డల్లాస్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా అమెరికాలోని డల్లాస్లో పార్టీ ఎన్నారై వింగ్ సభ్యులు పెద్ద ఎత్తున వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఎన్నారై సభ్యులతో పాటు అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లను గెలుచుకోవడం ప్రజావిజయమని పేర్కొన్నారు. ప్రజా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి పట్టంకట్టినందుకు ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలన అందించాలని ఆకాక్షించారు.
డల్లాస్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భారీ ర్యాలీ
Jun 12 2019 8:06 PM | Updated on Jun 12 2019 8:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement