రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 296వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం జననేత సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలంలోని తన నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కంచేడువలస క్రాస్ మీదుగా వెంకటభిరిపురంకు చేరుకుంటారు. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బగ్గందొర వలస, గెద్దలుప్పి జంక్షన్ మీదుగా తామరకండి వరకూ పాదయాద్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
296వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
Nov 13 2018 7:00 AM | Updated on Mar 20 2024 3:54 PM
Advertisement