యూపీలో ఘోర రైలు ప్రమాదం | Train Hits School Bus in UP Kushinagar | Sakshi
Sakshi News home page

యూపీలో ఘోర రైలు ప్రమాదం

Apr 26 2018 9:42 AM | Updated on Mar 20 2024 3:35 PM

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ వేకువ ఝామున స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఓ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది చిన్నారులతోపాటు డ్రైవర్‌ కూడా దుర్మరణం పాలయ్యారు.  కుశినగర్‌ జిల్లాలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

డివైన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన వ్యాన్‌ పిల్లలను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ రైల్వే క్రాసింగ్‌ వద్ద దాటుతుండగా.. వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement