చంద్రబాబు ఓడినందుకు శ్రీవారికి మొక్కులు చెల్లించా | Motkupalli Narasimhulu Visits Tirumala | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఓడినందుకు శ్రీవారికి మొక్కులు చెల్లించా

Jun 6 2019 11:50 AM | Updated on Mar 22 2024 10:40 AM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓడిపోవడమే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ లక్ష్యమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అందుకే చంద్రబాబు ఈ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు. గురువారం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న మోత్కుపల్లి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ మనోవాంఛ నెరవేరాలని గతంలో అలిపిరి నుంచి మెట్లు ఎక్కానని గుర్తుచేశారు. తను మొక్కును నెరవేర్చిన శ్రీవారికి ఇప్పుడు మొక్కు చెల్లించుకున్నానని ఆయన తెలిపారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement