మహాత్మా గాంధీకి ప్రధాని నివాళులు | Sakshi
Sakshi News home page

మహాత్మా గాంధీకి ప్రధాని నివాళులు

Published Tue, Oct 2 2018 10:18 AM

భారత జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో ఆయన సమాధి వద్ద భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీలు నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం 7.16 గంటలకు మొదటగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, 7.33 గంటలకు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, 7.36 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ, 8.19 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌లు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. మహాత్ముడి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.