతో వచ్చిన చిక్కు ఇదంతా. తను తీసుకు వచ్చిన చట్టంలోనే ఐదు శాతం భూమి పేదలకు ఇవ్వాలని ఉంది. దానిని అమలు చేస్తుంటే ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.పట్టాల పంపిణీ సభలో మాట్లాడిన ఇద్దరు మహిళలు తమ ఆవేదనను పంచుకుంటూ సొంత ఇల్లు అన్నది తమ చిరకాల వాంఛ అని, దానిని జగన్ తీర్చారని చాలా సంతృప్తిగా మాట్లాడారు. ఒకరైతే కన్నీటి పర్యంతం అయ్యారు. కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుపడుతున్నా, జగన్ తమకోసం పోరాడారని వారు అభిప్రాయ పడ్డారు. ముఖ్యమంత్రి కూడా వచ్చే జూలై ఎనిమిది అంటే దివంగత తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నాటికి ఈ స్థలాలలో ఇళ్ల నిర్మాణం ఆరంభం అవుతుందని ప్రకటించడం లబ్దిదారులలో ఎంతో సంతోషం కలిగించింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నరకాసురుడిని అయినా నమ్మవచ్చేమో కాని, నారా చంద్రబాబును మాత్రం నమ్మవద్దని కొత్త డైలాగు విసిరారు. యదా ప్రకారం ఎల్లో మీడియా తన ప్రభుత్వానికి సృష్టిస్తున్న అడ్డంకులను ప్రజలకు వివరించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం చానల్ ఒకటి టీడీపీ అధికారంలోకి రాగానే ఈ పట్టాలు రద్దు అవుతాయని దుర్మార్గంగా ప్రచారం చేసిందని వ్యాఖ్యానించారు.వైసిపి ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాజదానిలో ఇళ్ల స్థలాల పంపిణీని ఒక వారం రోజుల కార్యక్రమంగా రూపొందించింది. తద్వారా రాష్ట్రవ్యాప్త ప్రజలపై ఒక ప్రభావం పడాలని యత్నిస్తోంది. తెలుగుదేశం పార్టీ పేదల వ్యతిరేక పార్టీ అని, వారికి మేలు చేస్తుంటే చూడలేకపోతోందని వైసిపి ప్రచారం చేయడానికి ఈ అవకాశం వినియోగించుకుంటుంది. అందుకు తెలుగుదేశం పార్టీనే చాన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా జగన్ పట్టుదల, దక్షతలకు ఈ ఇంత వేగంగా ఈ ఇళ్ల స్థలాల పంపిణీ నిదర్శనం అని చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్