బాబు వస్తే ఉచిత విద్యుత్‌ ఉండదు | Ys Jagan Speech In Mylavaram Public Meeting | Sakshi
Sakshi News home page

బాబు వస్తే ఉచిత విద్యుత్‌ ఉండదు

Apr 3 2019 6:32 PM | Updated on Apr 3 2019 7:59 PM

మైలవరంలో దౌర్జన్యాలు, గూండాయిజం, రౌడీయిజం టీడీపీ హయాంలో బాగా పెరిగిపోయాయని వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసగించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఇదే మైలవరం నియోజకవర్గం నుంచి తన సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేశానని గుర్తు చేశారు. ఇక్కడి పోలీసులు టీడీపీకి ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement