ఎయిర్‌పోర్ట్‌లో ఓ వ్యక్తి చేసిన పని వినడానికే రోత

విమానాశ్రయాల్లో చోటు చేసుకునే కొన్ని వింత ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి చేసిన పని వినడానికే రోత పుడుతోంది. వివరాలు.. ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌లో ప్రయాణికులతోపాటు ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా ఆయన అందరిముందే మూత్ర విసర్జన చేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఛీ అంటూ చుట్టుపక్కల వాళ్లు వికారంగా మొహం పెట్టారు. వాళ్లేంటి.. ఈ విషయం తెలిసిన ఎవరైనా ఛీ.. యాక్‌ అనుకోకుండా ఉండరు. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top