breaking news
-
కడపలో వైఎస్సార్సీపీ నేత దారుణహత్య
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని సంధ్యాసర్కిల్ సమీపంలో శుక్రవారం వైఎస్సార్సీపీ నాయకుడు సి.శ్రీనివాసులరెడ్డి (42) దారుణహత్యకు గురయ్యాడు. బురఖాలు ధరించి మాటువేసిన దుండగులు ఒక్కసారిగా కొడవళ్లతో దాడిచేశారు. పిడిబాకులతో విచక్షణారహితంగా పొడిచారు. దుండగుల నుంచి తప్పించుకునే క్రమంలో పరుగెత్తిన శ్రీనివాసులరెడ్డి వందడుగుల దూరంలో కుప్పకూలిపోయాడు. సినిమా ఫక్కీలో హత్యచేసిన దుండగులు పరారయ్యారు. పోలీసుల కథనం మేరకు.. కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం చిన్ననాగిరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి కొన్నేళ్లుగా కడపలో నివాసం ఉంటున్నాడు. వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేస్తూ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నాడు. రోజూ సంధ్యాసర్కిల్ సమీపంలో ఎర్రముక్కపల్లి దారిలో ఉన్న రాబిట్ జిమ్కు వ్యాయామానికి వెళ్లేవాడు. ఆయన కదలికలను గమనించిన దుండగులు శుక్రవారం ఉదయం జిమ్ సమీపంలో బురఖాలు ధరించి మాటువేశారు. శ్రీనివాసులరెడ్డి జిమ్ నుంచి బయటకు రాగానే మారణాయుధాలతో ఒక్కసారిగా దాడిచేశారు. కత్తిపోట్లకు గురైన శ్రీనివాసులరెడ్డి దుండగుల నుంచి రక్షించుకునేందుకు కొద్దిదూరం పరుగెత్తి కుప్పకూలిపోయాడు. అతడు రక్తపుమడుగులో తీవ్రగాయాలతో పడిపోవడంతో నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న శ్రీనివాసులరెడ్డి భార్య మౌనిక అక్కడికి చేరుకుని స్థానికుల సహకారంతో భర్తను రిమ్స్కు తరలించారు. రిమ్స్కు చేరిన కొద్దిసేపటికే శ్రీనివాసులరెడ్డి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాసులరెడ్డి హత్యకు నిందితులతో ఉన్న ఆర్థిక లావాదేవీలు, భూ తగాదాలే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితుల్ని పట్టుకునేందుకు కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ సారథ్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేస్తున్న శ్రీనివాసులరెడ్డి హత్యపట్ల ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి తీవ్ర ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుడి భార్య మౌనిక ఫిర్యాదు మేరకు మోపూరి ప్రతాప్రెడ్డి, పాలెంపల్లి సుబ్బారెడ్డి, జమీల్ మొబైల్స్ యజమాని జమీల్, గుంటి నాగేంద్రలపై క్రైమ్ నంబర్ 252/2023 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు మహాదీప్రెడ్డి (14), హనుదీప్రెడ్డి(12) ఉన్నారు. శ్రీనివాసులరెడ్డి స్వగ్రామంలో శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ‘లోకేశ్ పర్యటనలోనే హత్యకు బీజం’ శ్రీనివాసులరెడ్డి హత్యకేసులో నిందితులు పావులు మాత్రమేనని కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథరెడ్డి చెప్పారు. ఇటీవల టీడీపీ నేత లోకేశ్ యువగళం పాదయాత్రలో ఈ హత్యకు బీజం పడిందని ఆరోపించారు. శ్రీనివాసులరెడ్డిని హత్యచేసి అందరినీ భయాందోళనలకు గురిచేయాలని కుట్ర చేసినట్లు భావిస్తున్నామన్నారు. సూత్రధారులపై లోతైన దర్యాప్తుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
వరుడి మొబైల్కు వధువు పర్సనల్ వీడియో.. ఆగిన వివాహం
సాక్షి, కృష్ణా జిల్లా: ఫేస్బుక్ పరిచయం ఓ యువతి జీవితాన్ని నాశనం చేసింది. స్నేహం, సానిహిత్యం పేరుతో ఓ వ్యక్తికి దగ్గరైన యువతి.. అతనితో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ అతన్ని కాదని యువతి మరో వ్యక్తికి పెళ్లికి సిద్ధమైంది.అతినితోనూ శారీరకంగా దగ్గరైంది. చివరికి యువతికి చెందిన పర్సనల్ వీడియోలు బయటకు రావడంతో ఆమెతో నిశ్చయమైన పెళ్లిని రద్దు చేసుకున్నాడు సదరు యవకుడు. ఈ ఘటన జిల్లాలోని గుడివాడలో చోటుచేసుకుంది. బాధితురాలు గుడివాడ పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడివాడ బంటుమిల్లి రోడ్డుకు చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన కర్రా న్యూటన్ బాబుతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అతడి కోరిక మేరకు ఆమె నగ్నంగా వీడియో కాల్ చేసింది. ఈ క్రమంలో యువతికి ఇటీవల ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో వివాహం నిశ్చయమైంది. కాబోయే భర్త పరంజ్యోతితోతో కూడా యువతి శారీరకంగా దగ్గరైంది. ఈనెల 14వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. చదవండి: ‘నా వల్ల కావట్లేదు..’ భర్తమామల్ని ఫేస్బుక్ లైవ్లో పెట్టి మరీ సనా.. అయితే న్యూటన్ బాబు యువతితో మాట్లాడిన న్యూడ్ వీడియోను పెళ్లి కొడుకు పరంజ్యోతికి నగ్న వీడియోలు పంపాడు. ఈ వీడియోను వరుడు తన కుటుంబానికి పంపి ఈ పెళ్లి వద్దని నిరాకరించాడు. ఈ క్రమంలో పెళ్లి పెద్ద అయిన ఓ వ్యక్తి సదరు వీడియోను యువతి కుటుంబానికి పంపి పెళ్లి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇదే వీడియో తమ బంధువుల్లోని కొంతమందికి సైతం చేరడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన గుడివాడ టూ టౌన్ పోలీసులు న్యూటన్ బాబు అతని బంధువులు బాపట్ల కోటేశ్వరరావు, కొండ్రు రణధీర్ళు మరికొందరికి షేర్ చేసినట్లు గుర్తించారు. నూటన్బాబుపై అత్యాచారయత్నం కేసు, పరంజ్యోతిపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు మరో ముగ్గురు పై 109,120b ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. -
పూర్ణానంద రిమాండ్ రిపోర్టు.. ‘అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు..’
సాక్షి, విశాఖపట్నం: భక్తిపేరిట కళ్లబొల్లి కబుర్లు చెప్పిన పూర్ణానంద స్వామి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా, బాలికను రెండేళ్ల పాటు నిర్బంధించి లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచారు. వచ్చే నెల 5వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పూర్ణానందను సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక, తాజాగా పూర్ణానంద రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్టులో దిశ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పోలీసులు రిపోర్ట్ ప్రకారం.. పూర్ణానంద అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు. బాలికలను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఏడాదిగా అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. పూర్ణానంద ఇద్దరు బాలికలను అత్యాచారం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. బాలికలు గర్భం దాల్చకుండా పూర్ణానంద వారికి ట్యాబ్లెట్స్ ఇచ్చేవాడు. ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, 9 మంది బాలురు ఉన్నారు. బాలికలపై అత్యాచారం జరిగినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వెల్లడైనట్టు తెలిపారు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో వారి బంధువులు ఆ బాలికను ఆశ్రమం నుంచి తీసుకొని వెళ్లారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. బీటెక్ విద్యార్థి మృతి -
ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్
పీఎం పాలెం(భీవిులి)/ దొండపర్తి(విశాఖ దక్షిణ) : విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ జి.వెంకటేశ్వరరావు(జీవీ) కిడ్నాప్ కేసులో మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివారాలిలా ఉన్నాయి. కోలా వెంకటహేమంత్కుమార్, ఉలవల రాజేష్, బమ్మిడి రాజేష్ మరో ఐదుగురు ముఠాగా ఏర్పడి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జి.వెంకటేశ్వరరావులను ఈ నెల 15వ తేదీన కిడ్నాప్ చేశారు. బాధితులను భయభ్రాంతులకు గురిచేసి సుమారు రూ.1.75 కోట్లు వసూలు చేయడంతో పాటు బంగారు నగలు లాక్కున్నారు. నగర పోలీస్ కమిషనర్కి ఎంపీ ఘటనపై ఫోన్లో తెలియజేయగా పోలీసులు బృందాలుగా ఏర్పడి సినీ ఫక్కీలో కిడ్నాపర్లను వెంటాడి ఆటకట్టించారు. కిడ్నాప్నకు గురైన ఎంపీ భార్య, కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. ప్రధాన నిందితుడైన కోలా వెంకటహేమంత్కుమార్, అతడికి సహకరించిన ఉలవల రాజేష్, న్యాయవాది బమ్మిడి రాజేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న యర్రోలు సాయి(19), బాడితబోయిన బాలాజీ(24)ను ఆనందపురం హైవే కూడలి వద్ద బుధవారం అరెస్ట్ చేశారు. దమ్ము ఆనందబాబు (26)ను ఆదర్్శనగర్ హైవే రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. వీరి ముగ్గురిదీ గాజువాక. వీరి నుంచి రూ.10 లక్షలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. మైనర్లను జువైనల్ హోమ్కు తరలించామన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీకి భద్రత పెంపు ఎంపీ ఎంవీవీకు భద్రత పెంచారు. ఎంపీ కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)కు కూడా భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంపీ ఎంవీవీ భార్య, కుమారుడితో పాటు ఆడిటర్ జీవీని హేమంత్కుమార్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిన వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో పోలీసులు హేమంత్కుమార్, రాజేష్, సాయితో పాటు మరో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఎంపీకి టూ ప్లస్ టూ, అతని కుటుంబ సభ్యులతో పాటు జీవీకి వన్ ప్లస్ వన్ భద్రతా సిబ్బందిని కేటాయించారు -
‘ఈనాడు’ రిపోర్టర్లపై కేసు నమోదు చేయండి.. నెల్లూరు కోర్టు ఆదేశం
సాక్షి, నెల్లూరు: అసత్య కథనాలతో రోజురోజుకు దిగజారుతున్న ఈనాడు రామోజీరావుకు షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో పని చేసే నలుగురు ఈనాడు రిపోర్టర్ల పై కేసు నమోదు చేయాలని జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నుడాలో అక్రమాలు అంటూ.. 2022లో ఈనాడులో వచ్చిన కథనంపై అప్పటి వీసీ రమేష్ కోర్టుకు వెళ్లారు. దళితుడు కావడంతోనే తనపై అసత్యాలు రాశారని.. తనకు న్యాయం చేసి.. రోత రాతలు రాసిన రిపోర్టర్లపై చర్యలు తీసుకోవాలని అప్పటి నుడా వీసీ రమేష్ కోర్టుకెక్కారు. నలుగురు ఈనాడు రిపోర్టర్స్పై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖను నెల్లూరు జిల్లా కోర్టు ఆదేశించింది. చదవండి: టీడీపీ చీప్ ట్రిక్స్.. ట్విట్టర్ ఖాతాలో అసత్య ప్రచారం అసలు కేసు నేపథ్యమేంటీ? నుడా ఏంటీ గడబిడ అంటూ ఈనాడు పత్రిక మే 2022న ఒక వార్తను అచ్చేసింది. అందమైన అబద్దాలన్నింటిని ఏర్చికూర్చి దానికి తన సొంత పైత్యాన్ని జోడించి పాఠకుల ముందేసింది. నుడా అంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. దీని పరిధిలో వేస్తోన్న లేఅవుట్కు సంబంధించి అనుమతి కోసం నిర్వాహకుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించింది. నుడాలో కీలక బాధ్యత నిర్వహిస్తోన్న ఓ అధికారిపై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ కథనం అల్లింది. ఈ కథనంపై అప్పటి వైస్ ఛైర్మన్ రమేష్ కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనం అచ్చేసిందని, ఈనాడుపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దానికి విచారణ జరిపిన న్యాయస్థానం నలుగురు రిపోర్టర్లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. -
మహిళ హత్య కేసులో ఐదుగురు అరెస్టు
అనకాపల్లి :మండలంలోని వనుగుపల్లి పంచాయతీ తియ్యగెడ్డ గ్రామంలో హత్యకు గురైన మహిళ కేసును పోలీసులు మూడు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. ఈ సంఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు పాడేరు సీఐ సుధాకర్ తెలిపారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జి.మాడుగుల మండలం కొరాపల్లి గ్రామానికి చెందిన కొర్రాబు బోడకొండమ్మ అలియాస్ గాయత్రిని అదే పంచాయతీ రూడిబయలు గ్రామానికి చెందిన పాంగి గణపతి అనే వ్యక్తి మూడో భార్యగా పెళ్లి చేసుకునేందుకు పాడేరు మండలం తియగెడ్డ గ్రామంలో తన పిన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. బోడకొండమ్మ అనారోగ్యంతో మృత్యువాత పడిందని దహన సంస్కారాలు పూర్తి చేశామని బోడకొండమ్మ తండ్రి కొరాబు త్రిమూర్తికి గణపతి తెలిపాడు. దీంతో అనుమానం వచ్చిన త్రిమూర్తి ఈ నెల 18న పాడేరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్ఐ లక్ష్మణరావు ఈ నెల 19న తియగెడ్డ గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని పాతి పెట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పాతి పెట్టిన చోట పైన కట్టెలతో కల్చినట్టు గుర్తించిన ఎస్ఐ లక్ష్మణరావు విషయాన్ని సీఐ సుధాకర్కు నివేదించారు. సీఐ సుధాకర్ పాడేరు తహసీల్దార్ను వెంటపెట్టుకొని సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలి మెడ చుట్టూ ఉరి వేసిన గుర్తులు ఉండడాన్ని చూసి హత్య కేసుగా నమోదు చేశారు. కేసు ధర్యాప్తులో భాగంగా పలు విషయాలు వెలుగు చూసాయి. మొదటి నిందితుడు పాంగి గణపతికి గతంలోనే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మృతురాలిని మూడో భార్యగా చేసుకుంటానని చెప్పి ఒంగోలులో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ ఆమెతో సహజీవనం చేశాడు. మృతురాలు గణపతిని తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకువెళ్లమని చెప్పడంతో ఈ నెల 14న తియగెడ్డ గ్రామంలో గల తన పిన్ని ఇంటికి తీసుకువచ్చాడు. అక్కడ కూడా ఉండడానికి ఇష్టపడని బోడకొండమ్మ తాను కొరాపల్లిలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని చెప్పింది. అయితే ఆమె ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదని, తనతో ఉండకపోతే చంపేస్తానని గణపతి బెదిరించాడు. అతని మాట వినని బోడకొండమ్మ ఈ నెల 16న ఉదయం 7గంటలకు కొరాపల్లి గ్రామానికి వెళ్లేందుకు సిద్ధపడుతూ ఉండగా ఆమెను చున్నీతో మెడ చుట్టూ గట్టిగా లాగి హత్య చేశాడు. అనంతరం విషయాని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారి సహకారంతో మృతదేహాన్ని గ్రామ శివారులో పాతి పెట్టి సాక్షాలు లేకుండా ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనలో జి.మాడుగుల మండలం కొరాపల్లి పంచాయతీ రూడిబయలు గ్రామానికి చెందిన పాంగి గణపతి, అతనికి సహకరించిన అదే గ్రామానికి చెందిన పాంగి శోభన్, పాంగి మహేష్బాబు, పాంగి లక్ష్మమ్మ, పాంగి భారతిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
ముచ్చటపడి కొనుక్కున్న బైక్.. మొదటి నుంచీ సమస్యలే.. చిర్రెత్తుకొచ్చి
హిందూపురం: సేవా లోపం కారణంగా అసహనానికి గురైన ఓ యువకుడు షోరూం ఎదుట తన నూతన ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు.. హిందూపురంలోని పెనుకొండ రోడ్డులో ఉన్న టీవీఎస్ షోరూంలో బీరేపల్లికి చెందిన మనోజ్ ఫైనాన్స్ కింద ఓ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. పట్టుమని ఐదు నెలలు కూడా గడవక ముందే వాహనంలో సమస్యలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. సమస్య తలెత్తిన ప్రతిసారీ తాత్కాలిక మరమ్మతులతో సరిబెడుతూ వచ్చారు. అయినా సాంకేతిక సమస్యలు తప్పలేదు. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి వాహనం మరమ్మతుకు గురవడంతో షోరూంకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో షోరూం నిర్వాహకులతో వాగ్వాదం జరిగి అసహనానికి గురైన మనోజ్ వెంటనే షోరూం ఎదుట తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఘటనతో నివ్వెర పోయిన షోరూం నిర్వహకులు వెంటనే మంటల్ని అదుపు చేశారు. విషయం తెలుసుకున్న వన్టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. -
స్వామీజీ లీలలు.. గొలుసులతో కట్టేసి రెండేళ్లుగా అఘాయిత్యం
దొండపర్తి(విశాఖ దక్షిణ): ఆశ్రమం ముసుగులో పూర్ణానంద సరస్వతి స్వామీజీ సాగించిన లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధ్యాత్మికత పేరుతో సాగించిన అకృత్యాలు విస్తుగొలుపుతున్నాయి. అనాథ బాలికలకు ఆశ్రయం కల్పించే నేపంతో చేసిన దారుణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. ఆశ్రమంలో మరో మైనర్ బాలికపై కూడా అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. వెంకోజీపాలెం ప్రాంతంలో దశాబ్దాల క్రితం ఏర్పాటైన జ్ఞానానంద ఆశ్రమాన్ని పూర్ణానంద సరస్వతి స్వామీజీ నిర్వహిస్తున్నారు. ఒకవైపు అధ్యాత్మికత బోధనలతో పాటు తల్లిదండ్రుల నుంచి దూరమైన, అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే ఈ ఆశ్రమంపై గత కొన్నేళ్లుగా అనేక ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ ఆశ్రమం నుంచి తప్పించుకున్న బాలిక(15) స్వామీజీ గత రెండేళ్లుగా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులకు చేసిన ఫిర్యాదు ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆమె ఫిర్యాదుతో పేర్కొన్న వివరాల ప్రకారం గొలుసులతో కట్టేసి రెండేళ్లుగా అఘాయిత్యం రాజమండ్రికి చెందిన బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పెద్దమ్మ విశాఖకు తీసుకువచ్చి జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించింది. అక్కడ స్వామీజీ ఈ బాలికతో పాటు మరికొంత మంది బాలికలతో పశువుల నిర్వహణ చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా రోజూ రాత్రి 12 గంటలకు ఆ మైనర్ బాలికను బలవంతంగా గదిలోకి తీసుకువెళ్లి గొలుసులతో కట్టేసి అఘాయిత్యం చేసేవాడు. కొన్నిసార్లు స్వామీజీని నిలువరించే ప్రయత్నం చేస్తే కొట్టి హింసించేవాడు. ఇలా రెండేళ్ల పాటు బాలిక నరకయాతన అనుభవించింది. పనిమనిషి సాయంతో బయటపడి.. ఈ నెల 13వ తేదీన పనిమనిషి గొలుసులు విప్పిడంతో బాలిక ఆశ్రమం నుంచి తప్పించుకుంది. ఆమె ఇచ్చిన డబ్బులతో రైల్వేస్టేషన్కు వెళ్లి తిరుమల ఎక్స్ప్రెస్ రైలు ఎక్కింది. రైలులో ఒక ప్రయాణికురాలు బాలికను గమనించి మాట్లాడగా ఆశ్రమంలో జరిగిన విషయాన్ని ఆమెకు వివరించింది. దీంతో ఆమె కృష్ణా జిల్లాలో కంకిపాడులోని తన సోదరి ఇంటికి తీసుకువచ్చింది. స్థానికుల సలహా మేరకు బాలికను హాస్టల్లో చేర్చేందుకు ప్రయత్నించింది. పోలీస్స్టేషన్ నుంచి లేఖ తీసుకువస్తే హాస్టల్ చేర్చుకుంటామని చెప్పారు. దీంతో వారు బాలికతో కంకిపాడు స్టేషన్కు వెళ్లగా పోలీసులు బాలిక నుంచి వివరాలు తెలుసుకొని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. కమిటీ సభ్యులు బాలిక నుంచి వివరాలు సేకరించారు. అనంతరం పోలీసులు అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. కేసును ఎంవీపీ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. మరో బాలికపై కూడా అఘాయిత్యం విశాఖ పోలీస్ ఉన్నతాధికారులు కేసును దిశ స్టేషన్కు బదిలీ చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో కూడా మరో బాలికపై స్వామీజీ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. దీంతో పోలీసులు ఆ ఆశ్రమంలో తనిఖీలు చేయగా పిల్లల ఆశ్రయానికి అనువైన పరిస్థితులు లేనట్లు గుర్తించారు. అలాగే ఇప్పటి వరకు ఎంత మంది పిల్లలు ఆశ్రమంలో ఆశ్రయం పొందారు? ఏయే పరిస్థితుల్లో బయటకు వెళ్లారు? వారితో స్వామీజీ వ్యవహరించిన తీరు? ఇలా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వామీజీపై కొన్నేళ్లుగా ఆరోపణలు ఆశ్రమ నిర్వహణ, పూర్ణానంద సరస్వతి స్వామీజీ వ్యవహార శైలిపై గత కొన్నేళ్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి 1955లో జ్ఞానానంద భారతి అనే స్వామిజీ ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అనాథ పిల్లలు, తల్లిదండ్రులచే నిర్లక్ష్యం చేయబడిన, అనార్యోగంతో ఉన్న పిల్లలను చేరదీసి ఆశ్రయం కల్పించారు. వారికి విద్యాబోధనతో పాటు ఆధ్యాత్మిక చింతన కలిగేలా శ్లోకాలు నేర్పించేవారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రకు చెందిన పూర్ణానంద సరస్వతి(అసలు పేరు వేరు) విశాఖలో ఉంటూ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినట్లు తెలుస్తోంది. తొలినాళ్లలో వెంకోజీపాలెంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. ఆశ్రమానికి వెళుతూ అప్పటి స్వామీజీకి సపర్యలు చేస్తూ, చిన్న చిన్న పనులు చేస్తుండడంతో ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. దీంతో అతడు ఆశ్రమంలో ఉంటూ అక్కడి కార్యకలాపాలు చూసుకునేవాడు. 1984లో పూర్ణానంద సరస్వతి ఆశ్రమ బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి కొన్నాళ్ల పాటు పిల్లలను చేరదీసి వారికి పాఠశాల విద్యను అందించేవారు. అయితే టూషన్లు చెప్పే సమయంలోనే బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పలువురు ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కొన్నేళ్ల క్రితం కూడా ఇదే తరహా ఆరోపణలు పెద్ద దుమారాన్ని రేపాయి. పోలీసుల అదుపులో స్వామీజీ తాజాగా మైనర్ బాలిక ఫిర్యాదుతో మరోసారి పూర్ణానంత సరస్వతి వ్యవహారం సంచలనం రేపింది. ఆమెతో పాటు మరో బాలికపై కూడా అఘాయిత్యానికి పాల్పడినట్లు సదరు బాలిక స్టేట్మెంట్ ఇవ్వడంతో పోలీసులు స్వామీజీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే గతంలో జరిగిన విషయాలపై ఆరా తీస్తున్నారు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు జిల్లా)/ కోనేరుసెంటర్ (కృష్ణాజిల్లా): అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ గిన్నెగరువు గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి 1,760 కిలోల గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం పాడేరు ఏఎస్పీ ధీరజ్ మీడియాకు వెల్లడించారు. జూన్1, 2023లో ఎండీఎస్, చెన్నై జోన్ యూనిట్ 13 ఎన్సీబీ కేసులో తమిళనాడుకు చెందిన సురేష్ 160 కిలోల గంజాయితో రాగమటన్పల్లి వేపనహీళి పోలీస్లకు పట్టుబడ్డాడు. ఈ గంజాయిని పాడేరు ప్రాంత సుందరరావు వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పాడు. చెన్నై నుంచి వచ్చిన బృందం పాడేరు వచ్చి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా ఎస్పీ, ఏఎస్పీ సూచనల మేరకు స్థానిక పోలీసులు పెదబయలు మండలం, ఇంజరి పంచాయతీ గిన్నెగరువు గ్రామానికి చెందిన సుందరరావు ఇంట్లో తనిఖీ చేయగా.. 1,760 కిలోల గంజాయి లభించింది. దీని విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుంది. సుందరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ పట్టివేత.. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ను కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అతనితో పాటు జిల్లాలో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న మరో ముగ్గురు వ్యాపారులనూ అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ పి.జాషువా తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా పాడువ మండలం చత్వా గ్రామానికి చెందిన కొర్రా రాందాస్ అలియాస్ భట్టుభాయ్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ గంజాయి సరఫరా చేయడం మొదలెట్టాడు. దీనిలో భాగంగా గుడివాడ, అవనిగడ్డ, ఘంటసాల తదితర ప్రాంతాలకు రాందాస్ గంజాయిని సరఫరా చేస్తుంటాడు. మచిలీపట్నంలో గంజాయి అమ్మకాలు సాగిస్తున్న బడుగు నాగరాజును పలుమార్లు పోలీసులు పట్టుకున్నారు. అతని నేర చరిత్రను పరిశీలించిన ఎస్పీ.. నాగరాజుతో పాటు గుడివాడకు చెందిన మందాల కిరణ్రాజు, పమిడిముక్కలకు చెందిన చీకుర్తి నాని అలియాస్ బీస్ట్పై పీడి యాక్టును అమలుపరిచి జైలుకు పంపారు. పై ముగ్గురు పట్టుబడిన కేసులో రాందాస్ గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్న ఎస్పీ జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా మచిలీపట్నంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా రాందాస్ కంటబడ్డాడు. వెంటనే పోలీసులు రాందాస్ను అదుపులోకి తీసుకుని బ్యాగు సోదా చేయగా పెద్ద మొత్తంలో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. రాందాస్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తక్షణం అతని వద్ద గంజాయి కొనుగోలు చేసిన గుడివాడలో ఒకరిని, ఘంటసాలలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి ఆరు కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. -
ఖాతాదారుల హక్కుల పరిరక్షణకే.. ‘మార్గదర్శి’పై దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్ : మార్గదర్శి చిట్ఫండ్స్ ఖాతాదారుల హక్కుల పరిరక్షణ, ఆర్థిక భద్రత కోసమే ఆ సంస్థలో అక్రమాలను వెలుగులోకి తెస్తున్నామని, అది తమ బాధ్యత అని ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ స్పష్టం చేశారు. మార్గదర్శి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లిస్తుండటంతో ఖాతాదారులకు నష్టం కలగకుండా ఇప్పటికే రూ.1,035 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచ్వల్ ఫండ్స్ పెట్టుబడులను అటాచ్ చేసినట్టు తెలిపారు. మార్గదర్శి కంపెనీ ఏ కారణంగానైనా మూతపడితే ఖాతాదారులకు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీపై ఉంటుందని తెలిపారు. మార్గదర్శి సంస్థ ప్రతి చట్టాన్ని, నిబంధనను అతిక్రమించిందని, ఇంకా అతిక్రమిస్తూనే ఉందని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 9 బ్రాంచ్లలో 23 గ్రూప్ చిట్స్ను, వాటికి సంబంధించి రూ. 604 కోట్ల టర్నోవర్ నిలిపివేసినట్టు చెప్పారు. ఇదే తరహాలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని ఇతర బ్రాంచ్ల్లోనూ అక్రమాలపై ఆధారాలు లభిస్తే.. వాటిలోని చిట్ గ్రూప్ల టర్నోవర్ నిలిచిపోతుందని చెప్పారు. చివరకు మార్గదర్శి పడిపోతుందన్నారు. సంజయ్ మంగళవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మార్గదర్శి చిట్ఫండ్స్లో మూడేళ్ల లావాదేవీలను పూర్తిగా పరిశీలించి, అక్రమాలపై ఆధారాలు సేకరించామన్నారు. ఏపీతోపా టు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 108 బ్రాంచ్లలో కార్యకలాపాలపై ఆరా తీస్తున్న ట్టు తెలిపారు. ఢిల్లీలోని కేంద్ర ఏజెన్సీలకు కూడా ఈ అక్రమాల సమాచారమిచ్చామని, తెలంగాణ, ఇతర రాష్ట్రాల డీజీపీలకు సమాచారం ఇస్తున్నామన్నారు. ఏపీలో పలు ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ శాఖ ఫిర్యాదు మేరకే ఏపీ సీఐడీ కేసు దర్యాప్తు చేస్తోందని తెలిపారు. పూర్తి నిబంధనలు పాటిస్తూనే ఈ కేసులో ఏ–1 రామోజీరావును, ఏ–2 శైలజాకిరణ్ను ప్రశ్నించామన్నారు. వడ్డీ ఆశ చూపి ఖాతాదారులను మభ్యపెడుతున్నారు మార్గదర్శి అక్రమాలపై ఖాతాదారుల నుంచి ఫి ర్యాదు లేకుండానే కేసు దర్యాప్తు చేస్తున్నారంటూ ఒక సెక్షన్ మీడియా ఆరోపణలు చేస్తోందని, ఖాతాదారులకు వడ్డీని ఆశజూపి ఆ సంస్థ నిబంధన లకు విరుద్ధంగా నిధులను మళ్లిస్తుండటాన్ని తాము వెలుగులోకి తెస్తున్నామన్నారు. ప్రజలు మోసపో యి ఫిర్యాదు చేసేకంటే ముందే తాము వారి సొమ్ము కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఏ బాధితుడి విషయంలో అయినా ఇదే పద్ధతి అని తెలిపారు. చాక్లెట్ ఇచ్చి బాలికను కిడ్నాప్ చేస్తే.. సమాచారం అందిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు కానీ, బాధితురాలు ఫిర్యాదు ఇచ్చేవరకు కూర్చోరని.. అదే తరహాలో లక్షల మంది ఖాతాదారుల సొమ్మును కాపాడేందుకు మార్గదర్శిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ అధికారులుగా ప్రజలకు న్యాయం చేస్తుంటే మార్గదర్శిపై కక్షసాధింపు అంటూ ఆ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. తమ దర్యాప్తు చట్టానికి లోబడి ఉన్నట్టే.. చిట్ఫండ్స్ కంపెనీ నిర్వహణలో రామోజీ సైతం చట్టానికి లోబడి ఉండాలన్నారు. నిబంధనలున్నా.. వారికి అనుకూలంగా వాడారు మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ లావాదేవీలు చిట్ఫండ్ యాక్ట్ ప్రకారం కాకుండా రామోజీ, శైలజా కిరణ్ వారికి అనుకూలంగా కంపెనీ యాక్ట్ ప్రకారం చూపు తున్నారని దర్యాప్తులో తేలిందన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. తమకు ఆ నిబంధనలు వర్తించవన్న తరహాలో సమాధానాలిచ్చారన్నారు. ఖాతాదారుల నుంచి సొమ్ము వసూలుకు చిట్ఫండ్స్ చట్టాన్నే వాడుకొంటున్నారని చెప్పారు. ఇదే తరహాలో చీరాలలో రూ. 65 లక్షల డిఫాల్ట్ కేసులో ష్యూరిటీగా ఉన్న వ్యక్తి నుంచి రూ.6 కోట్లు విలువైన ఆస్తిని అటాచ్ చేయించా రని తెలిపారు. ఇలాంటి ఎన్నో అంశాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయన్నారు. సంస్థలోని అంతర్గత లుకలుకలు బయటపడతాయనే చిట్ఫండ్స్ యాక్ట్ ను అమలు చేయడంలేదన్నారు. చిట్ సెటిల్మెంట్లోనూ నిబంధనలు పాటించడంలేదన్నారు. చిట్ ముగిసిన వారి వివరాలతో, కొన్నింటిలో మానేసిన ఖాతాదారుల పేర్లు వాడి మళ్లీ చిట్లు నడుపుతున్నారని తెలిపారు. చిట్ డబ్బు బ్రాంచ్లో లేకపోవడంపై ప్రశ్నిస్తే.. మీరెవరు ప్రశ్నించేందుకు అన్న రీతిలో సమాధానాలు ఇస్తున్నారన్నారు. చట్టానికి వారు సహకరించడం లేదని చెప్పారు. చిట్ఫండ్స్ చట్టం అమలు కాకుండా ఏకంగా 26 ఏళ్లు అడ్డుకున్నారు మర్గదర్శి చిట్ఫండ్స్ సంస్థను చిట్ఫండ్ యాక్ట్ 1982 మేరకు నడపడంలేదని అన్నారు. చిట్ఫండ్స్ సొమ్ముతో వేరే వ్యాపారం చేయకూడదన్నారు. చిట్ఫండ్ యాక్ట్ ప్రకారమే బ్యాలెన్స్ షీట్లు ఫైల్ చేయాల్సి ఉన్నా.. కంపెనీ యాక్ట్స్ ప్రకారం నడుచుకుంటున్నామని ఈ కేసులో ఏ–2 శైలజాకిరణ్ అవివేకంతో కూడిన సమాధానాలు చెప్పారని తెలిపారు. ఒక గ్రూప్ డబ్బు మరో గ్రూప్కు వాడొద్దని చట్టం చెబుతున్నా.. మార్గదర్శి బ్రాంచ్లన్నింటిలోని డబ్బు అక్రమంగా హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నట్టు అన్ని ఆధారాలు లభించాయని చెప్పారు. చిట్ఫండ్ యాక్ట్ రావడానికి ముందే మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ ప్రారంభమైందన్న వింత వాదన తెస్తున్నారన్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 1982లో చిట్ఫండ్ యాక్ట్ పాస్ చేస్తే.. దానిని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో పాస్ చేయాల్సి ఉందన్నారు. కానీ 26 ఏళ్ల తర్వాత 2008లో అమలు చేశారని, ఇన్నేళ్లూ రామోజీరావు పలుకుబడితో అడ్డుకున్నారని వివరించారు. చదవండి: #MSKPrasad: 'ఐపీఎల్ వల్ల బీసీసీఐకే నష్టం.. ఏపీలో అద్భుత సౌకర్యాలు' -
కూతురిని కిడ్నాప్ చేశారంటూ అల్లుడిపై ఫిర్యాదు
పెనుమంట్ర: విడాకుల కేసు కోర్టులో ఉండగా భార్యను కిడ్నాప్చేసి, పుట్టింటి నుంచి తీసుకుపోయిన సంఘటన నెగ్గిపూడి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెగ్గిపూడి గ్రామానికి చెందిన చిర్ల శ్రీనివాసరెడ్డి, కనకలక్ష్మి దంపతులు తెలిపిన వివరాల ప్రకారం తమ రెండో కుమార్తె పూజారెడ్డిని అదే గ్రామానికి చెందిన సత్తి శ్రీరామారెడ్డికి ఇచ్చి 2020లో వివాహం చేశారు. మొదట్లో తమ కుమార్తెను అల్లుడు బాగానే చూసుకున్నాడని, బాబు పుట్టిన అనంతరం వేధింపులకు గురిచేస్తూ, కొట్టేవాడని చెప్పారు. 2022లో పెనుమంట్ర పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేయగా గృహహింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉండగా ఈనెల 17న సాయంత్రం 4 గంటలకు అల్లుడు శ్రీరామారెడ్డి ఇంటికి వచ్చి తమను తిట్టడమే కాకుండా ఇంట్లోనే నిర్భంధించి కుమార్తె, మనవడిని బలవంతంగా తీసుకువెళ్లిపోయాడని చెప్పారు. అనంతరం 100కి ఫోన్ చేస్తే పోలీసుల నుంచి స్పందన లేదని, గాయాలతో సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లామన్నారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని పోలీసులు చెప్పడంతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై పెనుమంట్ర ఎస్సై సురేంద్రకుమార్ను సాక్షి వివరణ కోరగా తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఆసుపత్రి నుంచి సమాచారం వస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
దస్తగిరి అరాచకం... డబ్బు చెల్లించి మీ కొడుకును తీసుకెళ్లండి..
కడప అర్బన్ : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి చేస్తున్న అరాచకాలలో మరో సంఘటన పులివెందుల పట్టణంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై బాధితురాలు షేక్ గులాబి పులివెందుల అర్బన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ‘నేను నా భర్త గుగూడు వల్లితో కలసి పులివెందుల టౌన్ భాకరాపురం, జయమ్మకాలనీలో ఉంటున్నాం. నా భర్త ట్రాక్టర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నా భర్త మొదటి భార్య 9 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. నన్ను 8 ఏళ్ల క్రితం గుగూడు వల్లి రెండో వివాహం చేసుకున్నాడు. అయితే మొదటి భార్యకు గూగుడు వల్లి(16), రేష్మా (15) సంతానం కాగా.. నాకు గుగూడు వల్లికి ఇమ్రాన్, చాందినీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరం కలసి ఉంటున్నాం. అయితే మా కుటుంబ అవసరాల నిమిత్తం మా ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న షేక్ దస్తగిరి దగ్గర ఆరు నెలల క్రితం రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నాం. పూచీకత్తుగా ఇంటి పత్రాలను ఇచ్చాము. తరువాత బాకీ డబ్బుకు వడ్డీగా వారానికి రూ. 4 వేలు చొప్పున దస్తగిరికి ఇస్తూ వస్తున్నాం. తర్వాత మధ్యలో కొన్ని వారాలు మేము వడ్డీ కట్టలేకపోయాం. దీంతో అసలుకు వడ్డీతో కలిపి రూ.1,10,000 మాతో ప్రామిసరీ నోటు దస్తగిరి రాయించుకున్నాడు. కాగా డబ్బు ఇవ్వాలని నా భర్తను ఒత్తిడి చేస్తూ వస్తున్నాడు. ఈ నెల 13న డబ్బు చెల్లిస్తామని చెప్పాం.. అయితే సర్దుబాటు కాక చెల్లించలేదు. ఈ క్రమంలో ఈ నెల 17న నేను, నా భర్తతో కలసి బంధువుల ఇంటికి వెళ్లాం. 18వ తేదీ సాయంత్రం దస్తగిరి మాకు ఫోన్ చేసి డబ్బు చెల్లించకుండా ఇంటి నుంచి పారిపోయారు.. మీ కుమారుడు గూగుడు వల్లిని నిర్బంధించాను. డబ్బు చెల్లించి మీ కొడుకును తీసుకెళ్లండి.. లేకపోతే మీ కొడుకును కొడతాం.. అని బెదిరించాడు. నా కొడుకుతో ఫోన్లో మాట్లాడించాడు. ‘నన్ను దస్తగిరి కొడుతున్నాడు..’ అని మా కొడుకు బాధ పడుతున్నాడని.. పైగా దస్తగిరి భార్య షబానా కూడా ఫోన్ చేసి మీ కొడుకుకు ఇప్పటికే ఉదయం.. సాయంత్రం ఒక కోటింగ్ అయిపోందని.. నువ్వు వచ్చి మాట్లాడకపోతే నీ కొడుకు మా చేతిలో చచ్చిపోతాడని బెదిరిస్తున్నారు. నా కుమారుడిని వారు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది సార్.. దస్తగిరి, అతని భార్య షబానాపై చర్యలు తీసుకుని, మా కుమారుడిని అప్పగించండి.. సార్.. అంటూ’ గులాబి పోలీసులను వేడుకుంది. ఈ మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు దస్తగిరిపై కేసు నమోదు చేశారు. -
హాస్టల్ విద్యార్థినిపై టీడీపీ కార్యకర్త అఘాయిత్యం
మచిలీపట్నం (కోనేరు సెంటర్): కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్త హాస్టల్ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో బాలికను పిలిచి.. ఆపై మద్యం తాగించి లైంగిక దాడికి తెగబడ్డాడు. అనంతరం మత్తులో ఉన్న ఆమెను ద్విచక్ర వాహనంపై వసతి గృహం వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న బాధితురాలి ప్రవర్తనపై అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా జరిగిన ఘోరం బయటికి పొక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక మచిలీపట్నంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. నాలుగు నెలల క్రితం మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామానికి చెందిన ఆవుల సతీష్ అనే టీడీపీ కార్యకర్త ఆమెను పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమలో దింపాడు. నాలుగు నెలలుగా యువతిని కళాశాలకు వెళ్లే సమయాల్లో కలుస్తుండటంతో పాటు ఫోన్లో మాట్లాడుతున్నాడు. కాగా.. ఈ నెల 18వ తేదీన సతీష్ ఆ బాలికకు ఫోన్ చేసి ఓసారి కలవాలని చెప్పాడు. అందుకు ఆమె సరేనంది. ఆదివారం భోజనం చేసిన అనంతరం సదరు యువతి హాస్టల్ వార్డెన్కు తెలియకుండా బయటికి వెళ్లింది. సతీష్ ఆమెను నగరంలోని విజయ రాఘవ లాడ్జికి తీసుకురమ్మని తన స్నేహితుడైన కళ్యాణ్కు బైక్ ఇచ్చి పంపాడు. సతీష్ చెప్పిన విధంగా కళ్యాణ్ రామానాయుడుపేట సెంటర్లో యువతిని బండి ఎక్కించుకుని లాడ్జి వద్ద దింపాడు. యువతి సతీష్ ఉన్న రూంలోకి వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సతీష్ యువతికి బలవంతంగా మద్యం తాగించాడు. దీంతో యువతి స్పృహ కోల్పోగా.. సతీష్ ఆమెను వివస్త్రను చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బైక్పై హాస్టల్ వద్ద దింపి వెళ్ళిపోయాడు. మద్యం మత్తులో ఉన్న యువతి ప్రవర్తన వింతగా ఉండటం గమనించిన హాస్టల్ వార్డెన్ ఇతర సిబ్బంది సమీపంలోని సర్వజన ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. వైద్య సిబ్బంది ఆమెపై లైంగికదాడి జరిగినట్టు నిర్ధారించటంతో వార్డెన్ యువతిని మందలించింది. మద్యం మత్తు వీడిన అనంతరం విషయం తెలుసుకున్న యువతి సతీష్ తనకు బలవంతంగా తాగించి ఆపై లైంగిక దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న సీఐ రవికుమార్ మచిలీపట్నం ఎస్సై వి.వెంకటేశ్వరరావు సతీష్ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టుకు హాజరుపరచి రిమాండ్కు తరలించారు. కాగా, సతీష్ స్నేహితులైన కళ్యాణ్, మణికంఠ ఆ బాలికను అర్ధనగ్నంగా సెల్ఫోన్లలో వీడియోలు తీసినట్టు తెలుసుకున్న పోలీసులు వారిపైనా చర్యలకు ఉపక్రమించనున్నారు. సమాచారం అందుకున్న సోషల్ వెల్ఫేర్ డీడీ సాహిద్బాబు వసతి గృహానికి చేరుకుని ఘటనపై విచారణ జరిపారు. యువతి హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన క్రమంలో అందుకు బాధ్యురాలిని చేస్తూ వార్డెన్ మల్లేశ్వరిని సస్పెండ్ చేసినట్టు డీడీ తెలిపారు. -
Viveka Case : సునీత పిటిషన్ జులై 3కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో.. సునీతారెడ్డి పిటిషన్పై విచారణను వచ్చే నెల(జులై) 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ(జూన్ 19, సోమవారం) విచారణ జరిపింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ నెలాఖరు (జూన్ 30) కల్లా వివేకా హత్య కేసుపై సిబిఐని దర్యాప్తు పూర్తి చేయమని ఇప్పటికే సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ విషయాన్ని సిద్ధార్థ లూథ్రా న్యాయస్థానానికి గుర్తు చేశారు. ఈ నెలాఖరుతో సిబిఐ దర్యాప్తు గడువు ముగుస్తున్నందున ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ అంగీకరించలేదు. కేసు విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ CJI బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో వాదనలు వినిపించాల్సిందిగా ప్రతివాదులయిన అవినాష్ రెడ్డి, CBIలకు నోటీసులు జారీ చేసింది. Supreme Court is hearing a plea by the daughter of former MP late YS Vivekananda Reddy against a Telangana High Court order granting anticipatory bail to Kadapa MP YS Avinash Reddy in connection with her father's murder.#SupremeCourt #SupremeCourtofIndia pic.twitter.com/Xs5HCAjpXz — Bar & Bench (@barandbench) June 19, 2023 పిటిషన్కు కాలం చెల్లే అవకాశం! వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఈ నెలాఖరు సుప్రీంకోర్టు డెడ్లైన్గా విధించిన సంగతి తెలిసిందే. అలాగే సునీతా రెడ్డి పిటిషన్ ను జులై 3కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో.. CBI చార్జిషీట్ దాఖలు చేస్తే గనుక ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ కు కాలం చెల్లిపోయే అవకాశం ఉంది. గత విచారణలో సునీత తీరుపై అసంతృప్తి వివేకా కేసుకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్రెడ్డికి మే 31వ తేదీన షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. గత విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరింది సునీత. అంతే కాదు, హైకోర్టు మినీ ట్రయల్ ను నిర్వహించిందని, తమ వాదనల్లో మెరిట్ పరిశీలించకుండా బెయిల్ ఇచ్చిందని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాష్ ను అరెస్ట్ చేయించాలన్న తాపత్రయం సునీతలో కనిపిస్తోందని, కేవలం ఇగో క్లాషెస్ కోసం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని మొన్నటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. Justice Surya Kant: Returnable on 7th July. Counsel: There is a connected matter. Justice Kant: List before first bench on 3rd July 2023, after getting appropriate orders from CJI. #SupremeCourt #SupremeCourtOfIndia — Live Law (@LiveLawIndia) June 19, 2023 తన వాదనే వినాలి, తాను చెప్పిందే నమ్మాలి అన్నట్టుగా కనిపించిన సునీత తీరు ఆశ్చర్యకరంగా ఉంది. ఏ న్యాయస్థానమయినా.. ఎలాంటి అభియోగాలపైనా అయినా.. వాదనలతో పాటు దానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించిన పిమ్మటే నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని సునీత విస్మరించినట్టు కనిపించింది. ఇదీ చదవండి: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్కి కారణం ఇదే.. -
వైఎస్సార్సీపీ ఎంపీటీసీపై హత్యాయత్నం
తిరుపతి రూరల్: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ. రంగంపేట వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు బోస్చంద్రారెడ్డిపై శనివారం రాత్రి కొందరు దుండగులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఎంపీటీసీ సభ్యుడిని కత్తితో పొడిచేందుకు యత్నించడంతోపాటు అతని కారును కాల్చివేసేందుకు వేసిన పథకం విఫలమైంది. ఈ ఘటనలో కత్తితో సహా ఓ సినీహీరో వద్ద బౌన్సర్గా పనిచేసిన వ్యక్తి పట్టుబడ్డాడు. ఓ ప్రైవేటు యూనివర్సిటీ మాజీ పీఆర్వో సతీష్, ఓ సినీ హీరో అభిమాన సంఘం అధ్యక్షుడు సునీల్చక్రవర్తి సూచనల మేరకే ఈ ఘటనకు పాల్పడినట్లు పట్టుబడిన వ్యక్తి మీడియాతో చెప్పడం విశేషం. బాధితుడు బోస్చంద్రారెడ్డి తెలిపిన వివరాలు.. సతీష్, సునీల్చక్రవర్తి గతంలో బోస్చంద్రారెడ్డి, రంగంపేట ఉప సర్పంచ్ మౌనిష్రెడ్డితో గొడవపడ్డారు. ఓ భూమి, షాపు విషయంలోనూ ఎంపీటీసీ, ఉప సర్పంచ్తో సతీష్, సునీల్చక్రవర్తిలు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో బోస్చంద్రారెడ్డిపై కక్ష పెంచుకున్న సతీష్, సునీల్చక్రవర్తిలు ఓ సినీహీరో వద్ద బౌన్సర్గా పనిచేసిన హేమంత్తో ఒప్పందం చేసుకున్నారు. దీంతో శనివారం రాత్రి హేమంత్ మరో ఐదుగురు కలిసి రాడ్లు, కత్తులు, పెట్రోల్ బాటిల్స్తో మారుతీనగర్లోని బోస్చంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించి.. జన సంచారం ఉండటంతో ఆఖరి నిమిషంలో పరారయ్యారు. అనంతరం మళ్లీ రాత్రి 11 గంటలకు ఇలానే దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. ఆదివారం వేకువజామున 3 గంటలకు మళ్లీ కత్తులు, రాడ్లు, పెట్రోల్తో దాడికి రావడంతో వారిపై బోస్చంద్రారెడ్డి అనుచరులు తిరగబడ్డారు. హేమంత్ కత్తితో సహా పట్టుబడగా.. మిగిలినవారు పారిపోయారు. అతన్ని పట్టుకుని విచారించిన బోస్చంద్రారెడ్డి వర్గీయులు, రంగంపేటలోనూ మరో బ్యాచ్ ఉన్నారని చెప్పడంతో కారులో అతన్ని ఎక్కించుకుని రంగంపేటకు వచ్చారు. అప్పటికే వారు కూడా పారిపోయారు. ఈ హత్యాయత్నానికి సతీష్ కీలకసూత్రధారి అని, అతనే బోస్చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలపై దాడి చేయమన్నారని, దీనిలో సునీల్చక్రవర్తి పాత్ర కూడా ఉందని హేమంత్ మీడియాకు తెలిపాడు. హత్యచేయడం లక్ష్యం కాదని, కారును కాలి్చవేసి భయపెట్టాలని యత్నించినట్టు చెప్పాడు. నిందితులకు సతీష్ ఫోన్పే ద్వారా నగదు పంపించడం, అర్ధరాత్రిళ్లు కూడా సునీల్చక్రవర్తి ఫోన్లో మాట్లాడుతుండటంతో బాధితులు నిజనిర్ధారణకు వచ్చారు. హేమంత్ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఘటన జరిగిన ప్రదేశం తిరుపతి యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలో ఉండటంతో బోస్చంద్రారెడ్డి అక్కడే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, కొన్ని మీడియాల్లో సినీనటులు మోహన్బాబు, విష్ణువర్ధన్బాబుపై అసత్య ప్రచారం చేయడాన్ని బోస్చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలు ఖండించారు. చంద్రగిరిలో విలేకరుల సమావేశం పెట్టి జరిగిన ఘటనలతో వారికి ఎలాంటి సంబంధం లేదని, అసత్యప్రచారాలు మానుకోవాలని స్పష్టం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బోస్చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డితోపాటు గ్రామస్తులు ధర్నా చేశారు. -
లైంగికదాడి కేసులో 8 మంది అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులో సంచలనం రేకెత్తించిన యువతిపై లైంగికదాడి కేసులో 8 మంది నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నగర డీఎస్పీ డి.శ్రీని వాసరెడ్డి తన కార్యాలయంలో నిందితుల వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి కోవూరు మండలంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న తన అక్క ఇంటికొచ్చింది. ఆమె అక్క గర్భిణి కావడంతో నెల్లూరులోని ఆస్పత్రిలో సిజేరియన్ చేశారు. అక్కకు తోడుగా ఆమె ఆస్పత్రి లో ఉంటున్నారు. ఈ నెల 10న యువతి మందుల కోసం గాంధీబొమ్మ సెంటర్ వద్దకొచ్చింది. నె ల్లూరుకి చెందిన పాతనేరస్తులైన భాను విష్ణువర్ధన్ అలియాస్ లడ్డసాయి, జగదీష్ అలియాస్ డి యోసాయి, యుగంధర్ అలియాస్ యుగి, ఎ.సుజన్కృష్ణ అలియాస్ చింటూ ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని..కత్తితో బెదిరించి కొండాయపాళెంలోని ఖాళీ స్థలంలో లైంగికదాడి చేశారు. అనంతరం వారి స్నేహితులైన భాను సాయివర్ధన్, షేక్ హుస్సేన్బాషా అలియాస్ కేటీఎం, సాయిసాత్విక్, కె.అజయ్, రేవంత్లను పిలిపించి వారితో కూడా లైంగికదాడి చేయించారు. యువతి కేకలను గమనించిన స్థానికులు ‘దిశ’కు కాల్ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా దుండగులు పారి పోయారు. ఘటనాస్థలిలో బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్లు, ఆటో నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆదివారం గొలగమూడి క్రాస్ రోడ్డు సమీపంలో నిందితుల్లో 8 మందిని అరెస్ట్ చే శారు. డియోసాయి పరారీలో ఉన్నాడు. -
విశాఖ: బాలుడు అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు
సాక్షి, విశాఖపట్నం: ఐదేళ్ల బాలుడు తేజ అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. పెందుర్తి లెండి వనంలోని స్విమ్మింగ్ పూల్ లో బాలుడు మృతి చెందిన తర్వాత ఓనర్ భాను కుమార్కు వాచ్మెన్ సత్యనారాయణ సమాచారం ఇచ్చాడు. లెండి వనం నిర్మాణం సమయంలో స్థానిక టీడీపీ నేత బండారి సత్యనారాయణతో కలసి ఓ స్థలం కబ్జాకు యత్నించిన ఓనర్ భాను కుమార్.. లెండి వనం రిసార్ట్కి పక్కనే ఉన్న స్థలంపై కన్ను ఉండటంతో బాలుడు మృత దేహాన్ని ఆ స్థలంలో పడేయాలని ఆదేశించాడు. ఓనర్ చెప్పినట్టు ఆ బాలుడు మృత దేహాన్ని రాత్రి సమయంలో ఎవరు చూడకుండా పనస చెట్టు వద్ద వాచ్మెన్ పడేశాడు. ఆ విధంగా మృతదేహం పడేస్తే స్థలం యజమాని తక్కువ రేటుకి అమ్మకం జరుపుతారనే ఆలోచన పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వాచ్మెన్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. రిసార్ట్ ఓనర్ భానుకుమార్ హైదరాబాద్లో ఉండటంతో విశాఖకి రప్పించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. -
తాడిపత్రిలో దారుణం.. నిద్రిస్తున్న వారిపై పెట్రోలు పోసి..
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న వారిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టారు.. ఈ ఘటనలో దంపతులతో పాటు మరో యువతి తీవ్రంగా గాయపడింది. మద్యం, వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పారిశ్రామిక వాడలోని శ్రీనిధి నల్ల బండల పాలిష్ పరిశ్రమలో నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి పరిశ్రమ ఆవరణలో మంచంపై నిద్రిస్తున్నారు. అదే ఫ్యాక్టరీలో పని చేసే మల్లికార్జున కుమార్తె పూజిత కూడా వీరి పక్కనే మంచం వేసుకుని నిద్రిస్తోంది. రాత్రి 11.30 గంటల సమయంలో సరస్వతి మరిది రామేశ్వర్రెడ్డి నిద్రిస్తున్న నల్లపురెడ్డి, సరస్వతిపై పెట్రోల్ పోశాడు. మెలకువ వచ్చిన సరస్వతి ఏం చేస్తున్నావురా అని అరిచేలోగానే నిప్పంటించాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే నిద్రిస్తున్న పూజితకు కూడా మంటలు అంటుకుని చేతులు కాలాయి. తాగుడుకు బానిసైన రామేశ్వర్రెడ్డిని రెండు రోజుల క్రితం తాము పద్ధతి మార్చుకోవాలని దండించామని, అది మనసులో ఉంచుకుని ఇలా చేశాడని నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు రూరల్ ఎస్ఐ గౌస్ మహ్మద్కు వివరించారు. వారి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసుకున్నారు. సరస్వతి, నల్లపురెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పూజితకు తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు.. -
హ్యాట్సాఫ్.. ఏపీ పోలీసులు
సింగరాయకొండ : ఏపీ–తమిళనాడు సరిహద్దులోని ఆ ఊరు నేర సామ్రాజ్యానికి అడ్డా.. అది పోలీసులు కూడా ఛేదించలేకపోయిన ఘరానా దొంగల గడ్డ.. అలాంటి చోటుకు మన ఏపీ పోలీసులు ఎంతో ధైర్యసాహసాలతో ప్రాణాలకు తెగించి వెళ్లారు. వెళ్లడమే కాదు.. పద్మవ్యూహంలాంటి ఆ చోర సామ్రాజ్యం నుంచి కరడుగట్టిన ముగ్గురు దొంగల్ని పట్టుకున్నారు. ఇది పసిగట్టిన అక్కడి దొంగల ముఠా సభ్యులు పోలీసులను వెంబడించారు. ఈ ఛేజింగ్లో మన పోలీసుల చాకచక్యంతో పైచేయి సాధించి ముగ్గురు నేరస్తుల్ని పట్టుకొచ్చేశారు. క్రైమ్ థ్రిల్లర్ని తలపించిన ఈ ఘటన వివరాలు ఏమిటంటే.. ప్రకాశం జిల్లా ఒంగోలు, సింగరాయకొండలో వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు ఘరానా దొంగలను తమిళనాడులోని మింజూరులో ప్రకాశం జిల్లా పోలీసులు వలపన్ని సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ నెల 11న ప్రకాశం జిల్లా ఒంగోలు టీచర్స్ కాలనీకి చెందిన పోతిరెడ్డి కృష్ణారెడ్డి ఇంట్లో 60 సవర్ల బంగారం, రూ.6 లక్షల నగదు చోరీకి గురైంది. ఈ నెల 12వ తేదీన సింగరాయకొండ పరిధిలోని మూలగుంటపాడులో ముమ్మడిశెట్టి చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. ఎస్పీ మల్లికాగర్గ్ ఆదేశాల మేరకు డీఎస్పీ నారాయణస్వామి పర్యవేక్షణలో సింగరాయకొండ సీఐ రంగనాథ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సీసీ టీవీ ఫుటేజీలు ఆధారంగా ఒంగోలు టీచర్స్ కాలనీ, సింగరాయకొండలో చోరీలకు పాల్పడిన ముఠా ఒకటేనని నిర్థారణకు వచ్చారు. ఇదే ముఠా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ గతంలో దోపిడీలకు పాల్పడినట్టు గుర్తించారు. నేర సామ్రాజ్యంలోకి వెళ్లి మరీ అరెస్ట్? ఈ ముఠా తమిళనాడులోని మింజూరు ప్రాంతానికి చెందినదని గుర్తించిన పోలీసు బృందాలు నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు పథకం పన్నారు. మింజూరు ప్రాంతం నేర సామ్రాజ్యానికి అడ్డా కావడం.. గతంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన క్రమంలో దొంగల ముఠాకు చెందిన వ్యక్తులు పోలీసులపై విరుచుకుపడటం వంటి పరిస్థితులు తలెత్తాయి. గతంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించి తమవల్ల కాక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకున్న సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలోని పోలీస్ టీమ్ దొంగలను అదుపులోకి తీసుకునేందుకు రెండు కార్లలో పక్కా ప్రణాళికతో వెళ్లారు. మింజూరు స్టేషన్ మహిళా ఎస్సై సహకారంతో దొంగల కోసం రోజంతా అక్కడ మాటు వేశారు. చివరకు శనివారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు దొంగలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపైనే దాడికి యత్నం చోరీ సొత్తును రికవరీ చేసే క్రమంలో ఆంధ్రా నుంచి పోలీసులు వచ్చారని తెలుసుకున్న దొంగల ముఠాకు చెందిన కొందరు వ్యక్తులు పోలీసులపై మూకుమ్మడి దాడికి యత్నించినట్టు సమాచారం. అప్పటికే కొంత సొత్తును రికవరీ చేసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని వెంటనే తాము వచ్చిన వాహనాల్లోనే తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో దొంగల ముఠాకు చెందిన వ్యక్తులు మరో రెండు కార్లులో పోలీసుల్ని వెంబడించినట్టు తెలిసింది. ఆ తరువాత పోలీసుల వాహనాలు హైవేపైకి రావడంతో ముఠా తరఫు వ్యక్తులు వెనుదిరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమర్నాథ్ హత్యపై టీడీపీ శవరాజకీయం
సాక్షి, ప్రతినిధి, గుంటూరు :రెండు కుటుంబాల మ ధ్య చెలరేగిన ఘర్షణను రాజకీయం చేసి.. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు టీడీపీ నేతలు చేసిన శవ రాజకీయాలు బెడిసికొట్టాయి. అడుగ డుగునా అడ్డంకులు సృష్టించి లేనిపోని ఆరోపణలు చేద్దామనుకున్న టీడీపీ నేతల ఆటలు సాగలేదు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారి పాలెంకు చెందిన యువకుడు ఉప్పాల అమర్నాథ్ ను కొందరు వ్యక్తులు కుటుంబ వివాదాల నేపథ్యంలో పెట్రోల్ పోసి తగులబెట్టి హత్యచేసిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా.. అమర్నాథ్ మృతదేహంతో చెరుకుపల్లి సెంటర్లో ధర్నా చేపట్టారు. విద్యార్థి మృతిని తమకు అనుకూలంగా మార్చుకుని అలజడి సృష్టించేందుకు యత్నించారు. కానీ, నిందితులను గంటల వ్యవధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ మోపిదేవి అడ్డగింత.. అమర్నాథ్ మృతదేహాన్ని చూసి అతని కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావును అడ్డుకున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాలను గమ నించిన ఎంపీ మోపిదేవి ప్రతి ఒక్కరూ సంయ మనంతో వ్యవహరించాలని కోరారు. మృతుడి కుటుంబానికి ఎంపీ వ్యక్తిగతంగా రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నా.. వారికి వద్దంటూ టీడీపీ నేతలే అడ్డుకోవటం గమనార్హం. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని ఎంపీ చెప్పారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. అది రెండు కుటుంబాల మధ్య ఘర్షణే : ఎస్పీ రెండు కుటుంబాల మధ్య ఘర్షణే ఈ హత్యకు దారి తీసిందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే హత్య జరిగిన గంటల వ్యవధిలోనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో ఎటువంటి రాజకీయ కోణంలేదని ఆయన తేల్చిచెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటీకీ టీడీపీ నేతలు వారిని అరెస్టుచేయలేదని వ్యాఖ్యలు చేయటం వివాదా స్పదమయ్యాయి. మరో నిందితుడిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. సీఎం జగన్ రూ.10 లక్షల సాయం ఇక మృతుడు అమర్నాథ్ కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి అండగా నిలబడేలా రూ.10 లక్షల చెక్కును పంపారు. ప్రభు త్వం అన్ని విధాలుగా బాధిత కుటుంబానికి సాయం అందిస్తుందని స్పష్టంచేశారు. చెక్కును ఆదివారం అందజేస్తారు. -
ప్లాన్ ప్రకారమే అమర్ హత్య: బాపట్ల ఎస్పీ
సాక్షి, బాపట్ల: చెరుకుపల్లి మండల పరిధిలో దారుణ హత్యకు గురైన పదో తరగతి స్టూడెంట్ అమర్నాథ్ ఉదంతంపై బాపట్ల ఎంపీ వకుల్ జిందాల్ స్పందించారు. ఈ హత్య ప్లాన్ ప్రకారమే జరిగిందని.. కేసుకు సంబంధించి పలు వివరాలను తెలియజేశారాయన. అమర్నాథ్ హత్య వెనుక రాజకీయ కారణాలు లేవు. ప్లాన్ ప్రకారం అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అమర్ సోదరికి ఫోన్స్, మెసేజ్ చేసి వెంకటేశ్వరరెడ్డి వేధిస్తున్నాడు. ఆ విషయం ఇంట్లో చెప్పడంతో.. అమర్ పై వెంకటేశ్వరరెడ్డి కోపం పెంచుకున్నాడు. నిందితుడు వెంకటేశ్వరరెడ్డికి హత్యలో గోపిరెడ్డి, వీరబాబు, సాంబిరెడ్డి సహకరించారు అని తెలిపారు. ఈ కేసులో వెంకటేశ్వరరెడ్డి సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సాంబిరెడ్డి పరారీలో ఉన్నాడని.. అతని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు వివరించారాయన. ఇదీ చదవండి: అమర్ కుటుంబానికి న్యాయం చేసి తీరతాం -
అమర్నాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది: ఎంపీ మోపిదేవి
సాక్షి, బాపట్ల: సోదరి రక్షణ కోసం ఎదురెళ్లి దుండగుల చేతిలో హతమైన విద్యార్థి అమర్నాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, దోషులను కఠినంగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. తన అక్కపై జరుగుతున్న వేధింపులను అడ్డుకునే యత్నంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ను నలుగురు కిరాతకంగా తగలబెట్టి కాల్చి చంపిన సంగతి తెలిసిందే. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండల పరిధిలోని ఉప్పలవారిపాలెంలో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటన పట్ల ఎంపీ మోపిదేవి స్పందించారు. శనివారం ఉదయం ఉప్పలవారిపాలెంకు వెళ్లిన ఆయన అమర్నాథ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కేసులో వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని, దోషుల్ని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అమర్నాథ్ కుటుం సభ్యులకు హామీ ఇచ్చారాయన. అమర్నాథ్ కుటుంబాన్ని అన్నివిధాల ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ మోపిదేవి ప్రకటించారు. తక్షణ సాయంగా రూ.50 వేలను అందించారాయన. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఇదీ చదవండి: అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం -
కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 9 మంది తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. టాటా మ్యాజిక్ వాహనంలో రంపచోడవరం నుంచి మందపల్లి శనేశ్వరస్వామి దైవ దర్శనం కోసం పదిమంది వెళ్తున్నారు. ఈ క్రమంలో వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి నలుగురితో భీమవరం వెళుతున్న కారుని ఢీకొట్టడంతో మడికి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్లో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా , కారులో ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చదవండి: అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం -
అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం
చెరుకుపల్లి: తన అక్కను వేధించవద్దని చెప్పిన పదో తరగతి విద్యార్థిపై ఓ యువకుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ అమానుష ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామ పరిధిలోని ఉప్పాలవారిపాలెంలో శుక్రవారం జరిగింది. బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ కథనం ప్రకారం... రాజవోలు గ్రామ పరిధిలోని ఉప్పాలపాలేనికి చెందిన ఉప్పాల మాధవి కుమారుడు ఉప్పాల అమర్నా«థ్ (15) ఉదయం ఐదు గంటల సమయంలో రాజవోలుకు సైకిల్పై ట్యూషన్కు వెళుతున్నాడు. ఆ సమయంలో రాజవోలు గ్రామానికి చెందిన పాము వెంకటేశ్వరరెడ్డి (వెంకీ), అతని స్నేహితులు మరో ముగ్గురు కలిసి అమర్నాథ్ను అడ్డగించి సైకిల్ లాక్కుని రోడ్డు పక్కన మొక్కజొన్న బస్తాలు వేసిన చోటుకు తీసుకువెళ్లి దాడి చేశారు. అనంతరం ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్ను అమర్నాథ్పై పోసి నిప్పు అంటించి అక్కడ నుంచి పారిపోయారు. మంటలు రావటంతో సమీపంలోని గ్రామస్తులు గమనించి ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పి అమర్నాథ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన అతడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. గతంలోనూ దాడి.. పదో తరగతి ఫెయిల్ అయి ఖాళీగా తిరుగుతున్న పాము వెంకటేశ్వరరెడ్డి (వెంకీ) కొంతకాలంగా అమర్నా«థ్ అక్కను టీజ్ చేస్తున్నాడు. దీంతో వెంకీ, అమర్నాథ్ మధ్య గొడవ జరిగింది. అమర్నా«థ్పై వెంకీ దాడి చేశాడు. ఈ విషయం వెంకీ కుటుంబ సభ్యుల దృష్టికి కూడా అమర్నాథ్ తరఫు పెద్దలు తీసుకెళ్లారు. పాఠశాలలకు సెలవులు రావడంతో వీరు కలవలేదు. తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో అమర్నా«థ్, ట్యూషన్, స్కూలుకు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మార్గంమధ్యలో అమర్నాథ్ను వెంకీ అడ్డగించి బెదిరించటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో వెంకీ తన స్నేహితులతో కలిసి శుక్రవారం అమర్నాథ్పై దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. అమర్నాథ్ తండ్రి నాంచారయ్య గతంలోనే మరణించారు. అమర్నాథ్ తల్లి మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. -
ఆడిటర్ సహా.. విశాఖ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్
దొండపర్తి (విశాఖ దక్షిణ)/విశాఖ విద్య: విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడితో పాటు ప్రముఖ ఆడిటర్ జీవీ కిడ్నాప్ వ్యవహారం గురువారం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. సినీ ఫక్కీలో దుండగులు ఎంపీ కుమారుడు శరత్ ఇంట్లోకి చొరబడి.. ముగ్గురి మెడపై కత్తిపెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. 48 గంటల పాటు నిర్బంధించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. కానీ, పోలీసులు నాలుగు గంటల్లోనే కిడ్నాపర్ల ఆచూకీ కనిపెట్టి సినిమా స్టైల్లో వెంబడించి రౌడీషీటర్ కోలా వెంకట హేమంత్కుమార్, రాజేష్లను అరెస్టుచేయడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వారి చెర నుంచి ఎంపీ ఎంవీవీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) సురక్షితంగా బయటపడ్డారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మరో ఐదుగురి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. వివరాలివీ.. కిడ్నాప్ జరిగింది ఇలా.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు శరత్ రుషికొండ ప్రాంతంలో తారకరామ లేఅవుట్లో ఉంటున్నారు. ఈనెల 13వ తేదీ ఉదయం కొందరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. లోపల శరత్ ఒక్కడే ఉండడంతో అతడిని నిర్బంధించి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఇంకా డబ్బు కావాలని దాడిచేశారు. తన వద్ద లేదని చెప్పినా వినలేదు. దీంతో మరుసటి రోజు బుధవారం శరత్తో లాసెన్స్ బే కాలనీలో ఉంటున్న తల్లి జ్యోతికి ఫోన్ చేయించారు. తన ఆరోగ్యం బాగోలేదని, ఇంటికి రావాలని బలవంతంగా చెప్పించారు. అది నిజమని నమ్మిన అతడి తల్లి జ్యోతి కంగారుగా బుధవారం కొడుకు ఇంటికి వచ్చారు. ఆమెను కూడా బంధించి ఆమె వద్ద ఉన్న బంగారు నగలను కాజేశారు. భారీగా డబ్బులు కావాలన్న ఉద్దేశంతో ఎంపీతో సన్నిహితంగా ఉండే ప్రముఖ ఆడిటర్ జీవీకి జ్యోతితో ఫోన్చేసి రప్పించారు. జీవీని కూడా నిర్బంధించి రూ.2 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని ముగ్గురి మెడపై కత్తిపెట్టి బెదిరించారు. దీంతో జీవీ తనకు తెలిసిన వారికి ఫోన్చేసి రూ.1.75 కోట్లు సమకూర్చి వారికి అందించారు. అయినప్పటికీ వారిని విడిచిపెట్టకుండా ఇంకా డబ్బులు కావాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. మధ్యలో ఎంపీ తన కుమారుడు శరత్కు ఫోన్చేసినప్పటికీ కిడ్నాపర్ల సూచనల మేరకు మామూలుగానే మాట్లాడి ఫోన్ పెట్టేశారు. ఆడిటర్ ఫోన్ ట్రాక్కు ఎంపీ వినతి ఐటీ రిటర్నుల పనుల నిమిత్తం హైదరాబాద్లో ఉన్న ఎంపీ ఎంవీవీ.. ఆడిటర్ జీవీకి బుధవారం మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయలేదు. అతడి సన్నిహితులకు ఫోన్చేయగా.. శ్రీకాకుళం వెళ్లినట్లు చెప్పారు. అక్కడి వారికి ఫోన్చేసి ఆరా తీస్తే శ్రీకాకుళం కూడా రాలేదని సమాచారమిచ్చారు. గురువారం ఉదయం కూడా ఫోన్ చేసినప్పటికీ జీవీ స్పందించలేదు. ఒకవైపు రిటర్నుల పనులు, మరోవైపు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో జీవీకి ఏమైందన్న ఆందోళనతో ఎంపీ విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మకు ఫోన్చేసి అతని నెంబర్ను ట్రాక్ చేయాలని కోరారు. వెంటనే పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా జీవీ రుషికొండలోనే ఉన్నట్లు గుర్తించారు. అతని డ్రైవర్తో పాటు మరికొంత మంది ద్వారా సమాచారం సేకరించి సాంకేతికత సాయంతో విచారణ చేపట్టారు. దీంతో కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సినీ ఫక్కీలో ఛేజ్ చేసి.. మరోవైపు.. రెండ్రోజులుగా ముగ్గురిని ఇంట్లోనే నిర్బంధించిన విషయాన్ని పోలీసులు గుర్తించే అవకాశం ఉందని గ్రహించిన కిడ్నాపర్లు వారిని అక్కడ నుంచి విజయనగరం వైపు తరలించేందుకు ప్రయత్నించారు. శరత్కు చెందిన ఆడి కారులో వారిని ఎక్కించుకుని పద్మనాభం నుంచి ఎస్.కోట మీదుగా విజయనగరం వెళ్లేందుకు బయల్దేరారు. పోలీసులు అప్పటికే మొబైల్స్, ఇతర టెక్నాలజీల ఆధారంగా ప్రతి ప్రాంతంలోనూ చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. అడుగడుగునా విస్తృత తనిఖీలు చేపట్టారు. వారు ఆనందపురం మీదుగా పద్మనాభం వైపు వెళ్తున్నట్లు తెలుసుకుని వారి కారును వెంబడించారు. ఆనందపురం మండలం పందలపాక గ్రామానికి వారి కారు చేరుకోగానే ముందు నుంచి పద్మనాభం సీఐ బృందం, వెనుక నుంచి పీఎంపాలెం సీఐ బృందాల వాహనాలు అడ్డగించాయి. అయినప్పటికీ కిడ్నాపర్లు కారు ఆపకుండా ముందుకు వెళ్లే ప్రయత్నంలో పోలీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. వెంటనే కారులో ఉన్న కిడ్నాపర్లు రౌడీషీటర్ కోలా వెంకట హేమంత్కుమార్, రాజేష్లు బయటకు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఎంపీ కుటుంబ సభ్యుల కోసం ఆరా తీశారు. అయితే, వారిని బాకురుపాలెం ప్రాంతంలోనే విడిచిపెట్టినట్లు చెప్పడంతో మరో పోలీస్ బృందం వారికోసం గాలింపు చేపట్టింది. ఇంతలో వారు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నట్లు తెలుసుకుని వారిని సురక్షితంగా కమిషనరేట్కు తరలించారు. హేమంత్కుమార్పై 12 కేసులు.. భీమిలి ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ హేమంత్కుమార్ ఇప్పటికే రెండు కిడ్నాప్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్పుకుంటున్నప్పటికీ అతనిపై బ్లాక్మెయిలింగ్, కిడ్నాప్లు వంటి నేర చరిత్ర ఉంది. 2022లో రామకృష్ణ అనే వ్యక్తిని.. అలాగే, ఈ ఏడాది ఫిబ్రవరి 17న మధుసూధనరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ రెండు కేసుల్లోను పోలీసులు హేమంత్కుమార్ను అరెస్టుచేసి జైలుకు పంపించారు. బెయిల్పై బయటకు వచ్చిన కొద్దిరోజుల్లోనే మరో కిడ్నాప్కు పాల్పడి జైలుకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఇతడిపై మొత్తం 12 కేసుల వరకు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎంపీని పరామర్శించిన మంత్రి అమర్నాథ్ ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ ఉదంతాన్ని తెలుసుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ నగరంలోని ఎంపీ ఇంటికి గురువారం సాయంత్రం వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కిడ్నాప్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో మాట్లాడి, వివరాలు తెలుసుకోమని పంపినట్లు అమర్నాథ్ చెప్పారు. కిడ్నాప్ ఉదంతాన్ని మంత్రికి ఎంపీ వివరించారు. ఆ ఐదుగురు కోసం గాలింపు : సీపీ ఇక కిడ్నాప్ విషయం తెలుసుకున్న వెంటనే 17 బృందాలను ఏర్పాటుచేశామని నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ మీడియాకు వెల్లడించారు. టెక్నాలజీ ఆధారంగా కిడ్నాపర్ల కదలికలపై నిఘా పెట్టి ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి తనిఖీలు చేశామని చెప్పారు. నాలుగు గంటల్లోనే కిడ్నాపర్లు కోలా వెంకటహేమంత్కుమార్తో పాటు రాజేష్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో ఐదుగురి పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించామని, వారు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వీరికోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు సీపీ వివరించారు. కేసు దర్యాప్తులో ఉందని, సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని త్రివిక్రమ్ వర్మ చెప్పారు.