భువనేశ్వర్‌ కుమార్‌ అరుదైన ఘనత | Bhuvneshwar Kumar Becomes First Indian Pacer To Take Five wickets In T20Is | Sakshi
Sakshi News home page

Feb 19 2018 11:09 AM | Updated on Mar 22 2024 10:48 AM

 టీమిండియా పేస్‌ బౌలర్‌, డెత్‌ ఓవర్స్‌ స్పెషలిస్టు భువనేశ్వర్‌ కుమార్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఐదు వికెట్లతో ప్రొటీస్‌ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శన(5/24)తో టీ20ల్లోఐదు వికెట్లు పడగొట్టిన తొలి భారత్‌ పేస్‌ బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. అంతేకాకుండా అన్ని ఫార్మాట్లలో ఐదు వికెట్లు తీసిన తొలి భారత పేస్‌ బౌలర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో యుజువేంద్ర చహల్‌ ఒక్కడే ఐదు వికెట్లు సాధించగా భువీ రెండో బౌలర్‌గా రికార్డుకెక్కాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement