చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్సీలు.. కీలక భేటీకి డుమ్మా

 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి  సొంత పార్టీ ఎమ్మెల్సీల నుంచి ఊహించని షాక్‌ తగిలింది. చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో ఆదివారం టీడీపీఎల్పీ భేటీ అయ్యింది. అయితే ఈ సమావేశానికి ఆరుగురు మండలి సభ్యులు డుమ్మా కొట్టారు. వీరిలో గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ, శమంతకమణి ఉన్నారు. పార్టీ అధినేతకు కనీస సమాచారం లేకుండా గైర్హాజరు కావడంతో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top