కనీసం పది సీట్లలోనైనా పోటీ చేస్తాం

తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) పార్టీ గుర్తు అగ్గిపెట్టెను ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీసం పది సీట్లలోనైనా పోటీ చేయాలని టీజేఎస్‌ భావిస్తుందన్నారు. నేడు మహాకూటమి పొత్తులపై చర్చించడానికి కాంగ్రెస్‌ నేతలను కలుస్తున్నట్టు తెలిపారు. ఈ రోజు సాయంత్రం వరకు కూటమికి తుది రూపం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీపావళి వరకు మహాకూటమి నెలకొంటుందని అన్నారు. మహాకూటమి ఏర్పాటు ప్రజలకు భరోసా నింపిందని పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top