పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సతీమణి కుల్సుమ్ నవాజ్ (68) కన్నుమూసిన విషయం తెలిసిందే. దీర్ఘకాలంగా కేన్సర్తో బాధపడుతున్న ఆమె లండన్లో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ తన సతీమణితో గడిపిన చివరి క్షణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంత దేశ ప్రధాని అయినా ఒకరికే భర్తేకదా.. నవాజ్ షరీఫ్ భావోద్వేగంతో కూడుకున్న ఈ వీడియోలో తన భార్య కోసం ‘కుల్సుమ్ ఒక్కసారి కళ్లు తెరవవా.. ఆ అల్లా నీకు శక్తిని ప్రసాదించాలి’ అంటూ ఉర్దూలో ఆయన మాట్లాడిన చివరి మాటలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ఏడాది జూలైలో అక్రమ ఆస్తుల కేసులో ఆయనపై 11 ఏళ్ల శిక్ష పడిన విషయం తెలిసిందే. దీంతో లండన్ నుంచి బయలుదేరుతున్న సమయంలో నవాజ్ షరీఫ్ తన సతీమణితో చివరిసారిగా మాట్లాడారు.
కుల్సుమ్ ఒక్కసారి కళ్లు తెరవవా
Sep 12 2018 11:31 AM | Updated on Mar 22 2024 11:28 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement