వైఎస్ఆర్ జిల్లా, రాయచోటి వీరభద్రుని ఉత్సవాలలో అపశృతి దొర్లింది. అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమంలో ఇద్దరు భక్తులు జారిపడ్డారు. ఈ సంఘటనలో రాయచోటికే చెందిన లక్ష్మిదేవి, రామాంజులమ్మలకు తీవ్రగాయాలవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. అయితే పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు.