Top Stories
ప్రధాన వార్తలు

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ‘సాక్షి’పై ఏపీ సర్కార్ కక్ష సాధింపు
సాక్షి, విజయవాడ: ఏపీలో పత్రికా స్వేచ్చకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగారు. సోదాల పేరుతో ఏపీ పోలీసులు గురువారం ఉదయం.. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి చేరుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండానే ధనుంజయ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. కాసేపటికే ఇంటి తలుపులు మూసివేసి గంటల తరబడి సోదాలు చేశారు. అయితే, గతంలోనూ ధనుంజయ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ కథనాలు రాసిన పలువురు సాక్షి విలేకర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.ఏసీపీ ప్రవర్తన దుర్మార్గం: ధనుంజయ రెడ్డి అనంతరం, సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 9:45కి పది మంది పోలీసులు ఇంటికి వచ్చారు. సోదాలకు సంబంధించి నోటీసులు లేకుండా ఇంట్లోకి దూసుకొచ్చేశారు. ఏసీపీ మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు. నోటీస్ కూడా ఇవ్వకుండా సోదాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తాయి. ప్రజల గొంతుకై ‘సాక్షి’ నిలుస్తుంది అని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు కేసులు పెట్టారు. ప్రస్తుతం హైకోర్టు పరిధిలో కేసు ఉంది. సంబంధం లేదని వాళ్లే చెబుతారు. మళ్లీ వారే సోదాలు చేస్తారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కూడా మేము ఫిర్యాదు ఇస్తాం. మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ పద్ధతిని ఖండించాలి’ అని అన్నారు. ఖండించిన పాత్రికేయులుఏపీలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొన్నాయని పాత్రికేయులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నందుకే సాక్షిపై చంద్రబాబు సర్కారు కక్ష సాధిస్తోందని ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజాసంఘాలతో పాటు ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను నిగ్గదీసి అడుగుతున్నందుకు, కక్ష గట్టి ప్రజల గొంతును నొక్కాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే కూటమి సర్కారు ఇదంతా చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామన్నారు. సాక్షిపై కక్ష సాధింపు చర్యలను పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా పాత్రికేయులు పేర్కొన్నారు. ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా నడుచుకోవాలని కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు.

చంద్రబాబు బాటలోనే రేవంత్.. ఇదేం రాజకీయం!
ఆర్థిక పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ వ్యాఖ్యల్లో వాస్తవమున్నప్పటికీ ఆయన కూడా తన రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బాటే పట్టారేమో అనిపిస్తుంది. ఎన్నికల ముందు ఆకాశం మీ చేతుల్లోకి తెచ్చేస్తానన్న రీతిలో హామీలివ్వడం.. తీరా అధికారం చేపట్టిన తరువాత ఖజానా చూస్తే హామీల అమలుపై భయమేస్తోందని సన్నాయి నొక్కులు నొక్కడంలో చంద్రబాబు ఆరితేరిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రేవంత్ కూడా అదే మాదిరిగా.. అప్పులు కూడా పుట్టడం లేదని చెబుతున్నట్లు అనిపిస్తోంది.నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇంత బహిరంగంగా మాట్లాడడం సరికాకపోవచ్చు. వాస్తవాలు చెబుతున్న కారణంగా అంతా సర్దుకు పోతారని ఆయన భావన కావచ్చు. కాని దీనివల్ల రాష్ట్రం పరపతి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు అప్పులు నిజంగానే పుట్టడం లేదా అంటే ఆంధ్రప్రదేశ్లో పదకుండు నెలల్లోనే రూ.1.5లక్షల కోట్ల అప్పు చేస్తే, తెలంగాణలో రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేశారు. అదనంగా అప్పులకు వెళితే ఇస్తున్నట్లు లేరు. దేనికైనా పరిమితులు ఉంటాయి. తోచినట్లు వాగ్దానాలు చేసి,అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అప్పులు పుట్టడం లేదని, బ్యాంకులు తమను దొంగల్లా చూస్తున్నాయని అంటే ప్రజలు ఏమని అనుకుంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులకు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని, తీరు చూస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతారేమో అన్నట్లుగా పరిస్థితి దేశం ముందట ఉందని రేవంత్ అన్నారు.ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. దీనికంతటికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని రేవంత్ చెప్పవచ్చు. కాని అది పరిష్కారం కాదు. సరైన జవాబు కాదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే రాష్ట్ర అప్పులపై రేవంత్ కాని, ఇతర కాంగ్రెస్ నేతలు కాని అనేక విమర్శలు చేశారు. అయినా అధికారం రాబట్టుకోవడం కోసం ఎన్ని అసాధ్యమైన హామీలు ఇచ్చారో గుర్తులేదా? ఆరు గ్యారంటీలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియకుండానే వాగ్దానం చేశారా? అలా చేస్తే అది బాధ్యతారాహిత్యం కాదా? అదేమంటే రేవంత్ ఇచ్చిన సమాధానం చూడండి. ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. మూడు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి ఇదెంత సంసారం. చక్కదిద్దవచ్చని అనుకున్నానని ఆయన చెప్పారు. తీరా చూస్తే మూడు లక్షల కోట్ల ఆదాయం లేదు.. రెండు లక్షల కోట్లే ఆదాయం, అప్పు ఎనిమిది లక్షల కోట్లు ఉంది అని ఆయన వివరిస్తున్నారు.సరిగ్గా చంద్రబాబు కూడా ఏపీలో ఇలాగే మాట్లాడారు. తనకు ఎన్నికల ముందు అన్నీ ఇవ్వవచ్చని అనుకున్నానని, కాని లోపలికి వెళ్లి చూస్తే ఏమీ లేదని, ఖజానా ఖాళీగా కనబడస్తా ఉందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేసిన చంద్రబాబు తీరా బడ్జెట్లో రూ. ఆరున్నర లక్షల కోట్లే ఉందని అంగీకరించారు. అయినా హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టడానికి ఈ కబుర్లు చెబుతున్నారన్న సంగతి ఏపీ ప్రజలకు అర్థమైంది. అదే ధోరణిలో రేవంత్ కూడా ఎన్నికలకు ముందు వంద రోజులలో అన్ని హామీలు చేసి చూపిస్తామని, రైతులకు రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఎవరైనా అప్పు చేయకపోతే బ్యాంకులకు వెళ్లి అప్పు తీసుకోండని చెప్పారా? లేదా? అది బాధ్యతారాహిత్యం కాదా? ఇప్పుడేమో తాను 18 గంటలు కష్టపడుతున్నానని, ఒక్క రోజైనా, ఒక్క గంట సెలవైనా తీసుకోలేదని సానుభూతి కోసం మాట్లాడుతున్నారు. నిజానికి ఏ సీఎం అయినా 18 గంటలు పనిచేస్తున్నానని చెబితే ఆ ప్రభుత్వం పద్దతిగా లేదని అర్థం.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. మిగిలినవారిని పని చేయనివ్వకుండా తానే పని చేస్తున్నానని చెప్పుకోవడానికి ఇలాంటి మాటలు పనికి వస్తాయి తప్ప జనానికి ఏమి ఉపయోగం? ఇది కూడా చంద్రబాబు తరహా మాటే.ఆయన కూడా తాను ఎంతలా కష్టపడుతున్నది పదే, పదే జనానికి చెబుతుంటారు. రేవంత్ కొత్తగా సీఎం అయి ఉండవచ్చు.ఆయన కొన్ని వాగ్దానాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయకపోలేదు. అయినా అన్నిటిని అమలు చేయడం కష్టం కనుక ఈ కొత్తరాగం ఎత్తుకున్నారు. అప్పులు, వాయిదాలకే రూ.7500 కోట్లు అవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటివారు రేవంత్కు మద్దతుగా మాట్లాడుతున్నా, అవి అంత కన్విన్సింగా కనిపించవు. ఏ ప్రభుత్వం ఉన్నా, రుణాలు చెల్లించవలసిందే కదా! ఒక్కసారి గతానికి వెళితే చంద్రబాబు నాయడు 1996 లోక్ సభ ఎన్నికలకు ముందు టీడీపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలిస్తేనే కిలో రెండు రూపాయల బియ్యం, మద్య నిషేధం, మొదలైనవి కొనసాగుతాయని ప్రచారం చేశారు.ఎన్నికలు అయ్యాక మాత్రం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, మార్పులు చేయాలని, బియ్యం రేట్లు పెంచాలని, మద్య నిషేధం ఎత్తివేయాలంటూ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు సాగించారు. ప్రతి ఎన్నికకు ముందు ఇదే తతంగం ఆయన సాగిస్తుంటారు. 2014లో రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానని, బ్యాంకులలో తనఖాలో ఉన్న రైతుల భార్యల బంగారం కూడా విడిపిస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఏదో అరకొర చేసి చేతులెత్తేశారు. 2024లో కూడా సూపర్ సిక్స్ అంటూ మరోసారి జనాన్ని మభ్య పెట్టడానికి వెనుకాడలేదు. ఈ రకంగా గురు, శిష్యులైన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకే బాటలో పయనించడం విశేషం.ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా అంత సహేతుకంగా అనిపించవు. తమ డిమాండ్లు నెరవేర్చాలన్న ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి ఎవరిపై మీ సమరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల ఏమి ప్రయోజనం? తెలంగాణ రాష్ట్రం దివాళా తీయడానికి ఉద్యోగులు బాధ్యులు అవుతారా? లేక పాలన చేస్తున్న నేతలా?‘‘నన్ను కోసినా రూపాయి రాదు..ప్రభుత్వం అంటే నేను ఒక్కడినే కాదు..ప్రజా ప్రతినిధులు,, ప్రభుత్వ ఉద్యోగులు అంతా కలిస్తేనే ప్రభుత్వం’’ అంటూ సూత్రాలు చెబితే ఏమి లాభం. రేవంత్ ఒక్కసారి కాంగ్రెస్ మానిఫెస్టోని తిరిగి చదువుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని రకాల హామీలు ఇచ్చింది మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ చదివి వినిపించారు. వాటన్నిటిని ఏ బాధ్యతతో చేశారు? ఇప్పుడు వాటిని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అడిగితే ‘‘ఎవరిపై మీ సమరం?’’ అంటే వారేమి జవాబు ఇస్తారు! ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, తదితర వాగ్దానాలు చేశారా? లేదా? రేవంత్ తాను అన్ని నిజాలే చెప్పినట్లు అనుకోవచ్చు.కాని అది చెప్పిన తీరు బాగోలేదు. ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని అంతరంగికంగా చర్చలు జరిపి వారికి నచ్చ చెప్పి ఉండవచ్చు. ఫలానా సమయానికి తాను హామీలు అమలు చేయగలుగుతామని చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా ఇంత బహిరంగంగా వేరే కార్యక్రమంలో ఉద్యోగులను బెదిరించే రీతిలో మాట్లాడడం వల్ల ఆయనకే నష్టం. రేవంత్ తీరువల్ల రాష్ట్ర పరువు పోయిందని బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ముఖ్యమంత్రి పై మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ తాను నిజాలే మాట్లాడుతున్నానులే అనుకుని సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ సీఎంకు చేతకావడం లేదని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్లో కూడా దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి.కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెళతాయి. కుల గణన ద్వారా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయిందని ప్రచారం చేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ దివాళా తీసిందని చెప్పడం ద్వారా దేశానికి ఏమి సంకేతం ఇచ్చినట్లయింది? అసలే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో రేటింగ్ తగ్గుతోందని అనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డే దానిని మరింత తగ్గించుకున్నట్లుగా ఉంది. ఎన్నికలకు ముందు పొలిటికల్ సైన్స్, ఎన్నికల తర్వాత ఎకనామిక్స్ చెబితే జనం నమ్ముతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

జత్వానీ కేసు.. ఐపీఎస్ కాంతిరాణా, విశాల్ గున్నీకి ఊరట
సాక్షి, అమరావతి: సినీ నటి జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జత్వానీ వ్యవహారంలో కేసులను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పోలీసుల తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను జూన్ 30వ తేదీకి వాయిదా వేసింది. గత విచారణలో ఇలా..కొద్ది రోజుల క్రితం డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్ చేసినందుకే సినీనటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్కుమార్ దేశ్పాండే వివరించారు.జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ మరోసారి విచారణ జరిపారు. కాంతిరాణ టాటా తదితరుల తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్ కుమార్ దేశ్పాండే వాదనలు వినిపిస్తూ.. ‘పోలీసు అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానీని విచారించడమే తప్పు అన్నట్లుగా పిటిషనర్లపై కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దాఖలాలేవీ గతంలో లేవు.చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరిని నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానీకి తెలియదు. అలాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు?. జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్కు బెయిల్ మంజూరు చేసింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలి..’ అని కోర్టును కోరారు.అనంతరం సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ జత్వానీ విషయంలో పిటిషనర్లందరూ కుట్ర పూరితంగా వ్యవహరించారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.

IPL 2025: చరిత్ర సృష్టించిన ధోని
సీఎస్కే స్టాండ్ ఇన్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్యాష్ రిచ్ లీగ్లో 200 మందిని ఔట్ చేయడంలో భాగమైన తొలి వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. నిన్న (మే 7) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఓ క్యాచ్, ఓ స్టంపౌట్ చేసిన తర్వాత ధోని ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్లో సీఎస్కే, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీల తరఫున 276 మ్యాచ్లు ఆడిన ధోని 153 క్యాచ్లు, 47 స్టంపింగ్లు చేశాడు. ధోని తర్వాత దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్కీపర్గా ఉన్నాడు. డీకే.. ఢిల్లీ డేర్ డెవిల్స్, ఆర్సీబీ, కేకేఆర్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీల తరఫున 236 మ్యాచ్లు ఆడి 174 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ఇందులో 137 క్యాచ్లు, 37 స్టంపింగ్లు ఉన్నాయి. ధోని, డీకే తర్వాత అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లలో వృద్దిమాన్ సాహా, రిషబ్ పంత్, రాబిన్ ఉతప్ప తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లు..200 - MS ధోని (CSK/RPS) - 153 క్యాచ్లు, 47 స్టంపింగ్లు174 - దినేష్ కార్తీక్ (DD/RCB/KKR/GL/MI/KXIP) - 137 క్యాచ్లు, 37 స్టంపింగ్లు113 - వృద్ధిమాన్ సాహా (GT/SRH/PBKS/CSK/KKR) - 87 క్యాచ్లు, 26 స్టంపింగ్లు100 - రిషబ్ పంత్ (DC/LSG) - 76 క్యాచ్లు, 24 స్టంపింగ్లు90 - రాబిన్ ఉతప్ప (KKR/CSK/RR/MI/RCB/PWI) - 58 క్యాచ్లు, 32 స్టంపింగ్లుఓవరాల్గా కూడా ధోనిదే అగ్రస్థానంఓవరాల్గా చూసినా పొట్టి క్రికెట్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లలో ధోనినే మొదటి స్థానంలో ఉన్నాడు. యావత్ టీ20 ఫార్మాట్లో ధోని 316 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ధోని తర్వాత క్వింటన్ డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. డికాక్ తన టీ20 కెరీర్లో 307 డిస్మిసల్స్లో భాగమయ్యాడు.నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ధోని ఎట్టకేలకు కెప్టెన్గా రెండో విజయాన్ని సాధించాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో కేకేఆర్పై సీఎస్కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కేకు ఈ సీజన్ల ఇది మూడో గెలుపు. ఈ గెలుపు వల్ల సీఎస్కేకు ఒరిగింది ఏమీ లేనప్పటికీ.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మాత్రం దెబ్బకొట్టింది. ఈ ఓటమితో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ జట్టు ఇకపై ఆడాల్సిన రెండు మ్యాచ్ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కడం అనుమానమే. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 11 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. టాప్-5లో ఉన్న గుజరాత్ (16), ఆర్సీబీ (16), పంజాబ్ (15), ముంబై (14), ఢిల్లీ (13) కేకేఆర్ కంటే మెరుగైన పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ సీజన్లో సీఎస్కేతో పాటు సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ పోటీ నుంచి ఇదివరకే నిష్క్రమించాయి. లక్నో (10), కేకేఆర్ (11) కూడా నిష్క్రమణ అంచుల్లో ఉన్నాయి.నిన్నటి మ్యాచ్లో ధోని వికెట్కీపింగ్లోనే కాకుండా బ్యాటింగ్లోనూ రాణించి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కీపింగ్లో రఘువంశీ, నరైన్ను ఔట్ చేయడంలో భాగమైన ధోని.. ఛేదనలో కీలక సమయంలో సిక్సర్ కొట్టి తన జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ ఇన్నింగ్స్లో ధోని ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి, చివరి దాకా క్రీజ్లో నిలబడ్డాడు. ఫలితంగా సీఎస్కే సీజన్లో మూడో విజయం నమోదు చేసింది.

పాకిస్తాన్ లాహోర్లో పేలుళ్లు.. పరుగు తీసిన ప్రజలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని లాహోర్లో పేలుడు ఘటన చోటుచేసుకుంది. లాహోర్లోని వాల్టన్ విమానాశ్రయం సమీపంలోని లాహోర్లోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాలలో వరుసగా బాంబు పేలుడు ఘటన సంభవించింది. ఎయిర్పోర్టు వద్ద గురువారం ఉదయం ఒక్కసారిగా సైరన్లు మోగడంతో ఇళ్ల నుంచి పాక్ ప్రజలు బయటకు పరుగులు తీశారు.అయితే, డ్రోన్ కారణంగానే పేలుడు సంభవించినట్లు పాక్ పోలీసులు చెబుతున్నారు. 5-6 అడుగుల పొడవున్న డ్రోన్ పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రోన్ వ్యవస్థను జామ్ చేయడం ద్వారా కూల్చివేసినట్లు చెప్పుకొచ్చారు. వరుస బాంబు పేలుడు ఘటనలతో పాకిస్తాన్లోని కరాచీ, ఇస్లామాబాద్ సహా పలు విమనాశ్రయాలను అధికారులు మూసివేశారు. ఇక, భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన మరుసటి రోజే పేలుళ్లు సంభవించడం గమనార్హం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ బాంబు పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.Panic in Lahore after blast near laWhore airport pic.twitter.com/zsQNyoE4hx— Team Jhaat Official (@TeamJhaant__) May 8, 2025 Utter chaos in Lahore after drone strike at Walton Road which leads to Lahore cantonment. People out on streets in panic. Asim Munir's Jihadist policies have invited war to Pakistan's streets. pic.twitter.com/1195BQxlhf— Divya Kumar Soti (@DivyaSoti) May 8, 2025Something hit Naval college besides #Askari 5. Sirens are #lahore One 1x Drone intercept in #Walton road.#IndiaPakistanWar#Pakistan#PakistanZindabadpic.twitter.com/XN8HkYsi4S— Muhammad Asif (Parody) (@MuhammadAsif26_) May 8, 2025

తిరుమల ఆలయంపై విమానం చక్కర్లు.. దాడుల వేళ అలర్ట్!
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టిన తీవ్ర కలకలం రేపింది. ఆగమశాస్ర్త నిబంధనలు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల చర్యల కారణంగా తిరుమలకు ముప్పు పొంచి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఆగమశాస్ర్త నిబంధనలు విరుద్దంగా తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఆలయంపై నుండి విమానం వెళ్లింది. విమానం వెళ్లడాన్ని చూసి తిరుమలలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్గా ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరిన ఫలితం మాత్రం శూన్యం. కాగా.. నేడు విమానం చక్కర్లపై టీటీడీ భద్రత అధికారులు ఆరా తీస్తున్నారు.మరోవైపు.. దేశంలో ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో తిరుమలకు ప్రమాదం ముప్పు పొంచి ఉంది. అంతకుముందు, జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో దాడి తర్వాత తిరుమలలో హైఅలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తిరుమలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తుల వాహనాలను తనిఖీలు చేశారు.

భారత్-పాక్ యుద్ధం.. బిగ్ ట్విస్ట్ ఇస్తూ ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడుల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం ఆపేయాలని కోరారు. అలాగే, ఇరు దేశాలు సాయం కోరితే తాను అందుబాటులో ఉంటానని ట్రంప్ వెల్లడించారు.ఆపరేషన్ సిందూర్ నేపథ్యం భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు దేశాధినేతలు, రాయబారులు దాడుల ఘటనపై స్పందించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్, పాక్లను కోరారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం మరోసారి స్పందించారు.ఓవల్ ఆఫీస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్, పాక్ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. దాడులు చేయడం అవమానకరం. రెండు దేశాల గురించి నాకు చాలా తెలుసు. ఎప్పటి నుంచో వారి మధ్య వైరం ఉంది. అయితే, రెండు దేశాలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, వాటిని ఆపేయాలని కోరుకుంటున్నాను. వారు అనుకుంటే ఇప్పుడే ఇది చేయగలరు. రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వాయి. అమెరికాతో భారత్, పాక్కు మంచి సంబంధాల దృష్ట్యా వారికి సహాయం చేయాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటాను. ఏ సహాయమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.U.S. President Donald Trump has condemned India's attack, calling it shamefulPakistan Zindabad!#Pakistan #PakistanismyRedLine #donaldjtrump #PakistanZindabad #IndiaPakistanWar pic.twitter.com/iDl8SwVeLH— Anmol Sheraz (@iamanmolsheraz) May 6, 2025 చైనాకు భారత్ వార్నింగ్మరోవైపు.. ఆపరేషన్ సిందూర్పై విషం గక్కే ప్రయత్నం చేసిన పొరుగు దేశం చైనా భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్కు చెందిన మూడు విమానాలను పాక్ కూల్చేసిదంటూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసిన కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు రాయడం మానుకోవాలని హెచ్చరించింది.

ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించే లక్ష్యంతో ప్రముఖ ఆడిటింగ్ సంస్థ ప్రైస్వాటర్హౌజ్కూపర్స్(పీడబ్ల్యూసీ) 1,500 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ తాజా నిర్ణయంతో యూఎస్ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ ఉద్యోగుల తొలగింపు దాని మొత్తం సిబ్బందిలో 2 శాతంగా ఉంది. ఆడిట్, ట్యాక్స్ విభాగాలకు చెందిన బాధిత ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ మీటింగ్ ద్వారా లేఆఫ్స్ సమాచారం అందించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.తొలగింపునకు కారణాలుప్రస్తుత వ్యాపార డిమాండ్లకు అనుగుణంగా కంపెనీ తన శ్రామిక శక్తిని సమీకరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించే లక్ష్యంతో ఆలోచనాత్మకంగానే ఈ చర్య తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఆర్థిక అనిశ్చితి, మారుతున్న ఖాతాదారుల డిమాండ్లు, పునర్నిర్మాణ ప్రయత్నాలు వంటి అంశాలను హైలైట్ చేస్తూ డెలాయిట్, కేపీఎంజీ వంటి సంస్థలు కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, మార్కెట్ తీరుకు అనుగుణంగా సంస్థలు మారుతున్నాయి.ఇదీ చదవండి: దేశంలో వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఎంతంటే..సవాళ్లుతొలగింపులతో ప్రభావితమైన ఉద్యోగులు తిరిగి కొలువు సాంపాదించాలంటే సవాళ్లను ఎదుర్కోకతప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అకౌంటింగ్, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ రంగంలో ఉపాధి అవకాశాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలు అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. పెరిగిన ఆటోమేషన్, వ్యాపార వ్యూహాలతో ఆడిట్, ట్యాకేషన్ నిపుణులు డేటా అనలిటిక్స్, అడ్వైజరీ సర్వీసులు లేదా ప్రత్యేక ఫైనాన్స్ రంగాల్లో కొత్త అవకాశాలకు అనుగుణంగా మారవలసి ఉంటుంది.

‘సింగిల్’కాల్లో అతనికి ‘శుభం’ చెప్పేశా: సమంత పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ సమంత(samantha) నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవీస్ పిక్చర్స్లో నిర్మించిన తొలి సినిమా ‘శుభం’(subham movie) మే 9న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సమంత ఫోకస్ అంతా ఈ సినిమాపైనే పెట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్ని తన భుజాన వేసుకొని ముందుకు సాగుతోంది. వరుస ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాలతో ఫుల్ బిజీ అయిపోయింది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్కి తన స్నేహితులను కూడా వాడుకుంటుంది. తాజా వెన్నెల కిశోర్తో కలిసి ఓ ఫన్ వీడియో కూడా చేసింది. ఈ వీడియోలో సమంత ‘ నా శుభం మూవీ ప్రీమియర్స్కి రావట్లేదా’ అని అడుగుతుంది. వెన్నెల కిశోర్ ఏమో తన నటించిన ‘సింగిల్’(#single) మూవీ కూడా అదే రోజు(మే 9) రాబోతుందని చెప్పాలనుకుంటాడు. కానీ సమంత అతన్ని మాట్లాడనీయకుండా.. ‘నువ్వు, నీ ఫ్యామిలీ తప్పకుండా వస్తారు కదా? నేను నిర్మించిన ఫస్ట్ మూవీ ఇది తప్పుకుండా రావాలి’ అంటూ గబగబా మాట్లాడేస్తుంది. చివరికి నువ్వు కచ్చితంగా వస్తున్నావు అని కట్ చేసేస్తది. ఈ వీడియోని సమంత తన ఇన్స్టాలో షేర్ చేస్తూ.. సింగిల్ ఫోన్ కాల్లో వెన్నెల కిశోర్కి శుభం చెప్పేశా.. మే 9న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

అది భారత సోషల్ మీడియా.. పాక్ మంత్రి వింత సమాధానం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) విజయవంతమైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత దళాలు మెరుపు దాడులు చేశాయి. ఇందుకు తామూ సమర్థవంతంగా ప్రతిఘటించామంటూ పాకిస్తాన్ ప్రకటించుకుంది. రాఫెల్స్ సహా ఐదు భారత యుద్ధ విమానాలను తమ బలగాలు కూల్చివేశాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసింది. అయితే దీనిపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు.భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్ బలగాలు కూల్చివేశాయంటూ సోషల్ మీడియాలో చేసిన ఫేక్ ప్రచారాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ తన వాదనను నిరూపించడానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో విలేకరి అడిగ్గా ఆసిఫ్ వింత సమాధానం ఇచ్చాడు. ‘అదంతా ఇండియన్ సోషల్ మీడియాలోనే తప్ప మన సోషల్ మీడియాలో కాదు. జెట్ విమానాల శిథిలాలు వారి వైపు పడ్డాయి. ఇదంతా భారత మీడియాలోనే ఉంది' అని వింతగా బదులిచ్చారు.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు ప్రతిగా తామూ రెండు రాఫెల్ జెట్లు, ఒక సు-30తో సహా మూడు భారత వైమానిక దళ (IAF) యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. అయితే, ఈ వాదనలను భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. కార్యకలాపాల సమయంలో ఐఏఎఫ్ విమానాలు ఏవీ కోల్పోలేదని పేర్కొంది. ఇదంతా ఫేక్ ప్రచారమని తెలిపింది.పాకిస్తాన్ చేస్తున్నది ఫేక్ ప్రచారమని భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ నివేదించింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా బహవల్ పూర్ సమీపంలో భారత రాఫెల్ జెట్ ను పాకిస్థాన్ కూల్చివేసిందంటూ సోషల్ మీడియా షేర్ చేసిన ఫొటో 2021లో జరిగిన ప్రమాదానికి సంబంధించినదని తెలిపింది.
వరుణ్ చక్రవర్తి ఖాతాలో భారీ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్!
OTT: ఒకరోజు వ్యవధిలోనే 4 ట్రెండింగ్ సినిమాలు
ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు.. డిప్రెషన్లోకి వెళ్లా: శ్రిధి శెట్టి
'అస్సలు ఇది ఊహించలేదు చాలా గర్వంగా ఉంది'..! సోఫియా తండ్రి భావోద్వేగం
Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!
మాపై దాడి చేస్తే ప్రపంచంలో ఎవరు మిగలరు- పాక్ రక్షణ మంత్రి ఖవాజా
గూగుల్ 200 ఉద్యోగాల్లో కోత!
IPL 2025: చరిత్ర సృష్టించిన ధోని
ఎమ్మెల్యేకే రూమ్ ఇవ్వరా.. నీకెంత ధైర్యంరా..?
చూడటానికి మొక్కజొన్న పంట.. కానీ దగ్గరకెళ్తే షాకవ్వుతారు!
సారీ సార్! యుద్ధమొస్తే నేనూ వెళ్లిపోతా...
కుమారుడి ధోతి వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి మంజుల (ఫొటోలు)
భారత్ మాపై దాడి చేసేది అప్పుడే.. పాక్ మాజీ దౌత్వవేత్త సంచలన ట్వీట్!
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. శుభవార్తలు వింటారు
మొదట్నుంచి మీరే ఏదో రకంగా విదేశీయులకు హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూపిస్తున్నారుగా సార్!!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. సంఘంలో గౌరవమర్యాదలు
గోదావరి ప్రజల ఆరాధ్య దైవం.. శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం (ఫొటోలు)
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్
ఉగ్రబుద్ధిపై వక్రభాష్యం!
ఫ్లాష్ ఫ్లాష్: పాక్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..30 మంది ఉగ్రవాదుల హతం
#MetGala2025 : చరిత్ర సృష్టించిన కియారా.. మొదటిసారి బేబీ బంప్తో ఇలా! (ఫొటోలు)
ఆపరేషన్ సిందూర్ అప్డేట్స్.. రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం
భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్.. కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?
నేడు ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల
యుద్ధానికి సిద్ధం!.. నేడు కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష
భారత్ దాడులు.. పాక్ ప్రధాని రియాక్షన్ ఇదే..
IPL 2025: చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషబ్ పంత్
మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!
త్వరలో నా డ్రీమ్ ప్రాజెక్ట్తో తిరిగొస్తా: కార్తీక్ సుబ్బరాజ్
వరుణ్ చక్రవర్తి ఖాతాలో భారీ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్!
OTT: ఒకరోజు వ్యవధిలోనే 4 ట్రెండింగ్ సినిమాలు
ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు.. డిప్రెషన్లోకి వెళ్లా: శ్రిధి శెట్టి
'అస్సలు ఇది ఊహించలేదు చాలా గర్వంగా ఉంది'..! సోఫియా తండ్రి భావోద్వేగం
Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!
మాపై దాడి చేస్తే ప్రపంచంలో ఎవరు మిగలరు- పాక్ రక్షణ మంత్రి ఖవాజా
గూగుల్ 200 ఉద్యోగాల్లో కోత!
IPL 2025: చరిత్ర సృష్టించిన ధోని
ఎమ్మెల్యేకే రూమ్ ఇవ్వరా.. నీకెంత ధైర్యంరా..?
సినిమా

ఆరుగురి ప్రయాణమే ఈ సినిమా
‘‘తెలుగులో ‘సమరం’, కన్నడంలో ఓ సినిమా చేశాను. నా మూడో సినిమా ‘6 జర్నీ’. ఆరుగురి జీవిత ప్రయాణమే ఈ చిత్రం. గోవా ట్రిప్ను ఎంజాయ్ చేసి, ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఓ బ్యాచ్ కథే ‘6 జర్నీ’’ అని డైరెక్టర్ బషీర్ ఆలూరి అన్నారు. రవిప్రకాశ్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘6 జర్నీ’. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో పాల్యం రవిప్రకాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు బషీర్ ఆలూరి మాట్లాడుతూ– ‘‘టెర్రరిజం, దేశభక్తి వంటి అంశాలు మా ‘6 జర్నీ’లో ఉంటాయి. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? యువత ఎలా ΄ోరాడాలి? అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా క్లైమాక్స్ను తెరకెక్కించాను. మంచి కథాంశంతో తీసిన ‘6 జర్నీ’ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ముంబై నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నాను. అక్టోబర్లో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు.

ట్రైలర్ చూశాక ఈర్ష్య కలిగింది
‘‘రాజ్గారు ‘23’ సినిమా చేయమని నా దగ్గరికి వచ్చారు. వేరే ప్రాజెక్ట్స్ వల్ల చేయడం కుదరలేదు. ఈ కథ నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా... గొప్ప సినిమా ఇది. రాజుగారు లాంటి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఉండడం తెలుగు సినిమా అదృష్టంగా భావిస్తున్నా. ఈ చిత్రం ట్రైలర్ చూశాక నేను చేసుంటే బాగుండేదనే చిన్న ఈర‡్ష్య కలిగింది. ఇలాంటి సినిమాని తప్పకుండా ప్రేక్షకులు చూడాలి’’ అని హీరో ప్రియదర్శి కోరారు. తేజ, తన్మయి ప్రధాన పాత్రల్లో ‘మల్లేశం’ మూవీ ఫేమ్ రాజ్ ఆర్. దర్శకత్వం వహించిన చిత్రం ‘23’. స్టూడియో 99పై రూపొందిన ఈ చిత్రానికి వెంకట్ సిద్ధారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాని స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. ఈ నెల 16న ఈ చిత్రం రిలీజ్ కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ‘23’ ట్రైలర్ విడుదల వేడుకకి ప్రియదర్శి, పాటల రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చంద్రబోస్ మాట్లాడుతూ– ‘‘రాజ్గారు నిజాయితీ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాలో మూడు మంచి పాటలు రాసే అవకాశం దొరికింది. ‘మల్లేశం’ ప్రియదర్శికి నటుడిగా ఎలా జన్మనిచ్చిందో అలా ‘23’ నటీనటులందరికీ కొత్త జన్మ ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చిన్న సినిమాల్లో మాది చాలా పెద్ద సినిమా. థియేటర్స్లోనే చూడండి. అప్పుడే థియేటర్స్ సంస్కృతి బాగుంటుంది. మా ‘23’లాంటి సినిమాలను ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలని వినతి చేశాను’’ అని రాజ్ రాచకొండ తెలిపారు. ఈ వేడుకలో నటీనటులు తన్మయి, తేజ, పవన్ రమేశ్, ప్రణీత్ మాట్లాడారు.

వెండితెరపైకి అహల్యా బాయి హోల్కర్ జీవితం
మరాఠీ రాణి, ధీర వనిత అహల్యా బాయి హోల్కర్ జీవితం వెండితెరపైకి రానుంది. అహల్యా బాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు ఆమె జన్మస్థలం జామ్ఖేడ్ తహసీల్లో జరిగాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆమె బయోపిక్ను అధికారికంగా ప్రకటించారు. ‘‘మరాఠీతో పాటు ఇతర భాషల్లోనూ ఈ బయోపిక్ రూపొందనుంది. మహారాష్ట్ర ఫిల్మ్, థియేటర్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గుర్గావ్ ఫిల్మ్ సిటీ ఈ బయోపిక్ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తాయి’’ అని తెలిపారు దేవేంద్ర ఫడ్నవీస్. ప్రభుత్వం తరఫున ఈ సినిమాని నిర్మించనున్నారు కాబట్టి ఆయన స్వయంగా ప్రకటించారు. ఇక 1725 మే 31న అహల్యా బాయి హోల్కర్ జన్మించారు. భర్త ఖండేరావు హోల్కర్, మామ మల్హర్ రావు హోల్కర్ మరణించిన తర్వాత మాల్యా రాజ్యపు రాణిగా ఆమె సింహాసనాన్ని అధిష్టించారు. ఆ కాలంలో జరిగిన యుద్ధాల్లో సైన్యానికి నాయకత్వం వహించారు. దోపిడీ దారులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అంతేకాదు... ఎన్నో హిందూ దేవాలయాలు, ధర్మశాలలను నిర్మించి పేరు, ప్రఖ్యాతులు గడించారామె.

రూ.10 కోట్లు దానం చేసిన హీరో సూర్య
తమిళ హీరో సూర్య మంచి మనసు చాటుకున్నాడు. గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన హిట్ పడట్లేదు. రీసెంట్ గా రెట్రో మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తెలుగులో తేలిపోయింది గానీ తమిళంలో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పుడు తన చిత్రానికి వచ్చిన లాభాల నుంచి ఏకంగా రూ.10 కోట్లని సూర్య దానం చేశాడు. (ఇదీ చదవండి: సడన్ సర్ ప్రైజ్.. ఓటీటీలోకి తమన్నా 'ఓదెల 2') రెట్రో సినిమాలో సూర్య హీరోగా నటించాడు. ఇతడికి చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. తాజాగా రూ.104 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే లాభాలు రావడంతో హీరో కమ్ నిర్మాత అయిన సూర్య ఫుల్ హ్యాపీ అయిపోయాడు. తనకు చెందిన అగరం ఫౌండేషన్ కి రూ.10 కోట్లు దానం చేశాడు. ఈ మేరకు నిర్వహకులకు చెక్ అందజేశాడు.2006లో అగరం ఫౌండేషన్ ని సూర్యనే స్థాపించాడు. తమిళనాడులో చదివించే స్థోమత లేని చాలామంది పిల్లలని చదివించడమే ఈ సంస్థ ఉద్దేశం. ఇప్పటికే చాలామంది అగరం ద్వారా చదువుకుని ప్రయోజకులు అయ్యారు.(ఇదీ చదవండి: 'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత)
న్యూస్ పాడ్కాస్ట్

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం
క్రీడలు

పో.. పో!.. వరుణ్ చక్రవర్తికి షాకిచ్చిన బీసీసీఐ
కోల్కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy)కి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో మ్యాచ్లో అనుచిత ప్రవర్తనకు గానూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడికి మొట్టికాయలు వేసింది. మ్యాచ్ ఫీజులో ఇరవై ఐదు శాతం మేర కోత విధించింది.అంతేకాదు.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ వరుణ్ చక్రవర్తి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. ఐపీఎల్-2025లో భాగంగా కేకేఆర్ బుధవారం చెన్నైతో తలపడిన విషయం తెలిసిందే.రహానే రాణించినాసొంత మైదానం ఈడెన్ గార్డెన్స్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (11) విఫలం కాగా.. సునిల్ నరైన్ (26) ఫర్వాలేదనిపించాడు.వన్డౌన్లో వచ్చిన అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ (48) ఆడగా.. మనీశ్ పాండే (36 నాటౌట్), ఆండ్రీ రసెల్ (38) కూడా రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగలిగింది.చెన్నై బౌలర్లలో స్పిన్నర్లు నూర్ అహ్మద్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. పేసర్ అన్షుల్ కాంబోజ్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడుఇక కేకేఆర్ విధించే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై ఆదిలోనే ఓపెనర్లు ఆయుశ్ మాత్రే, డెవాన్ కాన్వే డకౌట్ కావడంతో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ 31 పరుగులతో రాణించగా.. ఆరో స్థానంలో వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ దంచికొట్టాడు.కేవలం 25 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసిన బ్రెవిస్.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. అయితే, హాఫ్ సెంచరీతో జోరు మీదున్న ఈ సౌతాఫ్రికా చిచ్చర పిడుగును కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పెవిలియన్కు పంపాడు.వరుణ్ రౌండ్ ది వికెట్ బౌల్ చేయగా.. బ్రెవిస్ ముందుకు వచ్చి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో లాంగాన్ మీదుగా వెళ్లిన బంతి రింకూ సింగ్ చేతిలో పడటంతో.. బ్రెవిస్ ఇన్నింగ్స్కు తెరపడింది. అత్యంత కీలకమైన ఈ వికెట్ తీసిన తర్వాత వరుణ్ చక్రవర్తి..‘‘ పో.. పో’’ అంటూ వేలు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.pic.twitter.com/vhf3iwOR8o— Knight Vibe Media (@Kkrmediareels) May 7, 2025 డీమెరిట్ పాయింట్ కూడా ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి వరున్ చక్రవర్తికి జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం వరుణ్ చక్రవర్తి లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడని.. అందుకే అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు డీమెరిట్ పాయింట్ కూడా జతచేసింది.ఇక బ్రెవిస్ విధ్వసంతో గెలుపు దిశగా వచ్చిన చెన్నై.. శివం దూబే (45), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(17 నాటౌట్) కారణంగా విజయతీరాలకు చేరింది. కేకేఆర్పై రెండు వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్లో మూడో గెలుపు నమోదు చేసింది. మరోవైపు.. ఈ విజయంతో చెన్నైకి వరుస ఓటముల తర్వాత ఊరట లభించగా.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.చదవండి: అతడికి థాంక్యూ.. అద్భుతంగా ఆడాడు.. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాతే..: ధోనిElation for the men in yellow 🥳@ChennaiIPL make it 1⃣-1⃣ against #KKR in the season with a 2⃣ wicket win at Eden Gardens💛 Updates ▶ https://t.co/ydH0hsBFgS #TATAIPL | #KKRvCSK pic.twitter.com/6MTmj6NPMH— IndianPremierLeague (@IPL) May 7, 2025

Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) నేపథ్యంలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) సోషల్ మీడియాలో స్పందించిన తీరు వైరల్ అవుతోంది. ఈ దేశ ఐక్యతకు ఇదే సరైన నిదర్శనం అంటూ ఆమె పంచుకున్న ఫొటో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. కాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ముష్కరులకు మెరుపు దాడులతో మన సైన్యం సమాధానమిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని దాదాపు తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసింది. తద్వారా ఉగ్రవాదాన్ని సహించేది లేదని మరోసారి భారత్ స్పష్టమైన సందేశాన్ని దాయాదికి అందించింది.పేరు సరిగ్గా సరిపోయిందంటూఇక ఈ ఆపరేషన్కు సిందూర్ అనే పేరు సరిగ్గా సరిపోయిందంటూ బాధిత కుటుంబాలతో పాటు యావత్ భారతావని ప్రశంసిస్తోంది. అమాయకపు ఆడపడుచుల నుదిటి సిందూరం చెరిగేపోయేలా పాశవిక దాడికి తెగబడిని ఉగ్రవాదులకు ‘రక్త సిందూరం’తో సమాధానమిచ్చారని.. ఇది సరైన నివాళి అని ఉద్వేగానికి లోనవుతున్నారు.మహిళా శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగాఅదే విధంగా.. ఈ ఆపరేషన్కు సంబంధించిన ప్రెస్మీట్లో మిలిటరీ బ్రీఫింగ్కు ఇద్దరూ మహిళా సైనికాధికారులు నాయకత్వం వహించడం కూడా జాతి హృదయాలు ఉప్పొంగేలా చేసింది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్... భారత దేశపు మహిళా శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగా తాము చేపట్టిన ఆపరేషన్ గురించి వివరిస్తూ ఉంటే భారతీయల గుండెలు గర్వంతో నిండిపోయాయి.ఈ ఒక్క ఫొటో చాలువాళ్లిద్దరు అలా చెరోవైపు ప్రెస్ మీట్లో కూర్చుని ఐక్యతకు ప్రతీకలా నిలిచిన తీరు నిజమైన దేశభక్తుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఈ దృశ్యాన్ని ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘‘ఈ శక్తివంతమైన ఫొటో.. మనమంతా ఒక్కటే జాతి అనేందుకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది’’ అని సానియా మీర్జా పేర్కొన్నారు.మరోవైపు.. సరిహద్దుల్లో తీవ్రవాదులను తుదముట్టించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై క్రీడాలోకం హర్షం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పలువురు క్రీడాకారులు స్పందిస్తూ మన దేశ ఘనతను కీర్తించారు. ఏకత్వంలో నిర్భీతిఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ‘ఏకత్వంలో నిర్భీతి. ఎల్లలెరుగని బలం. మన ప్రజలే మన దేశానికి బలం. మనమంతా ఒక్కటే. ప్రపంచంలో తీవ్రవాదానికి చోటు లేదు. జైహింద్’ అంటూ వ్యాఖ్యానించాడు. పేసర్ షమీ, మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, రైనా, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్ కూడా ఇదే తరహాలో స్పందించారు.‘మీపై ఎవరైనా రాళ్లు విసిరితే మీరు పూలు విసరండి. అయితే అది పూలకుండీతో సహా విసరండి’ అని సెహ్వాగ్ ట్వీట్ చేయగా, ‘ప్రతికూల పరిస్థితులను కూడా భారత సైన్యం తమకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధించింది. ప్రమాదకర సమయంలో వారి ధైర్యాన్ని చూసి గర్విస్తున్నాం’ అని షమీ స్పందించాడు.బాక్సింగ్లో ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ ‘భారత్ మాతాకీ జై’ అని ట్వీట్ చేయగా... పఠాన్, సైనా నెహ్వాల్ ‘జైహింద్’ అంటూ మద్దతు పలికారు. ‘మన సైనికులు కేవలం భయపెట్టడంతో ఆగిపోరు. వారు ఏదైనా చేసి చూపిస్తారు’ అని బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. మన సైనికుల భద్రత గురించి తాను ప్రార్థన చేస్తున్నట్లు ఒలింపియన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వెల్లడించింది.చదవండి: సరైన సమాధానం.. సాక్ష్యం కనబడుతోందా?.. ఆపరేషన్ సిందూర్పై స్పందనలు

అతడికి థాంక్యూ.. అద్భుతంగా ఆడాడు.. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాతే..: ధోని
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఒక్క విజయం.. ఒకే ఒక్క విజయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఊరట కలిగించింది. వరుస పరాజయాలు, పరాభవాల తర్వాత బుధవారం నాటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR)పై గెలిచింది. తద్వారా ఈ సీజన్లో ఎట్టకేలకు మూడో గెలుపు నమోదు చేసింది. ఏదీ కలిసిరాలేదుఈ నేపథ్యంలో కేకేఆర్పై విజయానంతరం సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ సీజన్లో మేము కొన్ని మ్యాచ్లో మాత్రమే గెలిచాం. ఇది మాకు మూడో విజయం. ఏదేమైనా గెలవడం సంతోషంగానే ఉంటుంది కదా!అయితే, ఈ ఏడాది మాకూ ఏదీ కలిసిరాలేదు. ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మా జట్టులో 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ల సేవలను ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపైనే ప్రస్తుతం నా దృష్టి కేంద్రీకృతమై ఉంది.వచ్చే ఏడాదైనా సరైన సమాధానం లభిస్తుందని భావిస్తున్నాం. ఏ బ్యాటర్ను ఏ స్థానంలో పంపాలి.. ఎవరైతే పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేస్తున్నారన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’’ అని ధోని పేర్కొన్నాడు.అతడికి కృతజ్ఞతలుఅదే విధంగా.. ‘‘ఈ మ్యాచ్లో గెలుపునకు బ్రెవిస్ కారణం. అందుకు అతడికి కృతజ్ఞతలు. అతడి వల్లే ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగాను. చక్కటి షాట్లతో బ్రెవిస్ అలరించాడు. అతడు బాదిన రెండు సిక్సర్ల వల్ల మాపై ఒత్తిడి తగ్గి విజయం దిశగా పయనం సాధ్యమైంది’’ అని ధోని సౌతాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ను ప్రశంసించాడు.అప్పుడే రిటైర్మెంట్ఇక తన ఐపీఎల్ భవితవ్యం గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాకిప్పుడు 43 ఏళ్లు. ఇప్పటికి చాలా ఏళ్లుగా నేను క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. అయితే, ఈ లీగ్లో నా చివరి సంవత్సరం ఏది అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేను.నిజానికి ఏడాదిలో కేవలం రెండు నెలలు మాత్రమే ఇక్కడ క్రికెట్ ఆడతాం. ఒక్కసారి ఐపీఎల్ ముగిసిపోతే మరో 6-8 నెలలు నాకు విశ్రాంతి దొరుకుతుంది. నా శరీరం ఎంత వరకు ఒత్తిడిని తట్టుకుందనే అంశం మీదే అంతా ఆధారపడి ఉంది. ఇప్పటికైతే రిటైర్మెంట్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకుల నుంచి లభించే ప్రేమ, ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అని ధోని పేర్కొన్నాడు.బ్రెవిస్ విధ్వంసం కాగా ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్తో మ్యాచ్లో టాస్ ఓడిన చెన్నై తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన రహానే సేన 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లో నూర్ అహ్మద్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో చెన్నైకి ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే, డెవాన్ కాన్వే డకౌట్ అయ్యారు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ఉర్విల్ పటేల్ 31 పరుగులతోరాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 52) అద్బుత అర్ధ శతకంతో చెలరేగాడు.ఆఖర్లో శివం దూబే (45), ధోని (17 నాటౌట్) రాణించడంతో.. చెన్నై 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ సీజన్లో ఇప్పటికి 12 మ్యాచ్లు ఆడిన చెన్నైకి ఇది మూడో గెలుపు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ధోని సేన అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.ఐపీఎల్-2025: కోల్కతా వర్సెస్ చెన్నై👉వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్కతా👉టాస్: కోల్కతా.. తొలుత బ్యాటింగ్👉కోల్కతా స్కోరు: 179/6 (20)👉చెన్నై స్కోరు: 183/8 (19.4)👉ఫలితం: రెండు వికెట్ల తేడాతో కోల్కతాపై చెన్నై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నూర్ అహ్మద్ (చెన్నై స్పిన్నర్- 4/31).Last over maximums 🤝 MS Dhoni A never ending story 💛Updates ▶ https://t.co/ydH0hsBFgS #TATAIPL | #KKRvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/fyQcVOIusT— IndianPremierLeague (@IPL) May 7, 2025

రెండు స్వర్ణాలపై భారత్ గురి
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత్కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం జరిగిన కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఫలితంగా భారత్ ఖాతాలో కనీసం రెండు స్వర్ణాలు లేదా రెండు రజతాలు చేరనున్నాయి. వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర)లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు... అభిõÙక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ్ దేవ్తలేలతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. మరోవైపు మెక్సికో పురుషుల, మహిళల జట్లు కూడా ఫైనల్లోకి అడుగు పెట్టాయి. శనివారం భారత్, మెక్సికో జట్లు రెండు స్వర్ణాల కోసం పోటీపడతాయి. క్వాలిఫయింగ్లో అగ్రస్థానంలో నిలిచినందుకు... భారత జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్కు ‘బై’ లభించింది. క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు 232–229 పాయింట్ల తేడాతో అదెల్ జెక్సెన్బినోవా, విక్టోరియా లియాన్, రొక్సానా యునోసోవాలతో కూడిన కజకిస్తాన్ జట్టును ఓడించింది. సెమీఫైనల్లో భారత జట్టు 232–230 పాయింట్లతో ఎల్లా గిబ్సన్, ఇసబెల్లా కార్పెంటర్, లేలా అనిసన్లతో కూడిన బ్రిటన్ జట్టుపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో భారత పురుషుల జట్టు 239–232 పాయింట్ల తేడాతో అజయ్ స్కాట్, ఆడమ్ కార్పెంటర్, ల్యూక్ డేవిస్లతో కూడిన బ్రిటన్ జట్టుపై నెగ్గింది. సెమీఫైనల్లో భారత బృందం 232–231 పాయింట్ల తేడాతో మథియాస్ ఫులర్టన్, మారి్టన్ డామ్స్బో, నిక్లాస్ బ్రెడాల్లతో కూడిన డెన్మార్క్ జట్టును ఓడించింది. తొమ్మిదో స్థానంలో ధీరజ్ బుధవారం జరిగిన రికర్వ్ విభాగం పురుషుల క్వాలిఫయింగ్లో భారత ఆర్చర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. పారిస్ ఒలింపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 677 పాయింట్లు స్కోరు చేసి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 666 పాయింట్లతో తరుణ్దీప్ రాయ్ 28వ స్థానంలో, 652 పాయింట్లతో అతాను దాస్ 57వ స్థానంలో, 651 పాయింట్లతో పార్థ్ సాలుంఖే 60వ స్థానంలో నిలిచారు. ఓవరాల్గా 1995 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచిన భారత్కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది.రికర్వ్ విభాగం మహిళల క్వాలిఫయింగ్లో భారత స్టార్ దీపిక కుమారి 655 పాయింట్లు సాధించి 12వ స్థానాన్ని దక్కించుకుంది. 652 పాయింట్లతో అంకిత 17వ స్థానంలో, 642 పాయింట్లతో అన్షిక 29వ స్థానంలో, 637 పాయింట్లతో సిమ్రన్జిత్ కౌర్ 39వ స్థానంలో నిలిచారు. ఓవరాల్గా 1949 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో నిలిచిన భారత్కు తొలి రౌండ్లో ‘బై’ దక్కింది.
బిజినెస్

బ్రిటన్ ఎఫ్టీఏతో వస్త్ర పరిశ్రమకు బూస్ట్..
న్యూఢిల్లీ: బ్రిటన్తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో (ఎఫ్టీఏ) కారి్మక శక్తి ఎక్కువగా ఉండే వ్రస్తాలు, లెదర్ తదితర దేశీ పరిశ్రమలకు తోడ్పాటు లభిస్తుందని ఎగుమతిదారులు ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటీష్ మార్కెట్లో బంగ్లాదేశ్, వియత్నాంలాంటి దేశాలతో మనం కూడా పోటీపడేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఈ ఎఫ్టీఏతో చాలా మటుకు భారతీయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గడమో లేదా పూర్తిగా తొలగించడమో జరుగుతుంది కాబట్టి మనకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. నియంత్రణ ప్రక్రియలను క్రమబదీ్ధకరించడంతో బ్రిటన్లో జనరిక్ ఔషధాలకు అనుమతులు వేగవంతం కాగలవని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. చేనేతకారులు, తయారీదారులు, ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు లభిస్తాయని, వాణిజ్య అవరోధాలు తొలగిపోతాయని, ప్రీమియం మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అపారెల్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) వైస్ చైర్మన్ ఎ. శక్తివేల్ వివరించారు. అంతర్జాతీయ వ్యవస్థకు భారత్ను మరింతగా అనుసంధానం చేసేందుకు, విశ్వసనీయ తయారీ భాగస్వామిగా అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని పటిష్టం చేసేందుకు ఇలాంటి ఒప్పందాలు కీలకమని రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా తెలిపారు.

బంగారం మళ్లీ లక్ష పైకి
న్యూఢిల్లీ: పసిడి మరోసారి రూ.లక్ష మార్క్పైకి చేరింది. ఇటీవలే మొదటిసారి రూ.లక్ష దాటిన తర్వాత అమ్మకాల ఒత్తిడితో పుత్తడి ఆ స్థాయిని కోల్పోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో బంగారానికి మళ్లీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా 99.9 శాతం స్వచ్ఛత బంగారం బుధవారం ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 పెరిగి రూ.1,00,750 స్థాయిని చేరుకుంది. పాకిస్తాన్–భారత్ మధ్య ఉద్రిక్తతలతో కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,050 పెరిగి రూ.1,00,350 స్థాయికి చేరింది. ఏప్రిల్ 22న పసిడి రూ.1,01,600 ఆల్టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేయడం గుర్తుండే ఉంటుంది. మరోవైపు వెండి కిలోకి రూ.440 పెరిగి రూ.98,940 స్థాయిని సమీపించింది. అంతర్జాతీయ మార్కెట్లో భిన్నమైన పరిస్థితి కనిపించింది. బంగారం 25 డాలర్ల నష్టంతో 3,397 డాలర్ల వద్ద ఉంది. యూస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయాలకు ముందు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అనుసరించినట్టు తెలుస్తోంది. ‘వాణిజ్య చర్చల్లో పురోగతిపై ఆశలతో మళ్లీ రిస్కీ ఆస్తులవైపు మార్కెట్లు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ మధ్య ప్రాచ్యం, రష్యా–ఉక్రెయిన్, భారత్–పాక్ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతుంది’ అని అబాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సీఈవో చింతన్ మెహతా పేర్కొన్నారు.

ప్రైవేటు పెట్టుబడులు తగ్గుముఖం!
న్యూఢిల్లీ: ప్రైవేటు మూలధన వ్యయాలు (పెట్టుబడులు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం మేర తగ్గిపోవచ్చని కేంద్ర ప్రభుత్వ సర్వే అంచనా వేసింది. రూ.4.88 లక్షల కోట్లుగా ఉండొచ్చని కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ నిర్వహించిన ‘ఫార్వార్డ్ లుకింగ్ సర్వే’ తెలిపింది. 2024–25లో ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు రూ.6.56 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 2023–24లో రూ.4.22 లక్షల కోట్లు కాగా, 2022–23లో రూ.5.72 లక్షల కోట్లు, 2021–22లో రూ.3.94 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఈ సర్వే నివేదిక వెల్లడించింది. వీటి ప్రకారం 2021–22 నుంచి 2024–25 మధ్య కాలంలో మొత్తం మీద ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు 66.3 శాతం పెరిగా యి. 2021–22లో ఒక్కో సంస్థ గ్రాస్ ఫిక్స్డ్ అస్సెట్ (జీఎఫ్ఏ) రూ.3,151 కోట్లుగా ఉంది. ఇది 2022–23లో రూ.3,279 కోట్లకు (4 శాతం వృద్ధి).. 2023–24లో రూ.4,183 కోట్లకు (27 శాతం వృద్ధి) పెరిగింది. విద్యుత్, గ్యాస్, స్టీమ్, ఎయిర్ కండీషనింగ్ సప్లై విభాగంలో ఒక కంపెనీ నుంచి అత్యధిక జీఎఫ్ఏ రూ.14,000 కోట్లుగా ఉంది. 2021–22లో ఒక్కో సంస్థ సగటున రూ.109 కోట్లను మూలధన వ్యయాలపై వెచ్చించింది. 20 22–23లో ఇది రూ.149 కోట్లు, 2023–24లో రూ. 1.07 కోట్లు, 2024–25లో రూ.172 కోట్ల చొప్పున ఉన్నాయి. తయారీ రంగం నుంచి 43.8 % మూ లధన వ్యయాలు ఉంటే.. ఐటీ నుంచి 15.6 %, రవాణా, స్టోరేజీ నుంచి 14 % చొప్పున ఉన్నాయి. వృద్ధి కోసమే పెట్టుబడులు.. ప్రస్తుత ఆస్తుల విలువను పెంచుకోవడంపై పెట్టుబడులకు 28.4 శాతం కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. 11.5 శాతం సంస్థలు అవకాశాలను విస్తృతం చేసుకోవడంపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఆదాయ వృద్ధి కోసం 2024–25లో మూలధన వ్యయాలు చేసినట్టు 49.6 శాతం ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు తెలిపారు. 30.1 శాతం సంస్థలు సామర్థ్యాల పురోగతికి, 2.8 శాతం సంస్థలు వైవిధ్యంపై పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించాయి.

టారిఫ్లకు రెండు వైపులా పదును
న్యూఢిల్లీ: టారిఫ్లనేవి రెండువైపులా పదునున్న కత్తిలాంటివని హెచ్సీఎల్ గ్రూప్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా వ్యాఖ్యానించారు. అమెరికాలాంటి పెద్ద మార్కెట్లలో టారిఫ్ ప్రభావిత పరిశ్రమలు నెమ్మదించినా వాటికి సేవలు కొనసాగించాల్సి రావడం ఒకెత్తైతే, టారిఫ్లవల్ల వ్యయాలు పెరగకుండా చూసుకోవడం మరో ఎత్తవుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇవన్నీ కూడా భారతీయ ఐటీ కంపెనీలు కొత్త వ్యాపారావకాశాలను దక్కించుకునేందుకు కూడా తోడ్పడవచ్చని, ఇందుకు టెక్నాలజీ ఉపయోగపడగలదని ఆమె తెలిపారు. అమెరికా టారిఫ్ల ప్రభావం నేరుగా ఐటీ సంస్థలపై పడకపోయినా, అవి సేవలందించే మార్కెట్లలో పరిశ్రమలు మందగించడం వల్ల పరోక్షంగా దెబ్బతినొచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో రోష్ని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టారిఫ్లు, డీగ్లోబలైజేషన్లాంటి భౌగోళికరాజకీయాంశాలు ఐటీ సేవలపై ప్రభావం చూపొచ్చని ఇటీవలే ఆరి్థక ఫలితాలు ప్రకటించిన సందర్భంగా హెచ్సీఎల్ టెక్ సీఈవో సి. విజయకుమార్ కూడా తెలిపారు.
ఫ్యామిలీ

Reita Faria: తొలి అందాల డాక్టర్ రీటా ఫారియా
రీటా ఫారియా.. అందాల పోటీలను ఫాలో అయ్యేవారెప్పటికీ మరచిపోని పేరు! మిస్ వరల్డ్గా ఎంపికైన తొలి ఇండియనే కాదు తొలి ఏషియన్ కూడా! అంతేకాదు మిస్ వరల్డ్గా ఎంపికైన తొలి మెడికల్ డాక్టర్! ఇన్ని ఫస్ట్లను ప్రీఫిక్స్గా పెట్టుకున్న రీటా నిజంగానే ప్రత్యేకమైన మహిళ! ఇప్పుడామెకు 82 ఏళ్లు. ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ వెల్ను పెళ్లి చేసుకుని ఐర్లండ్లో స్థిరపడ్డారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. వాళ్లూ డాక్టర్లే, అమ్మలాగే వాళ్లూ స్పోర్ట్స్ పర్సన్సే గోల్ఫ్లో! రీటా 5 అడుగుల 8 అంగుళాల ఎత్తుండటం వల్ల స్కూల్లో, కాలేజీలో ఆమెను ‘మమ్మీ లాంగ్ లెగ్స్’ అంటూ ఆటపట్టించేవాళ్లట. అయితే ఆమె దాన్ని అవకాశంగా మలచుకుంది. పొడుగు కాళ్లతో స్పోర్ట్స్లో బాగా రాణించవచ్చని గ్రహించి.. త్రోబాల్, నెట్బాల్, బాడ్మింటన్ నుంచి హాకీ దాకా అన్ని ఆటలూ ఆడారు. పెయింటింగ్ వేస్తారు. డాక్టర్ అయ్యి.. మంచి ఫిజీషియన్గా పేరు తెచ్చుకున్నారు. అసలు మిస్ వరల్డ్ కోసం ప్రయాణం... రీటా ఫారియా స్వస్థలం ముంబై. తాతల కాలంలోనే గోవా నుంచి వచ్చి ముంబైలో స్థిరపడిన ఓ సామాన్య కుటుంబం. నాన్న.. జాన్, ఒక మినరల్ ఫ్యాక్టరీలో పనిచేస్తే.. అమ్మ.. ఆంటోయినెట్, బ్యూటీ పార్లర్ నడిపేవారు. రీటా అక్క ఫిలోమెనా. రీటా మిస్ వరల్డ్ దాకా వెళ్లడానికి ప్రోత్సహించింది ఆమే! రీటా మెడిసిన్ ఫైనలియర్లో ఉన్నప్పుడే (1966) మిస్ బాంబే పోటీల్లో పాల్గొంది. టైటిల్ సొంతం చేసుకుంది. తర్వాత వాళ్ల సోదరి ‘మిస్ ఇండియా కోసమూ పోటీ పడు’ అంటూ వెన్ను తటింది. అక్కడా టైటిల్ ఆమెనే వరించింది. తర్వాత మిస్ వరల్డ్ వైపూ తోసింది. ఇంచక్కా వేరే దేశం చూడొచ్చన్న ఆశతో తన 23వ ఏట, చేతిలో కేవలం పది పౌండ్ల (అప్పుడు మన దేశ ఫారెక్స్ నిబంధనలు కఠినంగా ఉండేవి అందుకే పది పండ్లు)తో ఆ ΄ోటీల కోసం ఫ్లయిట్ ఎక్కారు. మిస్ వరల్డ్ పాజెంట్ కోసం కూతురు ఒంటరిగా లండన్ వెళ్లడం వాళ్లమ్మను కలవరపరచింది. ఆమె తిరిగొచ్చే వరకూ ఆందోళనతోనే ఉన్నారట. మినిస్టర్ కూతురు చీర.. సేల్స్లో హీల్స్.. మిస్ట్ వరల్డ్ పోటీల మీద సరైన అవగాహన, పోటీల్లో ఈవినింగ్ వేర్, గౌన్, పర్సనాలిటీ చాలెంజ్, మిస్ వరల్డ్ నైట్.. లాంటి ముఖ్యమైన ఘట్టాలకు సూట్ అయే దుస్తులూ లేకుండానే పీల్గొంది రీటా. ఈవెనింగ్ వేర్లో చీరే కట్టుకోవాలని నిశ్చయించుకుంది. ఎందుకంటే తన దగ్గర చీర మాత్రమే ఉంది. చీరను ఇండియన్ ట్రెడిషనల్ వేర్గానూ ప్రెజెంట్ చేయొచ్చు అనుకుంది. ఆ చీర కూడా అప్పటి మిస్ ఇండియా ఏజెంట్ ఆర్గనైజేషన్తో అనుబంధం ఉన్న మహారాష్ట్ర నాటి మినిస్టర్ పాజ్పేయి కూతురి పెళ్లి చీర. నగలు కూడా అరువు తీసుకున్నవే! ఆర్గనైజర్స్ ఆమె వార్డ్ రోబ్ చూసి అవాక్కయ్యారట. ఏమీ లేకుండా ఎలా పాల్గొనబోతోందీ అమ్మాయి అని! ఆమె పొడగరి కావడం వల్ల ఆమెకిచ్చిన స్విమ్ సూట్ కురచదైపోయిందట. తన దగ్గరున్న హీల్స్ ఆ పోటీలకు కావల్సిన ఎత్తు కన్నా తక్కువ ఎత్తున్నవి. ఏం చేయాలో పాలుపోక.. ఒకరోజు తన దగ్గరున్న పది పౌండ్లతో ఎక్కడ దొరుకుతాయో వెదుక్కోసాగింది. అదృష్టవశాత్తు ఒక షాపులో మూడు డ్లకు మంచి స్విమ్ సూట్, అర పౌండ్కి కావల్సిన హీల్స్ దొరికాయి ఆమెకు. వాటితోనే పోటీలకు తలపడింది. విశేషమేమంటే ఆ రౌండ్లో ఆమెకు ‘బెస్ట్ స్విమ్సూట్’ సబ్ టైటిల్ దక్కింది. అంతేకాదు ఈవెనింగ్ వేర్ ఈవెంట్లో శారీతో ప్రత్యక్షమై ‘బెస్ట్ ఈవెనింగ్ వేర్’ సబ్ టైటిల్నూ సొంతం చేసుకుంది. ఫైనల్ ఈవెంట్లో కూడా జడ్జెస్ అడిగిన ప్రశ్నలుకు చక్కటి సమాధానంతో 51 కంటెస్టెంట్లతో పోటీపడి ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని అందుకుంది. ఇక వాళ్లమ్మ సంతోషానికి అవధుల్లేవట! ‘అదంతా చాలా వేగంగా జరిగిపోయింది. కిరీటం గెలుచుకున్నాక వెనక్కి తిరిగి ఆలోచిస్తే.. నాకున్న అరకొర ఏర్పాట్లతో దీన్నెలా సాధించగలిగానా అని ఆశ్చర్యం వేసింది. ఇప్పటివాళ్లలాగా అప్పట్లో ఏడాది ముందు నుంచే ప్రిపరేషన్లు ఉండేవి కావు. ఇప్పటి వాళ్లు స్పష్టమైన లక్ష్యంతో దానికోసం ట్రైన్ అవుతున్నారు’ అని చెబుతారు రీటా ఫారియా పావెల్. గెలిచాక.. రీటా ఫారియాకు మోడలింగ్లో, సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె తన డాక్టర్ వృత్తిని చాలా సీరియస్గా తీసుకున్నారు. అందుకే వాటన్నిటికీ నో చెప్పారు. అంతేకాదు మిస్ట్ వరల్డ్గా వేదికల మీద పర్సనల్ అపియరెన్స్ ఇచ్చానే తప్ప ఎలాంటి కమర్షియల్స్కి అడ్వర్టయిజ్ చేయలేదు. ఆమె కమిట్మెంట్కు ముచ్చటపడ్డ లండన్లోని ప్రిస్టేజియస్ కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ సిబ్బంది తమ కాలేజీలో చదువు కొనసాగించమని ఆహ్వానించారు. అక్కడే డాక్టర్ యురోపియన్ డేవిడ్ పావెల్ ఈ డస్కీ బ్యూటీ రిటాను కలుసుకున్నాడు. ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లకు అయిదురుగు మనవలు, మనవరాళ్లు. ఇప్పటికీ రీటా అంతే బిజీగా, అంతే ఉత్సాహంగా ఉంటారు. గోల్ఫ్ ఆడుతారు. గార్డెనింగ్ చేస్తారు. ఇంటి పనీ, వంట పనీ చేస్తారు. భార్యాభర్తలిద్దరూ క్లాసికల్ మ్యూజిక్ క్లాసెస్కూ వెళ్తారు.– సరస్వతి రమ(చదవండి: అందాల పోటీలకూ నియమ నిబంధనలు ఉంటాయి)

నేలరాల్చిన 'సిందూరం'తోనే బదులు..! ఆదిపరాశక్తులే స్వయంగా..
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన కొన్ని వారాల తర్వాత మే 7 బుధవారం తెల్లవారుజామున భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టి బదులిచ్చింది. నాడు ఆ విషాదకర ఘటనలో మోదీకి చెప్పు అంటూ మహిళా పర్యాటకుల ముందే వారి భర్తలను కడతేర్చారు. వారి ఆక్రందనలు వినిపించేలా నేలరాల్చిన ఆ మహిళ 'సిందూరం' పేరుతోనే ఆపరేషన్ చేపట్టి ఉలిక్కిపడేలా సమాధానమిచ్చింది భారత్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆరోజు ఆనందంగా గడపాలని వచ్చిన మహిళలకు కన్నీళ్లు మిగిల్చితే..ఈ ఆపరేషన్ పేరుతో సైనిక మహిళా శక్తితోనే సమాధానం చెప్పడం విశేషం. అంతేగాదు ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది మీడియా ముందు వెల్లడించారు కూడా. మరీ ఆ ఆదిపరాశక్తులు ఎవరు? ఏవిధంగా ఈ ఆపరేషన్ని విజయవంతంగా ముగించారు తదితర విశేషాలు చూద్దామా..!వారే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీలు. ఈ సిందూర్ ఆపరేషన్ వారి నేతృత్వంలోనే విజయవంతంగా ముగిసింది. ఈ ఇద్దరు భారత సశస్త్ర దళాల్లో సీనియర్ మహిళా అధికారులు. ఈ సిందూర్ ఆపరేషన్కి సంబంధించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించింది వీరిద్దరే. సోఫియా ఖురేషీ ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సిందూర్కు ముందుండి నాయకత్వం వహించగా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పైలట్గా భారత వైమానిక దళానికి నాయకత్వం వహించారు. సోఫియా భూమిపై సైన్యంతో విధ్యంసం సృష్టించగా, వ్యోమికా సింగ్ ఆకాశం నుంచి వైమానిక దాడులు నిర్వహించారు. ఈ ఇరువురి మహళా అధికారుల నేతృత్వంలో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ బలగాలు పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై మెరుపులు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలతో సహా పాక్లో ఉన్న టెర్రర్ ఇండక్షన్లు, ట్రైనింగ్ సెంటర్లను కూడా మట్టుబెట్టింది. అంతేగాదు విజయవంతంగా ముగిసిన ఈ ఆపరేషన్ గురించి ప్రపంచానికి తెలియజేయడమే గాక భారతదేశ రక్షణ దళాలలో మహిళల పాత్రను హైలెట్ చేసింది. సాహసాలకు కేరాఫ్ అడ్రస్ ఇరువురు..ఇక్కడ సోఫియా కుటుంబం మొత్తం సైనిక సేవలతో ముడిపడి ఉంది. అంతేగాదు సోఫియా ఫోర్స్ 18 అనే బహుళ జాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు.సోఫియా యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాలలో ఆరు సంవత్సరాలు సేవలందించారు.ఐక్యరాజ్యసమితి మిషన్లో (2006) గణనీయమైన సేవలు అందించారువ్యోమిక తన పేరుకు తగ్గట్టే పైలట్ కావాలనే రంగాన్ని ఎంచుకుని సైన్యంలో చేరారామె. అంతేగాదు తన కుటుంబంలో ఆర్మీలో చేరిన తొలి వ్యక్తిగా వ్యోమిక పేరుగడించింది. డిసెంబర్ 18న, ఆమెకు శాశ్వత కమిషన్ లభించి, హెలికాప్టర్ పైలట్గా ఐఏఎఫ్లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. భారత్లో అత్యంత సవాలుతో కూడిన భూభాగాలలో చేతక్, చిరుత వంటి విమానాలను నడిపారామెఇప్పటివరకు 2,500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు.2020లో అరుణాచల్ప్రదేశ్లో కీలకమైన రెస్క్యూ మిషన్కు నాయకత్వం వహించింది2021లో త్రివిధ దళాల మహిళా ఎక్సపిడిషన్లో పాల్గొన్నారుహర్షం వ్యక్తం చేసిన పహల్గాం బాధితులు..ఆ ఆపరేషన్ గురించి వినగానే కళ్లల్లో నీళ్లు వచ్చేశాయన్నారు పహల్గామ్ బాధితులు. మా కుంకుమను నేలరాల్చిన వారికి అదే పేరుతో ఆపరేషన్ చేపట్టి మట్టికరిపించినందుకు ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని గద్గద స్వరంతో అన్నారు. ఈ ఆపరేషన్ సిందూర్తో ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని అంతం చేస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాం అని ధీమాగా చెప్పారు.(చదవండి: Operation Sindoor: మన కుమార్తెల సిందూరమే.. ఆపరేషన్ సిందూర్.. పహల్గాం బాధితుల రియాక్షన్)

ఓఆర్ఎస్ అని పిల్లలకు తాగిస్తున్నారా..?
ఎండలు మండుతున్నాయి, చిన్నారులు అనేక మంది డీ హైడ్రేషన్ బారిన పడుతున్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు యధాలాపంగా ఎంచుకునే ఓఆర్ఎస్ పరిష్కారం ప్రమాదకరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) పేరిట చక్కెర అధికంగా ఉండే పానీయాలను నమ్మడం మానేయాలని సూచిస్తున్నారు. తప్పుదారి పట్టించే మార్కెటింగ్ పద్ధతుల వల్ల పిల్లల మరణాలకు కూడా దారి తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ముందున్నారు హైదరాబాద్కి చెందిన సీనియర్ శిశువైద్యురాలు ప్రథమ చికిత్స శిక్షకురాలు శివరంజని సంతోష్ ఎలక్ట్రోలైట్ డ్రింక్గా విక్రయించినప్పటికీ, ఇది విరేచనాల సమయంలో రీహైడ్రేషన్కు తగినది కాదనీ తయారీదారులు పిల్లల వైద్యులతో కుమ్మక్కై, ఇది నిజమైన పరిష్కారం అనే అభిప్రాయాన్ని కలిగించారనీ ఆమె వెల్లడించారు. వాస్తవానికి, ఇది శీతల పానీయాలు పండ్ల రసాలతో పోల్చదగిన చక్కెర స్థాయిలను కలిగి ఉంటుందనీ దీనివల్ల సోడియం కంటెంట్లో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉంటుందన్నారామె ‘చాలా మంది పిల్లల విరేచనాలు తీవ్రమవుతున్నాయని నిశితంగా పరిశీలించిన తర్వాత, ఈ బ్రాండెడ్ ఉత్పత్తి ఓఆర్ఎస్ కాదని గ్రహించాం‘ అని ఆమె చెప్పారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్య హెచ్ ఒ )ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)కు ఉండాల్సినవిగా సిఫార్సు చేస్తున్న ప్రమాణాల ప్రకారం ఇవి ఉండడం లేదు. దీనికి విరుద్ధంగా పలు ఔషధ సంస్థలు మార్కెట్లో విక్రయించే కొన్ని ప్యాకెట్లలో లీటరుకు దాదాపు 120 గ్రాముల చక్కెర ఉంటుంది, అందులో 110 గ్రాములు అదనంగా కలిపిన చక్కెర. వాటిలో లీటరుకు 1.17 గ్రాముల సోడియం, 0.79 గ్రాముల పొటాషియం, 1.47 గ్రాముల క్లోరైడ్ కూడా ఉన్నాయి. ‘‘ఓఆర్ఎస్ అనేది లక్షలాది మంది ప్రాణాలను కాపాడే ఒక ప్రాణాలను రక్షించే చికిత్స. కానీ ఇప్పుడు మనం ఆ లేబుల్ను దుర్వినియోగం చేసి అధిక చక్కెర పానీయాలను విక్రయించే ఉత్పత్తుల పెరుగుదలను చూస్తున్నాము, ఇవి వాస్తవానికి విరేచనాలను మరింత తీవ్రతరం చేస్తాయి,‘ అని శివరంజని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఫార్ములా కంటే 6 నుంచి 10 రెట్లు ఎక్కువ చక్కెర స్థాయిలను కలిగి ఉన్నప్పటికీ, అనేక ప్రసిద్ధ బ్రాండ్లు వీటిని రీహైడ్రేషన్ సొల్యూషన్లుగానే భ్రమింపజేస్తూ విక్రయాలు కొనసాగిస్తున్నాయని డాక్టర్ శివరంజని పేర్కొన్నారు. ఫార్మసీలలో అందుబాటులో ఉంటూన్న ఈ ఉత్పత్తులను సాధారణంగా డెంగ్యూ టైఫాయిడ్ వంటి అనారోగ్యాలకు సంబంధించిన డీహైడ్రేషన్ కోసం సిఫార్సు చేయడం జరుగుతోంది.అయితే ఇవి చికిత్సా ఉత్పత్తులను నియంత్రించే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్సిఓ) నుంచి కాకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) దగ్గర మాత్రమే అనుమతి పొందడం గమనార్హం. వైద్య నిపుణుల ఒత్తిడి మేరకు,గత 2022లో అటువంటి చక్కెర–భారీ పానీయాల వాడకాన్ని నిషేధించడం జరిగింది. అయితే, నియంత్రణ సంస్థ అదే సంవత్సరం జూలైలో తమ నిర్ణయాన్ని సవరించింది, తయారీదారులు ‘‘ఇది ఓఆర్ఎస్ కాదు’’ అని రాసి ఉత్పత్తులను కొనసాగించడానికి అనుమతించింది, ‘‘ చాలా మంది తల్లిదండ్రులు, కొంతమంది వైద్యులు కూడా ప్యాకేజింగ్ ద్వారా తప్పుదారి పడుతున్నారు. ఈ పానీయాలు నిరుపయోగం మాత్రమే కాదు, అనారోగ్యంతో ఉండే చిన్నారులకు మధుమేహం ఉన్నవారికి ప్రమాదకరమైనవి, ’’అని డాక్టర్ శివరంజని హెచ్చరించారు. అటువంటి ఉత్పత్తుల వాడకాన్ని పూర్తిగా నిషేధించడం, ఆసుపత్రి రిటైల్ ఫార్మసీల నుంచి వాటిని తొలగించడం డీహైడ్రేషన్ చికిత్సకు డబ్లు్యహెచ్ఓ ఆమోదించిన ఫార్ములేషన్లను ఏకైక ప్రమాణంగా అమలు చేయడం వంటి కఠినమైన చర్యలు చేపట్టాలని ఆమె కోరుతున్నారు.(చదవండి: కల్తీ పుచ్చకాయను పసిగట్టొచ్చు ఇలా..!)

గుడ్ ఫార్మర్ స్టాన్లీ..!
అమెరికా తొలి గుడ్ ఫార్మర్ అవార్డుకు మహిళా సేంద్రియ రైతు క్లారెండా ‘ఫార్మర్ సీ’ స్టాన్లీ ఎంపికయ్యారు. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రసిద్ధ రోడేల్ ఇన్స్టిట్యూట్, డావైన్స్ గ్రూప్ సంయుక్తంగా ఈ పురస్కార ప్రదానానికి శ్రీకారం చుట్టటం విశేషం. పదేళ్లకు మించకుండా పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం (రీజనరేటివ్ ఆర్గానిక్ అగ్రికల్చర్)ను ఆచరిస్తూ, పర్యావరణానికి, సమాజానికి ఉత్తమ సేవలు అందించిన ఆదర్శ కృషీవలురికి ఈ పురస్కారం ఇవ్వటం ఈ ఏడాది ప్రారంభించామని అమెరికాలో 1947 నుంచి సేంద్రియ వ్యవసాయ పరిశోధనలకు పట్టుకొమ్మ అయిన రోడేల్ ఇన్స్టిట్యూట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జెఫ్ ట్రాక్ అన్నారు. ‘స్టాన్లీ తన గ్రీన్ హెఫ్ఫ ఫామ్స్లో చేస్తున్న పని తన వ్యవసాయ క్షేత్రాన్ని సుసంపన్నం చేయటంతోపాటు కొత్త తరం రైతులకు ప్రేరణగా నిలుస్తోంది. తొట్టతొలి ద గుడ్ ఫార్మర్ అవార్డ్ యుఎస్ పురస్కారాన్ని ప్రదానం ఆమెకు ప్రదానం చేయటం గర్వంగా ఉంది’ అన్నారాయన. నార్త్ కరోలినలో గ్రీన్ హెఫ్ఫ ఫామ్స్ను నిర్వహిస్తున్న స్టాన్లీ సేంద్రియ విలువల పట్ల నిబద్ధతతో వ్యవసాయం చేస్తున్న హెర్బలిస్టు. రీజెనరేటివ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఆర్థిక ప్రగతితోపాటు, సమానత్వం, విద్య, పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న విశేష కృషికి గాను ఆమెను పురస్కారం వరించింది. 20 రాష్ట్రాల నుంచి సుమారు వంద దరఖాస్తులు రాగా స్టాన్లీని జ్యూరీ ఎంపికచేసింది. ఈ పురస్కారం కింద పది వేల డాలర్ల నగదును, జ్ఞాపికను అందజేస్తారు. స్టాన్లీ విలువైన ఔషధ మొక్కలను, తేయాకును పూర్తిగా సేంద్రియంగా పండిస్తున్నారు. కొత్తగా సేద్యవృత్తిని చేపట్టిన వారికి ఆమె శిక్షణ ఇస్తున్నారు. చారిత్రకంగా అణగారిన వర్గాల బడుగు వారికి ఆమె ప్రాధాన్యం ఇస్తారు. నేలను సేంద్రియ పద్ధతుల్లో పునరుజ్జీవింపజేసుకుంటూనే పంటలు పండిస్తూ ఈ వ్యవసాయం ఆర్థికంగానూ, పర్యావరణపరంగా, ఆహార భద్రతాపరంగానూ గిట్టుబాటు వ్యవహారమే అని స్టాన్లీ నిరూపించుకున్నారు. ‘గ్రీన్ హెఫ్ఫ ఫామ్స్లో మేం అనుసరిస్తున్న సాగు పద్ధతికి ఈ పురస్కారం వెన్నుతట్టింది. ఈ క్షేత్రంలో మేం పంటలను మాత్రమే పండించటం లేదు, పరివర్తనను పెంపొందిస్తున్నాం’ అన్నారు స్టాన్లీ సంతోషంగా. డావైన్స్ గ్రూప్ ఐదేళ్ల క్రితం ఇటలీలోని పర్మలోయూరోపియన్ రీజెనరేటివ్ ఆర్గానిక్ సెంటర్ను రోడేల్ ఇన్స్టిట్యూట్ తోడ్పాటుతో నెలకొల్పింది. అక్కడ జరిగే సభలో స్టాన్లీకి పురస్కార ప్రదానం జరుగుతుంది. ఆమె రాకపోకల ఖర్చులన్నీ డావైన్స్ గ్రూప్ భరిస్తుంది. ఆమె తమ దేశానికి రావటం వల్ల రీజనరేటివ్ ఆర్గానిక్ వ్యవసాయ స్ఫూర్తి తమ ప్రాంత రైతులకు ప్రేరణ కలిగిస్తుందని భావిస్తున్నామని డావైన్స్ గ్రూప్ సంతోషిస్తోంది. పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం చేయటంతోపాటు.. పండించిన ఆహారాన్ని తినిపించి వ్యాధులు నయం చేసే ఆసుపత్రిని పొలంలోనే నిర్వహించే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్న స్టాన్లీ సింగిల్ వుమన్ ఫార్మర్ కావటం మరో విశేషం. (చదవండి: మెగా గుమ్మడి!)
ఫొటోలు


‘శుభం’ మూవీ దెయ్యం బయట ఇంత అందంగా ఉందా? (ఫోటోలు)


తిరుపతి : రెండో రోజు గంగమ్మ జాతర.. బైరాగి వేషంలో మొక్కుల చెల్లింపులు (ఫొటోలు)


హైదరాబాద్లో ఉత్కంఠభరితంగా ‘ఆపరేషన్ అభ్యాస్’ మాక్ డ్రిల్ (ఫొటోలు)


భార్యకు సీమంతం చేసిన హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు)


Miss World 2025: సుందరీమణులకు స్వాగతం


తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు (ఫొటోలు)


భారత్ తడాఖా.. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ విలవిల (ఫొటోలు)


మిస్ వరల్డ్ పోటీల విలేకరుల సమావేశంలో నందినీ గుప్తా, సోనూసూద్ (ఫొటోలు)


ఘనంగా తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)


మెట్గాలా 2025 ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ (ఫోటోలు)
అంతర్జాతీయం

భారత్ను దెబ్బకొట్టాల్సిందే: పాకిస్తాన్
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఆగ్రహంతో రగిలిపోతోంది. భారత్ను గట్టిగా దెబ్బకొట్టాల్సిందేనని నిర్ణయానికి వచ్చింది. భారత్పై ప్రతీకార చర్యల విషయంలో సైన్యానికి పూర్తిస్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలన్న దానిపై బాధ్యతను సైన్యానికే అప్పగించింది. పాక్ ప్రధానమంత్రి షెహవాజ్ షరీఫ్ నేతృత్వంలో బుధవారం పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎన్ఎస్సీ) సమావేశం నిర్వహించారు. కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు, సీనియర్ ఆర్మీ అధికారులు హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్తో పాటు తదనంతర పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. భారత సైన్యం నిర్వహించిన తాజా దాడుల్లో సామాన్య ప్రజలు బలైనట్లు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి చార్టర్లోని ఆరి్టకల్–51 ప్రకారం ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేసే హక్కు తమకు ఉందని ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. అమాయక ప్రజలను బలితీసుకున్నందుకు భారత్పై ప్రతీకారం తప్పదని తేల్చిచెప్పింది. ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టే అధికారాన్ని తమ సైనిక దళాలకు అప్పగించినట్లు వెల్లడించింది. సామాన్యులపై దాడులు సిగ్గుచేటు పాక్తోపాటు పీఓకేలో భారత్ దాడులను ఎన్ఎస్సీ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీయాలని చూస్తే సహించబోమని హెచ్చరించింది. భారత్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని, ఇది ముమ్మాటికీ తమపై యుద్ధ ప్రకటనేనని పేర్కొంది. అంతర్జాతీయ చట్టం ప్రకారం భారత్ దాడిని యుద్ధ చర్యగానే పరిగణిస్తున్నామని వెల్లడించింది. మహిళలు, చిన్నారులు సహా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం అత్యంత హేయం, దారుణం, సిగ్గుచేటు అని మండిపడింది. మానవత్వానికి సంబంధించిన అన్ని నియమాలను భారత సైన్యం ఉల్లంఘించినట్లు ఆరోపించింది. భారతదేశ చట్టవ్యతిరేక చర్యలను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని ఎన్ఎస్సీ విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించినందుకు భారత్ దోషిగా పరిగణించాలని స్పష్టంచేసింది. ఉగ్రవాదుల శిబిరాలు ఉన్నాయన్న సాకుతో సాధారణ జనావాసాలపై భారత సైన్యం దాడులు చేసిందని ఆక్షేపించింది. ఈ దాడుల్లో మసీదులు సహా పౌర సదుపాయాలు ధ్వంసమయ్యాయని ఆందోళన వ్యక్తంచేసింది.

పాక్ పీఎం యాక్షన్.. ఆర్మీ చీఫ్ నో యాక్షన్!
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ ‘యాక్టింగ్ కెప్టెన్’ పాత్రకు రెడీ అయ్యారు. భారత్తో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. భారత్ తమపై దాడి చేసిందని, అందుకు ప్రతీకారం తీర్చుకుంటామనీ అన్నారు. రైట్ టు రెస్పాండ్ హక్కు మాకూ ఉందన్నారు. ఈ మేరకు అత్యవసరం సమావేశం కూడా ఏర్పాటు చేశారు.ఆర్మీ చీఫ్ ఎక్కడ..?ఈ మేరకు హై లెవిల్ సెక్యూరిటీ మీటింగ్ కు పాక్ ప్రధాని షరీఫ్ పిలుపునిచ్చారు. అయితే దీనికి ఆ దేశ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ హాజరుకాలేదు. కనీసం మునీర్ నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల నడుమ మునీర్ ఎక్కడో కీలక ప్రాంతంలో దాక్కున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తో యుద్ధాన్ని ఆర్మీ చీఫ్ మునీర్ వద్దనుకునే కీలక మీటింగ్ లకు దూరంగా ఉంటున్నాడనే వాదన కూడా తెరపైకి వచ్చింది.ఇప్పుడు పాక్ ప్రధాని షరీప్ కాస్త యాక్టింగ్ లోకి దిగుదామని ప్రయత్నిస్తున్నా అక్కడ సైన్యం పూర్తిగా సహకరించడం లేదనడానికి మునీఫ్ గైర్హాజరీనే ఒక ఉదాహరణ. ప్రస్తుతం భారత్ పై తిరుగుబాటు చేస్తే పాక్ కే నష్టమని పలువురు దేశ, విదేశీ రాజకీయనాయకులు చెబుతున్న మాట. ఇదే ఫాలో అవుతున్నట్లున్నాడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. పాక్ లో అత్యంత శక్తివంతుడుగా విస్తృత ప్రచారంలో ఉన్న మునీర్.. మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్లో పాక్ పెద్దలకు అర్థం కావడం లేదు. హైలెవిల్ మీటింగ్ కు రావాలని పాక్ భద్రతా దళాల అధికారులకు ప్రధాని ఆదేశాలు ఇచ్చిన తరుణంలో మునీర్ ఎందుకు దూరంగా ఉన్నట్లు. పాక్ పీఎం యాక్షన్ ప్లాన్ కు ఆ దేశ ఆర్మీ చీఫ్ నుంచి ఎటువంటి యాక్షన్ లేకపోవడం ఏంటనేది ఇప్పుడు ఆ దేశంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు..మునీర్.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. తమ పార్టీ మాత్రం ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాల్లో పాల్గొదనే సంకేతాలిచ్చాడు. దాంతోనే ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీలోని పార్లమెంట్ సభ్యులు కూడా ప్రభుత్వంపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్మీ చీఫ్ కూడా కీలక సమయంలో పాక్ హ్యాండిచ్చాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తూ భారత్ వార్నింగ్ ఇచ్చిన మునీఫ్.. సరైన సమయానికి మాత్రం ఎస్కేపింగ్ ప్లాన్ చేసుకున్నట్లు కనబడుతోంది.మరో ముషారఫ్ రాజ్యం రాబోతుందా..?పాకిస్తాన్ లో ప్రభుత్వాలను కూల్చేసి ఆర్మీ చీఫ్ లు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గతంలో చూశాం. మరి మునీఫ్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అయితే మునీఫ్ అంత సీన్ లేదనే కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతం పాక్ లో ప్రభుత్వాన్ని మునీర్ కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకే సైలెంట్ మోడ్ లోకి మునీఫ్ వెళ్లాడని, ఇది పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్ కు మేలు చేయడం కోసమేనని పాక్ లోనే వినిపిస్తోంది. గతంలో పాక్ మాజీ సైనాకాధికారి ముషారఫ్.. సైన్యం మద్దతు విశేషంగా కూడగట్టుకుని పాక్ ప్రభుత్వాన్ని కూల్చేసి అధ్యక్షుడయ్యాడు.ముషారఫ్.. 1999 నాటి కుట్రలో ప్రధాని నవాజ్ షరీఫ్ నుంచి అధికారం హస్తగతం చేసుకొని, ‘ఛీఫ్ ఎగ్జిక్యూటివ్’గా, ఆ పైన సైనికాధ్యక్షుడిగా, చివరకు పౌర అధ్యక్షుడిగా తొమ్మిదేళ్ళ కాలం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఆఖరికి మెడ మీద అభిశంసన కత్తితో 2008లో గద్దె దిగక తప్పలేదు.

అక్కడ జరిగిందేమిటి?.. మీరు చేస్తున్నదేమిటి?
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల్ని ప్రాణాలు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల వేరివేత లక్ష్యంగా భారత్ ‘ ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది. పాక్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసిన భారత్.. 90 మంది వరకూ టెర్రర్ మూకలను మట్టుబెట్టింది. అయితే భారత్ విజయవంతంగా పూర్తి చేసిన ఆపరేషన్ సిందూర్ పై చైనా మీడియా విషం కక్కింది. చైనాలోని గ్గోబల్ టైమ్స్’ అనే మీడియా సంస్థ ఆపరేషన్ సిందూర్ భారత్ విమానాలను పాక్ కూల్చిందంటూ తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. కొన్ని పాత ఫోటోలను జత చేసి వాటిని ప్రస్తుత ఆపరేషన్ సిందూర్ కు ఆపాదించింది. దీనిపై చైనాలోని భారత్ ఎంబాసీ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అక్కడ జరిగింది ఏమిటి.. మీరు చేస్తున్నదేమిటి అంటూ మండిపడింది ఒక విషయాన్ని వార్త రూపంలో ప్రచురించేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలని, దానికి మూలాలను అన్వేషించి వార్తలు వేయాలని గ్లోబల్ టైమ్స్ కు చురకలంటించింది. అక్కడా ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసి విజయవంతంగా దాన్ని పూర్తి చేస్తే మీరు దాన్ని వక్రీకరించడం తగదంటూ హితవు పలికింది. కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులు హతమయ్యారు.

పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటాం: అజిత్ దోవల్
ఢిల్లీ: ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశ్యం భారత్కు లేదని.. పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటామంటూ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తేల్చి చెప్పారు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్ ఎన్ఎస్ఏలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. రష్యా, ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులతో దోవల్ చర్చించారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై ఇతర దేశాల మద్దతు కూడగట్టే క్రమంలో అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారులు, కార్యదర్శులతోచర్చించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్పై తీసుకున్న చర్యలు.. ఆపరేషన్ నిర్వహించడానికి గల కారణాలను ఆ దేశాల ప్రతినిధులకు వివరించారు.కాగా, పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్లోని బహవల్పూర్తో పాటు లాహోర్ లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్ టు సర్ఫేస్’ మిసైళ్లను ప్రయోగించారు. దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్’ అంటూ భారత్ సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్కు ‘సిందూర్’ అని నామకరణం చేశారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు.
జాతీయం

Jammu and Kashmir: దశాబ్దాలుగా నరమేధమే
అందాల కశ్మీరం ఉగ్రవాదులతో దశాబ్దాలుగా అగ్నిగుండంగా మారింది. 2000 నుంచి అక్కడ జరిగిన దాడులకు 700 మందికి పైగా భద్రతా సిబ్బంది, పౌరులు బలయ్యారు. వాటిలో ముఖ్యమైనవి.. 2000 మార్చి 21: అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్లో పర్యటిస్తున్న వేళ టెర్రరిస్టులు చెలరేగిపోయారు. అనంత్నాగ్ జిల్లా చట్టీసింగ్పురా గ్రామంలో 36 మంది సిక్కులను కాల్చి చంపారు. ∙ 2000లోనే అమర్నాథ్ యాత్రికులపై పహల్గాం బేస్ క్యాంప్ వద్ద జరిగిన ఉగ్ర దాడిలో 32 మంది మరణించారు. ∙ 2001లో 13 మంది, 2002లో 11 మంది అమర్నాథ్ యాత్రికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ∙ 2001 అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ప్రాంగణంపై జరిగిన ఆత్మాహుతి దాడికి 36 మంది బలయ్యారు. ∙ 2002లో జమ్మూ–శ్రీనగర్ హైవేపై ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు భద్రతా సిబ్బందితో పాటు 19 మంది మరణించారు. ∙ 2003లో పుల్వామా జిల్లా నందిమార్గ్లో 24 మంది కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ∙2014: ఉరిలో ఆత్మాహుతి దాడికి దిగి 17 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. ∙2015: కథువా పోలీస్ స్టేషన్పై దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. ∙2016: ఉరిలో సైనిక క్యాంపుపై దాడికి తెగబడి 18 మంది సిబ్బందిని పొట్టన పెట్టుకున్నారు. ∙2017లో అమర్నాథ్ యాత్ర నుంచి తిరిగొస్తున్న భక్తులపై కాల్పుల్లో 18 మంది మరణించారు. ∙2019: పుల్వామాలో సీఆరీ్పఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడికి 40 మంది జవాన్లు బలయ్యారు. ∙2025 ఏప్రిల్ 22: బైసారన్లో 26 మంది పర్యాటకులను కాల్చిచంపారు.

Operation Sindoor: ఆ 9 లక్ష్యాలు ఇవే..
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ కోసం ఎంపిక చేసిన 9 లక్ష్యాలను పక్కాగా సేకరించిన నిఘా సమాచారం ఆధారంగా సైన్యం నిర్ణయించుకుంది. ఇవన్నీ ఆరోగ్య కేంద్రాలు తదితర ముసుగుల్లో నడుస్తున్నాయి. వీటిని కచ్చితంగా గుర్తించడం మన నిఘా వర్గాలకు సవాలుగా నిలిచింది. ఈ ఉగ్ర కేంద్రాలు, శిబిరాలను బయటి ప్రపంచం దృష్టి నుంచి దాచి ఉంచేందుకు పాక్ ప్రభుత్వం, సైన్యం అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటాయి. ఇందుకోసం ఎప్పటికప్పుడు వాటి గుర్తింపులు మార్చడం వంటి పనులు చేస్తుంటాయి. పాకిస్తాన్ భూభాగంలో ఉన్నవి (4) 1: మర్కజ్ సుభాన్జైషే మహ్మద్ ప్రధాన స్థావరం. అంతర్జాతీయ సరిహద్దులకు 100 కి.మీ. దూరంలో పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో బహావల్పూర్ సమీపంలో నరోవల్ జిల్లా తెహ్రా కలాన్ గ్రామంలో ఉంది. ఉగ్రవాదుల చేరిక, శిక్షణ వంటివి ఇక్కడ జరుగుతాయి. జైషే చీఫ్ మసూద్ అజర్ ఇక్కడినుంచే కార్యకలాపాలు సాగిస్తుంటాడు. భద్రతా దళాలకు చిక్కిన అతన్ని 1999లో జైషే ఉగ్రవాదులు ప్రయాణికుల విమానాన్ని హైజాక్ చేసి విడిపించుకున్నారు. అజర్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్గర్ తదితర అగ్ర నేతల నివాసాలు తదితరాలూ ఇక్కడే ఉన్నాయి. ప్రస్తుతం ఇది అస్గర్ కనుసన్నల్లో నడుస్తోంది. సరిహద్దుల గుండా ముష్కరులు చొరబడేందుకు అనువైన ప్రాంతాలను ఇక్కడినుంచే గుర్తించడం, అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సొరంగాలు తవ్వడం జేషేకు నిత్యకృత్యం. అంతేగాక డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలు, డ్రగ్స్ వంటివి పంపే లాంచ్ప్యాడ్ కూడా ఇదే. 2000లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై దాడి, 2001లో పార్లమెంటుపై దాడి మొదలుకుని 2019లో 40 మంది సీఆరీ్పఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడుల దాకా ప్లానింగ్ జరిగిందిక్కడే. 2: మర్కజ్ తొయిబా‘టెర్రర్ ఫ్యాక్టరీ’గా పేరు పొందింది! నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో లాహర్ సమీపంలో మురిద్కేలో ఉంది. ఇది హఫీజ్ సయీద్ నేతత్వంలో పని చేసే లష్కరే తొయిబా ప్రధాన కేంద్రం. దానికి ఆయువుపట్టు కూడా. 1990లో ఉనికిలోకి వచ్చింది. నిత్యం కనీసం 1,000 మంది రిక్రూట్లకు ఇక్కడ 2 వారాల ప్రాథమిక కోర్సు నడుస్తుంటుంది. అందులో భాగంగా శారీరక, మతోన్మాద శిక్షణ ఇస్తారు. ముంబై ఉగ్ర దాడుల కుట్ర పురుడు పోసుకుంది ఇక్కడే. వాటికి పాల్పడ్డ కసబ్ బృందానికి దౌరా–ఎ–నిబ్బత్ (నిఘా) సంబంధిత శిక్షణ ఇక్కడే ఇచ్చారు. ముంబై దాడుల సూత్రధారులు డేవిడ్ హెడ్లీ, తహవ్వుర్ రాణా కూడా ఇక్కడ శిక్షణ పొందారు. ఇక్కడ ‘అతిథి గృహం’నిర్మాణానికి అప్పటి అల్కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ రూ.10 లక్షలిచ్చాడు. జమ్మూ కశ్మీర్తో పాటు హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల బాంబు పేలుళ్లు లష్కరే పనే. 3: సర్జాల్ అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు 6 కి.మీ. దూరంలో సియాల్కోట్లో ఉంది. గత మార్చిలో నలుగురు జమ్మూ కశ్మీర్ పోలీసు సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు శిక్షణ పొందింది ఇక్కడే. 4: మెహమూనా జోయా అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు 12 కి.మీ. దూరంలో సియాల్కోట్ సమీపంలో ఉంది. హిజ్బుల్కు కీలక శిక్షణ కేంద్రం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముసుగులో పని చేస్తోంది. జమ్మూలోని కథువా ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే కార్యకలాపాలకు ఇది కంట్రోల్ సెంటర్గా వ్యవహరిస్తోంది. పఠాన్కోట్ వైమానిక బేస్పై దాడుల వంటివాటికి ఇక్కడినుంచే వ్యూహరచన జరిగింది. జమ్మూ నగరంలో పలు ఉగ్ర దాడులకు కారకుడైన ఇర్ఫాన్ టండా ఈ కేంద్రానికి సారథి. పీఓకేలో ఉన్నవి (5) 5: అహ్నే హదీత్ (బర్నాలా) క్యాంప్ నియంత్రణ రేఖకు 9 కి.మీ. దూరంలో భీంబర్ వద్ద ఉంది. ఆయుధాల వాడకంతో పాటు అత్యాధునిక పేలుడు పదార్థాల (ఐఈడీ) తయారీలో ఇక్కడ శిక్షణ ఇస్తారు. 150 మంది దాకా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వగలదు. 6: మర్కజ్ తొయిబాలష్కరే తొయిబా ముఖ్య కేంద్రాల్లో ఒకటి. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో తాంగ్దార్ సెక్టర్లో ఉంది. కీలక ఉగ్ర శిక్షణకు ఇఎది కేంద్రం. ముంబైపై 26/11 దాడులకు తెగబడ్డ అజ్మల్ కసబ్ ఉగ్రవాద బృందం పూర్తిస్థాయి శిక్షణ పొందింది ఇక్కడే. ఇది 2000లో పుట్టుకొచ్చింది. పాక్ సైనిక, ఐఎస్ఐ అధికారులు ఇక్కడికి నిత్యం వస్తూ పోతూ ఉంటారు. ఏకకాలంలో 250 మందికి పైగా ఉగ్రవాదులు ఉండేందుకు ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయి. ఇక్కడినుంచి వారు ప్రధానంగా ఉత్తర కశ్మీర్లోకి చొరబడుతుంటారు. కొత్తగా చేర్చుకున్న వారికి మత, ఉగ్రవాద శిక్షణ కూడా ఇక్కడ అందుతుంది. పహల్గాంలో ఉగ్రవాదులపై దాడులకు తెగబడింది ఇక్కడినుంచి చొరబడ్డ ఉగ్రవాదులే! 2024లో కశ్మీర్లోని సోన్మార్గ్, గుల్మార్గ్లో భద్రతా బలగాలు, పౌరులపై దాడులు కూడా వారి పనే. 7: గుల్పూర్ క్యాంప్నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో కోట్లిలో ఉంది. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఆపరేట్ చేసే లష్కరే ఉగ్రవాదులకు బేస్. పూంచ్ 2023 దాడులు, 2024లో యాత్రికులపై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు. ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ ఈ శిబిరానికి తరచూ వచ్చి రిక్రూటీలకు మతోన్మాద ప్రసంగాలిచ్చేవాడు. 8: అబ్బాస్ క్యాంప్ నియంత్రణ రేఖకు 13 కి.మీ. దూరంలో కోట్లీలో ఉంది. లష్కరే ఆత్మాహుతి బాంబర్లకు ప్రధాన కేంద్రం. 150 మందికి పైగా ఉగ్రవాదులకు ఏకకాలంలో శిక్షణ ఇచ్చేందుకు వసతులున్నాయి. పూంచ్, రాజౌరీల్లో చొరబాట్లు, ఉగ్ర దాడులకు వ్యూహరచన మొత్తం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక్కడి వ్యవహారాలు చూసేది క్వారీ జరార్. జేషే చీఫ్ మసూద్ సోదరుడైన అస్గర్కు సన్నిహితుడు. పలు ఎన్ఐఏ కేసుల్లో జరార్ ప్రధాన నిందితుడు. హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణ కేంద్రం కూడా ఇక్కడే ఉంది. బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ)తో పాటు స్నైపర్ దాడులు తదితరాలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. 9: సయీద్నా బిలాల్ క్యాంప్జైషే ఉగ్ర శిబిరం. ముజఫరాబాద్లో ఉంది. తొలుత ఉగ్ర సామగ్రి నిల్వ కేంద్రం. తర్వాత ఆధునీకరించి ఉగ్రవాదులకు ఆయుధాలు, పేలుడు పదార్థాల వాడకం, అడవులు, ప్రతికూల పరిస్థితుల్లో సుదీర్ఘకాలం ఉండటం తదితరాల్లో శిక్షణ ఇచ్చే కేంద్రంగా మార్చారు. నిత్యం కనీసం 100 మందికి పైగా ఉగ్రవాదులు ఇక్కడ శిక్షణ పొందుతుంటారు. పాక్ సైన్యానికి చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ వీరికి నేరుగా శిక్షణ ఇస్తుంది!

పాక్ సైన్యం కర్కశ కాల్పులు
జమ్మూ/శ్రీనగర్/పూంచ్: ఉగ్రస్థావరాలపై భారత్ దాడి తర్వాత బరితెగించిన పాకిస్తాన్ సైన్యం సరిహద్దువెంట కన్నుమిన్నుకానక కర్కశంగా కాల్పులకు తెగబడింది. గతంలో ఎన్నడూలేనంతగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ తూటాల వర్షం కురిపించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి జమ్మూకశ్మీర్లోని పూంచ్æ జిల్లాలో సరిహద్దు వెంట డజన్ల కొద్దీ గ్రామాలపై పాకిస్తాన్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సాధారణ నివాస ప్రాంతాలపై జరిపిన కాల్పుల్లో నలుగురు చిన్నారులు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 57 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయాలపాలైన కొందరిని ఆస్పత్రిలో చేరి్పంచారు. వారిలో కొందరు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మరణించిన వారిలో బల్విందర్ కౌర్ అలియాస్ రూబీ(33), మొహ్మద్ జైన్ ఖాన్(10), జోయా ఖాన్(12), మొహ్మద్ అక్రమ్(40), అమ్రిక్ సింగ్(55), మొహ్మద్ ఇక్బాల్(45), రంజీత్ సింగ్(48), షకీలా బీ(40), అమీర్జీత్ సింగ్(47), మరియం ఖటూన్(7), విహాన్ భార్గవ్(13), మొహ్మద్ రఫీ(40), ఒక లాన్స్ నాయక్లను గుర్తించారు. పూంచ్ జిల్లాతోపాటు బాలకోటె, మెన్ధార్, మాన్కోటె, కృష్ణ ఘతి, గుల్పార్, కెర్నీ సెక్టార్లలో పాక్ రేంజర్ల భారీ స్థాయిలో మోర్టార్లతో కాల్పులు జరిపారు. చారిత్రక ప్రాధాన్యమున్న పూంచ్ కోట, ఆలయాలు, గురుద్వారాలపైనా బుల్లెట్ల వర్షం కురిసింది. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లో ఐదుగురు మైనర్లుసహా పది మంది గాయపడ్డారు. కుప్వారా జిల్లాలోని కర్నాహ్ సెకాŠట్ర్లో బాంబుల శకలాలు పడి మంటలు అంటుకుని పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. బుధవారం మధ్యాహ్నందాకా ఈ కాల్పులు ఆగలేదు. ఈ కాల్పుల్లో ఇళ్లు, దుకాణాలు, వాహనాలు, బస్టాండ్లు ధ్వంసమయ్యాయి. జనావాసాలపై తుపాకులు ఎక్కుపెట్టడాన్ని మాజీ జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వేద్ తీవ్రంగా తప్పుబట్టారు. బోర్డర్కు ఆవల డజన్ల మంది మృతి పాక్ రేంజర్ల కాల్పులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. భారత సైన్యం కాల్పుల్లో సరిహద్దుకు ఆవల పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్లు ఇండియన్ ఆర్మీ బుధవారం ప్రకటించింది. దాయాది ఆర్మీ పోస్ట్లను ధ్వంసం చేసింది. ముందు జాగ్రత్తగా సరిహద్దు జిల్లాలైన జమ్మూ, సాంబా, కథువా, రాజౌరీ, పూంఛ్లలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలను బుధవారం మూసేశామని డివిజనల్ కమిషనర్ రమేశ్ కుమార్ చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దు వెంట పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా 13వ రోజు. పూంఛ్–రాజౌరీలోని భీంబర్ గలీలో పాక్ కాల్పులు కొనసాగిస్తోందని భారతఆర్మీలో అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. కాల్పుల బారిన పడకుండా అధికారులు సరిహద్దు ప్రాంతాల్లోని వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

‘ప్రధాని మోదీ చేతుల్లో భారత్ సురక్షితంగా ఉంది’
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడిని స్వాగతించారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్. ఉగ్రవాదాన్ని ఎప్పుడూ ప్రోత్సహించకూడదని, అది మానవాళి మనుగడకు అత్యంత ప్రమాదమన్నారు రవిశంకర్. ఆపరేషన్ సిందూర్ పై రవిశంకర్ మాట్లాడుతూ.. ‘ మనం నాగరిక సమాజంలో ఉన్నాం. మానవాళిని నాశనం చేసే ఉగ్రవాదులు దాడులు కానీ మిలిటెంట్ల దాడులను కానీ ఎంతమాత్రం ఉపేక్షించకూడదుఉగ్రవాదం అనేది ఓ ఆటవిక చర్య. భారత్ కేవలం పాక్లోని ఉగ్రస్థాపరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేసింది. ఇది హర్షించదగ్గ విషయం. భారత్ చేసిన దాడులపై ఏ ఒక్కరు మాట్లాడాలన్నా మాట్లాడటానికి ఏమీ లేదు. ఎందుకంటే భారత్ కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేసింది.ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని సహించబోమని పదే పదే చెబుతూ ఉన్నారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించలేదని చాలాసార్లు చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేయాల్సి వచ్చింది. ఇది కచ్చితంగా తెలివైన నిర్ణయమే. ప్రస్తుతం భారత్ నరేంద్ర మోదీ చేతుల్లో సురక్షితంగా ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాలతో భారత్ కు మేలే జరుగుతుంది. ఆయనకు మరింత ఆత్మస్థైర్యం కలగానికి ప్రార్దిద్దాం అని రవిశంకర్ అన్నారు.
ఎన్ఆర్ఐ

వైట్హౌస్లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్కు చెందిన ప్రేమ్సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

బావ మా అక్క మరో పెళ్లి చేసుకుంటుంది..!
బంజారాహిల్స్(హైదరాబాద్): భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా..భర్తకు దూరంగా ఉంటున్న భార్య మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని ప్రశ్నించగా..అతనిపై రోకలితో దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నేపాల్ దేశం బరాండ్కు చెందిన కృష్ణదమత్ బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. 2013లో సునీత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జూబ్లీహిల్స్లోని ఓ పబ్లో హౌస్కీపింగ్గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నాడు. 2024 అక్టోబర్లో కుటుంబాన్ని తన గ్రామానికి పంపించేందుకు స్నేహితుడి నుంచి రూ.1.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇదే విషయమై సునీతకు, కృష్ణకు గొడవలు జరిగాయి. ఇదే క్రమంలో జనవరి 3న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కృష్ణకు భార్యతో మరోసారి గొడవ జరిగింది. దీంతో సునీతను ఇంటి నుంచి పంపించివేశాడు. అప్పటి నుంచి భార్యతో ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. ఇదిలా ఉండగా మంగళవారం సునీత సోదరుడు దీపక్..కృష్ణదమత్కు ఫోన్చేసి తన సోదరి అమర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. దీంతో కృష్ణదమత్ వెంటనే నందినగర్లోని సునీత ఉండే నివాసానికి వెళ్లి నిలదీశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా సునీత అల్యుమినియం రోకలితో భర్తపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కుడికంటి వద్ద తీవ్రంగా గాయమై రక్తస్రావం జరిగింది. ఆమెతో పాటు అమర్ కూడా కృష్ణదమత్పై దాడి చేయగా బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

డాడీ.. లే డాడీ..
తంగళ్లపల్లి (సిరిసిల్ల): తండ్రి నిద్రపోయాడనుకున్న ఆ రెండేళ్ల చిన్నారి చనిపోయిన తండ్రిని ‘డాడీ.. లే డాడీ’.. అంటూ పిలవడం అందరినీ కంటతడి పెట్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్నగర్ (డబుల్ బెడ్రూం సముదాయం)లోని బ్లాక్ నంబర్ 18, రూం నంబర్ 6లో నివాసముంటున్న తాడూరి రామ్కుమార్ (38) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. రామ్కుమార్ 14 ఏళ్ల కిత్రం వేములవాడకు చెందిన అనితను కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం సుఖజిత్ (11), శ్రీవాస్తవ్ (5), విహాన్ (2). రామ్కుమార్ జిరాక్స్ మెషీన్ మెకానిక్గా, వివాహ ఈవెంట్లలోనూ పనిచేస్తుండేవాడు. పనులు సరిగాలేక రామ్కుమార్కు రూ.3 లక్షల వరకు అప్పులు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం మధ్యాహ్నం భార్య వంట గదిలో ఉన్న సమయంలో పెద్ద కొడుకు సుఖజిత్తో మాట్లాడిన రామ్కుమార్, తమ్ముళ్లను బాగా చూసుకోమని చెప్పి గదిలోకి వెళ్లి డోర్ వేసుకుని ఉరేసుకున్నాడు. ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో భార్య కేకలతో స్థానికులు వచ్చి తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే మృతిచెందాడు. ట్రెయినీ ఎస్సై వినీతారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కర్రిగుట్టల్లో రక్తపుటేర్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్టలు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 38 మంది మావోయిస్టులు చనిపోయినట్టు విశ్వసనీయవర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ మాత్రం.. 22 కంటే ఎక్కువ మావోయిస్టుల మృతదేహాలు లభించినట్లు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ బుధవారం ఉదయమే జరిగినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మొదలైంది. తొలుత 15 మంది మావోయిస్టులు మాత్రమే చనిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత ఈ సంఖ్య గంటగంటకూ పెరగగా, ఛత్తీస్గఢ్ సీఎం మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని రోజులుగా కర్రిగుట్టల దగ్గర యాంటీ నక్సలైట్ ఆపరేషన్ కొనసాగుతోంది. భద్రతా దళాలకు ఈ రోజు భారీ విజయం దక్కింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది..’అని వెల్లడించారు. మృతదేహాలేవీ..? బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రిగుట్టల సమీపాన గుంజపర్తి – ఇత్తగూడ సమీపంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టు సమాచారం. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను స్వా«దీనం చేసుకున్నామని ఛత్తీస్గఢ్ సీఎం ప్రకటించినా..ఎవరెవరు చనిపోయారు? ఆ మృతదేహాలను ఎక్కడికి, ఎలా తరలించారనే అంశాలపై స్పష్టత రాలేదు. దీంతో చనిపోయిన మావోయిస్టుల్లో అగ్రనేతలు ఉన్నారా లేక దళ సభ్యులు, జన మిలీషియా సభ్యులే ఉన్నారా? అనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ గుట్టలపై తెలంగాణ మావోయిస్టు కమిటీతో పాటు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, పీఎల్జీఏ బెటాలియన్ వన్ ఉన్నట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు బుధవారం ఐఈడీ పేలి ఓ జవాను గాయపడగా, ఎలుగుబంటి దాడిలో ఇంకొకరు గాయపడినట్టు తెలుస్తోంది. అయితే వీటిపై పోలీసు వర్గాల నుంచి అధికారిక సమాచారం అందలేదు. మిషన్లో అంతా గోప్యతే మంగళవారం డ్రోన్తో తీసిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. కొందరు సాయుధులు నడిచి వెళ్తున్న దృశ్యాలు వాటిల్లో కనిపించాయి. ఈ వీడియో ‘మిషన్ సంకల్ప్’కు సంబంధించినదే అని ప్రచారం జరిగినా, అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. అయితే ఆ మరుసటి రోజే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఒక్క వీడియోనే కాదు మిషన్ సంకల్ప్ మొదలైనప్పటి నుంచి అన్ని విషయాల్లో భద్రతా దళాలు గోప్యత పాటిస్తున్నాయి. మావోయిస్టులు ఉపయోగించిన గుహలు అంటూ వైరల్ అయిన వీడియోలపైనా స్పష్టత కరువైంది. ఏప్రిల్ 24న జరిగిన ఒక ఎన్కౌంటర్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు చనిపోయారని ప్రకటించి, వారి పేర్లు, ఫొటోలు వెల్లడించడానికి 72 గంటల సమయం తీసుకున్నారు. వారు ఎక్కడివారనేది వెల్లడించలేదు. అలాగే మంగళవారం చనిపోయిన మరో మహిళా మావోయిస్టుకు సంబంధించిన వివరాలపై కూడా స్పష్టత లేదు. ప్రస్తుత భారీ ఎన్కౌంటర్ విషయంలోనూ అదే గోప్యత కొనసాగుతోంది. కొనసాగుతున్న ఆపరేషన్ మిషన్ సంకల్ప్ ఏప్రిల్ 21న మొదలైంది. ఈ ఆపరేషన్లో 24 వేల మంది బలగాలను, నాలుగు హెలీకాప్టర్లు, రెండు డ్రోన్లు, 20 వరకు ఆన్మ్యాన్డ్ వెహికల్స్(యూఏవీ)ను ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు కర్రిగుట్టల్లో 70 శాతం ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ అ«దీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 6 తర్వాత దశల వారీగా ఇక్కడ బలగాలను తగ్గించాలని ముందుగా నిర్ణయించినా, బుధవారం నాటి ఎన్కౌంటర్ నేపథ్యంలో మరికొన్ని రోజులు యధాతథంగా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 184 మంది మావోయిస్టులు చనిపోయారు.ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటుములుగు: మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు బుధవారం లొంగిపోయినట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో కొమటిపల్లికి చెందిన ఆర్పీసీ సభ్యుడు మడావి భీమా, జంగిల్శాఖ సభ్యుడు మడావి కోస, డీకేఏఎంఎస్ సభ్యుడు మడివి భీమా, ఆర్పీసీ సభ్యుడు వంజం ఊర, చైతన్య నాట్యమండలి సభ్యురాలు వంజం హుంగి ఉన్నట్లు చెప్పారు.

నూడుల్స్ తిని భర్త మృతి.. భార్యపై అనుమానం..!
జూలూరుపాడు: పూడ్చి పెట్టిన యువకుడి మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసిన ఘటన మంగళవారం జూలూరుపాడులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జూలూరుపాడు ఎస్సీకాలనీకి చెందిన కత్తి రాములు, నాగమణి దంపతుల కుమారుడు కత్తి అరవింద్ (26) ఇటీవల మృతి చెందగా.. మృతిపై అనుమానాలున్నాయని తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.తహసీల్దార్ స్వాతిబిందు సమక్షంలో జేసీబీ సాయంతో సమాధి తొలగించి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. ఫోరెన్సిక్ నిపుణులు రమణమూర్తి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవి, సీఐ ఇంద్రసేనారెడ్డి వివరాలు వెల్లడించారు. ఐదు నెలల కిందట అరవింద్కు ఏన్కూర్కు చెందిన సింధుతో వివాహమైంది. గత నెల 1వ తేదీన పుట్టింటికి వెళ్లిన సింధు అత్తగారింటికి వచ్చింది. ఏప్రిల్ 2న ఫ్రైడ్ రైస్, నూడుల్స్ తిన్న అరవింద్ విరేచనాలు, వాంతలు కావడంతో ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. 7వ తేదీన అరవింద్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా.. ఐదు రోజుల అనంతరం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 16న మృతి చెందాడు. కాగా, ఈ నెల 4న మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని వెలికితీసి, తహసీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించామని సీఐ పేర్కొన్నారు. ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ సీహెచ్ ఆదినారాయణ, పంచాయతీ సెక్రటరీలు హరిబాబు, లక్ష్మణ్, పోలీసులు పాల్గొన్నారు.
వీడియోలు


పదుల సంఖ్యలో ఉగ్ర వాదులను మట్టిలో కలిపేసిన భారత యోధులు


భారత్ ప్రతీకారం తీర్చుకుంది - సినీ ప్రముఖులు


భ్రమరావతి మీద పెట్టిన శ్రద్ధ కొంచం రైతులపై కూడా పెట్టండి..


ఆపరేషన్ సిందూర్ శాటిలైట్ చిత్రాల్ని విడుదల చేసిన భారత్


సరిహద్దుల్లో హై అలర్ట్ 400కిపైగా ఫ్లైట్స్ క్యాన్సిల్


తిరుమల ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు


విజయ సిందూరం పెరిగిన భారత్ ప్రతిష్ట


పాక్ వెన్నులో వణుకు పుట్టించిన ఆధునిక మిస్సైల్స్ ఏంటో తెలుసా ?


బలూచిస్థాన్ రెబల్స్ కాల్పులతో ఎయిర్ పోర్ట్ లు బంద్


భారత్ జవాన్లకు మద్దతుగా సీఎం రేవంత్ ర్యాలీ