వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య | West Godavari, YSRCP Activist Murdered In Land Disputes | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

Nov 15 2019 6:32 PM | Updated on Mar 21 2024 8:31 PM

సాక్షి, పశ్చిమగోదావరి : భీమడోలు మండలం అంబరుపేటలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. భూవివాదం నేపథ్యంలో పసుపర్తి కిశోర్‌పై దుండగులు రాడ్లతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన కిశోర్‌ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సోదరుడు గోపాలం ప్రోద్బలంతో టీడీపీ నాయకులు దాడిచేసి చంపారని కిశోర్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు చేరుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement