గురువాయుర్‌లో మోదీ తులాభారం | PM Narendra Modi offers prayers at Guruvayur temple in Kerala ahead of Maldives trip | Sakshi
Sakshi News home page

గురువాయుర్‌లో మోదీ తులాభారం

Jun 8 2019 11:03 AM | Updated on Mar 22 2024 10:40 AM

సాధారణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కేరళలో పర్యటించారు. త్రిసూర్‌ జిల్లాలోని గురువాయూర్‌ ఆలయంలో పళ్లు, రూపాయి నాణేలతో తులాభారం వేయించుకున్నారు. అనంతరం శ్రీకృష్ణ భగవానున్ని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ తిరుమల శ్రీవారి దర్శన నిమిత్తం ఆదివారం ఆంధ్రప్రదేశ్‌కి రానున్నారు. ఈ మధ్యలో ఆయన మాల్దీవుల్లో జరిగే విదేశాంగ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని శ్రీలంక రాజధాని కొలంబో మీదుగా రేణిగుంట చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement