జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ కీలక నిర్ణయం | Sakshi
Sakshi News home page

జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ కీలక నిర్ణయం

Published Sat, Feb 23 2019 7:23 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కేసు విచారణను ఇకపై ఇన్‌ కెమెరా ద్వారా చేపట్టాలని విజయవాడలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించిన ఇరుపక్షాల న్యాయవాదులు తప్ప, మరెవ్వరూ కూడా ఈ కేసు విచారణ సమయంలో కోర్టులో ఉండరాదని స్పష్టంచేసింది. అలాగే, ఇకపై ఈ కేసుకు సంబంధించి కోర్టులో జరిగే విచారణపై ఎలాంటి వార్తలు రాయడంగానీ, ప్రసారం చేయడంగానీ చేయరాదని పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాను ఆదేశించింది.