కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నుస్తులాపూర్‌లో రోడ్డు దాటుతున్న బైక్‌ను, కారు ఢీ కొట్టింది. కారు వేగం ఎక్కువగా ఉండటంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు చాలా దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతున్ని నుస్తులాపూర్‌కు చెందిన ఆవుల రవిగా గుర్తించారు. గాయపడ్డ సమ్మయ్యను ఆస్పత్రికి తరలించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top