దిశ ఘటన: లోక్‌సభలో మహిళా ఎంపీల గళం | YSRCP MP Vanga Geetha Comments Over Disha Incident in Lok Sabha | Sakshi
Sakshi News home page

దిశ ఘటన: లోక్‌సభలో మహిళా ఎంపీల గళం

Dec 2 2019 2:18 PM | Updated on Dec 2 2019 2:21 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ దిశ ఘటనపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో సోమవారం చర్చ జరిగింది. ఘటనను తీవ్రంగా ఖండించిన ఇరు సభలు.. త్వరగతిన కేసును విచారించి దోషులకు సత్వరమే శిక్ష విధించాలని విఙ్ఞప్తి చేశాయి. పాశవిక ఘటనపై చర్చ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మహిళా ఎంపీలు తమ గళం వినిపించారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ... ఇలాంటి ఘటలనకు పాల్పడాలంటే భయపడే విధంగా చట్టాలు రూపొందించాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఇటువంటి దారుణాలు అరికట్టలేకపోతే ఆడపిల్లలను మళ్లీ ఇంటికే పరిమితం చేయాలనే ఆలోచన వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ ఇది హృదయ విదారక ఘటన. నిర్భయ ఘటన తర్వాత అందరి హృదయాలను అంతగా కలచివేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement