రుణమాఫీ పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున పసుపు-కుంకుమ పేరుతో మరోసారి మోసానికి దిగారని మండిపడ్డారు. మహిళల తాళిబొట్టులు తెంపే విధంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారనీ, మహిళల ద్రోహి అని త్రీవ స్థాయిలో ధ్వజమెత్తారు.