పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ | Krishna River flood water inflow increases | Sakshi
Sakshi News home page

పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ

Sep 10 2019 10:04 AM | Updated on Mar 22 2024 11:30 AM

ఎగువన కురుస్తున్న వర్షాలకు మళ్లీ వరద పోటెత్తుతోంది. జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి దృష్ట్యా అధికారులు మంగళవారం ఉదయం సాగర్‌ రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల నుంచి పులిచింతలకు.. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేశారు. గత వరద ముంపును దృష్టిలో పెట్టుకుని అధికారులు నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌, ప్రకాశం బ్యారేజీల  వద్ద  వరద ఉధృతి కొనసాగుతోంది.
 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement