చంద్రబాబు అడుగుపెడితే ఊరుకోం: కేసీఆర్
ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అధినేత, ఆపధర్మ సీఎం కేసీఆర్.. ఏపీ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లాకు తలమానికంగా మారిన సీతారామ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు.. వాటిని వెనక్కి తీసుకున్న తరువాతనే ఈ గడ్డపై అడుగుపెట్టాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే ఇక్కడికి రావాలని, లేకపోతే ఊరుకోమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. యాభైఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఖమ్మంలో పోడు భూములు తప్ప రైతులకు ఏమీ మిగిల్చలేక పోయారని మండిపడ్డారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు