షాజహాన్ సంతకం పెట్టి రాసిచ్చారా మీకేమైనా? | Sakshi
Sakshi News home page

షాజహాన్ సంతకం పెట్టి రాసిచ్చారా మీకేమైనా?

Published Thu, Apr 12 2018 8:57 AM

మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ నిర్మించిన ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ తమకే చెందుతుందని ఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు షాజహాన్‌ అప్పట్లో వక్ఫ్‌నామాను తమకు అనుకూలంగా జారీచేశారని తెలిపింది. వాదనలు విన్న కోర్టు షాజహాన్‌ సంతకంతో జారీచేసిన పత్రాలను వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది.