మళ్లీ పట్టాలెక్కిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ | Pakistan restores Samjhauta Express services to Delhi | Sakshi
Sakshi News home page

మళ్లీ పట్టాలెక్కిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్

Mar 5 2019 7:34 AM | Updated on Mar 22 2024 11:17 AM

భారత్‌–పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రద్దయిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ లాహోర్‌–ఢిల్లీ మధ్య మళ్లీ పరుగులు పెడుతోంది. సంఝౌతా సర్వీసును పునరుద్ధరించినట్లు పాక్‌ సోమవారం ప్రకటించింది. ఇటీవల ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నేపథ్యంలో సంఝౌతా రైలు సర్వీసును ఫిబ్రవరి 28న పాక్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. సోమవారం దాదాపు 150 మంది ప్రయాణికులతో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ లాహోర్‌లో బయలుదేరినట్లు పాక్‌ రేడియో ప్రకటించింది. ఈ రైలు లాహోర్‌ నుంచి ప్రతి సోమ, గురువారాల్లోనూ, ఢిల్లీ నుంచి ఆది, బుధవారాల్లోనూ బయలుదేరుతుంది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement