ప్రేమ పేరుతో మోసం,చెప్పుతో కొట్టిన బాధితురాలు

సినిమాల్లో అవకాశం కల్పిస్తా మని నమ్మించి, ప్రేమిస్తున్నానని పెళ్లి చేఐసుకుంటానని మాయ మాటలు చెప్పి, ఓ సినీ నటి, డబ్బింగ్‌ ఆర్టిస్ట్, యాంకర్‌కు మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడిన జూనియర్‌ ఆర్టిస్టుపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా , మానేపల్లి గ్రామానికి చెందిన కొండా పుల్లారెడ్డి అలియాస్‌ శ్రీశాంత్‌ రెడ్డి శ్రీకృష్ణానగర్‌లో ఉంటూ సినిమా షూటింగ్‌లకు యువతులను సరఫరా చేసే కో–ఆర్డినేటర్‌గానే కాకుండా సినిమాల్లో నటిస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్‌లో నటి, యాంకర్, డబ్బింగ్‌ ఆర్టిస్టుతో అతడికి పరిచయం ఏర్పడింది. గత డిసెంబర్‌ 10న బోరబండలోని ఆమె గదికి వెళ్లిన శ్రీశాంత్‌ ద్రాక్షరసంలో మత్తుమందు కలిపి తాగించాడు.

ఆమె మత్తులోకి జారుకున్న అనంతరం లైంగికదాడికి పాల్పడటమే కాకుండా, బీరువాలో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు తీసుకుని పరారయ్యాడు. కొద్దిరోజుల తర్వాత ఆమె నిలదీయగా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ఎన్నిమార్లు అడిగినా దాటవేస్తుండటంతో బాధితురాలు గురువారం నటి శ్రీరెడ్డిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరింది. అదే సమ యంలో శ్రీశాంత్‌ రెడ్డి తనను కొందరు బెదిరిస్తున్నారంటూ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top