11 సాంకేతిక సంస్థలతో ఎంవోయూ: మంత్రి | Sakshi
Sakshi News home page

11 సాంకేతిక సంస్థలతో ఎంవోయూ: మంత్రి

Published Mon, Feb 10 2020 3:29 PM

దేశంలోనే పేరుగాంచిన 11 సాంకేతిక సంస్థలతో ఎంవోయూ ఒప్పందాలు కుదిరాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. సోమవారం మీడియా సమావేశంలో  ఆయన మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక అడుగులు వేస్తున్నామన్నారు. ఎంఎస్‌ స్వామినాథన్‌, ఐకార్‌తో పాటు మొత్తం 11 సంస్థలతో ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ఈ సంస్థలు వ్యవసాయరంగానికి కావాల్సిన సాంకేతిక సహాయం, సలహాలు ఇస్తాయన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విస్తరణను గ్రామ స్థాయికి తీసుకు వెళ్లాలన్నదే ముఖ్య ఉద్దేశం అన్నారు.

Advertisement
Advertisement