ఒడిసా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణస్వీకారం
ఒడిసా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ వరుసగా ఐదోసారి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాయక్తో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ను ఒడిషా గవర్నర్ గణేషి లాల్ ఆదివారం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దేశంలో దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో నవీన్ పట్నాయక్ (72) ముందువరసలో నిలుస్తారు. లోక్సభతో పాటు జరిగిన ఒడిసా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్ధానాల నుంచి పోటీ చేసిన పట్నాయక్ రెండింటిలోనూ భారీ మెజారిటీతో గెలుపొందారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు