ఏపీ ప్రజల సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిన ఓ నేరగాడు, దొంగ, నారాసురుడు అనే రాక్షసుడు ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ సమరశంఖారావం సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు.