breaking news
-
భర్తతో కలిసి థాయ్లాండ్ టూర్కు వెళ్లాల్సి ఉండగా.. భార్య ఆత్మహత్య
ప్రకాశం: ఉరి వేసుకుని అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మంగపాటివారిపాలెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొప్పోలు కళ్యాణి (38) వెల్లటూరు పంచాయతీలో అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త సురేష్ వ్యవసాయం చేస్తూనే ఓ ప్రైవేట్ మార్కెట్ కంపెనీలో ఏజెంట్గా పనిచేస్తున్నాడు. మార్కెట్ కంపెనీలో సురేష్ బాగా పనిచేయడంతో ఆ కంపెనీ వారు సురేష్ కుటుంబానికి అక్టోబర్ 1వ తేదీ థాయ్లాండ్ టూర్ ఏర్పాటు చేశారు. దీంతో సురేష్, కళ్యాణి థాయ్లాండ్ వెళ్లడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏమైందో ఏమోగానీ గురువారం రాత్రి అందరూ నిద్రించిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నిద్రలేచిన భర్త సురేష్ గమనించి చుట్టుపక్కల వారి సాయంతో కిందికి దించి చూడగా అప్పటికే కళ్యాణి మృతి చెందింది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై దాసరి రాజారావు సంఘటన స్థలానికి చేరుకుని కళ్యాణి మృతదేహాన్ని పరిశీలించారు. ఆపై మృతిపై అనుమానాలున్నాయని, ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Sep 30th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu And Nara Lokesh Bail Petition Hearings and Ground updates 07:20 PM, సెప్టెంబర్ 30, 2023 లోకేష్.. ఈ సంగతులు మరిచిపోయావా? : మంత్రి సురేష్ ► ఇన్నర్ రింగ్ రోడ్ కారణంగా ముగ్గురు లబ్ధిపొందారు: ఆదిమూలపు సురేష్ ► అమరావతి రింగ్రోడ్ 97 కి.మీ పరిధిలో 97 అష్టవంకర్లు తిప్పారు ► ఆప్షన్-1 కంటే రూ.350 కోట్లు అదనంగా ఖర్చయ్యే ఆప్షన్-2 ఎన్నుకున్నారు ► ముందుగానే భూములు కొనుక్కుని బాబు కుటుంబం హెరిటేజ్ సంస్థ, నారాయణ, లింగమనేని లబ్దిపొందారు ► క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబుకు లింగమనేని తన గెష్ట్ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చారు ► ఇన్నర్ రింగ్ రోడ్ అవకతవకలన్నీ నారా లోకేష్ కనుసన్నల్లోనే జరిగాయి ► హెరిటేజ్ లో డైరెక్టర్లుగా ఉన్న లోకేష్, బ్రాహ్మణి తమకు సంబంధం లేదని ఎలా చెప్తారు? ► 56 శాతం వాటాలు చంద్రబాబు కుటుంబానివే.!: ఆదిమూలపు సురేష్ 07:18 PM, సెప్టెంబర్ 30, 2023 విచారణకు విజయవాడకు వస్తాను : ఢిల్లీలో లోకేష్ ► CID వాళ్లు లవ్ లెటర్ ఇచ్చారు, వాళ్లకు కాఫీ, టీలు ఆఫర్ చేశాం ► వాయిదాలు అడగను, విజయవాడకు మంగళవారం వెళ్లి విచారణకు హజరవుతా ► ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు, నాపై అభియోగాలు మోపారు ► 9.6 ఎకరాలు అమరావతి కోర్ కాపిటల్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ► ప్లాంట్ పెడతామని హెరిటేజ్ అప్పుడు కొనుగోలు చేసింది ► హెరిటేజ్లో నేను షేర్ హోల్డర్ను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ను ► నాపై మూడు కేసులున్నాయి, స్కిల్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ ► ఈ మూడు వేర్వేరు శాఖల కింద ఉన్నాయి తప్ప వాటికి నేను మంత్రిని కాను ► వాటికి సంబంధించిన ఫైళ్లను నేను చూడలేదు, వాటితో నాకు సంబంధం లేదు ► వాటిలో ఏం జరిగినా నాకు సంబంధం లేదు 06:58 PM, సెప్టెంబర్ 30, 2023 కదులుతున్న హెరిటేజ్ డొంక ► ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వేగం పెంచిన CID ► రాజధాని పేరిట లింగమనేనితో క్విడ్ ప్రో కో నడిపిన చంద్రబాబు కుటుంబం & హెరిటేజ్ ► రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని భూములు కొన్న హెరిటేజ్ ► లింగమనేని నుంచి కరకట్ట గెస్ట్హౌజ్ను తీసుకున్న చంద్రబాబు కుటుంబం ► రూ.29 లక్షలు నగదు రూపంలో ఇచ్చానంటున్న భువనేశ్వరీ ► హెరిటేజ్తో ఏ ఏ లింకులు ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలన చేసిన CID ► ఢిల్లీలో ఇవ్వాళ నారా లోకేష్కు CID నోటీసులు ► హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వండి ► అమరావతిలో ఎక్కడెక్కడ భూములు కొన్నారు? లావాదేవీల వివరాలివ్వాలని సూచన ► హెరిటేజ్ బోర్డు సమావేశాల మినిట్స్తో కూడిన బుక్ సమర్పించాలని ఆదేశం ► మినిట్స్ను ఆధారంగా చేసుకుని జరిపిన బ్యాంకు లావాదేవీలేంటీ? ► చెల్లింపు వివరాలను పూర్తిగా అందించాలని నోటీసుల్లో పేర్కొన్న సిఐడి 06:30 PM, సెప్టెంబర్ 30, 2023 సుప్రీంకోర్టులో అక్టోబర్ 3న చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ► చంద్రబాబు పిటిషన్ మంగళవారం విచారించనున్న సుప్రీంకోర్టు ► జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందుకు పిటిషన్ ► 6 వ నెంబర్ కోర్టులో జరగనున్న విచారణ ► Case No: SLP(Crl) No. 012289 - / 2023 Registered on 23-09-2023 ► Category : 1405-Criminal Matters : Matters relating to Prevention of Corruption Act 06:20 PM, సెప్టెంబర్ 30, 2023 నోటీసుల్లో లోకేష్కు CID ఏం చెప్పిందంటే.. 1. భవిష్యత్తులో ఎలాంటి నేరానికి పాల్పడకూడదు 2. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లో తారుమారు చేయకూడదు 3. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని.. బెదిరింపులు కాని ప్రలోభాలు కాని గురిచేయకూడదు 4. పిలిచినప్పుడు కోర్టు ముందు తప్పక హాజరు కావాలి 5. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరై అధికారులకు సహకరించాలి 6. వాస్తవాలను దాచిపెట్టకుండా వెల్లడించాలి 7. హెరిటెజ్ ఫుడ్స్ బ్యాంక్ అకౌంట్ల వివరాలను విచారణ అధికారులకు ఇవ్వాలి 8. భూముల కొనుగోలుకు సంబంధించి హెరిటేజ్ బోర్డ్ డైరెక్టర్ల మీటింగ్ మినిట్స్ ఇవ్వాలి 9. అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి లావాదేవీల వివరాలు విచారణకు హాజరయ్యే సమయంలో తీసుకురండి 10. నోటీసులు అందుకున్నాక విచారణకు రాకపోయినా, నిబంధనలను పాటించకోపోయినా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ(3), (4) ప్రకారం మీ అరెస్టు తప్పదు 05:45 PM, సెప్టెంబర్ 30, 2023 ఢిల్లీలో లోకేష్కు నోటీసులు ► ఏ కేసులో నోటీసులు ఇస్తున్నారని ప్రశ్నించిన లోకేష్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నోటీసులు : సీఐడీ అధికారులు ► వాట్సాప్ లో కూడా నోటీసులు పంపారు కదా అన్న లోకేష్ ► 41A కింద నోటీసులు ఇచ్చామని వివరించిన సీఐడీ అధికారులు ► 41(3), 41(4) సెక్షన్ లోని విషయాలను అడిగిన లోకేష్ ► సెక్షన్ల గురించి లోకేష్ కు వివరించిన సీఐడీ అధికారులు ► నోటీసులు ఇచ్చే సమయంలో లోకేష్ తో పాటు కనకమేడల ► సాక్ష్యాధారాలను ట్యాంపర్ చేయను : లోకేష్ ► నోటీసులను క్షుణ్ణంగా చదువుకుంటాం : లోకేష్ 05:35 PM, సెప్టెంబర్ 30, 2023 గల్లా ఇంట్లో ఏం జరిగింది? ► గల్లా జయదేవ్ ఇంట్లో లోకేష్ను కలిసిన CID అధికారులు ► సీఐడీ అధికారులు మధుసూధన్ రావు, బాజీజోహాన్, జగత్ సింగ్ ► డ్రాయింగ్ రూంలో CID అధికారులకు లోకేష్ అభివాదం ► లోకేష్ : ఏం కేసు, రింగ్ రోడ్ కేసేనా? వాట్సాప్లో పంపించారు కదా.! ► CID అధికారులు : మేం ఢిల్లీలోనే ఉన్నాం, నేరుగా నోటీసులు సర్వ్ చేయాలని వచ్చాం ► లోకేష్ : సెక్షన్ల గురించి చదువుకుంటాను, మా లాయర్ కనకమేడల అన్నీ చెబుతారు 05:25 PM, సెప్టెంబర్ 30, 2023 ఔను.. లోకేష్కు నోటీసులిచ్చాం ► దాదాపు 20 నిమిషాల పాటు గల్లా జయదేవ్ ఇంట్లో CID అధికారులు ► గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్న లోకేష్తో మాట్లాడిన CID అధికారులు ► అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విజయవాడ CID కార్యాలయానికి విచారణకు రావాలని సూచన ► కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీడియాతో మాట్లాడలేకపోతున్నామని తెలిపిన అధికారులు ► నోటీసులు తీసుకున్న లోకేష్, నోటీసులు అందినట్టు లిఖితపూర్వకంగా తెలిపిన లోకేష్ 05:15 PM, సెప్టెంబర్ 30, 2023 CID @ గల్లా జయదేవ్ గృహం ► గల్లా జయదేవ్ ఇంటి లోనికి వెళ్లిన CID అధికారులు ► అశోక్ రోడ్డులోని 50వ నెంబర్ గృహంలోనికి అనుమతితో వచ్చిన CID అధికారులు ► జయదేవ్తో మాట్లాడి లోపలికి వచ్చిన CID అధికారులు ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమ అలైన్మెంట్ కేసులో A14గా లోకేష్ ► నేరుగా నోటీసులు ఇస్తామని తెలిపిన CID అధికారులు ► లోకేష్ విజయవాడకు వచ్చి విచారణకు హాజరు కావాలని సూచించిన CID అధికారులు 05:10 PM, సెప్టెంబర్ 30, 2023 CID అధికారులను అడ్డుకున్న జయదేవ్ సిబ్బంది ► ఢిల్లీ అశోకా రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్ ఆఫీస్ లో లోకేష్ ► గేటు వద్దే CID అధికారులను నిలిపివేసిన జయదేవ్ సిబ్బంది ► లోకేష్ను బయటకు వస్తే నోటీసులు ఇస్తామన్న CID అధికారులు ► బయటకు రావడానికి ఇష్టపడని లోకేష్ ► విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవద్దని సూచించిన CID అధికారులు ► CID అధికారులను లోనికి అనుమతించిన జయదేవ్ సిబ్బంది ► నోటీసులు తీసుకోవాలని లోకేష్కు సమాచారం ఇచ్చిన CID అధికారులు ► అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విజయవాడ CID కార్యాలయానికి విచారణకు రావాలని సూచన 05:00 PM, సెప్టెంబర్ 30, 2023 లోకేష్ ఇంట్లో లేడు, ఆఫీసులో ఉన్నాడు : గల్లా జయదేవ్ ► CID అధికారులతో మాట్లాడిన ఎంపీ గల్లా జయదేవ్ ► అశోక్ రోడ్డులోని తన కార్యాలయంలో లోకేష్ ఉన్నాడన్న ఎంపీ గల్లా జయదేవ్ ► అశోక్ రోడ్డులోని 50వ నెంబర్ గృహంలో ఉన్న జయదేవ్ కార్యాలయానికి వచ్చిన CID అధికారులు 04:50 PM, సెప్టెంబర్ 30, 2023 ఢిల్లీ : గల్లా జయదేవ్ ఇంటి వద్ద హైడ్రామా ► ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లిన AP CID అధికారులు ► జయదేవ్ ఇంట్లో లోకేష్ ఉన్నట్టు పక్కా సమాచారంతో వెళ్లిన CID అధికారులు ► ఇంటికి వచ్చిన పోలీసులను గేటు వద్దే నిలిపివేసిన గల్లా మనుష్యులు ► నారా లోకేష్ ఇంట్లో లేరని సీఐడీ అధికారులకు తెలిపిన గల్లా జయదేవ్ ► నోటీసులు ఇచ్చి వెళతామని చెప్పిన CID అధికారులు 04:40 PM, సెప్టెంబర్ 30, 2023 బండారు నోరు జారొద్దు.! ► టీడీపీ నేత బండారు సత్యనారాయణపై మహిళా కమిషన్ సీరియస్ ► మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణ ► టీడీపీ నేత బండారు వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న మహిళా కమిషన్ ► ఆంధ్రప్రదేశ్ డిజిపికి లేఖ రాసిన మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ► బండారు సత్యనారాయణను అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి ► మరోసారి నోరు జారకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన వాసిరెడ్డి పద్మ 04:30 PM, సెప్టెంబర్ 30, 2023 రంగంలోకి భువనేశ్వరీ.! ► చంద్రబాబు అరెస్ట్పై సానుభూతి రావట్లేదని గ్రహించిన టిడిపి నేతలు ► ఎలాగైనా భువనేశ్వరీని రంగంలోకి దించాలని నిర్ణయించిన టిడిపి నేతలు ► ఇప్పటికే రాజమండ్రి నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయిన భువనేశ్వరీ ► చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా దీక్ష చేసేందుకు భువనేశ్వరీని ఒప్పించిన టిడిపి నేతలు ► అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష 04:00 PM, సెప్టెంబర్ 30, 2023 భువనేశ్వరీ లావాదేవీల సంగతేంటీ? ► కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్హౌజ్లో అద్దెకు మాత్రమే ఉన్నామన్న చంద్రబాబు, భువనేశ్వరీ ► అద్దె ఎందుకు కట్టలేదని దర్యాప్తు సంస్థల ప్రశ్న ► కరకట్టపై ఉన్న లింగమనేని ఇంట్లో చంద్రబాబు అద్దెకు ఉన్నారు అంతే ► కానీ.. ఆ ఇంటికి ఆయన అద్దె డబ్బు చెల్లించలేదు, ఆ అద్దె కట్టింది నేనే అన్న చంద్రబాబు భార్య భువనేశ్వరీ ► అద్దెను నగదు రూపంలో చెల్లించానంటున్న భువనేశ్వరీ ► జూన్ 2019లో ఏకంగా రూ.27 లక్షల రుపాయల నగదును లింగమనేనికి చెల్లించానంటున్న భువనేశ్వరీ ► రూ.27లక్షల రుపాయల నగదు చెల్లించడంలో పారదర్శకత ఉందా? ► నిజంగా రూ.27లక్షల రుపాయల నగదు చెల్లించి ఉంటే లింగమనేని IT రిటర్నులలో ఎందుకు పేర్కొనలేదు? ► పోనీ.. భువనేశ్వరీ IT రిటర్నులలోనైనా ఎందుకు రూ.27లక్షల రుపాయల నగదు చెల్లించినట్టు తెలపలేదు? ► భువనేశ్వరీకి, లింగమనేనికి మధ్య ఎన్ని లావాదేవీలు జరిగాయి? ► అందులో వైట్ మనీ ఎంత? బ్లాక్ మనీ ఎంత? 03:10 PM, సెప్టెంబర్ 30, 2023 ఢిల్లీలో బయటికొచ్చిన లోకేష్ ► ఢిల్లీ: నిన్నటి నుంచి కనిపించకుండా ఉన్న లోకేష్ ► మధ్యాహ్నం 3గంటలకు గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్న లోకేష్ ► లోకేష్ తో పాటు టిడిపి ఎంపీ రవీంద్ర కుమార్ ► లోకేష్కు 41A నోటీసులు ఇవ్వనున్న CID అధికారులు ► లోకేష్ బయటకు రావడానికి ముందు భారీగా మంతనాలు ► CIDకి సమాచారం ఇవ్వడమే మంచిదని సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు సూచించినట్టు సమాచారం ► దేశం విడిచిపోవడం వల్ల తప్పుడు సంకేతాలిచ్చినట్టు అవుతుందని సూచించినట్టు సమాచారం ► అరెస్ట్ భయంతో ఢిల్లీలో ఉండడం వల్ల కేడర్ నిరుత్సాహానికి గురవుతుందని చెప్పిన పార్టీ నేతలు ► తండ్రి అరెస్టయిడే ప్రజల్లో ఉండి ఆందోళన చేయాలి కానీ.. మీ అరెస్ట్ గురించి ఆలోచిస్తే ఎలా అన్న నేతలు ► బింకం వీడి గల్లా జయదేవ్ ఇంటికొచ్చిన లోకేష్ ► నోటీసు అందుకోగానే పలువురు సీనియర్ లాయర్లతో మాట్లాడేందుకు సన్నాహాలు 02:35 PM, సెప్టెంబర్ 30, 2023 ఆలోచించుకోవాల్సిందే TDP, జనసేనే : CPI ► BJPతో జనసేన పొత్తులో ఉంది ► జనసేనతో TDP పొత్తులో ఉంది ► TDP, జనసేన కూడా ఒకసారి ఆలోచించాలి ► వాళ్లు BJP తో తెంచుకుని వస్తే మేం స్వాగతిస్తాం ► దేశం, రాష్ట్రం బాగుపడాలంటే TDP, జనసేన పార్టీలు బీజేపీ నుంచి బయటకు రావాలి : CPI రామకృష్ణ 02:15 PM, సెప్టెంబర్ 30, 2023 పవన్కళ్యాణ్కు జై కొట్టాలని యాక్షన్ కమిటీలో TDP నిర్ణయం ► పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం : అచ్చెన్న ► రేపటి నుంచి కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగే వారాహి యాత్రలో తెలుగుదేశం కార్యకర్తలంతా పాల్గొనాలి ► చంద్రబాబును బాగా అభిమానించే వారిలో దాదాపు 97 మంది ఇప్పటివరకు చనిపోయారు ► త్వరలోనే చనిపోయిన వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెబుతాం ► అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున భువనేశ్వరి నిరాహారదీక్ష చేస్తారు ► అక్టోబర్ 2 రాత్రి 7 నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి నిరసన తెలపాలి ► లైట్లు ఆపి వరండాలోకి వచ్చి కొవ్వొత్తులతో నిరసన తెలపాలని కోరుతున్నా ► రేపటినుంచి 4 రోజులు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పవన్ పర్యటిస్తారు ► పవన్ పర్యటనలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని సంపూర్ణ సహకారం ఇవ్వాలని నిర్ణయించాం 02:00 PM, సెప్టెంబర్ 30, 2023 కోర్టు సాక్షిగా బయటపడుతున్న తండ్రీకొడుకుల డొల్లతనం ► అసలు తప్పే చేయలేదు, మేం నిప్పు అని చెప్పుకున్న చంద్రబాబు, లోకేష్ ► కోర్టు ముందు వేసే పిటిషన్లు, వాదనలను పరిశీలిస్తే బయటపడుతోన్న డొల్లతనం ► రాజకీయ కక్షతో కేసులని చెబుతున్న వాళ్లు అదే విషయాన్ని కోర్టు ముందు చెప్పని వైనం ► మచ్చుకు ఒక రెండు ఉదాహరణలు పరిశీలిస్తే.. ఎక్కడా మేం తప్పు చేయలేదని చెప్పడం లేదు ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో ఒకసారి వాదనలు పరిశీలిస్తే.. ► లోకేష్ బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో దమ్మాలపాటి వాదనలు ► తండ్రితో కలిసి కరకట్ట ఇంట్లో నివాసం ఉన్నందుకు నాపై ఎలా కేసు పెడతారు? : లోకేష్ ► అంటే చంద్రబాబు తప్పు చేస్తే చంద్రబాబును పట్టుకోవాలి కానీ, లోకేష్పై ఎలా కేసు పెడతారా అన్నదేనా మీ వాదన ► ఇన్నర్ రింగ్రోడ్డు వ్యవహారంలో జోక్యం చేసుకోలేదని చెప్పిన లోకేష్ తండ్రి తరపున సంతకాలు ఎందుకు పెట్టారు? ► కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్హౌజ్ను క్విడ్ప్రోకో కింద తీసుకున్నారన్న అభియోగాలపై ► చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, దమ్మలపాటి వాదనలు ► కరకట్టపై ఉన్న లింగమనేని ఇంట్లో చంద్రబాబు అద్దెకు ఉన్నారు అంతే ► కానీ.. ఆ ఇంటికి ఆయన అద్దె డబ్బు చెల్లించలేదు, ఆ అద్దె కట్టింది చంద్రబాబు భార్య భువనేశ్వరీ ► భువనేశ్వరీ కట్టిన అద్దె లింగమనేని ఐటీ రిటర్నుల్లో ఎందుకు జమ కాలేదు? ► అసలు మీరు చెల్లించిన అద్దెను మీ ఐటీ రికార్డుల్లోనయినా చూపించారా? 01:25 PM, సెప్టెంబర్ 30, 2023 ఓవర్ టు ఢిల్లీ : లోకేష్ ఎక్కడ? ► లోకేష్ కోసం ఢిల్లీలో గాలిస్తోన్న AP CID ► 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు గాలిస్తోన్న ఏపీ సీఐడీ అధికారులు ► నోటీసులు తీసుకోకుండా ఢిల్లీలో దాగుడు మూతలు ఆడుతున్న లోకేష్ ► స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ కేసుల్లో ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్లు ► CIDతో పాటు మీడియా కంట్లో కూడా పడకుండా తిరుగుతున్న లోకేష్ ► ఇప్పటివరకు ఉన్న ఐటీసీ మౌర్య హోటల్లో రూమ్ ఖాళీ ► ఆఫీసు కోసం వినియోగించుకున్న జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌజ్ ఖాళీ ► లోకేష్ రెగ్యులర్గా వాడే కారును పక్కకు పెట్టిన టిడిపి ► సుప్రీంకోర్టు లాయర్లకు ఈ కేసు గురించి ఇంకేం చెబుతారు? ► లాయర్లతో మంతనాలు చేయడానికి లోకేష్ లా చదవలేదు కదా? ► పోనీ న్యాయశాస్త్రాన్ని ఔపోసన పట్టి సీనియర్ లాయర్లకే చెప్పే కేసు పాయింట్లు కూడా ఏమీ లేవు కదా? ► పైగా, ఎన్ని కేసులుంటే అంత మంచి పదవులు ఇస్తాను అని ప్రకటించారు కదా ► తన దాకా వస్తే కానీ లోకేష్కు అర్ధం కావడం లేదా? 01:10 PM, సెప్టెంబర్ 30, 2023 యాక్షన్ కమిటీలో TDP నేతలు ఏం చర్చించారు? ► నంద్యాలలో TDP పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం ► చంద్రబాబు నంద్యాలలో అరెస్ట్ అయ్యారు కాబట్టి అక్కడే సమావేశం జరిపిన టీడీపీ ► జూమ్ ద్వారా మాత్రమే హాజరవుతానని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీలో పాల్గొన్న నారా లోకేష్ ► హాజరైన అచ్చెన్న, బాలకృష్ణ, యనమల, ఇతర సభ్యులు ► టీడీపీ, జనసేన కోఆర్డినేషన్ కమిటీ నియామకంపై చర్చ ► 10 మందితో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం ► చంద్రబాబు అరెస్ట్, పెరుగుతున్న కేసుల దృష్ట్యా భవిష్యత్ కార్యాచరణపై చర్చ ► టీడీపీ, జనసేనతో కలిసి ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చ ► పైకి భింకంగా కనిపిస్తున్నా.. లోన గందరగోళంగా టిడిపి నేతల పరిస్థితి ► ఇన్ని తప్పులు ఎలా చేశారని ప్రజలు ప్రశ్నిస్తే ఏం చేయాలి? ► మీరు తప్పులు చేయకుండానే కేసులు పెట్టారా అని ప్రశ్నిస్తే ఏం చెప్పాలి? ► లోకేష్ ఎందుకు ఢిల్లీకే పరిమితమయ్యారని ప్రశ్నిస్తే ఏం చెప్పాలి? 1:05 PM, సెప్టెంబర్ 30, 2023 ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు 1. అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా? 2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? 3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా? 4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా? 5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా? 6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా? 7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా? 12:10 PM, సెప్టెంబర్ 30, 2023 బ్రాహ్మణి, ముందు తప్పు చేశాడా లేదా మీ ఆయన్ని అడుగు : వరుదు కళ్యాణి ► బ్రాహ్మణి మోత పిలుపుపై వరుదు కళ్యాణి విమర్శలు ► ED, IT, CID మోగిస్తున్న అవినీతి మోతకు సమాధానం చెప్పు బ్రాహ్మణి..! ► టీడీపీకి 2019లోనే ప్రజలు మోత మోగించారు ► ఇప్పుడు బాబు జైల్లో ఉన్నాడని కొత్తగా మోగించేది ఏముంటుంది? ► టీడీపీ మాయమాటలను నమ్మే వారెవరూ లేరని బ్రాహ్మణి గుర్తించాలి ► తప్పుచేసినోళ్లే సంఘీభావం కోరడం సిగ్గుచేటు ► తప్పులపై తప్పులు చేసి ఇప్పుడు బుకాయిస్తే ఎలా? ► బాబును మించిన నియంత ఎవరూ లేరని బ్రాహ్మణికి తెలియదా? స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్లో చంద్రబాబు, లోకేష్ జనం సొమ్మును అడ్డంగా దోచేశారు. తప్పులు అన్నీ మీరు చేసి.. డబ్బులు దోపిడీ చేసేసి.. ఇప్పుడు మోత మోగించి మద్దతు తెలపండి అని ప్రజలను అడగడం ఎంత వరకు సమంజసం? - ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి… pic.twitter.com/6K7pjsKi8O — YSR Congress Party (@YSRCParty) September 30, 2023 12:00 PM, సెప్టెంబర్ 30, 2023 తప్పులు చేసి, జైలుకి వెళ్లి.. మోత మోగిస్తానంటారా? ► లోకేష్, బ్రాహ్మణి మోత పిలుపుపై కురసాల కన్నబాబు చురకలు ► చంద్రబాబుకు ఆల్రెడీ మోత మోగింది ► గతంలో కాపు ఉద్యమంలో నిరసన తెలిపితే అక్రమ కేసులు పెట్టారు ► కాపు ఉద్యమంలో పెట్టిన అక్రమ కేసులను సీఎం జగన్ మాఫీ చేశారు ► నాటి సిద్ధాంతం ప్రకారం ఇవాళ టీడీపీ వాళ్లు కంచాలు కొడితే కేసులు పెట్టాలి కదా? ► చంద్రబాబును అరెస్ట్ చేస్తే నన్ను కలవనివ్వారా అని లోకేష్ అంటున్నాడు ► ఆనాడు ముద్రగడను అరెస్ట్ చేసి ఆయన కుమారుడ్ని దారుణంగా కొట్టారు ► కాపులు కంచాలు కొడితే తప్పని టీడీపీ నేతలే చెప్పారు ► బాబు స్కిల్ స్కామ్తో రాష్ట్రమంతా మోతెక్కిపోతుంది ► భలేగా కుంభకోణం చేశామని మోత మోగించాలనుకుంటున్నారా? ► ఫైబర్ గ్రిడ్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమ అలైన్మెంట్ స్కాంల తర్వాత ఇంకేమి మోగిస్తారు? 11:29 AM, సెప్టెంబర్ 30, 2023 సూత్రధారి చంద్రబాబు, కీలక పాత్రధారి పెండ్యాల శ్రీనివాస్ చౌదరీ ► చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ చౌదరీని సస్పెండ్ చేసిన ప్రభుత్వం ► సర్వీస్ నిబంధనలు అతిక్రమించినందుకు శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు ► సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ జవహర్రెడ్డి ► ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న శ్రీనివాస్ ► స్కిల్ కుంభకోణం, చంద్రబాబు ఐటీ నోటీసుల్లో కీలకంగా ఉన్న శ్రీనివాస్ ► శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరాయని గుర్తించిన CID ► ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా పారిపోయిన శ్రీనివాస్ లెక్కలన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి శ్రీనివాసే, అందుకే అమెరికాకు ఎక్స్పోర్ట్ చేశారు ► చంద్రబాబుకు వచ్చే నిధులన్నీ శ్రీనివాస్ ద్వారానే రూట్ అయినట్టు గుర్తించిన CID ► పర్సనల్ సెక్రటరీగా పని చేసిన సమయంలో బాబుకు నమ్మకంగా పెండ్యాల శ్రీనివాసచౌదరి ► శ్రీనివాసచౌదరి ఇంట్లో ఫిబ్రవరి 13 ,2020న IT సోదాలు ► ఏకంగా రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించిన IT అధికారులు ► చంద్రబాబు పేరును స్పష్టంగా రాసుకున్న శ్రీనివాసచౌదరి ► చంద్రబాబుకు సంబంధించి ఫిబ్రవరి 17, 2020న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల ► బ్లాక్ మనీ రూ.2వేల కోట్లకు సంబంధించి వివరాలు లభ్యమయ్యాయని పేర్కొన్న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ► మొత్తమ్మీద చంద్రబాబు చీకటి చరిత్రలో పెండ్యాల శ్రీనివాసచౌదరి పాత్ర పెద్దదేనంటున్న ఐటీ ► పెండ్యాల శ్రీనివాసచౌదరి దొరికితే కీలక ఆధారాలు దొరికే అవకాశం ఉందని భావిస్తోన్న CID & IT ► అవసరమయితే అమెరికాకు వెళ్లి పెండ్యాల శ్రీనివాసచౌదరిని తీసుకురావాలని భావిస్తోన్న CID & IT ► ఇంటర్పోల్ సహకారం తీసుకుని పెండ్యాల శ్రీనివాసచౌదరిని తీసుకువచ్చే అవకాశం 11:00 AM, సెప్టెంబర్ 30, 2023 బాబు కోసం గుండు గీయించుకుంటే@ రూ.1000 ►టీడీపీ నేతల పరిస్థితి దారుణంగా తయారైంది. ►ఎల్లో బ్యాచ్కు మద్దతిచ్చే వారే కరువురయ్యారు. ►చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలిపేవారే దిక్కులేరు. ►ఆటోడ్రైవర్లకు రూ.1000 ఇచ్చి గుండ్లు గీయించిన ఎల్లో బ్యాచ్. ►టీడీపీ నేతల తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు.. అరెస్ట్ కు నిరసన గా గుండు చేపించుకుంటే గుండుకు రూ.1000 ఇవ్వడమేంట్రా.. @jaitdp @iTDP_Official 😹🤭 నీ 40 ఏళ్ల రాజకీయంలో ప్రజల్ని ఎంత పీడించావో ఈ దౌర్భాగ్యం పట్టింది నీకు @ncbn!#CorruptionKingCBN #KhaidiNo7691 #SkilledCriminalCBNinJail #TDPScams #InnerRingRoadScam pic.twitter.com/aVstKNgPGp — Jagananna Connects (@JaganannaCNCTS) September 30, 2023 10:50AM, సెప్టెంబర్ 30, 2023 ►టీడీపీ నేత నూకరాజుపై కేసు నమోదు.. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలతో జడ్జిలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై హైకోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జిపై అసభ్యకర కామెంట్లు చేసిన భీమిలికి చెందిన నూకరాజుపై సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్… — YSR Congress Party (@YSRCParty) September 30, 2023 10:40AM, సెప్టెంబర్ 30, 2023 అంత భయమెందుకు లోకేష్? ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాంలో A14గా ఉన్న నారా లోకేష్ ►అరెస్ట్ భయంతో ఢిల్లీలోనే లోకేష్. ►41ఏ నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి సీఐడీ అధికారులు ►సీఐడీకి దొరక్కుండా దాగుడుమూతలు ఆడుతున్న చినబాబు. ►తప్పు చేయకపోతే నోటీసులు అందుకోవడానికి భయమెందుకు.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాంలో A14గా ఉన్న నారా లోకేష్..అరెస్ట్ భయంతో ఢిల్లీకి పారిపోయాడు. దాంతో అతనికి 41ఏ నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి సీఐడీ అధికారులు వెళ్లగా.. వారికి దొరక్కుండా దాగుడుమూతలు ఆడుతున్నాడు. తప్పు చేయకపోతే నోటీసులు అందుకోవడానికి భయమెందుకు… pic.twitter.com/v7iqySTIjT — YSR Congress Party (@YSRCParty) September 30, 2023 10:35 AM, సెప్టెంబర్ 30, 2023 బాలయ్యకు సామాన్యురాలు కౌంటర్ ►సినిమాల్లో తొడ కొట్టినట్లు అసెంబ్లీలో కూడా బాలయ్య తొడకొడితే ఎలా? ►నిజానికి బాలకృష్ణకు రాజకీయాలు తెలీదు.. వాటి గురించి మాట్లాడలేడు కూడా. ►పొరపాటున బాలయ్య నోరుతెరిస్తే బూతులే మాట్లాడతాడు ►చంద్రబాబు రూ.371 కోట్లు అవినీతి చేశాడు. ►అది తప్పు కాబట్టే.. అరెస్ట్ చేశారు సినిమాల్లో తొడ కొట్టినట్లు అసెంబ్లీలో కూడా బాలయ్య తొడకొడితే ఎలా? నిజానికి అతనికి రాజకీయాలు తెలీదు.. వాటి గురించి మాట్లాడలేడు కూడా. పొరపాటున నోరుతెరిస్తే బూతులే మాట్లాడతాడు. చంద్రబాబు రూ.371 కోట్లు అవినీతి చేశాడు. అది తప్పు కాబట్టే.. అరెస్ట్ చేశారు. - ఓ వృద్ధురాలి అభిప్రాయం… pic.twitter.com/ML3s5thrT7 — YSR Congress Party (@YSRCParty) September 30, 2023 10:30 AM, సెప్టెంబర్ 30, 2023 బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ సస్పెన్షన్ ►చంద్రబాబు మాజీ సీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పన్షన్ ►ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా పారిపోయిన శ్రీనివాస్ ►శుక్రవారంలోగా రావాలని నోటీసులిచ్చినా వెనక్కి రాని శ్రీనివాస్ ►స్కిల్ స్కామ్, చంద్రబాబు ఐటీ నోటీసులిచ్చినా కీలకంగా ఉన్న శ్రీనివాస్ ►ప్రభుత్వ సర్వీస్ రైల్స్ అతిక్రమించినందుకు శ్రీనివాస్ సస్పెన్షన్ 8:45 AM, సెప్టెంబర్ 30, 2023 21వ రోజు జైలులో చంద్రబాబు.. ►జైలులో 21వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్న జైలు వర్గాలు. ►చంద్రబాబుకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు. ►చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్న జైలు అధికారులు ►ఈ వారానికి చంద్రబాబుతో పూర్తైన ములాఖత్లు. 7:00 AM, సెప్టెంబర్ 30, 2023 లోకేష్ ఎక్కడ.? ► ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో A14 లోకేష్ ► 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లిన CID బృందం ► ఇప్పటివరకు బస చేసిన ITC మౌర్య హోటల్లో రూమ్ ఖాళీ ► మీటింగ్లు పెట్టే గల్లా జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌజ్లో లేడు ► రెగ్యులర్గా వాడే కారు మార్చేశాడు ► CID కంటికి కనిపించకుండా లోకేష్ దాగుడు మూతలు. 06:30 AM, సెప్టెంబర్ 30, 2023 బ్రాహ్మణి.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా? ► బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలకు YSRCP సూటి ప్రశ్నలు 1) బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో కేంద్ర సంస్థ ఆదాయంపన్ను అధికారులు ఫిబ్రవరి 13 ,2020న సోదాలు జరిపినపుడు రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17, 2020న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీన్ని మీరు అంగీకరించారా? లేదా? 2) అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ.600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో రూ.119 కోట్లు (20%) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును, నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని అని శ్రీనివాస్ చౌదరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కంటాక్స్ సంస్థ చంద్రబాబుకు నోటీస్ ఇచ్చింది. దీనిమీద మీ మాటేంటీ? 3) రూ.371 కోట్ల స్కిల్ కుంభకోణంలో కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నలుగురిని అరెస్ట్ చేసింది. మరి మీరు అంతా సవ్యంగా జరిగిందని ఎలా అంటారు? 4) CID నోటీసులు అందుకున్న వెంటనే పెండ్యాల శ్రీనివాసచౌదరి, మనోజ్ వాసుదేవ్ , యోగి విదేశాలకు ఎందుకు పారిపోయారు?. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో A14 గా నారా లోకేశ్. ముందస్తు బెయిల్ పై ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో అరెస్ట్ భయంతో మీడియా కళ్ళుగప్పి ఢిల్లీలో ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. #LooterLokesh #CorruptBabuNaidu pic.twitter.com/cFSWzwbTbB — YSR Congress Party (@YSRCParty) September 29, 2023 ఎవరి కోసం మోగించాలి.. ఎందుకోసం మోగించాలి @jaitdp? స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి యువతను మోసం చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు మీ నాయకుడు @ncbn. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణను ఎదుర్కోలేక ఢిల్లీ వెళ్ళి దాక్కున్నాడు ఆయన కొడుకు @naralokesh. అంటే మీరు తప్పులు చేసి… https://t.co/URMSKWm0Ou — YSR Congress Party (@YSRCParty) September 29, 2023 06:14 AM, సెప్టెంబర్ 30, 2023 తెలుగుసేనలో అయోమయం ► రాజమండ్రిలో జైలుకు పరిమితమైన చంద్రబాబు ► ఢిల్లీ నుంచి కదలనంటున్న లోకేష్ బాబు ► రాజమండ్రి నుంచి హైదరాబాద్కు భువనేశ్వరి ► రాజమండ్రి లోకేష్ క్యాంప్లో నారా బ్రాహ్మణి ► రెండు రోజుల హడావిడి తర్వాత కనిపించని బాలకృష్ణ ► జైలు ముందు పొత్తు ప్రకటన చేసి సైలంట్ అయిన పవన్ కళ్యాణ్. -
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
దొండపర్తి : ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాకు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. బెట్టింగ్ వేసే వారిని నిలువునా ముంచుతున్న బుకీ గ్యాంగ్లో 11 మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం డీసీపీ–1 కె.శ్రీనివాసరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. క్రికెట్ బెట్టింగ్ పేరుతో రూ.8 లక్షల వరకు తనను మోసం చేశారని నగరానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల పోలీస్ స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంలో తీగ లాగితే డొంక కదిలింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి చెందిన మెరుపురెడ్డి సూరిబాబు ఈ ముఠాలో ప్రధాన సూత్రధారుల్లో ఒకరుగా పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో 20 నుంచి 30 మంది మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఒక్కో మ్యాచ్కు రూ.4 లక్షల వరకు బెట్టింగ్ చేసేవాడు. ఇలా ఏడాదికి రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు బిజినెస్ టర్నోవర్ చేసేవాడు. ఇలా సేకరించిన మొత్తాన్ని నగరంలోని సూర్యాబాగ్ ప్రాంతంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపిస్తున్న దినేష్కుమార్ అనే వ్యక్తికి పంపేవాడు. ఇందుకు అతడికి 2 శాతం కమీషన్ ఇచ్చేవాడు. ఇలా తనకు తెలిసిన వ్యక్తులను కూడా బుకీలుగా మార్చి బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ బుకీ గ్యాంగ్ గుట్టుగా బెట్టింగ్ నిర్వహించడంతో పాటు.. బెట్టింగ్ వేసే వారికి డబ్బులు నష్టపోయేలా సాఫ్ట్వేర్లను రూపొందించారు. సాధారణంగా గెలిచే అవకాశమున్న జట్టుకు తక్కువ పర్సెంట్, ఓడిపోయే అవకాశాలున్న జట్టుకు ఎక్కువ శాతం డబ్బును ఆఫర్ చేస్తుంటారు. ఆ విధంగా జట్టు మీద బెట్టింగ్ వేశాక కొంత సమయం వరకు వాటిని వేరొక జట్టుకు మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ వీరు అలా మార్చడానికి అవకాశం లేకుండా ఆ సమయంలో సర్వర్ను ఆఫ్ చేసేవారు. ప్రధానంగా గేమ్ విన్నర్, లాస్ ఆప్షన్స్.. హ్యాండ్లర్ చేతిలో ఉండడంతో ఒకవేళ గెలిచినప్పటికీ నష్టం వచ్చిందని చెప్పి వారి ఐడీని బ్లాక్ చేస్తారు. ఆ డబ్బును తమ కరెంట్ అకౌంట్లలోకి జమ చేసి వాటి నుంచి కార్పొరేట్ ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో నిర్ధారౖణెంది. ఈ గ్యాంగ్కు సంబంధించిన 63 బ్యాంక్ ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయగా.. అందులో 36 ఖాతాల ద్వారా ఇప్పటి వరకు రూ.367.62 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. వాటిలో 13 అకౌంట్లలో ఉన్న రూ.75 లక్షలు స్తంభింపచేసినట్లు పోలీసులు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో సూరిబాబు, విశాఖకు చెందిన హండ దినే‹Ùకుమార్, బర్రి శ్రీను, గుర్రం శివ, కిల్లాడి శ్రీనివాసరావు, ఉరిటి కొండబాబు, ఉరిటి వెంకటేశ్వర్లు, సుందరాపు గణేష్, దూలి నూకరాజు, అల్లు నూకరాజు అవినాష్, ఉప్పు వాసుదేవరావులున్నారు. ఈ రాకెట్ వెనుక ప్రధాన సూత్రదారి కోసం గాలిస్తున్నట్టు డీసీపీ–1 శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో ఏడీసీపీ(ఎస్బీ) నాగేంద్రుడు, సైబర్ క్రైం సీఐ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
భర్తతో పోట్లాడి.. కాలువలో దూకింది
తూర్పు గోదావరి: భర్తతో పోట్లాడిన ఓ యువతి పోలవరం కాలువలో దూకింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరానికి చెందిన నెరుసు శ్రీనివాసరావుకు, కొవ్వూరుకు చెందిన కస్తూరితో ఈ ఏడాది జనవరిలో వివాహమైంది. శ్రీనివాసరావు వేలివెన్ను శశి విద్యాసంస్థల్లో లెక్చరర్గా పని చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల మనస్పర్థలు వచ్చి, తరచూ గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కస్తూరిని కొన్ని రోజుల పాటు కొవ్వూరులోని పుట్టింట్లో ఉంచమని శ్రీనివాసరావు తల్లిదండ్రులు సూచించారు. దీంతో ఆమెను శ్రీనివాసరావు బైక్పై తీసుకొని శుక్రవారం ఉదయం బయలుదేరాడు. అనంతపల్లి పోలవరం కుడి కాలువ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి కాలి చెప్పు పడిపోయిందని, బైక్ ఆపాలని కస్తూరి భర్తను కోరింది. బైక్ ఆపిన వెంటనే ఆమె పరుగెత్తి, అందరూ చూస్తూండగానే బ్రిడ్జిపై నుంచి కాలువలోకి దూకేసి, ప్రవాహంలో గల్లంతైంది. దీనిపై ఆమె భర్త శ్రీనివాసరావు నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేశామని ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. కస్తూరి ఆచూకీ కోసం కాలువలో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. -
జైల్లో నుంచే చంద్రబాబు మరో ప్లాన్.. వారంతా ఎక్కడ?
