మహాశివరాత్రితో ముగిసిన కుంభమేళా | Kumbh Mela concludes today, devotees take last dip at Sangam | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రితో ముగిసిన కుంభమేళా

Mar 5 2019 8:33 AM | Updated on Mar 22 2024 11:17 AM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌(అలహాబాద్‌)లో జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా ముగిసింది. మహాశివరాత్రితో పాటు కుంభమేళా చివరిరోజు కావడంతో సోమవారం పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పవిత్ర సంగమానికి పోటెత్తారు. జనవరి 15 న ప్రారంభమైన కుంభమేళాలో భాగంగా సోమవారం సాయంత్రం నాటికి మొత్తం 24.05 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి నేపథ్యంలో ఒక్కరోజే 1.10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. సన్నటి వర్షపు జల్లులు కురుస్తున్నప్పటికీ భక్తులందరూ ‘హరహర మహాదేవ్‌’అంటూ శివనామస్మరణ చేస్తూ ముందుకుసాగారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement