కూకట్‌పల్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

నగరంలోని కూకట్‌పల్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కూకట్‌పల్లి వై జంక్షన్‌ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు మరో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో రెండు బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డ్రైవర్‌ అనుభవ రాహిత్యమై ఈ ప్రమాదానికి కారణమని మండిపడ్డ ప్రయాణికులు.. డ్రైవర్‌ను చితక్కొట్టారు. రెండు బస్సులు నడిరోడ్డుపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top