రాష్ట్ర మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలో మహిళలపై దౌర్జన్యం జరిగింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రిని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన మహిళలను పోలీసులు ఈడ్చిపారేశారు. అనంతరం వారిని అరెస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు మంత్రి సునీత కాన్వాయ్పై చెప్పులు, పొరకలు, చేటలు విసిరి నిరసన తెలిపారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చేయకుండా మోసం చేసి, తిరిగి ఎన్నికల సమయంలో మోసపు మాటలు చెప్పడం, ప్రశ్నించిన మహిళలను పోలీసులతో అరెస్టు చేయించి విచక్షణారహితంగా వ్యవహరించడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి కాన్వాయ్పై చెప్పుల వర్షం
Feb 4 2019 7:19 AM | Updated on Mar 22 2024 11:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement