ఇద్దరు జవాన్లపై హోటల్‌ సిబ్బంది కర్రలతో దాడి | Sakshi
Sakshi News home page

ఇద్దరు జవాన్లపై హోటల్‌ సిబ్బంది కర్రలతో దాడి

Published Sun, Jun 2 2019 5:12 PM

భాగ్‌పత్‌లోని ఓ హోటల్‌ సిబ్బంది ఇద్దరు జవాన్లపై కర్రలతో దాడికి దిగింది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. జవాన్లను తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. కర్రలతో దాడి చేసిన ఈ ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌చేశారు. వివరాలు.. రెస్టారెంట్‌లో పని చేస్తున్న వ్యక్తులకు జవాన్లకు మధ్య వాగ్వాదం జరుగుతుండగా.. ఇంతలో ఒక్కసారిగా ఇరు వర్గాలు కొట్టుకోవడం ప్రారంభించాయి. అయితే జవాన్లు ఇద్దరే ఉండడంతో ప్రత్యర్థి గుంపు దాడిని నిలువరించలేకపోయారు.