పారిపోతున్నారు.. ఒకరి తర్వాత ఒకరుగా పారిపోతున్నారు. అవినీతి ఆనకొండ అరెస్ట్ కావడంతో.. అవినీతి పందికొక్కులన్నీ విదేశీ కలుగుల్లో దాక్కొంటున్నాయి. దర్యాప్తు అనగానే వణుకు పుడుతోంది. లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము స్వాహా చేశారు కాబట్టే.. ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో జంప్ అయిపోతున్నారు. ఒకవైపు చంద్రబాబు.. నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని తెగ వాపోతున్నారు. మరోవైపు కుంభకోణాల్లో తనకు సహకరించిన వారందరినీ ఆయన సలహాతోనే దేశం దాటించేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సింపుల్గా చెప్పుకోవాలంటే.. దొరికి పోయామని అర్థమైంది. పరారైపోయారు.. చంద్రబాబు నాయుడు తన హయాంలో సాగించిన కుంభకోణాలు అన్నీ ఇన్నీ కావు. అందులో ప్రధాన సూత్రధారి చంద్ర బాబు అయితే.. కీలక పాత్రధారులు చాలా మందే ఉన్నారు. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో టీడీపీ సర్కారు అవినీతి బాగోతాలు బయటపడుతున్న కొద్దీ.. పరారవుతున్న వారి జాబితా పెరుగుతూ వస్తోంది. తాజాగా లోకేష్కి అత్యంత సన్నిహితుడు కిలారు రాజేష్ పరారైన బ్యాచ్లో చేరిపోయాడు. జైల్లోకి వెళ్లక ముందు ఈ పరారీ ఎపిసోడ్కి దర్శకత్వం చంద్రబాబు వహించారని.. జైల్లోకి వెళ్లిన తర్వాత సలహాలు, సూచనలు ఇస్తూ చంద్రబాబు దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తు న్నారని.. రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తనకే పాపం తెలియదని.. తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఒకవైపు గగ్గోలు పెడుతోన్న చంద్రబాబు.. మరోవైపు కుంభకోణాల్లో కీలకంగా వ్యవహరించిన వారిని దేశం దాటించేస్తున్నారు. వాళ్లు దొరికితే కీలక ఆధారాలన్నీ దొరికిపోయినట్టే అని చంద్రబాబు తెగ ఆందోళన చెందుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, అలానే.. షాపూర్జీ-పల్లోంజీ ప్రతినిధి మనోజ్ ఇద్దరూ ఇప్పటికే విదేశాలకు చెక్కేశారు. శ్రీనివాస్ని అమెరికాకి, మనోజ్ని దుబాయ్కి పంపించేసేది చంద్రబాబే అని పొలిటికల్ ఎనలిస్ట్లు విశ్లేషిస్తున్నారు. సెప్టెంబర్ నెల 5వ తేదీన సీఐడీ నుంచి నోటీసులు వస్తే.. ఆరవ తేదీన శ్రీనివాస్ అమెరికాకి వెళ్లిపోయాడు. చంద్రబాబు ఏ తప్పు చేయ నప్పుడు.. వాళ్లని ఎందుకు దేశం దాటించేశారన్న ప్రశ్న మొత్తం స్కామ్లకు సూత్రధారి చంద్రబాబే అని చెప్పకనే చెబుతోంది. మరోవైపు.. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీ పారిపోయిన లోకేష్.. అక్కడ నేషనల్ మీడియా ముందు అమాయకత్వం నటించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. ఒక నేషనల్ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ అమెరికాకి పిక్నిక్కి వెళ్లాడని లోకేష్కి చెప్పుకొచ్చాడు. మరి, తన బాస్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే.. ఆఘమేఘాల మీద అమెరికా నుంచి రావాల్సిన పీఏ రాలేదు. ఇంకా అమెరికాలో పిక్నిక్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నా డు. ఎందుకంటే.. శ్రీనివాస్ అమెరికా వెళ్లింది. మనోష్ దుబాయ్ వెళ్లింది. విహారయాత్రకి కాదు. పరారైన యాత్రకు. స్కామ్ల్లో సీఐడీ ఎవరెవరి పేర్లు అయితే బయటపెట్టిందో.. ఎవరెవరి పాత్రలపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టంగా చెబుతోందో.. వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరుగా చంద్రబాబు అరెస్ట్కి ముందు పారిపోయారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పారి పోతున్నారు. నిర్దోషులు అయితే వాళ్లెందుకు పారిపోతున్నారు?. మరోవైపు ఢిల్లీలో వ్యవహరాలు చక్కపెట్టేందుకని లోకేష్ హడావుడి చేస్తున్నా.. అరెస్ట్ భయంతోనే ఆయన కూడా హస్తిన పారిపోయారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరో ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. చంద్రబాబుని అరెస్ట్ చేయగానే రోడ్డు మీద పడుకుని గగ్గోలు పెట్టేసిన పవన్ కళ్యాణ్.. ఇక టీడీపీతోనే కలిసి పనిచేస్తానని ముసుగు తీసేసిన దత్తపుత్రుడు.. ఆ తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. పవన్ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇక వన్.. టూ.. త్రీ.. అంటూ ఒకరి తర్వాత ఒకరుగా పరారైయ్యే వాళ్లు పరారైపోతున్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకపోతే.. ఒకవైపు దర్యాప్తునకి పూర్తిగా సహకరిస్తూ, మరోవైపు సీఐడీ నోటీసులు ఇచ్చిన వారందరూ పారిపోకుండా చూసేవారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రకరకాల కుంభకోణాలతో ప్రజాధనాన్ని చంద్రబాబు స్వాహా చేశారు కాబట్టే.. సాక్ష్యాధారాలు బయటపడకుండా స్కామ్లో సహకరించిన అందరినీ దేశాలు దాటిస్తున్నారన్న సంగతి.. సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతోంది. తాజాగా కిలారు రాజేష్ కూడా పారిపోవడంతో పరారైన వాళ్ల సంఖ్య ముగ్గురికి చేరింది. పారిపోయిన వాళ్లు ముగ్గురు కాదు. నలుగురు అంటూ లోకేష్ వైపు వేలు చూపించే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంతకీ, కిలారు రాజేష్ని దేశం దాటించారా? లేక దేశంలోనే దాచేశారా? విదేశీ కలుగుల్లో దాక్కొన్న అవినీతి పందికొక్కులను పట్టే స్కెచ్.. సీఐడీ సిద్దం చేస్తోంది. ఇంతకీ.. అసలు లోకేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నాడు.? ఇది కూడా చదవండి: చంద్రబాబు విడుదల కాలేరు: రఘువీరారెడ్డి వ్యాఖ్యలు -
ఏపీ హైకోర్టులో నారా లోకేష్కు ఎదురు దెబ్బ
సాక్షి, గుంటూరు: ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం డిస్పోస్ చేసింది. అంతేకాదు ఈ కేసులో లోకేష్కు నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ సీఐడీని ఆదేశించిన కోర్టు.. మరోవైపు విచారణకు సహకరించాల్సిందేనని నారా లోకేష్కు తేల్చి చెప్పింది. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్ పేరు చేరుస్తూ ఈ మధ్యే విజయవాడ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాకలు చేసింది. దీంతో అరెస్ట్ భయంతో.. నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్పై వాదనలు జరిగాయి. లోకేష్ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా.. ఏపీ సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే లోకేష్కు 41-ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. ‘‘మేము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నాం. దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని లోకేష్ను ఆదేశించిండి’’ అని ఏజీ శ్రీరామ్ చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 41-ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని సూచించింది. ఆ ఆదేశాలను అనుసరించి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ బయల్దేరింది ఏపీ సీఐడీ. మరికాసేపట్లో ఏపీ సీఐడీ అధికారులు లోకేష్ను కలిసి నోటీసులు అందించే అవకాశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: పాపం.. లోకేష్ను కించపరుస్తూ యెల్లో మీడియా కథనాలు -
విశాఖలో రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందా గుట్టురట్టు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. విశాఖ వేదికగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందాను సైబర్ పోలీసులు గుట్టురట్టు చేశారు, అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస్తున్న కింగ్ మోను అలియాస్ దినేష్, వాసుదేవ్, సూరి బాబులతోపాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చే శారు. కాగా ఒక్క కింగ్ మోను అకౌంట్స్ నుంచే రూ. 145 కోట్ల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తదించారు. ఈ బెట్టింగ్ ఉచ్చులో విశాఖ పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది అమాయక యువకులు చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ కేసును సీపీ రవిశంకర్ స్వయంగా విచారణ చేస్తున్నారు. చదవండి: బాలిక హత్య.. బాబాయే హంతకుడు? -
Sep 29, 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu And Nara Lokesh Bail Petition Hearings and Ground updates 7:07 PM, సెప్టెంబర్ 29, 2023 కోర్టులపై వక్రభాష్యాలకు సమాధానాలు ఇవిగో ► కోర్టులకు ఎదురవుతున్న సవాళ్లకు ఇటీవల ఇండియా టుడే కాంక్లేవ్లో సూటిగా, స్పష్టంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ సమాధానాలు ప్రశ్న : కోర్టుల స్వతంత్రత గురించి మీరేమంటారు? తీర్పు ఇచ్చే సమయంలో మీపై ఒత్తిడులుంటాయా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ : ► ఒక జడ్జిగా నాకు 23ఏళ్లుగా అనుభవం ఉంది. ► ఒక కేసులో ఇలా ఉండండి, ఇలా తీర్పు చెప్పండి అని ఏ ఒక్కరు మాపై ఒత్తిడి తీసుకురారు, తీసుకురాలేదు. ► ప్రతీ రోజూ సుప్రీంకోర్టులో ఉదయాన్నే బెంచ్ మీదకు వెళ్లకముందు జడ్జిలందరూ కలిసి కాఫీ తాగుతాం. ► కానీ ఏ ఒక్కరు ఇంకొకరి కేసు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించబోరు ► ఇక హైకోర్టులోనయితే ఈ సున్నితమైన పరిస్థితి మరింత ఎక్కువ. ► కొన్ని సార్లు సింగిల్ బెంచ్లో జడ్జి ఇచ్చిన తీర్పును అదే హైకోర్టులోని మరో ఇద్దరు జడ్జిలు సమీక్షించాల్సి ఉంటుంది. ► ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోరు. ► ఎవరి కేసునయితే నేను సమీక్షించబోతున్నానో.. అదే జడ్జితో కలిసి భోజనం చేయవలిసిన పరిస్థితి ఉంటుంది. ► భోజనం షేర్ చేసుకుంటాం. అయితే కేసులను మాత్రం షేర్ చేసుకోం. ► అది మేం తీసుకున్న శిక్షణలో భాగం. ► అంతెందుకు మాపై ప్రభుత్వంలో ఉన్న ఏ వ్యవస్థ నుంచి ఒత్తిడి రాదు. ► ఇది నా ఒక్కరి గురించి చెప్పడం లేదు. మొత్తం దేశంలోని న్యాయవ్యవస్థ గురించి చెబుతున్నాను. 7:02 PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ఎక్కడ.? ► ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో A14 లోకేష్ ► 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లిన CID బృందం ► ఇప్పటివరకు బస చేసిన ITC మౌర్య హోటల్లో రూమ్ ఖాళీ ► మీటింగ్లు పెట్టే గల్లా జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌజ్లో లేడు ► రెగ్యులర్గా వాడే కారు మార్చేశాడు ► CID కంటికి కనిపించకుండా లోకేష్ దాగుడు మూతలు 6:32 PM, సెప్టెంబర్ 29, 2023 అభివృద్ధి తరలిపోతోందన్న బ్రాహ్మణి.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా? ► బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలకు YSRCP సూటి ప్రశ్నలు 1) బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో కేంద్ర సంస్థ ఆదాయంపన్ను అధికారులు ఫిబ్రవరి 13 ,2020న సోదాలు జరిపినపుడు రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17, 2020న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీన్ని మీరు అంగీకరించారా? లేదా? 2) అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ.600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో రూ.119 కోట్లు (20%) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును, నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని అని శ్రీనివాస్ చౌదరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కంటాక్స్ సంస్థ చంద్రబాబుకు నోటీస్ ఇచ్చింది. దీనిమీద మీ మాటేంటీ? 3) రూ.371 కోట్ల స్కిల్ కుంభకోణంలో కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నలుగురిని అరెస్ట్ చేసింది. మరి మీరు అంతా సవ్యంగా జరిగిందని ఎలా అంటారు? 4) CID నోటీసులు అందుకున్న వెంటనే పెండ్యాల శ్రీనివాసచౌదరి, మనోజ్ వాసుదేవ్ , యోగి విదేశాలకు ఎందుకు పారిపోయారు? 6:23 PM, సెప్టెంబర్ 29, 2023 పళ్లాలను గరిటలతో కొట్టండి : బ్రాహ్మణి ► చంద్రబాబు అరెస్ట్ అయినందుకు నిరసన తెలపాలంటూ పిలుపు ► బ్రాహ్మణి తీరును తప్పుబట్టిన మంత్రి అంబటి ► నాడు పళ్లాలను గరిటలతో కొట్టిన కాపులను దెబ్బతీశారు, ఇప్పుడు విధి ప్రకారం మీ వంతొచ్చిందంటూ చురకలు విధి విచిత్రమైనది ! కాపు ఉద్యమంలో పళ్ళాలు కొట్టినవారిని మక్కెలిరగొట్టి బొక్కలో వేసావ్ ! అవినీతి కేసులో బొక్కలో పడి పళ్ళాలు కొట్టమంటున్నావ్ ! వారే వాహ్ !@ncbn@naralokesh @iTDP_Official — Ambati Rambabu (@AmbatiRambabu) September 29, 2023 5:23 PM, సెప్టెంబర్ 29, 2023 భువనేశ్వరీకి నోటీసులు ఇవ్వాలి : కోర్టును కోరిన లూథ్రా ► రింగ్ రోడ్ అక్రమ అలైన్మెంట్ కేసులో చంద్రబాబు తరపున సిద్ధార్ధ్ లూద్రా వాదనలు ► భువనేశ్వరి అకౌంట్ నుంచే లింగమనేనికి అద్దె చెల్లింపులు జరిగాయి ► చంద్రబాబు, భువనేశ్వరికి 91 నోటీసు ఇవ్వొచ్చు కదా అని కోరిన లూథ్రా ► బాబు బెయిల్ నిరాకరణకు లింగమనేని వ్యవహారానికి లింకు పెట్టొద్దు లూథ్రా 5:20 PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ఢిల్లీలో ఎందుకు ఉంటున్నారంటే.? : అచ్చెన్నాయుడు ► ఎన్నికేసులు వేసినా లోకేష్ భయపడడు ► సుప్రీంకోర్టు లాయర్లకు బ్రీఫింగ్ ఇవ్వడానికే లోకేష్ ఢిల్లీలో ఉంటున్నాడు ► లాయర్లతో చర్చించాలి కాబట్టే లోకేష్ పాదయాత్ర వాయిదా 5:00 PM, సెప్టెంబర్ 29, 2023 తప్పులు చేసిన చంద్రబాబు జైలుకు వెళ్లారు : రఘువీరారెడ్డి ► శ్రీసత్యసాయి జిల్లా: చంద్రబాబు అరెస్ట్పై సీనియర్ నేత N.రఘువీరారెడ్డి వ్యాఖ్యలు ► స్వీయ తప్పిదాల వల్లే చంద్రబాబు జైలుకు వెళ్లారు ► తాను తవ్విన గోతిలో తనే పడ్డారు చంద్రబాబు ► ప్రత్యేక హోదా కోసం 2017లో గుంటూరులో సభ నిర్వహిస్తే చెప్పులు, రాళ్లు వేయించారు ► టీడీపీ దీక్షల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.. చంద్రబాబు విడుదల కాలేరు ► న్యాయస్థానంలో తప్పు చేయలేదని చంద్రబాబు నిరూపించుకోవాలి 4:25 PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసు అక్టోబర్ 3కు వాయిదా ► చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ వచ్చే నెల 3కు వాయిదా ► CID తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ► రింగ్ రోడ్ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు ► లింగమనేని భూముల పక్కనుంచి వెళ్లేలా అలైన్మెంట్ మార్పులు ► అలైన్మెంట్ మార్పు తర్వాత లింగమనేని భూముల విలువ భారీగా పెరిగింది ► లింగమనేని, హెరిటేజ్ సంస్థలు భూఅక్రమాలకు పాల్పడ్డాయి ► చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ లూథ్రా వాదనలు 3:25 PM, సెప్టెంబర్ 29, 2023 స్టేబిఎన్ ఇన్నాళ్లకు జైలుకెళ్లాడు : బొత్స ► విజయనగరంలో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి నేతలు కలిసి దోచుకుతిన్నారు ► ఇప్పడు సెక్షన్లు వర్తించవని అంటున్నారు తప్ప.. అవినీతి జరగలేదని చెప్పడం లేదు ► చంద్రబాబు ఇప్పటివరకు స్టే లు తెచ్చుకొని బ్రతికాడు ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కూడా అలాగే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు ► జైలుకు వెళ్లిన తర్వాత సానుభూతి పొందాలని చూస్తున్నాడు ► శాసనసభలో చర్చకు అవకాశం ఉన్నప్పటికీ టిడిపి ఎమ్మెల్యేలు చర్చించకుండా పారిపోయారు ► అవినీతి జరిగిందని అసెంబ్లీలో ఉన్న టిడిపి ఎమ్మెల్యేలకి కూడా తెలుసు 3:15 PM, సెప్టెంబర్ 29, 2023 తెలుగుసేనలో అయోమయం ► రాజమండ్రిలో జైలుకు పరిమితమైన చంద్రబాబు ► ఢిల్లీ నుంచి కదలనంటున్న లోకేష్ బాబు ► రాజమండ్రి నుంచి హైదరాబాద్కు భువనేశ్వరి ► రాజమండ్రి లోకేష్ క్యాంప్లో నారా బ్రాహ్మణి ► రెండు రోజుల హడావిడి తర్వాత కనిపించని బాలకృష్ణ ► జైలు ముందు పొత్తు ప్రకటన చేసి సైలంట్ అయిన పవన్ కళ్యాణ్ 3:10PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో బాబు, లోకేష్ పిటిషన్లు వాయిదా ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ► కేసు విచారణను అక్టోబర్ 4, 2023, బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు ► ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా అక్టోబర్ 4కు వాయిదా వేసిన హైకోర్టు 3:00PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో 4వరకు ఆగండి ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో లోకేష్ వేసిన ముందస్తు బెయిల్పై విచారణ ► లోకేష్ను అరెస్ట్ చేసే విషయంలో అక్టోబర్ 4వరకు ఆగాలని హైకోర్టు సూచన ► ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు 2:50PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : అమరావతి రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసు ► చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ జరుపుతున్న హైకోర్టు ► CID తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు 2:40PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ లోకేషన్ ఎక్కడ? ► ఢిల్లీ: మీడియాకు కంటపడకుండా తిరుగుతున్న లోకేష్ ► కార్లు మారుస్తూ రహస్యంగా మీటింగులు ► నిన్నటి నుంచి గల్లా జయదేవ్ ఇంటికి రాని లోకేష్ ► ఐటీసి మౌర్య నుంచి మరో చోటకు మకాం మార్పు ► జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌస్లో ఉన్నారని సమాచారం ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్ట్ ఎదురుదెబ్బ తగలడంతో న్యాయవాదులతో మంతనాలు ► CID బృందం వస్తుందని తెలిసి ఢిల్లీలో అలర్ట్ 2:30PM, సెప్టెంబర్ 29, 2023 ►లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ప్రారంభం ►స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసుల్లో లోకేష్ బెయిల్ పిటిషన్ 2:15 PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ► ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు ► హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బాబు లాయర్లు ► ఫైబర్ నెట్ స్కాంలో A25గా ఉన్న చంద్రబాబు ► A25గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో ఇప్పటికే సిఐడి మెమో ► తాజా పరిణామాలతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు ► అత్యవసరంగా విచారించాలని ఇప్పటికే హైకోర్టును కోరిన లోకేష్ లాయర్లు ► కాసేపట్లో హైకోర్టు బెంచ్ ముందుకు విచారణకు వచ్చే అవకాశం 2:00 PM, సెప్టెంబర్ 29, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు గురించి పది పాయింట్లు.. తండ్రీ కొడుకులు ఏం చేశారంటే.? 1. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును 2016 డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు ప్రారంభించారు. రూ.149కే కేబుల్ ప్రసారాలు, 200 చానళ్లతో టీవీ, ఫోన్ సౌకర్యం ఇస్తామని ప్రకటించారు. 2. ఫైబర్నెట్ ప్రాజెక్టును బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు. రూ.333 కోట్ల బిడ్డింగ్ ముగియటానికి ఒక్క రోజు ముందు టెరాసాఫ్ట్ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన APTS వీసీ సుందర్ను బదిలీ చేశారు. టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్ను టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్గా తొలగించారు. 3. టెరాసాఫ్ట్ సంస్థకు 14 ఏళ్లు డైరెక్టర్ ఎవరంటే హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్గా పనిచేసిన దేవినేని సీతారామయ్య 4. బహిరంగ మార్కెట్లో అత్యంత నాణ్యమైన సెట్టాప్ బాక్స్ రూ.2,200కే దొరుకుతుండగా చంద్రబాబు సర్కారు మాత్రం రూ.4,400 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీలో ఉత్పత్తి చేసినట్లు వేమూరి అంగీకరించారు. 5. APSFL నుంచి టెరా సాప్ట్కి రూ.284 కోట్లు విడుదల చేశారు. అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి ఇచ్చారు. ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్లో ఆ కంపెనీ ఏర్పాటైంది. నెట్వర్క్, ఎక్స్వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బును బదిలీ చేశారు. ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమ తదితరులకు వెళ్లినట్లు తేలింది. ఈ కంపెనీలన్నింటి చిరునామా, టెరా సాఫ్ట్వేర్ అడ్రస్ ఒక్కటే. 6. ఈ డబ్బంతా పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు రూటు అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇన్కమ్ టాక్స్ కూడా శ్రీనివాస్కు, చంద్రబాబుకు నోటీసులిచ్చింది. 7. హెరిటేజ్తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణప్రసాద్కి టెరా సాఫ్ట్తో అనుబంధం ఉంది. ఈవీఎంల దొంగతనం కేసు నమోదైన వ్యక్తికి చెందిన సంస్థకు ఈ ప్రాజెక్టును ఇచ్చారు. టెండర్ల పర్యవేక్షణ కమిటీలో ఆయన్ను సభ్యుడిగా నియమించారు. ఆయనే టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్గానూ వ్యవహరిస్తున్నాడు. పర్యవేక్షణ కమిటీ సభ్యుడుగా ఉంటూ తన సొంత సంస్థ టెరా సాఫ్ట్కు పనులు ఇచ్చేసుకున్నారు. 8. ఐదేళ్లూ చంద్రబాబు వద్దే పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఉండింది. ఆ శాఖ పరిధిలోనిదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్. నిబంధనల మేరకు సంబంధిత శాఖను నిర్వహిస్తున్న మంత్రి మాత్రమే ఆ శాఖలోని ఫైళ్లపై సంతకం చేయాలి. ఇతర మంత్రులు సంతకం చేయకూడదు. 9. లోకేశ్ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్ను 2017 సెప్టెంబర్ 14న APSFLకు సలహాదారుగా నియమించారు. అప్పటి నుంచి టెండర్లలో గోల్ మాల్ పెద్ద ఎత్తున జరిగినట్టు తేలింది. లోకేశ్ వద్ద ఉన్న శాఖలకు, APSFLకు సంబంధం లేదు. అయినా తన తండ్రి శాఖలోని ఫైల్ తెప్పించుకున్న లోకేశ్.. 2017 నవంబర్ 12న బీబీఎన్ఎల్తో ఎంవోయూ ఫైల్పై సంతకం చేశారు 10. కేంద్రం అనుమతి లేకుండా అంచనా వ్యయం రూ.500 కోట్లకుపైగా పెంచేసి వేమూరి సంస్థకు ఖరారు చేశారు. BBNL మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. టెండర్ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించి.. అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. 1:40 PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ఇప్పటికైనా బయటకు రావాలి : మంత్రి రోజా ► ఈ 20 రోజుల్లో లోకేష్ ముఠా నానా యాగీ చేసింది ► తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాలి ► తప్పు చేయక పోతే ముందస్తు బెయిల్కు ఎందుకు దరఖాస్తు చేస్తుకున్నారు? ► యువగళం పాదయాత్ర ఆపేసి ఢిల్లీలో ఎందుకు దాక్కున్నారు? ► ఎన్టీఆర్ కూతురు, మనవరాలిగా భువనేశ్వరి, బ్రాహ్మణిలను అభిమానిస్తాం, ► టిడిపి స్క్రిప్ట్ చదివితే మాత్రం తప్పులు ఎత్తి చూపిస్తాం ► ఎర్ర బుక్లో రాసుకున్నాము, తాట తీస్తాం అన్న లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? 1:35PM, సెప్టెంబర్ 29, 2023 కుంభకోణం గురించి మాట్లాడరెందుకు? : సజ్జల రామకృష్ణారెడ్డి ► ఈ 20 రోజుల్లో లోకేష్ ముఠా నానా యాగీ చేసింది ► ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీకి గురైంది ► సాక్ష్యాధారాలతో దొరికితే చంద్రబాబును కోర్టు రిమాండ్కు పంపింది ► జరిగిన కుంభకోణంపై వీరంతా మాట్లాడడం లేదు ► దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు ► మేధావులు అనుకుంటున్న కొందరితో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు ► చంద్రబాబు అరెస్టును దేశ సమస్యలా చిత్రీకరిస్తున్నారు ► రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చారు, ఐక్యరాజ్యసమితికి ఇచ్చినా ఆశ్చర్యం లేదు ► మూడేళ్లు దర్యాప్తు చేశాక ఆధారాలతో అరెస్ట్ చేశారు ► స్కిల్ స్కామ్ లో పూర్తి ఆధారాలు ఉన్నాయి ► తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ స్టేట్మెంట్ ఇచ్చింది ► గంటా సుబ్బారావుకు నాలుగు పదవులిచ్చారు ► మొత్తం నాలుగు కేసుల్లో అన్ని ఆధారాలున్నాయి ► డిజైన్ టెక్ ద్వారా కోట్లు కొట్టేశారు 1:25PM, సెప్టెంబర్ 29, 2023 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్ ► హైకోర్టులో మరో పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు ► ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ ► ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు 12:55PM, సెప్టెంబర్ 29, 2023 ఇండియా కూటమి వైపు సైకిల్ వెళ్తొందా.? బయటకొస్తున్న అసలు ఎజెండాలు ► చంద్రబాబు అరెస్ట్పై ఇప్పటివరకు తెగ ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ ► హైదరాబాద్లో ధర్నాలను పోలీసులు నిలిపివేయడంపై టి కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఆగ్రహం ► చంద్రబాబును వెనకేసుకొస్తూ ప్రకటనలు చేస్తోన్న రేవంత్ ► గతంలో చంద్రబాబుతో కలిసి ఓటుకు కోట్లు పంపిణీ చేసి రెడ్ హండెడ్గా దొరికిన రేవంత్ ► తాజాగా చంద్రబాబు కోసం తెగ ఆరాట పడ్డ మోత్కుపల్లి ► బాబును తిట్టిన నోటితోనే ప్రశంసలు కురిపించి తెలుగుదేశం పార్టీనే ఆశ్చర్యపరిచిన మోత్కుపల్లి ► ఇవ్వాళ బెంగళూరుకు వెళ్లిన మోత్కుపల్లి నర్సింహులు ► డీకే శివకుమార్ తో భేటీ అయిన మోత్కుపల్లి నర్సింహులు ► పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అంటోన్న మోత్కుపల్లి ► డీకే శివకుమార్ డైరెక్షన్తోనే చంద్రబాబుకు మోత్కుపల్లి మద్ధతిచ్చారా? 12:45PM, సెప్టెంబర్ 29, 2023 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో యార్లగడ్డ క్వాష్ పిటిషన్లు ► లోకేష్ యువగళం పాదయాత్రలో రెచ్చిపోయిన యార్లగడ్డ వెంకట్రావు ► తన మనుష్యులతో కలిసి వీరంగం సృష్టించినట్టు యార్లగడ్డపై అభియోగాలు ► గన్నవరం నియోజకవర్గంలోని రంగన్నగూడెం, వీరవల్లి పోలీస్ స్టేషన్లు ముట్టడి ► ఏపీ హైకోర్టును ఆశ్రయించిన యార్లగడ్డ వెంకట్రావు ► మూడు కేసుల్లో క్వాష్ పిటిషన్ వేసిన యార్లగడ్డ ► యార్లగడ్డ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నాగముత్తు 12:25PM, సెప్టెంబర్ 29, 2023 విజయవాడ వేదికగా కురుక్షేత్ర సంగ్రామ శంఖారావాన్ని పూరించిన CM వైఎస్ జగన్ ► ప్రస్తుత సంక్షేమ ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలోని స్కాముల నేతలకు మధ్య యుద్ధం ► ఫైబర్ గ్రిడ్ స్కామ్, స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్... ► అమరావతి పేరుతో స్కాములు చేసిన గత నాయకులతో యుద్ధం ► గతంలోనూ ఇదే బడ్జెట్, మారిందల్లా సీఎం ఒక్కడే ► గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారు? ► దోచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలి ► దోచుకున్నది పంచుకునేందుకే వాళ్లకు అధికారం కావాలి ► వాళ్లకు మాదిరిగా నాకు గజదొంగల ముఠా తోడుగా లేదు ► వంత పాడేందుకు వాళ్లకున్నట్టు దత్త పుత్రుడు లేడు ► పేదవాడి ప్రభుత్వం నిలబడాలి, పెత్తందారుల ప్రభుత్వం రాకూడదు ► మీ ఇంట్లో మంచి జరిగిందనిపిస్తే నాకు తోడుగా నిలవండి ► ఈ కురుక్షేత్ర యుద్ధంలో నాకు అండగా నిలవండి ► ఓటు వేసే ముందు జరిగిన మంచి గురించి ఆలోచించండి 12:15PM, సెప్టెంబర్ 29, 2023 రాజమండ్రి జైలుకు నారాయణ, చంద్రబాబుతో ములాఖత్ ► 20 రోజులుగా జైల్లో ఉన్నా చంద్రబాబు మనో ధైర్యం కోల్పోలేదు ► ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కు సంబంధించి లోకేష్పై కేసు పెట్టారు ► ఇన్నర్ రింగ్రోడ్లో నా సొంత భూమి పోయింది, దాని ఖరీదు ఏడు కోట్ల రూపాయలు ► జనసేనతో పొత్తుపై ఉమ్మడి కమిటీ వేస్తాం ► కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ముందుకు వెళ్తాం ► అన్ని విషయాలు కోర్టులోనే తేలుతాయి, బాబు జైల్లో ధైర్యంగా ఉన్నారు 12:05PM, సెప్టెంబర్ 29, 2023 ఎక్కడ దాక్కున్నా తప్పుంటే అరెస్ట్ కావాల్సిందే : లోకేష్ ఛాలెంజ్కు పేర్ని నాని కౌంటర్ ► ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేసే దమ్ము CIDకి లేదా ? : లోకేష్ ఛాలెంజ్ ► ఢిల్లీ కాదు.. సప్త సముద్రాల అవతల చెట్టు తొర్రలో దాక్కున్నా తప్పు చేస్తే అరెస్ట్ కావాల్సిందే : పేర్ని నాని నారా లోకేష్ని అరెస్ట్ చేయాలంటే ఢిల్లీలోనే కాదు.. చెట్టు తొర్రలో దాక్కున్నా దర్యాప్తు అధికారులు నిమిషాల్లో అరెస్ట్ చేసి తీసుకురాగలరు. చంద్రబాబు కంటే నువ్వేమీ పోటుగాడివి కాదు కదా @naralokesh..? కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేయాలి? అనేది దర్యాప్తు… pic.twitter.com/dLLF8HcNj3 — YSR Congress Party (@YSRCParty) September 28, 2023 12:00PM, సెప్టెంబర్ 29, 2023 పచ్చమీడియాకు ఇంత పక్షపాతమా? : YSRCP ► ఏ కేసులోనయినా ఏ మీడియా అయినా రెండు వర్షన్లను కవర్ చేస్తారు ► కానీ స్కిల్ స్కాంలో పచ్చమీడియా నిజాలు దాచిపెడుతోంది ► మేం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే కవర్ చేయలేదు ► టిడిపి వాళ్లు అసత్యాల ప్రజంటేషన్కు మాత్రం ఎల్లో మీడియా పట్టం కట్టింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజెంటేషన్ రూపంలో క్లియర్గా ప్రభుత్వం చూపించినా.. ఎల్లో మీడియా మాత్రం ప్రసారం చేయలేదు. కేవలం టీడీపీ వాళ్లు చెప్పింది మాత్రమే ప్రజలకి చూపించారు. బాబు అరెస్ట్ తర్వాత ఎల్లో మీడియా పిచ్చి పీక్స్కి చేరిపోయింది. దీన్ని… pic.twitter.com/mimAxmJcXA — YSR Congress Party (@YSRCParty) September 28, 2023 11:40AM, సెప్టెంబర్ 29, 2023 మరో రెండు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన లోకేష్ ►హైకోర్టులో మరో రెండు పిటిషన్లు వేసిన లోకేష్ లాయర్లు ►స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో నిందితుడు లోకేష్ ►ఈ రెండు కేసుల్లో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి ►అరెస్ట్ చేస్తారు, అత్యవసరంగా విచారించండి : హైకోర్టుకు అభ్యర్థన ►మధ్యాహ్నం తర్వాత బెంచ్ ముందుకు పిటిషన్లు వచ్చే అవకాశం 11:20AM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు : హైకోర్టు : BIG BREAKING ►IRR కేసులో నారా లోకేష్కు 41ఏ కింద నోటీసులు ►దర్యాప్తుకు లోకేష్ సహకరించాల్సిందే : హైకోర్టు ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్కు నోటీసులు ►కేసు దర్యాప్తుకు లోకేష్ సహకరించాలన్న హైకోర్టు ►కుంభకోణంలో లోకేష్ పాత్రను స్పష్టం చేస్తూ 129 ఆధారాలు సేకరించిన సిట్ ►ముందస్తు బెయిల్ పిటిషన్కు అంగీకరించని న్యాయస్థానం ►దర్యాప్తు అధికారి FIRలో మార్పు చేశారని నివేదించిన అడ్వొకేట్ జనరల్ ►41ఏ నిబంధనలు పూర్తిగా పాటిస్తామని చెప్పిన అడ్వొకేట్ జనరల్ 11:15AM, సెప్టెంబర్ 29, 2023 ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు 1. అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా? 2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? 3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా? 4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా? 5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా? 6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా? 7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా? 11:02AM, సెప్టెంబర్ 29, 2023 41 ఏ కింద లోకేష్కు నోటీసులు: ఏజీ శ్రీరామ్ ►IRR కేసులో నారా లోకేష్కు 41ఏ కింద నోటీసులు ►కోర్టులో వెల్లడించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ►హైకోర్టులో ఏపీ సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు ►నోటీసుల కాపీ హైకోర్టుకు అందజేత ► ఇన్నర్ రింగ్రోడ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై కొనసాగుతున్న విచారణ ► లోకేష్ తరపున వాదనలు వినిపించిన దమ్మాలపాటి శ్రీనివాస్ 10:55AM, సెప్టెంబర్ 29, 2023 బటన్ నొక్కడంలో తేడాలు గమనించండి: YSRCP ► జగనన్న బటన్ నొక్కితే సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజల ఖాతాల్లో నగదు జమ ► అదే చంద్రబాబు బటన్ నొక్కితే.. ఫస్ట్ కార్పోరేట్ సంస్ధల ఖాతాల్లోకి నగదు జమ ► మళ్లీ ఆ డబ్బు షెల్ కంపెనీల ద్వారా తిరిగి బాబు జేబులోకే వెళ్తుంది. ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం, అమరావతి అసైన్డ్ భూమల స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాంలో అంతర్లీనంగా జరిగింది ఇదే..! జగనన్న బటన్ నొక్కితే సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. కానీ.. చంద్రబాబు బటన్ నొక్కితే తొలుత కార్పోరేట్ సంస్ధల ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. మళ్లీ ఆ డబ్బు డొల్ల కంపెనీల ద్వారా తిరిగి బాబు జేబులోకే వెళ్తుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం,… pic.twitter.com/mQ8rlC4JfQ — YSR Congress Party (@YSRCParty) September 29, 2023 10:50AM, సెప్టెంబర్ 29, 2023 IRR కేసులో లోకేష్ పిటిషన్పై విచారణ ప్రారంభం ►ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభం ►లోక్ష్ తరపున వాదనలు వినిపిస్తున్న దమ్మాలపాటి శ్రీనివాస్ ► ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్ ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంతో లబ్ధి పొందినట్లు ఏపీ సీఐడీ అభియోగం 10:04AM, సెప్టెంబర్ 29, 2023 కుటుంబ సభ్యుల ములాఖత్ నేడు! ►నేడు చంద్రబాబుతో ములాఖత్ కానున్న కుటుంబసభ్యులు ►రాజమండ్రి జైలులో ఉ.11 గం.కు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ ► సతీమణ భువనేశ్వరి, కోడలు బ్రహ్మణితో పాటు మాజీ మంత్రి నారాయణ కూడా 08:58AM, సెప్టెంబర్ 29, 2023 విధుల్లో చేరిన జైలు సూపరిండెంట్ ►రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ విధుల్లో చేరిన రాహుల్ ►కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో విధులకు దూరంగా ఉన్న సూపరిండెంట్ రాహుల్ ►జైలు సూపరిండెండెంట్ భార్య అనారోగ్య కారణాలతో సెలవు పెడితే విపరీతార్థాలు తీసిన పచ్చ మీడియా ►పచ్చ మీడియా తీరుపై వెల్లు వెత్తిన విమర్శలు 08:45AM, సెప్టెంబర్ 29, 2023 సుప్రీంలో బాబుకు మరో దెబ్బ! ►సుప్రీం కోర్టులో చంద్రబాబు SLP లిస్టింగ్కే మరింత ఆలస్యం ►అక్టోబర్ 3 కాదు.. 6? ►ఇంతకు ముందు స్పెషల్ లీవ్ పిటిషన్ అక్టోబరు 3కి వాయిదా ►కానీ, అక్టోబర్ 6వ తేదీ.. అదీ లిస్టింగ్కు వచ్చే ఛాన్స్ ► అంటే ఆరోజు.. పిటిషన్ను విచారణకు స్వీకరిస్తారా? అని చెప్పే ఛాన్స్ ► ఒకవేళ విచారణ చేపడితే.. ఏ రోజు విచారణ చేపడతారో ప్రకటిస్తుంది బెంచ్ ►సుప్రీం కోర్టు వెబ్సైట్లో ఈ మేరకు కంప్యూటర్ జనరేటెడ్ ధృవీకరణ 08:33AM, సెప్టెంబర్ 29, 2023 శతవిధాల ప్రయత్నాలు ►చంద్రబాబు బెయిల్ కోసం విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ వర్గాలు ►లోకేష్ అరెస్టు అవుతాడని రాజమండ్రిలో వదంతులు ►అరెస్టు అవుతాడనే కారణం తోనే ఢిల్లీ నుంచి రాకుండా జాప్యం చేస్తున్నారంటూ వార్తలు ►ఇవాళ నుంచి ప్రారంభం కావలసిన యువగళం వాయిదా ►సుప్రీంకోర్టులో క్వాష్ ఫలితం తేలిన తర్వాతే రాజమండ్రి కి రానున్న లోకేష్ ►రాజమండ్రి టిడిపి శిబిరంలో నారా బ్రాహ్మణి భువనేశ్వరుని ముందు పెట్టుకుని కార్యక్రమాలు కొనసాగిస్తున్న టీడీపీ శ్రేణులు ►‘‘బాబుతో మేము’’, ‘‘పోస్ట్ కార్డు ఉద్యమం’’ తో పాటు రిలే నిరాహార దీక్షలు ,దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు ►ప్రజల నుంచే కాదు.. టీడీపీ కార్యకర్తల నుంచి కూడా కనిపించని స్పందన 07:10AM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ►నేడు హైకోర్టులో వాదనలు జరిగే అవకాశం ►అమరావతి ఇన్నర్ రింగ్రోడ్ కేసులో ఏ14గా లోకేష్ పేరు చేర్చిన ఏపీ సీఐడీ ► అరెస్ట్ భయంతో.. ఢిల్లీ నుంచే యాంటిసిపేటరీ బెయిల్కు దరఖాస్తు ► బెయిల్ వస్తేనే యువగళం పాదయాత్ర.. లేకుంటే మరిన్ని రోజులు ఢిల్లీలోనే 07:05AM, సెప్టెంబర్ 29, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ ►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ► మధ్యాహ్నం 2.15కి ప్రారంభంకానున్న విచారణ ►ఇప్పటికే వాదనలు పూర్తి చేసిన చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా ►మరోసారి వాదనలు వినిపించనున్న ఏజీ ►చంద్రబాబు కేసులు..బెయిల్ పిటిషన్లతో టీడీపీ(TDP) శ్రేణుల్లో టెన్షన్ పెరుగుతోంది. 07:00AM, సెప్టెంబర్ 29, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @20 ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►ఏసీబీ కోర్టు విధించిన జ్యూడీషియల్ రిమాండ్ 20వ రోజుకి చేరిక ► సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకుంది ఏపీ సీఐడీ ► ఏసీబీ కోర్టు రిమాండ్తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్లో చంద్రబాబు ► అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు -
బాలిక హత్య.. బాబాయే హంతకుడు?
సాక్షి, భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో బాలిక హత్య కలకలం రేపింది. సొంత బాబాయే బాలికను హత్య చేసి ఉంటాడని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కుమార్తె కనబడటం లేదని పోలీసులను ఆశ్రయించి.. అల్లాడిపోతున్న తల్లిదండ్రులకు వారి ఇంటి వెనుక ఉన్న తుప్పల్లోనే శవమై కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. భీమవరానికి చెందిన ములుపు అంజి, దుర్గ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె రత్నకుమారి(14). పట్టణంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. కూలి పనులు చేసుకునే వారు తమ బిడ్డను చదివించుకుంటున్నారు. వీరి ఇంటివద్దనే బాలిక బాబాయి ములుపు మావుళ్లు నివసిస్తున్నాడు. కొన్ని రోజులుగా రత్నకుమారికి ఆరోగ్యం బాగోకపోవడంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటోంది. ఈ నెల 26న రత్నకుమారి తల్లిదండ్రులు యథావిధిగా పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చే సరికి కుమార్తె లేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీసినా ఆమె జాడ తెలియలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రితో పాటు మావుళ్లు కూడా పోలీస్స్టేషన్కు వెళ్లాడు. దిశ పోలీసులకు తన ఫోన్ నుంచి ఫిర్యాదు కూడా చేశాడు. మావుళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా అతని భార్య కువైట్లో ఉంది. అతని ఇద్దరు పిల్లలు నరసాపురంలోని హాస్టల్లో ఉంటున్నారు. రెండు రోజులుగా అతని ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో కొంతమంది యువకులు ప్రత్యేక నిఘా వేశారు. మావుళ్లు వేరొకరి ఇంటి నుంచి పార తేవడంతో అనుమానం మరింత బలపడింది. మూడు రోజులుగా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో బాలిక తండ్రి అంజి మరికొంత మందితో కలసి గురువారం ఉదయం ఇంటి వెనుక తుప్పలు, జమ్ముతో ఉన్న ప్రాంతంలో వెతికేందుకు వెళుతుండగా.. అక్కడ ఉండదు.. అటు వెళ్లొద్దంటూ మావుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ వారు వెళ్లి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. బాలికను బాబాయే ఇంట్లో చంపేసి ఆ తర్వాత మృతదేహాన్ని తుప్పల్లో పడేసి ఉంటాడని భావిస్తున్నారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తేలాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని స్థానికులు భావిస్తున్నారు. కాగా, బాలిక మృతదేహం లభించిన ప్రాంతాన్ని ఎస్పీ రవిప్రకాష్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి సమగ్రంగా విచారించాలని ఆదేశించారు. అనుమానితుడు మావుళ్లును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. -
ఏసీబీ జడ్జిపై అసత్య ప్రచారం.. టీడీపీ నేత అరెస్ట్
సాక్షి, కృష్ణా జిల్లా: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన టీడీపీ నాయకుడు బుర్ర వెంకట్ను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును మచిలీపట్నం సైబర్ బ్రాంచ్కు పోలీసులు అప్పగించారు. కాగా, చంద్రబాబుకు రిమాండ్ తర్వాత జడ్జిని కించపరుస్తూ కొందరు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. నిన్న(బుధవారం) నంద్యాల జిల్లాకు చెందిన ఐటీడీపీ కార్యకర్త ఖాజా హుస్సేన్పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఏసీబీ జడ్జిపై పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్ట్
సాక్షి, నంద్యాల: స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. సోషల్ మీడియాలో యెల్లో బ్యాచ్ అడ్డగోలుగా రెచ్చిపోయింది. ఆయనకు సంబంధించి పలు పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన న్యాయమూర్తులపైనా అనుచిత పోస్టులు చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. అయితే దర్యాప్తు క్రమంలో ఇందులో బాబు మద్దతుదారుల కంటే టీడీపీ నేతల పాత్రే ఎక్కువుందని తేటతెల్లమవుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఓ టీడీపీ నేత అరెస్ట్ అయ్యారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు జడ్జిని అవమానిస్తూ పోస్టులు పెట్టాడు ఓ వ్యక్తి. అయితే అతన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్గా ధృవీకరించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. ఓ ప్రైవేట్కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్నాడు ఖాజా హుస్సేన్. ఈ క్రమంలో.. విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి హిమబిందును టార్గెట్ చేసి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేశాడు. టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి హోదాలోనే పోస్టులు చేసినట్లు అంగీకరించాడతను. అరెస్ట్ చేసిన నంద్యాల పోలీసులు.. ఇవాళ కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది. మరోవైపు జడ్జిలపై అనుచిత పోస్టులు, ట్రోలింగ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ వేసింది ఏపీ హైకోర్టులో. ప్రభుత్వం తరపున ఏపీ శ్రీరామ్ ‘‘ఉద్దేశపూర్వక క్యాంపెయిన్ జరిగిందని.. జడ్జిలను, వాళ్ల కుటుంబ సభ్యులనూ వదలకుండా ట్రోలింగ్ చేశారని, ఈ క్రమంలోనే అనుచిత పోస్టులు పెట్టార’ని వాదించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సదరు 26 మంది అకౌంట్లను పరిశీలించి.. నోటీసులు జారీ చేయాలని ఏపీ డీజీపీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బుద్దా వెంకన్నతో పాటు సోషల్ మీడియా పేజీల ముసుగులో ఉన్న టీడీపీ నేతలకు నోటీసులు జారీ కానున్నాయి. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ సైతం జడ్జిలపై అనుచిత కామెంట్ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి.. కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
Sep 28, 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Remand, Court matters and Ground updates 6:43 PM, సెప్టెంబర్ 28, 2023 మంగళగిరి కార్యాలయంలో జనసేన పార్టీ నేతల భేటీ ► తెలుగుదేశం పొత్తుపై నాదెండ్ల మనోహర్ చర్చలు ► జైలుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడి పొత్తు ప్రకటించారు ► ఎన్ని సీట్లు అడుగుదాం?, ఏ ఏ జిల్లాల్లో అడుగుదాం? ► కనీసం 75 సీట్లు తక్కువ కాకుండా సీట్లు అడగాలన్న యోచనలో నేతలు ► తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టొద్దన్న పవన్ సూచనలను గుర్తు చేసిన నాదెండ్ల ► లోకేష్, బాలకృష్ణ పక్కన నిలబడ్డంత మాత్రాన ఎక్కువ ఊహించుకోవద్దంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసినట్టు సమాచారం ► జనసేన పోటీ చేసే చోట తెలుగుదేశం మద్ధతు ఎలా తీసుకోవాలన్న దానిపై చర్చ 6:12 PM, సెప్టెంబర్ 28, 2023 కేవియట్ పిటిషన్తో తెలుగుదేశం బేజారు ► అక్టోబర్ 3పై కోటి ఆశలు పెట్టుకున్నతెలుగుదేశం ► అన్యాయం జరిగిపోయిందని కలరింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు ► గగ్గోలు పెట్టి స్టే తెచ్చుకోవాలని వ్యూహం ► ఈ కేసులో తమ వాదనలు వినాలంటూ ఏపీ సర్కారు కేవియట్ పిటిషన్ ► మొత్తం ఆధారాలను సుప్రీంకోర్టు ముందుంచనున్న ఏపీ సర్కారు ► చంద్రబాబు ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డారో తెలియజేస్తూ సమగ్ర పిటిషన్ ► కేసు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని ఇప్పటికే టిడిపికి చెప్పిన సీనియర్ లాయర్లు ► ఈ కేసులో తమకు రిలీఫ్ దొరకడం కష్టమేనని తెలుగుదేశం ఆందోళన 4:20 PM, సెప్టెంబర్ 28, 2023 రింగ్ రోడ్డు పేరిట దోపిడి చేశారు : YSRCP ► రింగ్ రోడ్డును తమకు అనుకూలంగా మలుపులు తిప్పారు ► రోడ్డు పక్కనే ఉన్న తమ భూములకు విలువ పెంచుకున్నారు ► భారీ లాభాలతో విక్రయించారు : YSRCP అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ ఖరారు పేరిట జరిగిన భూ దోపిడీలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడుగా నారా లోకేశ్ కీలక పాత్ర వహించినట్లు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. లోకేశ్ పాత్రకు సంబంధించి 129 ఆధారాలను గుర్తించి జప్తు చేసింది. ఐఆర్ఆర్ లో లోకేశ్… pic.twitter.com/r8R8fu07cB — YSR Congress Party (@YSRCParty) September 28, 2023 4:05 PM, సెప్టెంబర్ 28, 2023 పాదయాత్ర లేదు.. పార్టీ ప్రోగ్రాం లేదు.. ► పాదయాత్రను వాయిదా వేసాం : అచ్చెన్నాయుడు ► కేసులో లోకేష్ పేరు పెట్టారు ► చంద్రబాబునాయుడిపై PT వారంటు జారీ చేశారు ► వీటిన్నింటిని న్యాయపరంగా ఎదుర్కొవాలి ► ఢిల్లీలో సుప్రీంకోర్టులో లాయర్లతో లోకేష్ మాట్లాడాలి ► లోకేష్ను వాయిదా వేసుకొమ్మని మేమే కోరాం 3:52 PM, సెప్టెంబర్ 28, 2023 - BIG BREAKING చినబాబుకు భయం పట్టుకుంది.! పాదయాత్ర వాయిదా ► లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా ► యువగళం పాదయాత్ర తేదీ వాయిదా వేయాలని తెలుగుదేశం నిర్ణయం ► ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాతే పునఃప్రారంభించాలని నిర్ణయం ► అప్పటివరకు ఢిల్లీలోనే ఉండాలని యోచిస్తోన్న లోకేష్ ► రాజమండ్రికి వస్తే జైలుకు పోవడమొక్కటే మిగిలిందని లోకేష్కు సూచించిన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా టాప్ మేనేజ్మెంట్లు ► అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ కేసు విచారణను బట్టి నిర్ణయం తీసుకుందామని సూచన ► ఢిల్లీలో మంచి లాయర్లను ముందస్తు బెయిల్ కోసం మాట్లాడుకొమ్మని సలహా ► ఇప్పుడే పాదయాత్రకు వెళ్లాలనుకుంటే అరెస్ట్ అవుతారని సూచన ► టీడీపీ నాయకులు, పచ్చమీడియా మేనేజ్మెంట్ల అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేష్ ► పాదయాత్ర సంగతి తర్వాత చూద్దాం, ఢిల్లీ హోటల్లోనే ఉంటానన్న లోకేష్ పాదయాత్ర ఘనంగా ప్రారంభిస్తామని నిన్నటిదాకా ట్వీట్లు వేసిన తెలుగుదేశం అద్భుత ప్రజాదరణతో జైత్రయాత్రలా కొనసాగుతోన్న యువగళం పాదయాత్ర చంద్రబాబు గారి అక్రమ అరెస్టు కారణంగా ఆగింది. కానీ అది చిన్న విరామం మాత్రమే. ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ సెప్టెంబర్ 29, 2023, రాత్రి 8.15 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తున్నారు నారా లోకేష్ గారు#YuvaGalamPadayatra… pic.twitter.com/cSDQONUG8s — Telugu Desam Party (@JaiTDP) September 26, 2023 3:12 PM, సెప్టెంబర్ 28, 2023 - BIG BREAKING సుప్రీంకోర్టు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేవియట్ ► సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ► చంద్రబాబుపై నమోదయిన కేసులో మా వాదన వినాలని విజ్ఞప్తి ► స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయి ► విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారు ► నిధులను షెల్ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్క్యాష్ చేసుకున్నారు ► కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయి ► ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని GST శాఖ ► ఈ కేసులో మా వాదన మీ ముందుంచుతాం : ఏపీ ప్రభుత్వం 3:10 PM, సెప్టెంబర్ 28, 2023 తిట్టలేదట కానీ అన్నాడట : అదీ బుచ్చయ్య సంస్కారం.! ► నేను జడ్జిని తిట్టలేదు : గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ► కానీ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని అన్నాను ► నాకు కోర్టు నోటీసులు వచ్చాక, పరిశీలించి మాట్లాడుతా ► చంద్రబాబుని జైల్లో పెట్టి పొందేది తాత్కాలిక ఆనందమే 1:10 PM, సెప్టెంబర్ 28, 2023 జవాబులు చెప్పండి ప్లీజ్.! తెలుగుదేశం లీగల్ సెల్కు సగటు తెలుగు ప్రజల 10 ప్రశ్నలు.. 1. ఏ కోర్టులో అయినా బాబు లాయర్లు సెక్షన్ 17A అంటున్నారు, మరో వాదన వినిపించడం లేదేందుకు? 2. అరెస్ట్ చేసిన తీరును తప్పుబడుతున్నారు కానీ తప్పు చేయలేదని ఎందుకు చెప్పడం లేదు? 3. దేశంలోనే అత్యంత ఖరీదైన హరీష్ సాల్వేను పెట్టుకున్నా.. మీ కేసులో ఒక్కటంటే ఒక్క బలమైన కారణం దొరకడం లేదా? 4. మీడియా మీటింగ్ల్లో మీరు చేసే ప్రకటనలను కోర్టు ముందు ఎందుకు చెప్పడం లేదు? 5. Yes, మేం తప్పు చేయలేదు, ఈ డబ్బులు మా ఖాతాల్లో పడలేదు, ఈ సంతకాలు బాబు పెట్టలేదు అని కోర్టుకు చెప్పడం లేదెందుకు? 6. మీరు అన్నీ కరెక్ట్గానే చేస్తే.. మీ మనుష్యులు శ్రీనివాస్, మనోజ్ తదితరులంతా దేశం విడిచి ఎందుకు పారిపోయారు? 7. ప్రపంచమంతా అన్ని దేశాల్లో నిరసనలు చేస్తున్నారని ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్న మీరు జర్మనీలో సీమెన్స్ కంపెనీ ముందు ఎందుకు ధర్నాలు చేయడం లేదు? 8. కనీసం సీమెన్స్ కంపెనీకి తెలుగుదేశం పార్టీ నుంచి అధికారికంగా ఒక్క మెయిల్ అయినా రాయలేదేందుకు? 9. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నది ఒప్పందం నుంచి ఎందుకు తొలగించారో.. ఏ మీడియా సమావేశంలో చూపించడం లేదెందుకు? 10. మేనేజర్ తప్పు చేస్తే ఓనర్ను శిక్షిస్తారా అన్న డొంక తిరుగుడు వాదన లోకేష్ ఎందుకు చేస్తున్నారు? 1:10 PM, సెప్టెంబర్ 28, 2023 అమరావతిలో రింగ్ అంతా లోకేష్దే ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో లోకేష్ కుట్ర సుస్పష్టం ► కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిట్ వెల్లడి ► లోకేష్ పాత్రను స్పష్టం చేస్తున్న 129 ఆధారాలు ► ఈ ఆధారాలను జప్తు చేసిన సిట్ అధికారులు ► అప్పటి అధికారులు, అలైన్ మెంట్ లో పాల్గొన్న సంస్థల వాంగ్మూలాలూ నమోదు ► పక్కా పన్నాగంతోనే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు ► హెరిటేజ్కు, లింగమనేని రమేష్ కుటుంబానికి అడ్డగోలుగా లబ్ధి ► వారి భూములను ఆనుకొని వెళ్లేలా IRRలో మార్పులు ► క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబుకు కరకట్ట బంగ్లా బహుమానంగా ఇచ్చిన లింగమనేని మాస్టర్ ప్లాన్ లోని ఇన్నర్ రింగు రోడ్డును ఇష్టానుసారం మార్చేసింది ప్రజల కోసం ఏమాత్రం కాదు. ఆ ప్రాంతాల్లోని నారాయణ కాలేజీల కోసమే ఈ ప్లాను.. తద్వారా నారాయణతో పాటు @naralokesh , @ncbn సైతం లబ్ది పొందారు. #CorruptBabuNaidu#SkilledCriminalCBNInJail #AmaravathiLandScam… pic.twitter.com/HwytVjPaVR — YSR Congress Party (@YSRCParty) September 28, 2023 1:00 PM, సెప్టెంబర్ 28, 2023 పాదయాత్ర నిలిపివేస్తే పరువు గోవిందా.! ► లోకేష్ తీరుపై తెలుగుదేశంలో తీవ్ర ఆందోళన, ఆగ్రహం ► ఇప్పటివరకు నడిచిన క్రెడిట్ అంతా పోతోందని ఆవేదన ► ఏపీ నుంచి ఢిల్లీ పారిపోయారన్న అపఖ్యాతి వద్దంటున్న టిడిపి క్యాడర్ ► ఎల్లో మీడియాలో వస్తున్న అప్డేట్స్ ప్రకారం టిడిపి ఇన్సైట్స్ ఇలా ఉన్నాయి రెండు వర్గాలుగా మారిన తెలుగుదేశం అగ్ర నేతలు ఒక వర్గం : ముందయితే ఎలాగైనా లోకేష్ను బుజ్జగించి రాజమండ్రికి రప్పించాలి రెండో వర్గం : పాదయాత్రను కనీసం వారం పాటు వాయిదా వేయాలి ఒక వర్గం : లోకేష్ను అరెస్ట్ చేస్తే బ్రాహ్మణితో పాదయాత్ర చేయించాలి రెండో వర్గం : ముందస్తు బెయిల్ వచ్చే వరకు లోకేష్ను ఢిల్లీలోనే ఉంచాలి ఒక వర్గం : లోకేష్ కంటే బ్రాహ్మణి బరిలో దిగితే ఎక్కువ మైలేజ్ వస్తుంది, నారా+నందమూరి కుటుంబాలకు వారసురాలిగా గుర్తింపు వస్తుంది రెండో వర్గం : ఇన్నాళ్లు లోకేష్ను లీడర్గా ప్రచారం చేసి ఇప్పుడు వెనక్కు జరిపితే క్యాడర్ మనోస్థైర్యం దెబ్బ తింటుంది 12:45 PM, సెప్టెంబర్ 28, 2023 మా చినబాబు మంచోడే, కొనాలని ముందే కల పడింది : టిడిపి ► అమరావతిలో భూములు కొనాలని లోకేష్ ముందే అనుకున్నారు : పట్టాభి ► భూముల విషయంలో టిడిపి నేత పట్టాభి అధికారిక ప్రకటన ► అవును, నారా లోకేష్తో పాటు హెరిటేజ్ కూడా భూములు కొనుగోలు చేశారు ► సంస్ధ విస్తరణ కోసం అనేక చోట్ల హెరిటేజ్ భూములు కొంటుంది ► అదేవిధంగా ఆనాడు అమరావతి ప్రాంతంలోనూ భూములు కొనుగోలు చేసింది ► FIR ఫైల్ కాగానే CIDకి కూడా హెరిటేజ్ సంస్ధ అన్ని వివరాలతో లేఖ రాసింది ► జులై1న హెరిటేజ్ 7.21 ఎకరాలు కొనుగోలు చేసింది ► జులై 31తర్వాత మరి కొన్ని ఎకరాలు భూమి కొనుగోలు చేసింది ► లింగమనేని నుంచి కూడా 4.55 ఎకరాలు కొనుగోలు చేసింది ► ఈ భూమికి సంబంధించి లీగల్ ఇష్యూ ఉందని ఒప్పందం రద్దు చేసుకుంది ► లీగల్ ఇష్యూ ఉందని కోట్లు విలువచేసే 4.5 ఎకరాలను హెరిటేజ్ వదులుకుంది ► లింగమనేని భూమి ఒప్పందం రద్దుచేసుకున్నాక హెరిటేజ్కు మిగిలింది 9.6 ఎకరాలు ► కొనాలని ముందే అనుకున్నారు కాబట్టి తప్పు జరిగిందని ఎలా చెబుతారు? చంద్రబాబు అప్పట్లో అమరావతిని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దబోతున్నట్లు గ్రాఫిక్స్తో అందర్నీ నమ్మించాడు. కానీ.. చివరికి అమరావతి అంతర్జాతీయ స్కామ్గా మిగిలిపోయింది. ఈ స్కామ్కి డైరెక్షన్ చంద్రబాబు.. పర్యవేక్షణ నారా లోకేష్. - మంత్రి ఆదిమూలపు సురేష్#APAssembly#CorruptBabuNaidu… pic.twitter.com/XaSGHK5b8o — YSR Congress Party (@YSRCParty) September 27, 2023 12:30 PM, సెప్టెంబర్ 28, 2023 కిం కర్తవ్యం.? ► రేపు నంద్యాలలో టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశం ► ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్న నారా లోకేష్ ► చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలోనే యాక్షన్ కమిటీ భేటీ ► పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చ ► లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు ముందు నిలబడుతుందా? ► లోకేష్కు వ్యతిరేకంగా ఎలాంటి బలమైన ఆధారాలున్నాయి.? ► లోకేష్ పాదయాత్ర నిరవధికంగా వాయిదా పడుతుందా? ► ఇప్పట్లో చంద్రబాబు బయటకు వస్తారా? ► చంద్రబాబుకు ప్రత్యామ్నయంగా పార్టీకి ఎవరు నేతృత్వం వహిస్తారు? ► భువనేశ్వరీ, బ్రాహ్మణికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? ► ఎల్లో మీడియాలో జరుగుతున్నట్టు మహిళలిద్దరే పార్టీకి నేతృత్వం వహిస్తారా? ► లోకేష్ అరెస్ట్ అవుతారంటూ ఎల్లో మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమేనా? సానుభూతి కోసమా? ► బాలకృష్ణ పాత్ర ఏంటీ? పార్టీ మీటింగ్లు రెండు పెట్టి మళ్లీ కనిపించడం లేదేందుకు? ► జైలు ముందు పొత్తు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు తెర మీదికి రావడం లేదు? ► పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఏ ఏ సీట్లు ఇస్తారు? 12:00 PM, సెప్టెంబర్ 28, 2023 లోకేష్ యువగళానికి మంగళం.! ► మరింత వాయిదా దిశగా లోకేష్ పాదయాత్ర యువగళం ► ఢిల్లీలో చేసిన ప్రకటన ప్రకారం రేపు రాత్రి నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయం ► అరెస్ట్ భయంతో ఇప్పట్లో ఢిల్లీ నుంచి రాలేనంటున్న చిన బాబు ► పాదయాత్ర మధ్యలో నిలిపివేస్తే పరువు పోతుందంటున్న తెలుగుదేశం నేతలు ► హైకోర్టులో ముందస్తు బెయిల్ వస్తేనే ఏపీకి వస్తానని తేల్చి చెబుతోన్న లోకేష్ ► అరెస్ట్ అయితే మరింత సానుభూతి వస్తుందంటున్న టిడిపి నేతలు ► చంద్రబాబు అరెస్ట్కే రాలేదు, నాకేం వస్తుందని ఎదురు ప్రశ్నిస్తోన్న లోకేష్ ► యువగళం పాదయాత్ర వాయిదా వేస్తున్నారని ఎల్లో మీడియాలో బ్రేకింగ్లు ► వారం వాయిదా వేస్తేనే బాగుంటుందని కొందరు నేతలు లోకేష్కు సూచించారు : ఎల్లో మీడియా ► ఎవరా కొందరు.? ఎందుకు వాయిదా? అన్న వివరాలు వెల్లడించని ఎల్లో మీడియా 11:45AM, సెప్టెంబర్ 28, 2023 ఏసీబీ జడ్జిపై పోస్టు.. మరో టీడీపీ నేత అరెస్ట్ ►ఏసీబీ జడ్జిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన కృష్ణా జిల్లా టీడీపీ నేత ►టీడీపీ నాయకుడు బుర్ర వెంకట్ను అదుపులోకి తీసుకున్న కంకిపాడు పోలీసులు ►మచిలీపట్నం సైబర్ బ్రాంచ్ కి అప్పగించిన పోలీసులు ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ న్యాయమూర్తి 10:20AM, సెప్టెంబర్ 28, 2023 ఏ వయస్సులో చేసినా నేరం నేరమే ►చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి ►ఆధారాలతోనే సీఐడీ అరెస్ట్ చేసింది ►కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకపోవడానికి అదే కారణం ►బాబు చేసిన స్కాం లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి ►చంద్రబాబుకు 23 లక్కీ నంబర్ ►మా పార్టీకి చెందిన 23 మందికి లాక్కున్నాడు ►2019లో ఆయనకి వచ్చిన సీట్లు 23 ►జైలుకు వెళ్లిన డేట్ కూడా 23 యే ►చంద్రబాబు అరెస్ట్ పై జంప్ అయిన ఎమ్మెల్యే ల హడావుడి ఎక్కువైంది. ►మునిగిపోయే పడవలో కూర్చుని ఎక్కువ రోజులు వారు రాజకీయం చెయ్యలేరు ►తప్పు చేస్తే మా ప్రభుత్వంలో ఎంతటి వారికైనా జైలు జీవితం తప్పదు ►ఏ వయస్సులో చేసినా తప్పు తప్పే.. నేరం నేరమే.. ►భవిష్యత్తు లో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది :: ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ 07:30AM, సెప్టెంబర్ 28, 2023 రింగ్రోడ్డు కేసులో లోకేష్ పాత్రపై 129 ఆధారాలు ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో లోకేశ్ కుట్ర సుస్పష్టం ►ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిట్ వెల్లడి ►లోకేశ్ పాత్రను స్పష్టం చేస్తున్న 129 ఆధారాలు ►ఈ ఆధారాలను జప్తు చేసిన సిట్ అధికారులు ►అప్పటి అధికారులు, అలైన్మెంట్లో పాల్గొన్న సంస్థల వాంగ్మూలాలూ నమోదు ►పక్కా పన్నాగంతోనే ఐఆర్ఆర్ అలైన్మెంట్లో మార్పులు ►హెరిటేజ్కు, లింగమనేని రమేశ్ కుటుంబానికి అడ్డగోలుగా ప్రయోజనం ►వారి భూములను ఆనుకొని వెళ్లేలా ఐఆర్ఆర్లో మార్పులు ►క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబుకు కరకట్ట బంగ్లా ఇదీ చదవండి: హెరిటేజ్ అంటేనే నారా కుటుంబం 07:00AM, సెప్టెంబర్ 28, 2023 సుప్రీం జడ్జిల వద్ద బాబు లాయర్ల పట్టు.. నో రిలీఫ్ ►నిన్న(బుధవారం) సుప్రీంలో చంద్రబాబు లాయర్ల ఇబ్బందికర ప్రవర్తన ►తక్షణ ఉపశమనానికి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్పై ఒత్తిడి ► తిరస్కరించిన సీజేఐ ►కస్టడీ పిటిషన్పై వాదనలు వినకుండా ట్రయల్ జడ్జిని నియంత్రించలేమని స్పష్టీకరణ ►అక్టోబర్ 3వ తేదీనే ఎస్ఎల్పీపై విచారణ జాబితాలోకి అని బాబు లాయర్లకు చెప్పిన చీఫ్ జస్టిస్ ►అంతకు ముందు.. బాబు పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ►సోమవారం జాబితా చేయాలని బాబు లాయర్ హరీష్ సాల్వే పట్టు ►సాధ్యం కాదని.. వచ్చే వారమే లిస్ట్ చేస్తామని స్పష్టం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా 06:45AM, సెప్టెంబర్ 28, 2023 ఏసీబీ జడ్జిపై పోస్టులు.. టీడీపీ నేత అరెస్ట్ ► చంద్రబాబు కేసును విచారణ చేసిన ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందును అవమానించిన టీడీపీ నేత ►సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్ ► జడ్జిపై అనుచిత పోస్ట్ చేసినందుకు టీడీపీ నేత ముల్లా ఖాజాను అరెస్ట్ చేసిన నంద్యాల పోలీసులు ►ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసిన ఖాజా హుస్సేన్ ►టీడీపీ తరపునే పోస్ట్ చేసినట్లు ఒప్పుకోలు! ►నేడు కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు. ఇదీ చదవండి: జడ్జిలపై కులం పేరుతో దూషణల పర్వం 06:30AM, సెప్టెంబర్ 28, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @19 ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడి రిమాండ్ 19వ రోజుకి చేరుకుంది ► సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకుంది ఏపీ సీఐడీ ► ఏసీబీ కోర్టు రిమాండ్తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్లో చంద్రబాబు ► ఇప్పటికే రెండుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు టీడీపీ & గ్యాంగ్ చిల్లర వేషాలు: వైఎస్సార్సీపీ ►చంద్రబాబు ఇప్పటికే 20కిపైగా కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు. ►అప్పుడు న్యాయస్థానాలను టీడీపీ వాళ్లు ఆహా ఓహో అని పొగిడారు. ►ఇప్పుడు చంద్రబాబుకి రిమాండ్ విధించగానే.. కోర్టులు చెడ్డవి అయిపోయాయా? ►జడ్జిలపై టీడీపీ నేతలు అసభ్యకర కామెంట్స్ పెట్టడం.. వాళ్ల పైశాచికత్వానికి నిదర్శనం చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలతో టీడీపీ అండ్ గ్యాంగ్ చిల్లర వేషాలు వేస్తోంది. @ncbn ఇప్పటికే 20కిపైగా కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు. అప్పుడు న్యాయస్థానాలను టీడీపీ వాళ్లు ఆహా ఓహో అని పొగిడారు.. ఇప్పుడు బాబుకి రిమాండ్ విధించగానే కోర్టులు చెడ్డవి అయిపోయాయా? గౌరవ జడ్జిలపైనే సోషల్… pic.twitter.com/1PjfV0rabV — YSR Congress Party (@YSRCParty) September 27, 2023 -
టీడీపీ తెలుగు మహిళా కార్యదర్శి అరెస్ట్
గుంటూరు లీగల్: సీఎం వైఎస్ జగన్ పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన టీడీపీ గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళ కార్యదర్శి పిడికిటి శివ పార్వతిని బుధవారం పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన శివ పార్వతి నగరంలోని జేకేసీ రోడ్డులోని విజయపురి కాలనీలో ఉంటుంది. ఆమె టీడీపీ గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా కార్యదర్శిగా పనిచేస్తూ ఫేస్బుక్లో ‘లక్ష్మీగణేష్ ఐడీతో పోస్టింగ్లు పెడుతుంది. ఈ నెల 25న సీఎం పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలతో వీడియో పోస్టు చేసింది. దీనిపై స్తంబాలగరువుకు చెందిన వైఎస్సార్ సీపీ 42వ డివిజన్ ఇన్చార్జ్ చల్లా శేషిరెడ్డి, ఏటి అగ్రహారానికి చెందిన వైఎస్సార్ సీపీ గుంటూరు వెస్ట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజవరపు జగదీష్ పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా ఉండటమే కాకుండా అల్లర్లు జరిగేలా రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వీడియో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. నిందితురాలు ఇదే తేదీన పోస్టు చేసిన మరో వీడియోపై మారుతీనగర్కు చెందిన షేక్ ఉస్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కూడా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. నిందితురాలు సోషల్ మీడియాలో తరచూ ఇలాంటి పోస్టింగ్స్ పెడుతుందనీ, గతంలో సీసీ నం.1247/2021 లో కూడా ముద్దాయి అని పేర్కొంటూ , ఆమెకు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరుతూ పట్టాభిపురం పోలీసులు రిమాండ్ రిపోర్టును కోర్టులో దాఖలు చేశారు. వాదనలు విన్న ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి జి.స్పందన రిమాండ్ను తిరస్కరిస్తూ రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. -
కేటుగాడు దొరికాడు !
అనంతపురం క్రైం:C రూ.లక్షలు దండుకుని ముఖం చాటేసిన మోసగాడు రాయచోటి శశిని చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు బీటెక్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలిప్పిసామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 150 మందిని మోసగించాడు. జిల్లాల వారీగా ఏజెంట్లను నియమించి వారి ద్వారా నిరుద్యోగుల నుంచి డబ్బు దండుకున్నాడు. నాలుగు రోజుల క్రితం పలువురు బాధితులు కుప్పం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు బుధవారం ఉదయం రాయచోటిలోని తన స్వగృహంలో ఉన్న నిందితుడు శశిని అదుపులోకి తీసుకున్నారు. కుప్పంలోని బాధితులకు మాత్రమే డబ్బు తిరిగిస్తానని నిందితుడు చెప్పినట్లు ఏజెంట్ల ద్వారా తెలుస్తోంది. అదే జరిగితే అనంతపురం జిల్లాతో పాటు మిగిలిన ప్రాంతాల్లోని బాధితుల పరిస్థితి ఏంటనేది అగమ్యగోచరమే. ఏజెంట్లు బలమైన సామాజికవర్గానికి చెందినవారు కావడంతో డబ్బు రికవరీపై బాధితులు ఆందోళన చెందుతున్నారు. డబ్బు కోసం నిలదీస్తే ఏజెంట్లు టీడీపీకి చెందిన నాయకుల పేర్లు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని వాపోతున్నారు. వీరికి అల్లరిమూకలు, రౌడీషీటర్లు అండగా ఉండటంతో ఒత్తిడి చేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఖతర్నాక్ లేడీ బెదిరింపుల పర్వం.. ఉద్యోగాలిప్పిస్తామని తమ నుంచి తీసుకున్న నగదు తిరిగివ్వాలని అడిగిన నిరుద్యోగులను ‘ఖతర్నాక్ లేడీ’ పోలీసుల ద్వారా బెదిరిస్తోంది. నెల క్రితం అప్పటి అనంతపురం ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు కొంతమంది నిరుద్యోగులు తమకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. బెంగళూరుకు చెందిన సదరు మహిళ ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు డబ్బు తీసుకుందని ఆరోపించారు. ఏడాది దాటినా ఉద్యోగం చూపకపోవడంతో బాధితులు ఆ మహిళను నిలదీసి డబ్బు కోసం ఒత్తిడి తెచ్చారు. దీంతో సదరు మహిళ వైఎస్సార్ జిల్లా పోలీసుల ద్వారా బాధితులను బెదిరింపులకు గురి చేస్తోంది. మహిళకు ఎందుకు ఫోన్ చేస్తున్నారంటూ పోలీసులు ప్రశ్నిస్తుండటంతో.. బాధితులు నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి జరిగిన విషయం తెలిపారు. అయితే న్యాయస్థానంలో కేసు వేసుకోండని పోలీసులు ఉచిత సలహా ఇచ్చారని బాధితులు తెలిపారు.ఉ -
నిమజ్జనోత్సవంలో అపశ్రుతి
ప్రకాశం: మండలంలోని పొట్లపాడు గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జన సమయంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి 9 రోజుల పాటు పూజలు చేశారు. మంగళవారం రాత్రి గ్రామోత్సవం చేసి నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేశారు. ఒక ట్రాక్టర్ ట్రక్కులో గణపతి విగ్రహాన్ని ఉంచి లైటింగ్ ఏర్పాటు చేశారు. విగ్రహానికి నాలుగు వైపులా ఇనుప పైపులు ఉంచి డెకరేషన్ చేశారు. గ్రామోత్సవం అనంతరం పొలాల్లోని నీటి గుంటల్లో నిమజ్జనం చేసేందుకు పొలాల బాటలో వెళుతుండగా విద్యుత్ తీగలు డెకరేషన్ కోసం ఏర్పాటు చేసిన పైపులకు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురవడంతో ట్రాక్టర్ పై ఉన్న వారంతా కిందకు దిగారు. ప్రమాదంలో చమిడిశెట్టి శ్రీను(35), తడకమల్ల నాగేంద్రం (11) విద్యుదాఘాతానికి గురై స్పృహ తప్పడంతో వెంటనే వినుకొండలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హాస్పిటల్లో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడు శ్రీనుకు భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. నాగేంద్రం 8వ తరగతి చదువుతున్నాడు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యం దేవకుమార్ తెలిపారు. అన్ని విధాలా అండగా ఉంటాం పొట్లపాడులో విద్యుత్ షాక్తో మృతి చెందిన వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. పార్టీలో చురుకై న పాత్రను శ్రీను పోషించాడని, ఒక కార్యకర్తను పోగొట్టుకోవటం బాధాకరమన్నారు. వారి కుటుంబసభ్యులకు అండగా ఉండి శ్రీను లేని లోటును తీర్చుతానని హామీ ఇచ్చారు. ఆయన వెంట రాష్ట్ర గ్రీనరి అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్.సైదా, ఏఎంసీ ఉపాధ్యక్షుడు కండె గంగయ్య, దర్శి ఏఎంసీ మాజీ అధ్యక్షుడు వైవీ సుబ్బయ్య, కురిచేడు సొసైటీ ప్రెసిడెంట్ పోతిరెడ్డి నాగిరెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ మేరువ సుబ్బారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కాకర్ల కాశయ్య, నాయకులు ఉన్నారు. -
చంద్రబాబుకు నో రిలీఫ్..!
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పోలీసు కస్టడీ పిటిషన్పై వాదనలు వినకుండా ట్రయల్ జడ్జిని తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరిస్తూ కేసును తగిన ధర్మాసనం ముందు జాబితా చేస్తామని, అక్టోబరు 3న దీన్ని విచారిస్తుందని సీజేఐ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ బుధవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందుకొచ్చింది. అయితే ఈ పిటిషన్ విచారణపై జస్టిస్ ఎస్వీఎన్ భట్టికి కొన్ని రిజర్వేషన్లు (అభ్యంతరాలు) ఉన్నాయని జస్టిస్ సంజీవ్ఖన్నా పేర్కొన్నారు. దీంతో జస్టిస్ భట్టి నిర్ణయంపై తామేమీ చేయలేమని, కేసును త్వరగా జాబితా చేయాలని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే కోరారు. వచ్చే వారం జాబితా చేస్తామని జస్టిస్ సంజీవ్ఖన్నా పేర్కొనడంతో, జస్టిస్ భట్టి విచారణ నుంచి వైదొలిగిన అంశాన్ని సీజేఐ ముందు ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫు మరో సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా అనుమతి కోరారు. ఇందుకు అనుమతించిన జస్టిస్ సంజీవ్ఖన్నా కేసును పాస్ ఓవర్ చేయాలా? అని న్యాయవాదుల్ని ప్రశ్నించారు. పాస్ ఓవర్తో ఉపయోగం ఉండదని, సోమవారం జాబితా చేయాలని హరీశ్ సాల్వే అభ్యర్థించారు. అది సాధ్యం కాదని, వచ్చే వారం జాబితా చేస్తామని, ప్రాసెస్కు కొంత సమయం పడుతుందని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు. జస్టిస్ ఎస్వీఎన్ భట్టి లేని ధర్మాసనంలో అక్టోబరు 3న ప్రారంభయ్యే వారంలో కేసును జాబితా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అలాంటి ఆదేశాలు ఇవ్వలేం.. ట్రయల్ కోర్టు జడ్జిని నియంత్రించలేం: సీజేఐ చంద్రబాబు క్వాష్ పిటిషన్ను విచారించేందుకు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నిరాకరించారని, దీనిపై వెంటనే విచారణ జరిగేలా చూడాలని అనంతరం సీజేఐ ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా అభ్యర్థించారు. అయితే ఈ అంశంలో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని, వెంటనే విచారణ వద్దని సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్కుమార్ విన్నవించారు. ఈ దశలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ.. ‘అసలు మీకేం కావాలి? సెక్షన్ 17ఏతో బెయిలు కావాలని కోరుతున్నారా?’ అని ప్రశ్నించడంతో చంద్రబాబు ఎస్సెల్పీపై విచారణ జరపాలని లూత్రా కోరారు. అయితే బెయిలు కావాలని దరఖాస్తు చేసుకోవచ్చుగా? అని సీజేఐ సూచించారు. దీనిపై లూత్రా స్పందిస్తూ ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని, 17 ఏ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదని చెప్పారు. దీంతో అక్టోబరు 3న విచారణ జాబితాలో చేర్చుతామని సీజేఐ తెలిపారు. సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను ట్రయల్ కోర్టు విచారిస్తోందని, చంద్రబాబును వారి కస్టడీకి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని లూత్రా కోరారు. ఇప్పటికే పోలీసు కస్టడీ పూర్తయిందని, మరో 15 రోజులు పోలీసు కస్టడీ కోరుతున్నారని ఎన్నికల నేపథ్యంలో పదే పదే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని లూత్రా ఆరోపించారు. తొలుత జ్యుడీషియల్ కస్టడీ తర్వాత పోలీసు కస్టడీకి ఇచ్చారన్నారు. ఈ క్రమంలో లూత్రా పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ, ఈ దశలో అలాంటి ఆదేశాలను ఇవ్వలేమని, ట్రయల్ కోర్టు జడ్జిని నియంత్రించలేమని, అక్టోబరు 3నే విచారణ జాబితాలో చేర్చుతామని సీజేఐ తేల్చి చెప్పారు. దర్యాప్తు కొనసాగేలా చూడాలి: రంజిత్కుమార్ ఇదే సమయంలో సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్కుమార్ స్పందిస్తూ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.కోట్లలో కుంభకోణం జరిగిందని సీజేఐ దృష్టికి తెచ్చారు. రూ.3,330 కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వం పది శాతం మాత్రమే వెచ్చిస్తుందంటూ నిధులు విడుదల చేశారన్నారు. ప్రైవేట్ సంస్థ 90 శాతం నిధులను ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా పది శాతం నిధులు చేతులు మారిపోయాయన్నారు. సొమ్ములు స్వాహా అయినట్లు జీఎస్టీ అధికారులు కూడా గుర్తించారన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయడంతో గత ప్రభుత్వం ఫైళ్లు మాయం చేసిందన్నారు. ముందస్తుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని పిటిషనర్ వాదించడం సరి కాదన్నారు. ఆ చట్ట సవరణ కన్నా ముందుగానే ఈ కుంభకోణం జరిగిందన్నారు. దర్యాప్తు కొనసాగేలా చూడాలని అభ్యర్థించారు. -
నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
సాక్షి, గుంటూరు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఏ14గా లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే. రాజధాని పేరుతో అమరావతిలోని అన్ని రోడ్లను కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) వేసే ప్రాజెక్టు పేరిట నాటి టీడీపీ సర్కార్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ విషయంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఫిర్యాదుతో ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్లో సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు తదనంతరం.. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. అయితే.. ఈ కేసులో ఇప్పటికే ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణను పేర్కొన్న సిట్ నారా లోకేశ్ను ఏ–14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో మంగళవారం ప్రత్యేక మెమో దాఖలు చేసింది. ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేసి నారా లోకేష్ లబ్ధి పొందాలని ప్రయత్నించారని అభియోగాలు నమోదు చేసింది ఏసీ సీఐడీ. తన తండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో జరిగిన స్కామ్లో నారా లోకేష్ కీలక భూమిక పోషించారని, అలైన్మెంట్ ఖరారులో అక్రమాలతో హెరిటేజ్ ఫుడ్స్ కోసం భూములను నారా లోకేష్ కొల్లగొట్టినట్లు దర్యాప్తు సంస్థ సీఐడీ నిర్ధారించుకుంది. చంద్రబాబు, నారాయణ, లోకేష్తోపాటు లింగమనేని రమేశ్, రాజశేఖర్లు, అలాగే.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది ఏపీ సీఐడీ. అయితే నారాయణ ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందారు. -
CBN Arrest: ‘క్యాంపెయిన్గా జడ్జిలను ట్రోల్ చేశారు’
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత.. ఆయన పిటిషన్లను విచారించిన జడ్జిలపై రాజకీయపరంగా.. ఉద్దేశపూర్వకంగానే దూషణల పర్వం కొనసాగిందని ఏపీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఇవాళ క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్పై విచారణ జరిగింది. పిటిషన్పై విచారణ నేపథ్యంలో.. టీడీపీ నేత బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరీ సహా 26 మందికి నోటీసులు జారీ చేయాలని బుధవారం హైకోర్టు ఏపీ డీజీపీని ఆదేశించింది. క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్పై వాదనల సందర్భంగా.. ‘‘క్యాంపెయిన్గా జడ్జిపై ట్రోలింగ్ చేశార’’ని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. ఇద్దరు హైకోర్టు జడ్జీలు, ఏసీబీ జడ్జి ఫ్యామిలీ టార్గెట్గా ట్రోలింగ్ నడిచిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. దీంతో ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి.. ఆ 26 మందికి నోటీసులు ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. నాలుగు వారాలకు పిటిషన్పై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. యెల్లో బ్యాచ్తో పాటు చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై దూషణల పర్వం కొనసాగింది. టీడీపీ నేతలు, చంద్రబాబు సానుభూతి పరులు న్యాయవ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులపై నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసింది పచ్చ మీడియా. దీంతో ఈ వ్యవహారంలో బుద్దా వెంకన్న సహా 26 మంది ప్రతివాదులుగా చేర్చింది ప్రభుత్వం. బుద్దా వెంకన్నతో పాటు ఎస్. రామకృష్ణ, మరికొన్ని సోషల్ మీడియా పేజీల నిర్వాహకులకు పరిశీలన తర్వాత నోటీసులు జారీ కానున్నాయి. అలాగే ప్రతివాదులుగా ఉన్న గూగుల్, ఎక్స్(ట్విటర్), ఫేస్బుక్కు కూడా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. మహాదారుణంగా.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. కోర్టులో 10 గంటల వాదనల తరువాత చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఆపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని హైకోర్టు కొట్టేసింది. అయితే ఈ తీర్పులను ఇచ్చిన జడ్జీలను సామాజిక మాధ్యమాల వేదికగా వికృత రూపాల్లో తూలనాడుతూ పోస్టులు వెల్లువెడ్డాయి. రాష్ట్రపతి కార్యాలయం స్పందన మరోవైపు జడ్జీలపై అభ్యంతరకర పోస్టులపై రాష్ట్రపతి భవన్ పై స్పందించి పోస్ట్ లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ రాసింది. తదనంతరం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. -
Sep 27th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest: Petitions in different courts - Live Updates 5:10 PM, సెప్టెంబర్ 27, 2023 కిం కర్తవ్యం.? ► ఢిల్లీ: ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో టిడిపి ఎంపీలతో లోకేష్ మంతనాలు ► పారని లీగల్ వ్యూహంతో దిగాలు పడ్డ చిన బాబు ► ఇప్పట్లో ఏపీకి వెళ్లకపోవడమే మంచిదని లోకేష్కు సూచించిన ఎంపీలు ► ఆంధ్రప్రదేశ్కు వస్తే లోకేష్ను అరెస్ట్ చేస్తారని కొన్ని రోజులుగా ఎల్లోమీడియా వార్తలు ► లోకేష్ వెళ్లగానే అరెస్ట్ కావడానికి అన్ని రకాల అవకాశాలున్నాయన్న ఎంపీలు ► ముందస్తు బెయిల్కు ఎలాంటి బలమైన వాదనలు లేవన్న ఎంపీలు ► వెళ్లి అరెస్ట్ అయ్యేకంటే ఇక్కడే హోటల్లో ఉండడమే మంచిదన్న భావనలో లోకేష్ 4:50 PM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టు : బాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై అక్టోబర్ 4న నిర్ణయం ► చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వచ్చే నెల నాలుగు విచారణ వాయిదా ► అదే రోజున రెండు వర్గాలు వాదనలు పూర్తి చేయాలని న్యాయమూర్తి ఆదేశం ► మరోసారి వాదనాలు వేయవద్దని చంద్రబాబు లాయర్లకు సూచన ►ఎవరు వాదనలు చెప్పకపోయినా ఆర్డర్ పాస్ చేస్తామన్న న్యాయమూర్తి 4:25 PM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కొనసాగుతున్న వాదనలు ► చంద్రబాబును కస్టడీకి ఇవ్వండి, దర్యాప్తు పూర్తి చేస్తాం : CID లాయర్ పొన్నవోలు ► మొన్నటి కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు ► ఆధారాలు చూపించడంతో చంద్రబాబు సమాధానాలు దాటవేశారు ► కస్టడీకి ఇస్తే కేసులో పూర్తి కుట్ర కోణం బయటపెడతాం ► విచారణ అక్టోబర్ 5కు వాయిదా వేయాలనుకున్నట్టు చెప్పిన న్యాయమూర్తి ► కస్టడీపై తమ వాదనలు పూర్తి చేయనివ్వాలని విజ్ఞప్తి చేసిన AAG పొన్నవోలు ► విచారణ వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు లాయర్లు ► శుక్రవారం వాదనలు వినిపిస్తామన్న బాబు న్యాయవాదులు ► చంద్రబాబు తరపు లాయర్లపై ఏసీబీ కోర్టు ఆగ్రహం ► పిటిషన్ దాఖలు చేస్తారు, పదేపదే వాయిదా వేయాలని ఎందుకు కోరతారు? ► బెయిల్ పిటిషన్ దాఖలు చేసి 17 రోజులైనా వాదనలు ఎందుకు వినిపించడం లేదు? ► విచారణ ఎందుకు ముందుకు జరగనివ్వడం లేదని బాబు లాయర్లను ప్రశ్నించిన జడ్జి ► కోర్టు సమయం వృధా ఎందుకుచ చేస్తున్నారంటూ ప్రశ్నించిన న్యాయమూర్తి ► ఎంతకాలం పిటిషన్ను పెండింగ్ లో ఉంచాలి? ► లిఖిత పూర్వక మెమో దాఖలు చేయండి 4:20 PM, సెప్టెంబర్ 27, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఎల్లుండికి వాయిదా ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కొనసాగిన వాదనలు ► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ కోరిన CID ► ఈ స్కాంలో చంద్రబాబు కుటుంబానికి లబ్ధి చేకూరింది : అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ► ఏ కేసుకి ఆ కేసు ప్రత్యేకమని కులకర్ణి కేసులో గౌరవ న్యాయస్థానం స్పష్టం చేసింది ► ఒక కేసులో అరెస్ట్ అయితే అన్ని కేసుల్లో అరెస్ట్ అయినట్టు కాదు ► ఒక కేసులో రిమాండ్ విధించినప్పుడు అది మరో కేసుకు వర్తించదు ► మరో కేసులో మళ్లీ రిమాండ్ విధించవచ్చు ► ఈ అంశానికి సంబంధించిన పలు తీర్పును న్యాయమూర్తికి అందజేసిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ► కేసును ఈ నెల 29, శుక్రవారం మధ్యాహ్నంకు వాయిదా వేసిన కోర్టు 4:05 PM, సెప్టెంబర్ 27, 2023 బలమైన ఆధారాలు vs పసలేని వాదనలు : సీనియర్ లాయర్లు ► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబువి అత్యంత బలహీనమైన వాదనలు ► తనను అరెస్ట్ చేసిన విధానమే చంద్రబాబు చెప్పుకుంటున్న ఏకైక పాయింట్ ► ఎల్లోమీడియాలో చెప్పేదొకటి, కోర్టుల ముందు వాదించేది ఒకటి ► ప్రజలను నమ్మించడానికి తెలుగుదేశం, ఎల్లో మీడియా అబద్డాల ప్రచారం ► 17A కింద అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరమంటూ గగ్గోలు ► తప్పు చేయలేదు అని కోర్టు ముందు బలంగా చెప్పుకోలేని దుస్థితి ► కోర్టుల ముందు తప్పనిసరి పరిస్థితుల్లో నిజాల ఒప్పుకోలు ► పీకల్లోతు ఆరోపణలు, ప్రతీ దాంట్లో బాబుకు వ్యతిరేకంగా ఆధారాలు ► ఏకంగా 13 చోట్ల స్వయంగా సంతకాలు చేసిన చంద్రబాబు ► ఈ కేసులో చంద్రబాబు తప్పించుకోవడం కష్టమంటున్న లాయర్లు 3:40 PM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు ► చంద్రబాబు కేసును చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ముందుకు తీసుకెళ్లిన బాబు లాయర్ లూథ్రా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : మీకు ఏం కావాలి? సిద్ధార్థ్ లూథ్రా : చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరపాలి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబుకు రిలీఫ్ కావాలంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి సిద్ధార్థ్ లూథ్రా : మేం బెయిల్ కావాలని అడగడం లేదు, త్వరగా లిస్ట్ చేయమని అడుగుతున్నాం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : అక్టోబర్ 3న ఈ కేసును ఏదో ఒక బెంచ్ కు కేటాయిస్తాం సిద్ధార్థ్ లూథ్రా : 17A సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదు, మధ్యంతర ఉపశమనం కావాలని అడుగుతున్నాం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : ACB కోర్టు విచారణ జరుపుతున్న ఇలాంటి కీలక సమయంలో మేం దర్యాప్తును అడ్డుకోలేం. సిద్ధార్థ్ లూథ్రా : Z కేటగిరి ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టారు, కనీసం CIDకి కస్టడీ ఇవ్వకుండా ఆదేశాలివ్వండి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబు నాయుడిని పోలీస్ కస్టడీ ఇవ్వొద్దన్న ఆదేశాలను ఈ సమయంలో ఇవ్వలేం. ఈ కేసును అక్టోబర్ 3, 2023, మంగళవారానికి వాయిదా వేస్తున్నాం 3:30 PM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టులో CID వాదనలు ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున లాయర్ రంజిత్ కుమార్ వాదనలు ► స్కిల్ స్కాం కుట్ర, కుంభకోణం పరిధి చాలా పెద్దవి ► రూ.3300 కోట్ల ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు ► దీంట్లో 90% గ్రాంటు కింద సీమెన్స్ ఇస్తుందని చెప్పారు ► ప్రభుత్వం కేవలం 10% పెడితే చాలంటూ నిధులు విడుదల చేశారు ► ఇక్కడ కథ మలుపు తిరిగింది, 90% మాయమయింది ► ఈ 10% నిధులు మాత్రం ముందుకెళ్లిపోయాయి ► తొలుత ఈ స్కాంను GST అధికారులు గుర్తించారు ► 2018 , పిసి యాక్ట్ - 17ఏ సవరణ రాకముందే నేరం జరిగింది ► ప్రస్తుత పరిస్థితుల్లో దర్యాప్తును సజావుగా సాగనివ్వాలి ► చీఫ్ జస్టిస్ చంద్రచూడ్కు విజ్ఞప్తి చేసిన లాయర్ రంజిత్ 3:20 PM, సెప్టెంబర్ 27, 2023 రెండు కేసులు వేర్వేరు, బాబుకు బెయిల్ వద్దు : అడ్వొకేట్ జనరల్ శ్రీరాం ► హైకోర్టు : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై వాదనలు ► వేర్వేరు కేసుల్లో సెక్షన్ 428 వర్తించదన్న ఏజీ శ్రీరామ్ ► స్కిల్, ఇన్నర్ రింగ్రోడ్ కేసుల్లో 2 వేర్వేరు లావాదేవీలు జరిగాయి ► రెండు కేసుల్లో వేర్వేరు నిందితులు ఉన్నారు ► రెండు వేర్వేరు కుట్రలు, రెండు వేర్వేరు కుంభకోణాలు ► ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబు కీలక సూత్రధారి, కీలక పాత్రధారి ► చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దు : AP అడ్వొకేట్ జనరల్ శ్రీరాం 3:00 PM, సెప్టెంబర్ 27, 2023 "నాట్ బిఫోర్ మీ" ఎందుకంటే.. ► జస్టిస్ SVN భట్టి పూర్తి పేరు సరస వెంకట నారాయణ భట్టి ► 2013 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా సేవలందించిన జస్టిస్ భట్టి ► 14 జులై 2023 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తోన్న జస్టిస్ భట్టి ► ఆంధ్రప్రదేశ్కు చెందిన మ్యాటర్ కాబట్టి ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని ప్రకటించిన జస్టిస్ భట్టి ► జస్టిస్ భట్టి నిర్ణయాన్ని గౌరవించాలని సూచించిన జస్టిస్ ఖన్నా 2:45 PM, సెప్టెంబర్ 27, 2023 చంద్రబాబు పిటిషన్ వాయిదా ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వాయిదా ► పిటిషన్పై వాదనల కంటే ముందే ప్రకటన చేసిన జస్టిస్ ఖన్నా జస్టిస్ ఖన్నా : మా సహచరుడు జస్టిస్ SVN భట్టి ఈ కేసుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు హరీష్ సాల్వే : వీలయినంత తొందరగా విచారణకు వచ్చేలా చూడగలరు జస్టిస్ ఖన్నా : వచ్చే వారం చూద్దాం సిద్ధార్థ లూథ్రా : ఒక సారి చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్తాను జస్టిస్ ఖన్నా : మీరు కలవొచ్చు. ప్రస్తుతానికి ఈ కేసు వాయిదా వేస్తున్నాను హరీష్ సాల్వే : వాయిదా వేయడం ఒక్కటే మార్గం కాదు జస్టిస్ ఖన్నా : చీఫ్ జస్టిస్ను కలిసి మరో బెంచ్ ముందు వాదనలు వినిపిస్తానని లూథ్రా అంటున్నారు హరీష్ సాల్వే : సోమవారం వాదనలకు అవకాశం ఇవ్వండి జస్టిస్ ఖన్నా : సోమవారం అవకాశం లేదు. వచ్చే వారం తప్పకుండా వింటాం సిద్ధార్థ లూథ్రా : ఒక అయిదు నిమిషాలు నాకు సమయం ఇవ్వండి జస్టిస్ ఖన్నా : సరే, నేను ఆర్డర్ పాస్ చేస్తున్నాను జస్టిస్ ఖన్నా : "ప్రస్తుతం బెంచ్ ముందు ఉన్న ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను వచ్చే వారం విచారణకు స్వీకరిస్తాం. ఆ బెంచ్లో మా సహచరుడు SVN భట్టి ఉండేందుకు సుముఖంగా లేరు కాబట్టి మరో జడ్జితో కలిసి ఈ కేసును విచారిస్తాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తుది ఆదేశాలకు లోబడి ఈ ఆర్డర్ వర్తిస్తుంది". 2:35 PM, సెప్టెంబర్ 27, 2023 నాట్ బిఫోర్ : సుప్రీంకోర్టు ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్పై స్పందించిన సుప్రీంకోర్టు ► చంద్రబాబు పిటిషన్పై "నాట్ బిఫోర్ మి" అని స్పందించిన జస్టిస్ SVN భట్టి ► మరో బెంచ్కు పిటిషన్ను మార్చాల్సిన అవశ్యకత ► ఈ కేసును విచారించలేనని తేల్చిచెప్పిన జస్టిస్ భట్టి ► బాబు పిటిషన్పై వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ► రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు 2:15 PM, సెప్టెంబర్ 27, 2023 న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు హాల్ నెంబర్ 3కు ఇరుపక్షాల లాయర్లు ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్పై కొద్దిసేపట్లో విచారణ ► చంద్రబాబు తరపున మరోసారి హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా ► కిక్కిరిసిన హాల్ నెంబర్ 3, వాదనలు వినేందుకు వచ్చిన లాయర్లు, ఇతరులు ► బెంచ్ మీదకు వచ్చిన కేసు 2:10 PM, సెప్టెంబర్ 27, 2023 న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు కిక్కిరిసిన హాల్ నెంబర్ 3 ► మరికొద్దిసేపట్లో స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారించనున్న సుప్రీంకోర్టు ► విచారణ జరపనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ SVN భట్టి ధర్మాసనం ► ఐటం నెంబర్ 61గా లిస్ట్ అయిన చంద్రబాబు పిటిషన్ ► స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ 12289/2023 ► చంద్రబాబు తరపున రికార్డు ప్రకారం అడ్వొకేట్ గుంటూరు ప్రమోద్ ► ఇప్పటికే హేమాహేమీలను రంగంలోకి దించుతామని చెబుతోన్న లోకేష్ ► గత 11 రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ సుప్రీంకోర్టు లాయర్లతో లోకేష్ మంతనాలు ► హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా బాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా ► Follow www.sakshi.com LIVE updates 1:56 PM, సెప్టెంబర్ 27, 2023 బాబు దోచుకుంటే.. జగన్ ఫ్రీగా స్కిల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ► చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై మండలిలో స్వల్పకాలిక చర్చ.. ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు కామెంట్స్ ► స్కిల్ డెవలప్మెంట్ ను స్కామ్ గా మార్చి చంద్రబాబు తన ఆదాయవనరుగా చేసుకున్నారు ► చంద్రబాబు 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కొల్లగొట్టాడు. ► ప్రజాధనాన్ని దోచుకుని తాను ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడుతున్నాడు ► సీఎం జగన్ మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థుల భవితకు అండగా నిలుస్తున్నారు ► 26 జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లఏర్పాటుకు ఒక్కొక్క దానికి ఐదు ఎకరాల భూమిని సీఎం జగన్మోహన్రెడ్డి కేటాయించారు ► సీఎం జగన్.. ప్రభుత్వ నిధుల నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వివిధ సంస్థల సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు 1:10 PM, సెప్టెంబర్ 27, 2023 హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో A14గా లోకేష్ ► అరెస్ట్ భయంతో గత 11 రోజులుగా ఢిల్లీకే పరిమితమైన లోకేష్ ► తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పాత్రను తేల్చిన CID ► లోకేష్కు ఏ రకంగా లబ్ది చేకూరిందో తెలుపుతూ A14గా తేల్చిన CID ► తనను అరెస్ట్ చేయకుండా నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ► ముందస్తు బెయిల్ ఇస్తే పాదయాత్ర చేసుకుంటానంటున్న లోకేష్ 1:00 PM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టులో లంచ్ బ్రేక్ తర్వాతే చంద్రబాబు కేసు ► ఢిల్లీ: సుప్రీం కోర్టు లో లంచ్ బ్రేక్ ► లంచ్ బ్రేక్ తర్వాతే చంద్రబాబు కేసు విచారణ ► లంచ్ కోసం బెంచ్ నుంచి లేచిన జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ SVN భట్టి ► మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న విచారణ ► ఐటెం నెం.61 గా ఉన్న చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ 12:50 PM, సెప్టెంబర్ 27, 2023 ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు 1. అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా? 2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? 3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా? 4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా? 5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా? 6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా? 7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా? 12:40 PM, సెప్టెంబర్ 27, 2023 లోకేష్ జోలికి రావొద్దు : తెలుగుదేశం ► అర్జంటుగా భుజాలు తడుముకుంటోన్న తెలుగుదేశం బృందం ► లోకేష్ను A14గా అభియోగాలు మోపుతూ కోర్టులో CID పిటిషన్ ► A14 అని తెలియగానే ఢిల్లీలో చిందులు తొక్కిన చినబాబు ► ఏమైనా చేయండి, నాపై కేసును ఖండించాలని టిడిపి నేతలకు ఆదేశం ► ఆఘమేఘాల మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ పెట్టిన పంచుమర్తి అనురాధ ► అసలు మేం రాజధానే కట్టలేదు, ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కడిది? : పంచుమర్తి ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూమి సేకరించలేదు, బడ్జెట్ కేటాయించలేదు ► హెరిటేజ్కు ప్రయోజనం చేకూర్చారన్న ఆరోపణలు కూడా సరికాదు ► లింగమనేనికి అనుకూలంగా ఇన్నర్ రింగ్ రోడ్ తయారు చేశారని ఎలా చెబుతారు?: పంచుమర్తి ► TDP తీరును తప్పుబట్టిన YSRCP, ఇదే విషయం కోర్టులో చెప్పగలరా? : YSRCP ► CID చూపించిన ఆధారాలకు ఏమని సమాధానం చెబుతారు? : YSRCP 12:10 PM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టులో మీ నిర్ణయమేంటీ? ► కస్టడీ, బెయిల్ పిటిషన్పై CID, బాబు లాయర్ల వాదనలు ► వెంటనే వాదనలు వినాలన్న CID లాయర్లు ► సుప్రీంకోర్టులో SLP ఉన్నందున దాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న బాబు లాయర్లు ► వాదనల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని ఇరుపక్షాల లాయర్లకు కోర్టు సూచన ► సాయంత్రం 5గంటలలోపు వాదనలపై ఏకాభిప్రాయానికి వస్తే వింటామన్న న్యాయమూర్తి 11:40 AM, సెప్టెంబర్ 27, 2023 కోర్టుల మీద నోరు పారేసుకుంటారా? క్రిమినల్ కేసు పెట్టమని హైకోర్టు సీరియస్ ► చంద్రబాబు అరెస్టు తర్వాత న్యాయవ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఎల్లో బ్యాచ్ ► నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసిన పచ్చ మీడియా, టిడిపి నేతలు ► హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణలకు దిగిన గ్యాంగ్ ► ఈ వ్యవహారం అడ్వొకేట్ జనరల్ శ్రీరాం దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ► ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ► తెలుగుదేశం నాయకులు, సానుభూతి పరులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హైకోర్టు ► టిడిపి నేతలు బుచ్చయ్య చౌదరీ, బుద్ధా వెంకన్న, రామకృష్ణ సహా 26 మందికి నోటీసులు ► ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులు ఇవ్వాలని AP DGPకి ఆదేశం ► బుద్ధా వెంకన్న ► గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ► ఎస్. రామకృష్ణ ► రామకృష్ణ గోనె ► మువ్వా తారక్ కృష్ణ యాదవ్ ► రవికుమార్ ముదిరాజు ► రుమాల రమేష్ ► ఎల్లా రావు ► కళ్యాణి ► అకౌంట్ : @NCHIRAN17457886 ► అకౌంట్ : In Jesus New Life @ NewIN34229 ► అకౌంట్ : @TrueAPDeveloper ► అకౌంట్ : Mosapu ► అకౌంట్ : Jail Jj ► అకౌంట్ : The Ark @ArkTheAce ► అకౌంట్ : @EdukondaluMupp2 ► అకౌంట్ : @Royanenenu ► అకౌంట్ : @Wish_cap ► అకౌంట్ : @Cdattu ► అకౌంట్ : @Bean9989 ► అకౌంట్ : Chary Veda ► అకౌంట్ : Paramasivaiah Gsanju Chandu ► అకౌంట్ : SriKishore Kumar ► సంస్థ : గూగుల్ ఇండియా ► సంస్థ : ట్విట్టర్ ఇండియా ► సంస్థ : ఫేస్బుక్ ఇండియా 11:30 AM, సెప్టెంబర్ 27, 2023 అసెంబ్లీలో చంద్రబాబు అసలు రంగు బయటపెట్టిన MLA వరప్రసాద్ ► వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు ► ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నాడు ► ఓటుకు కోట్లు అనే కాన్సెప్ట్ను చంద్రబాబు ఎప్పటినుంచో అనుసరిస్తున్నాడు ► తిరుపతి ఎంపీగా నేను ఉన్నప్పుడు టిడిపిలో చేరమని ఒత్తిడి తెచ్చాడు ► ఒకటి కాదు..రెండు కాదు.. వంద కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు ► చంద్రబాబు లాంటి దిగజారిన రాజకీయాలు చేసే వ్యక్తి ఇంకొకరు లేరు 11:15AM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టులో బాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు ► ACB కోర్టుకు చేరుకున్న ఇరు వర్గాల న్యాయవాదులు ► కస్టడీ పిటిషన్ పై విచారణ చేయాలన్న CID లాయర్ వివేకానంద ► బెయిల్ పిటిషన్ పై వాదనలు వినాలన్న చంద్రబాబు లాయర్ ప్రమోద్ దూబే ► మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాదనలు వింటానన్న న్యాయమూర్తి 11:10AM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టు ఏం తేల్చబోతుంది? ► అందరి చూపు సుప్రీంకోర్టు వైపు ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్లో నేడు వాదనలు జరిగే అవకాశం ► చంద్రబాబు తరపున దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► అరెస్ట్ జరిగిన తీరును ప్రశ్నిస్తూ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ► 17A సెక్షన్ ప్రకారం గవర్నర్కు చెప్పలేదంటూ సాంకేతిక అంశాలు ► హైకోర్టులో ఇదే అంశంపై వాదనలు, బాబు లాయర్ల వాదనను తిరస్కరించిన కోర్టు ► కేసు కీలక దశలో ఉంది, దర్యాప్తును నిలిపివేయలేమని తేల్చిచెప్పిన హైకోర్టు ► ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తేల్చబోతుందన్న దానిపై ఉత్కంఠ ► రేపటి నుంచి అక్టోబర్ 3వరకు సుప్రీంకోర్టుకు సెలవులు 11:00AM, సెప్టెంబర్ 27, 2023 ఏసీబీ కోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్లు ► చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం ► విచారణ కోసం జడ్జి ముందు మెన్షన్ చేసిన చంద్రబాబు లాయర్లు ► రెండు పిటిషన్లను విచారించి ఉత్తర్వులు ఇస్తామని తెలిపిన జడ్జి ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ► చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ 10:50AM, సెప్టెంబర్ 27, 2023 హైకోర్టు ముందుకు ఉండవల్లి అరుణ్కుమార్ పిటిషన్ ►హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్ ►ఇప్పటికే బెంచ్ను కేటాయించిన హైకోర్టు రిజిస్ట్రీ ►పిల్ విచారించేందుకు తమలో ఒకరికి అభ్యంతరం ఉందని పేర్కొన్న బెంచ్ ►నాట్ బి ఫోర్ మీ అని పేర్కొన్న జస్టిస్ రఘునందన్ రావు ►మరో బెంచ్కు వెంటనే బదిలీ చేయాలని ఆదేశించిన చీఫ్ జస్టిస్ ►ప్రజా ప్రయోజనవ్యాజ్యానికి రిట్ నెంబర్ 38371/2023 కేటాయింపు ►చంద్రబాబు A1గా ఉన్న స్కిల్ స్కాం పరిధి చాలా పెద్దదని పేర్కొన్న ఉండవల్లి ►ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలు CBI, ED, ITలకు అప్పగించాలని విజ్ఞప్తి ►నిధులు పక్కదారి పట్టించేందుకు ఇతర ప్రాంతాల్లో షెల్ కంపెనీలు ఏర్పాటయ్యాయి ►ఈ కంపెనీల గుట్టు బయటపడాలంటే సమగ్ర దర్యాప్తు అవసరం ►కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలన్నీ ఏకమై విచారణ చేస్తేనే కుట్ర బహిర్గతమవుతుంది ►ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర పై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి ►44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటీషన్ దాఖలు ►హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావు బెంచ్ ముందుకు పిటిషన్ 10:30AM, సెప్టెంబర్ 27, 2023 తప్పు చేయలేదని చెప్పడం లేదు, అరెస్ట్ను తప్పుపడుతున్నారంతే.! ►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ ►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ►ఐటం నెంబర్ 61 గా లిస్ట్ అయిన బాబు కేసు ►తన క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 10:00AM, సెప్టెంబర్ 27, 2023 తప్పు చేయలేదని చెప్పడం లేదు, అరెస్ట్ను తప్పుపడుతున్నారంతే.! ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని చంద్రబాబు వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి ►కానీ, 17 (ఏ) సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని హైకోర్టు స్పష్టీకరణ ►ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ కొట్టివేత కూడా ► ఆ వెంటనే సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదైన స్కిల్ స్కాం కేసును కొట్టివేయాలని పిటిషన్ ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి.. నేడు విచారణ 09:22AM, సెప్టెంబర్ 27, 2023 ముందు ఏ పిటిషన్పై విచారణ? ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై విచారణ ►చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►రెండురోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని, మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారుల పిటిషన్ ►ఏ పిటిషన్ పై ముందు వాదనలు జరుపుతామనేది ఈ రోజు ప్రకటించనున్న కోర్టు ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిటి వారెంట్, ఏపి ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ పైనా ఈరోజు వాదనలు జరిగే అవకాశం ►ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో నారా లోకేష్ ను A14గా చేర్చి ఇంచార్జి ఎమ్ఎస్ జే కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ ►లోకేష్ పేరుతో కూడిన మెమోపై కూడా ఇవాళ విచారణ జరిగే అవకాశం.. 09:10AM, సెప్టెంబర్ 27, 2023 అసెంబ్లీ సమావేశాల్లో బాబు స్కామ్లపై చర్చ ►ఏపీ అసెంబ్లీ సెషన్.. చివరిరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ►పలు బిల్లులతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంపై చర్చ జరగనుంది. ►అలాగే శాసనమండలిలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపైనా చర్చ జరగనుంది 08:55AM, సెప్టెంబర్ 27, 2023 లోకేష్ పాత్ర ఉందనే ఫిర్యాదు చేశా: ఎమ్మెల్యే ఆర్కే ►ఇన్నర్ రోడ్ స్కాంలో లోకేష్ పాత్ర ఉందనే సీఐడీకి ఫిర్యాదు చేశా ►చట్టాలు గౌరవిస్తానని చెప్పే చంద్రబాబు, లోకేస్.. కోర్టు విషయంలో ఎందుకు భయపడుతున్నారు ►ఇన్నర్ రింగ రోడ్ అలైన్మెంట్ విషయంలో తన వారికి లబ్ధి చేకూరే విధంగా మార్పు చేశారనేది స్పష్టం. 08:00AM, సెప్టెంబర్ 27, 2023 తండ్రీకొడుకుల ఆట ముగిసింది: ఎంపీ విజయసాయిరెడ్డి ►తండ్రి ఎలాగో కొడుకు అలాగే! ►ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో నారా లోకేష్ A14ని కలవండి. ►ఢిల్లీలో ఉన్నప్పుడు తను కలిసే లాయర్లకు బై-వన్-గెట్-వన్-ఫ్రీ స్కీమ్ అందించాలి. ►తండ్రి కేసును టేకప్ చేయండి.. కొడుకు కేసును ఉచితంగా పొందండి ►ఈ తండ్రీకొడుకుల ఆట ఇప్పుడు ముగిసింది. Like father, Like son! Meet Nara Lokesh A14 in the Inner Ring Road scam. While in Delhi he should offer a buy-one-get-one-free scheme to the lawyers he is meeting. Take up the father’s case and you’ll get the son's case for free. This father-son duo’s game is now over. pic.twitter.com/JIhpnXrA8R — Vijayasai Reddy V (@VSReddy_MP) September 27, 2023 06:52AM, సెప్టెంబర్ 27, 2023 క్రిమినల్ కంటెంప్ట్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ ►హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఏజీ ►నేడు విచారిస్తామన్న హైకోర్టు డివిజన్ బెంచ్ 06:52AM, సెప్టెంబర్ 27, 2023 నేడు చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల పై ఏసీబీ కోర్టులో విచారణ ►బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల పై విచారణ నేటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►రెండు పిటిషన్ల పై నేడు విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామన్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ ►సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ లో కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు 06:45AM, సెప్టెంబర్ 27, 2023 నేడు హైకోర్టులో అమరావతి రింగ్ రోడ్డు కేసు విచారణ ►అమరావతి రింగ్ రోడ్డు కేసు విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు ►మధ్యాహ్నం 2.15 గం.కు వాదనలు వింటామన్న హైకోర్టు ►రింగ్ రోడ్డు కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ 06:44AM, సెప్టెంబర్ 27, 2023 నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ ►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ►ఐటెం నెం.61 గా లిస్ట్ అయిన బాబు కేసు ►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 06:00AM, సెప్టెంబర్ 27, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @18 ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18వ రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్. ► స్కిల్డెవలప్మెంట్ స్కామ్లో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ ► ఏసీబీ కోర్టు రిమాండ్తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్లో చంద్రబాబు ► రెండుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► తాజా పొడిగింపుతో అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు -
ఫైబర్ నెట్లో రూ.114 కోట్లు దోచేశారు!
సాక్షి, అమరావతి: ఫైబర్నెట్ స్కామ్లో మాజీ సీఎం చంద్రబాబు రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని లూటీ చేశారని, ఇది ఒక కేస్ స్టడీ లాంటిదని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగిందన్నారు. 2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైనట్లు చెప్పారు. చంద్రబాబు తన ఓఎస్డీ అభీష్ణ ద్వారా ఈవీఎంల దొంగ వేమూరి హరికృష్ణప్రసాద్ని మెంబర్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సి ల్గా నియమించాలని ఐటీ కార్యదర్శికి లేఖ రాశా రని చెప్పారు. ప్రాజెక్టు సాంకేతిక మదింపు కమిటీ, టెండర్ మదింపు కమిటీలోనూ హరికృష్ణప్రసాద్ సభ్యుడిగా ఉన్నాడని తెలిపారు. హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్గా పనిచేసిన దేవినేని సీతారా మయ్య 2000 సెప్టెంబర్ 30 నుంచి 2014 వరకు టెరా సాఫ్ట్ సంస్థకు 14 ఏళ్లు డైరెక్టర్గా ఉన్నారని వెల్లడించారు. ఫైబర్నెట్ ప్రాజెక్టుపై మంగళవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. బ్లాక్ లిస్టు కంపెనీకి టెండర్ అప్పటిదాకా బ్లాక్ లిస్టులో పెట్టిన టెరా సాఫ్ట్ను రూ.333 కోట్ల బిడ్డింగ్ ముగియటానికి ఒక్క రోజు ముందు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. అప్పటి ఏపీటీఎస్ వీసీ అండ్ ఎండీ సుందర్ దీనిపై అభ్యంతరం తెలిపితే ఆయన్ను బదిలీ చేశారు. టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్ను టెరా మీడి యా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్గా తొలగించారు. ఈ స్కామ్ పూర్తిగా చంద్రబాబు కనుస న్నల్లోనే జరిగింది. ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి టెరా సాప్ట్కి రూ.284 కోట్లు విడుదల చేయగా అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి ఇచ్చా రు. ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్లో ఆ కంపెనీ ఏర్పాటైంది. నెట్వర్క్, ఎక్స్వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బును బదిలీ చేశారు. ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమ తదితరులకు వెళ్లినట్లు తేలింది. ఈ కంపెనీలన్నింటి చిరునామా, టెరా సాఫ్ట్వేర్ అడ్రస్ ఒక్కటే. అప్పటికప్పుడు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా డబ్బులను తరలించారు. పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ఈ డబ్బంతా చంద్రబాబు వద్దకు చేరింది. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి సీమెన్స్ వెబ్సైట్లో ఏపీ ప్రాజెక్టు గురించి ఎక్కడా లేదు. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటక ప్రాజెక్టుల గురించి మాత్రమే ఉంది. తమకున్న వ్యాపార సంస్థలో 2 శాతం అమ్మేస్తే రూ.400 కోట్లు వస్తాయని బాబు సతీమణి అంటున్నారు. ఆ వ్యాపారాలు ఉండడానికి ఆమె భర్త బ్యాక్గ్రౌండ్ ఏమిటి? 2 శాతం అమ్మితేనే రూ.400 కోట్ల వస్తాయంటే వంద శాతం అమ్మేస్తే రూ. 20 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు రెండు ఎకరాల నుంచి ఈ స్థాయికి ఎలా ఎదిగారు? అన్నీ అవకతవకలే: వేణుగోపాల్, ఎమ్మెల్యే టెండర్లలో నిబంధనలను పాటించలేదు. ఇతర సంస్థలతో కన్సార్టియమ్గా ఏర్పడి టెరాసాఫ్ట్ వేసిన టెండర్ డాక్యుమెంట్లు సరైనవి కాకపోవడంతో ఇతరులు అభ్యంతరం తెలిపారు. ఈ స్కామ్కు ప్రత్యక్ష సాక్షిని, బాధితుడిని నేనే కనుక ఈ విషయాలు స్పష్టంగా చెప్పగలుగుతున్నా. సూత్రధారులు బాబు, లోకేశ్లే: అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే ఫైబర్ గ్రిడ్ స్కామ్ సూత్రధారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్లే. వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా వీరు దోపిడీకి పాల్పడ్డారు. టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధనాన్ని దోచేశారు. బాబు అవినీతిని ఎవరు కట్ చేస్తారు? (ఫైబర్ గ్రిడ్ స్కామ్పై 26.3.2016న ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అసెంబ్లీలో ఏమన్నారో తాజాగా సభలో ప్రదర్శించారు) ‘చంద్రబాబు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ప్రాజెక్టును రూ.333 కోట్లకు ఎంత దారుణంగా ఇచ్చారో, ఇందులో ఎన్ని వందల కోట్ల స్కామ్ జరిగిందో చెబుతా. చౌక దుకాణాల్లో ఈ–పోస్ యంత్రాలను అమర్చడంలో విఫలమై బ్లాక్ లిస్టులో పెట్టిన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ అనే సంస్థకు ఫైబర్ గ్రిడ్ పనులను రూ.333 కోట్లకు ఎలా అప్పగించారో చంద్రబాబుకే తెలియాలి. హెరిటేజ్తో సంబం«ధాలున్న వేమూరి హరికృష్ణప్రసాద్కి టెరా సాఫ్ట్తో అనుబంధం ఉంది. ఈవీఎంల దొంగతనం కేసు నమోదైన వ్యక్తికి చెందిన సంస్థకు ఈ ప్రాజెక్టును ఇచ్చారు. టెండర్ల పర్యవేక్షణ కమిటీలో ఆయన్ను సభ్యుడిగా నియమించారు. ఆయనే టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్గానూ వ్యవహరిస్తున్నాడు. పర్యవేక్షణ కమిటీ సభ్యుడుగా ఉంటూ తన సొంత సంస్థ టెరా సాఫ్ట్కు పనులు ఇచ్చేసుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టర్గా వ్యవహరిస్తున్న దేవినేని సీతారామయ్య 2014 సెప్టెంబర్ 30 వరకు టెరా సాఫ్ట్వేర్లోనూ డైరెక్టర్గా పనిచేశాడు. అదే సంస్థకు ఫైబర్ ఆప్టికల్ పనుల్ని చంద్రబాబు అప్పగించారు. వేమూరి హరికృష్ణప్రసాద్, చంద్రబాబు కుటుంబం మధ్య సన్నిహిత సంబంధాలున్నట్లు తేటతెల్లమవు తుంటే ఇక ఇది ఏ రకంగా పారదర్శకం? ఇది సబబేనా? పెన్షన్లు, ఇళ్ల విషయంలో ఒకటో అరో అవినీతి జరిగితే కట్ చేయాలంటాడు చంద్రబాబు. మరి ఆయనే దగ్గరుండి చేస్తున్న అవినీతిని ఎవరు కట్ చేస్తారు?’ అని అప్పట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ మాయగాళ్లు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జిల్లాలో ఆన్లైన్ మోసాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అక్షర జ్ఞానం లేని వారి నుంచి ఉన్నత విద్యాభ్యాసం చేసిన, ఉద్యోగులు.. ఆన్లైన్ మోసాల్లో చిక్కుకుంటున్నారు. నిరుద్యోగులకు, యువతకు కొందరు కేటుగాళ్లు వల వేస్తున్నారు. ఖాళీ సమయంలో పార్ట్ టైంగా ఇంటి వద్దే ఉండి ఉద్యోగం చేయండి, భారీగా సంపాదించే అవకాశం ఉంది అంటూ మాయగాళ్లు పెద్ద ఎత్తున యువత నుంచి అందిన మేరకు దోచుకొంటున్నారు. ఇలాంటి కేసులు నగరంలో ఇటీవల ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఆ ప్రకటనలు నమ్మి పలువురు ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగులు, మోసగాళ్ల మాయలో చిక్కుకుంటున్నారు. ఊడ్చేస్తున్నారు ఇలాగే విజయవాడలోని యువతి మొబైల్కు.. పార్ట్టైం ఉద్యోగం చేస్తూ అధిక డబ్బు సంపాదించవచ్చని ఫోన్కు మెసేజ్ వచ్చింది. యూట్యూబ్లో వీడియోలకు లైక్ చేస్తే చాలని, అన్నింటికి లెక్కకట్టి డబ్బులు వేస్తామని నమ్మపలకగా ఆమె అంగీకరించి బ్యాంకు ఖాతా వివరాలను పంపింది. మొదట మూడు వీడియోలకు లైక్ చేసినందుకు రూ.150, ఆరు వీడియోలకు లైక్ చేసినందుకు రూ.300 బ్యాంకు ఖాతాలో వేశారు. ప్రీపెయిడ్ టాస్క్లు చేస్తే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని మాయగాళ్లు నమ్మబలికారు. తొలుత రూ.1000 చెల్లిస్తే, తిరిగి రూ.1600 బ్యాంకు ఖాతాలో వేశారు. ఇలా విడతల వారీగా ఆమె 19 లక్షలు బ్యాంకు ఖాతాకు బదిలీ చేసి మోస పోయింది. ఇలా నగరంలో ఇంటి పట్టునే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చనే మొయిల్లను నమ్మి మోసపోతూనే ఉన్నారు. యువతను ఆకర్షించి.. కొంత మంది యువత ప్రభుత్వ పథకాల కోసం అకౌంట్లను ప్రారంభిస్తున్నారు. ఇలాంటి వారిని కొన్ని ముఠాలు ఆకర్షిస్తున్నాయి. వారికి పార్ట్టైమ్ జాబ్లు, కమిషన్ వస్తుందని ఆశ చూపుతున్నారు. వీరి అకౌంట్లకు లింక్ అయిన ఫోన్ నంబర్లను అన్లైన్లోనే మార్చి, వారి ఫోన్ నంబర్లకు లింక్ చేసుకొని ఖాతాలను వాడుకొంటున్నారు. ఇలా పలు బ్యాంకు అకౌంట్ల నుంచి మాయ మాటలతో డబ్బులు సేకరించి, ఒక కరెంటు అకౌంట్కు బదిలీ చేసుకొని, దానిని క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. దీంతో ఆ డబ్బు ఏదేశానికి ఎక్కడికి వెళ్లింది కూడా తెలియని పరిస్థితి. గల్ఫ్, హాంకాంగ్, బంగ్లాదేశ్, మలేషియా దేశాలకు ఉద్యోగాల కోసం ఇండియా నుంచి వెళ్లిన వారిని మాయగాళ్లు ఉపయోగించుకొంటున్నారు. యూఎస్బేస్ సర్వర్లు ఆ దేశాల నుంచి నిర్వహిస్తుండటంతో, మోసగాళ్ల ఆట కట్టించడం కూడా కష్టంగా మారింది. -
చంద్రబాబు ఏ–1.. లోకేశ్ ఏ–14
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు సహకార డెయిరీలను దెబ్బతీసి తమ కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారం, ఆస్తులను అమాంతం పెంచగా ఆయన తనయుడు లోకేశ్ రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారులో అక్రమాలతో హెరిటేజ్ ఫుడ్స్ కోసం భూములను కొల్లగొట్టారు. తమ బినామీ, సన్నిహితుడు లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్ప్రోకోకు పాల్పడి భారీ భూదోపిడీకి తెగబడటంలో చంద్రబాబు, లోకేశ్ చక్కటి సమన్వయం కనబరిచారు. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు కరకట్ట నివాసాన్ని తీసుకోగా హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ భూములను కొల్లగొట్టారు. ఈ అవినీతి భూబాగోతాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్ క్యాపిటల్లో పొందిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈమేరకు న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణను పేర్కొన్న సిట్ నారా లోకేశ్ను ఏ–14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో మంగళవారం ప్రత్యేక మెమో దాఖలు చేసింది. లింగమనేని రమేశ్, రాజశేఖర్లతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అవినీతి మెలికలు.. అమరావతి ముసుగులో చంద్రబాబు సాగించిన భారీ భూదందాలో ఐఆర్ఆర్ కుంభకోణం ఓ భాగం! మాజీ మంత్రి పొంగూరు నారాయణతోపాటు లోకేశ్ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు తమ బినామీ, సన్నిహితుడైన లింగమనేని రమేష్తో క్విడ్ ప్రోకోకు పాల్పడి ఆయన భూముల విలువను భారీగా పెరిగేలా చేశారు. అందుకు ప్రతిగా బినామీల పేరిట భారీగా భూములను పొందడమే కాకుండా కరకట్ట నివాసంతోపాటు హెరిటేజ్ ఫుడ్స్కు భూములు కానుకగా దక్కించుకున్నారు. నాడు సీఆర్డీఏ అధికారులు రూపొందించిన 94 కి.మీ. అమరావతి ఐఆర్ఆర్ అలైన్మెంట్పై చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఆ అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలోని పెదపరిమి, నిడమర్రు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా వెళ్తుంది. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి దాన్ని నిర్మించాల్సి వస్తుంది. దీంతో తమ భూముల విలువ అమాంతం పెరగదని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలున్న తాడికొండ, కంతేరు, కాజాను పరిగణలోకి తీసుకున్నారు. అందుకోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజాలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. అలైన్మెంట్ను రూపొందించారు. అయితే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అనంతరం సింగపూర్కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చి అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ను అమరావతి మాస్టర్ ప్లాన్లో చేర్చారు. ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి మాస్టర్ ప్లాన్లో పొందుపరిచిన అలైన్మెంట్కు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. ఈ క్రమంలో తాడికొండ, కంతేరు, కాజాలో హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకుని అలైన్మెంట్ను ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ఖరారు చేసింది. హెరిటేజ్ ఫుడ్స్కు భూములు ఐఆర్ఆర్ అలైన్మెంట్ను మెలికలు తిప్పడం ద్వారా లింగమనేని కుటుంబం భూముల విలువను భారీగా పెరిగేలా చేశారు. కంతేరు, కాజాలో లింగమనేని కుటుంబానికి ఉన్న 355 ఎకరాలను ఆనుకునే అలైన్మెంట్ను ఖరారు చేశారు. అందుకు ప్రతిగా అదే ప్రాంతంలో హెరిటేజ్ ఫుడ్స్కు భూములను పొందారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకుని కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్కు 10.4 ఎకరాలు పొందగా 2014 జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో కొనుగోలు చేసినట్టు చూపించారు. లింగమనేని కుటుంబ నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్ను రద్దు చేసుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. లోకేశ్ కీలక ‘భూ’మిక క్విడ్ప్రోకోకు పాల్పడి హెరిటేజ్ ఫుడ్స్కు భూములను దక్కేలా చేయడంలో లోకేశ్ కీలక భూమిక పోషించారు. ఆయన 2008 జూలై 1 నుంచి 2013 జూన్ 29 వరకు హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టర్గా ఉన్నారు. అనంతరం 2017 మార్చి 31 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకుని కొనుగోలు పేరిట భూములను దక్కించుకోవాలని నిర్ణయించిన హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో లోకేశ్ కూడా పాల్గొన్నారు. క్విడ్ ప్రోకో కింద భూములను పొందే ప్రక్రియలో ఆయన కీలక భూమిక పోషించారు. లోకేశ్ పేరిట హెరిటేజ్ ఫుడ్స్లో 23,66,400 షేర్లు ఉన్నాయి. అంటే హెరిటేజ్ ఫుడ్స్లో లోకేశ్కు 10.20 శాతం వాటా ఉంది. బాబుకు కరకట్ట నివాసం క్విడ్ప్రోకోలో భాగంగా లింగమనేని రమేశ్ విజయవాడ వద్ద కృష్ణా కరకట్టపై ఉన్న తన బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారాన్ని మసిపూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్ బుకాయించారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ, చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయపన్ను వివరాల్లో లేవు. తరువాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారన్న ప్రశ్నకు సమాధానం లేదు. దీంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్ప్రోకో కింద ఇచ్చారని స్పష్టమైంది. లింగమనేని నుంచి కానుకగా స్వీకరించిన కరకట్ట ఇంట్లోనే చంద్రబాబు, లోకేష్ దర్జాగా నివసించడం గమనార్హం. పవన్కూ వాటా జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కూడా ఈ అవినీతి పాపంలో పిడికెడు వాటా ఇచ్చారు. కాజాకు సమీపంలో ఐఆర్ఆర్ అలైన్మెంట్కు చేరువలో పవన్కల్యాణ్కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్కు ఇవ్వడం గమనార్హం. భారీగా పెరిగిన విలువ ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారమైతే ఎకరా రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరం రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకుపైగా పెరిగింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే రూ.62.4 కోట్లకు చేరుతుందని తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకుని రద్దు చేసినట్టు చూపిన మరో 4.55 ఎకరాల విలువ కూడా రూ.27.3 కోట్లకు చేరుతుంది. ఇక చంద్రబాబు బినామీల పేరిట ఉన్న వందలాది ఎకరాల విలువ అమాంతం పెరిగింది. -
Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14
సాక్షి, కృష్ణా: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పేరును చేర్చింది ఏపీ సీఐడీ. ఏ14గా పేరు చేర్చి విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి నారాయణ, పలువురిని సీఐడీ నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయానికి వస్తే.. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్పులు చేశారు. అమరావతి రాజధాని మాస్టర్ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తయారీ ఆమోదంలో.. చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారాయణ, లింగమనేని రమేష్, నారా లోకేష్, మరికొందరు కూడబలుక్కొని వారికి, అనుయాయులకు భారీ లబ్ధి చేకూరేలా, వారి భూములకు మాత్రమే భారీ రేట్లు వచ్చేలా కుట్రలు చేశారు. ఇందుకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్లో సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు తదనంతరం.. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో చంద్రబాబును A1 ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. లోకేశ్దే కీలక పాత్రే... అయితే.. ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేసి నారా లోకేష్ లబ్ధి పొందాలని ప్రయత్నించారని అభియోగాలు నమోదు చేసింది ఏసీ సీఐడీ. ఈ మేరకు మెమోలో ఏ14గా లోకేష్ పేరును మెన్షన్ చేసింది ఏపీ సీఐడీ. అంతకు ముందు క్విడ్ ప్రోకో కింద లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించారనే ఆరోపణలు లోకేష్పై ఉన్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసుతో పాటు ఫైబర్ నెట్ కేసులోనూ లోకేష్ నిందితుడిగా ఉన్నారు. ఇన్నర్రింగ్రోడ్డు కేసు వ్యవహారం.. అమరావతి మాస్టర్ప్లాన్, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంతా నాటి సీఎం, ఈ కేసులో ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో సీఆర్డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరించిన చంద్రబాబుకు మాస్టర్ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసు. మాస్టర్ప్లాన్పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే అని పేర్కొంది. అంతేకాదు రాజధాని ఎంపిక, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో ఆయనకు పూర్తి భాగస్వామ్యం ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకోకు పాల్పడ్డారని స్పష్టమయింది. టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మూడుసార్లు మార్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు జరిగాయి. లింగమనేని కోసమే.. ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ కుటుంబానికి ఇన్నర్రింగ్ రోడ్డు తుది అలైన్మెంట్ను ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయి. అయితే ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేదని, లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్మెంట్ను ఖరారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. రాజధాని మాస్టర్ప్లాన్తో పాటు ఇన్నర్రింగ్ రోడ్డు స్కాంలో క్విడ్ ప్రోకోలో భాగంగా.. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించిన కరకట్ట నివాసాన్ని వ్యక్తిగతంగానే ఇచ్చారు. కథ నడిపిన ఏ–2 నారాయణ అమరావతి మాస్టర్ప్లాన్, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినట్లు స్పష్టమైంది. మాస్టర్ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని, అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగిందని దర్యాప్తులో వెల్లడయింది. ఈ కేసులో ఇప్పటికే నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్ క్యాపిటల్లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయి. తద్వారా సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు సీఆర్డీయేకే భూసమీకరణ కింద ఇచ్చి 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని తేలింది. ఆ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని పేర్కొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్ క్యాపిటల్లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేసేందుకు కోర్టు కూడా అనుమతినిచ్చింది. -
మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం.. దూరం పెట్టడంతో!
తూర్పు గోదావరి: తనను తీసుకువెళ్తున్నది మేకవన్నె పులి అని.. అభం శుభం తెలియని ఆ చిన్నారి మనస్సుకు అర్థం కాలేదు.. నిలువెల్లా కాపట్యం నిండిన ఆ క్రూరుడు తనను కబళించేస్తాడని ఏ మాత్రం అనుకోలేదు.. బంధువే కదా అనుకుంటూ ఆ దుర్మార్గుడిని నమ్మింది.. మాయమాటలు విని, అతడితో వెళ్లింది.. చివరకు ఆ దౌర్భాగ్యుడి చేతుల్లో అత్యంత క్రూరంగా హతమారిపోయింది. పెద్దాపురం పట్టణంలో సంచలనం రేపిన బాలిక హత్యకు కారకుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన దంపతులు ద్రోణ వీర్రాజు, జ్యోతి కొన్నాళ్ల కిందట మనస్పర్థల కారణంగా విడిపోయారు. దీంతో జ్యోతి తన పదేళ్ల కుమార్తె ప్రవీణ కుమారి అలియాస్ మానస, తన తల్లి సునీతతో కలసి పట్టణ శివారులోని ఎన్టీఆర్ నగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన బత్తిన నాని జ్యోతికి సమీప బంధువు. వరుసకు మేనల్లుడు అవుతాడు. ఐదేళ్లుగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి, కొనసాగుతోంది. అయితే, తన కుమార్తె ఎదుగుతోందని, ఇంటికి రావడం సరికాదని అంటూ కొన్నాళ్లుగా నానిని జ్యోతి దూరం పెడుతోంది. అది తట్టుకోలేని నాని తమ సాన్నిహిత్యానికి అడ్డంగా ఉన్న మానసను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ప్రణాళిక సిద్ధం చేశాడు. అందులో భాగంగా బయటకు తీసుకువెళ్తానని ఈ నెల 19వ తేదీన మానసకు చెప్పాడు. బంధువే కావడంతో అతడి మాటల్ని ఆ బాలిక నమ్మింది. మానసను తన బైక్పై ఎక్కించుకున్న నాని, స్థానిక కట్టమూరు పుంత రోడ్డులోకి తీసుకువెళ్లి, ముందే వేసుకున్న పథకం ప్రకారం హతమార్చాడని పోలీసులు చెబుతున్నారు.బయటకు వెళ్లిన మానస ఎంతకూ ఇంటికి రాకపోవడంతో జ్యోతి ఈ నెల 20వ తేదీన పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు ఆరంభించిన పోలీసులు అనుమానితుడిగా ఉన్న నానిని అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టేందుకు ప్రయతి్నంచారు. చివరకు అతడు పరారీలో ఉన్నాడని గుర్తించారు. మరోవైపు బాలిక ఆచూకీ కోసం కూడా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కట్టమూరు పుంతలో బాలిక మృతదేహాన్ని ఆదివారం రాత్రి గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆ బాలిక మృతదేహం పూర్తిగా పాడైపోయింది. కుక్కలు ఈడ్చుకు రావడంతో గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. చివరకు దుస్తుల ఆధారంగా ఆ మృతదేహం మానసదేనని గుర్తించారు. చిన్నారి మృతదేహానికి పెద్దాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించి, సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మానస హత్యకు కారకుడైన నాని ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అతడిని పట్టించిన వారికి రూ.10 వేల పారితోíÙకం అందిస్తామని ప్రకటించారు. డీఎస్పీ లతాకుమారి నేతృత్వంలో సీఐ అబ్దుల్ నబీ, ఎస్సై సురే‹Ùలు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గణేష్ నిమజ్జనం ఊరేగింపులో విషాదం
సాక్షి, పల్నాడు జిల్లా: నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో, వీధుల్లో, వ్యాపార సముదాయాల్లో, అపార్ట్మెంట్లలో వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో గణనాధుడిని నిత్య అలంకరణలు చేస్తూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల నిమజ్జనం మహోత్సవంలో పలు అపశ్రుతి, అనుకోని సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గణేష్ నిమజ్జనం ఊరేగింపులో కరెంట్ షాక్ తగిలి 13 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన నరసరావుపేటలో చోటుచేసుకుంది. సోమవారం వినాయకుడి ఊరేగింపు చూసేందుకు 13 ఏళ్ల బాలుడు వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు కరెట్ షాక్ తగిలి బాలుడు కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పిల్లాడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. చదవండి: తిరుమల: ముగింపు దశకు బ్రహ్మోత్సవాలు.. వేడుకగా చక్రస్నానం