విజయ్‌ శంకర్‌ బ్యాడ్ లక్.. తొలి హాఫ్‌ సెంచరీ మిస్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 156 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయింది. భారత ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌(46; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అయితే మంచి జోరు మీదున్న విజయ్‌ శంకర్‌ను దురదృష్టం వెంటాడిందనే చెప్పాలి. స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న కోహ్లి స్ట్రైట్‌ డ్రైవ్‌ ఆడగా, విజయ్‌ శంకర్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top