ఈవీఎంలు పనిచేయడం లేదంటూ పుకార్లు పుట్టిస్తున్నారని.. ఈ విషయమై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నేతలు వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్ నాగిరెడ్డి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి విఙ్ఞప్తి చేశారు. గురువారం ఆయనను కలిసి ఎన్నికల నిర్వహణతో పాటు పలు అంశాలపై ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చాలా నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్న చోట డబ్బులు పంపిణీ చేస్తున్నారని ద్వివేది దృష్టికి తీసుకువెళ్లారు. ఈవీఎంల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
‘టీడీపీ నేతలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు’
Apr 11 2019 1:52 PM | Updated on Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement