హోదా కోసం పోరాడుతున్నది వైఎస్‌ జగన్‌ మాత్రమే | YSRCP Leader varaprasad On YS Jagan Tirumala Visit | Sakshi
Sakshi News home page

హోదా కోసం పోరాడుతున్నది వైఎస్‌ జగన్‌ మాత్రమే

Jan 10 2019 4:46 PM | Updated on Mar 20 2024 3:59 PM

వైఎస్సార్‌ సీపీ తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్‌ మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత  వైఎస్‌ జగన్‌ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చారని అన్నారు. వైఎస్‌ జగన్‌కు తప్పకుండా స్వామివారి ఆశీస్సులు ఉంటాయని.. ఆయన సీఎం కావాలనే ప్రజల అందరి కోరికను భగవంతుడు నెరవేరుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. అబద్దాలు చెబతూ, అక్రమాలకు పాల్పడే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వామివారు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు తీర్చమని శ్రీవారిని కోరడానికే వైఎస్‌ జగన్‌ ఓ సామాన్య భక్తుడిలా ఇక్కడికి వచ్చినట్టు  తెలిపారు. టీడీపీ చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. 600 హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ది కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది కేవలం వైఎస్‌ జగన్‌ మాత్రమేనని అన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement