ఆ బాల్‌ వైడ్‌గా ఇచ్చుంటే..

ఎక్కడైనా గెలుపు-ఓటములు సహజం. మరి గెలుపు అంచుల వరకూ వచ్చి ఓటమి పాలైతే మాత్రం అది చాలా నిరాశను మిగులుస్తుంది. ఇప్పుడు భారత క్రికెట్‌ పరిస్థితి ఇలానే ఉంది. న్యూజిలాండ్‌లో తొలి టీ20 సిరీస్‌ గెలుద్దామనుకున్న భారత్‌.. దాన్ని అందుకునే ప్రయత్నంలో కడవరకూ పోరాడినా సఫలీకృతం కాలేదు. ఆదివారం కివీస్‌తో జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టీ20లో భారత్ నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమి పాలైంది. ప్రధానంగా చివరి మూడు ఓవర్లలో విజయానికి 48 పరుగులు అవసరమైన సమయంలో భారత్‌ పోరాడిన తీరు అసాధారణం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top