వారితో నాట్యం చేయించడం సంతోషంగా ఉంది: షమీ
మూడు టెస్టుల సిరీస్లో దక్షిణాఫ్రికాను వైట్వాష్ చేసిన టీమిండియా ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్లో ఆగ్రస్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఇక ఈ టెస్టు సిరీస్లో భారత బౌలర్లు 60 వికెట్లు పడగొట్టగా అందులో పేస్ బౌలర్లే 26 వికెట్లు దక్కించుకోవడం విశేషం. అత్యధికంగా మహ్మద్ షమీ 13 వికెట్లతో భారత బౌలింగ్ దళానికి నాయకత్వం వహించాడు. ఆ తర్వాత కేవలం చివరి రెండు టెస్టుల్లోనే ఉమేశ్ యాదవ్ 11 వికెట్లు దక్కించుకోవడం విశేషం. అయితే ఈ సిరీస్లో భారత్కు లాభించిన మరో అంశం టెయిలెండర్లు బ్యాట్తో రాణించడం. ముఖ్యంగా రాంచీ టెస్టులో ఉమేశ్ యాదవ్ సిక్సర్ల మోతతో పాటు షమీ కూడా తన బ్యాట్కు పనిచెప్పడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించగలిగింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు