ఐటీ దాడులు | IT Raids On Cash For Vote Scam | Sakshi
Sakshi News home page

ఐటీ దాడులు

Sep 27 2018 12:27 PM | Updated on Mar 20 2024 3:38 PM

‘ఓటుకు నోటు కోట్లు’  కేసులో ఏ1 రేవంత్‌ రెడ్డి, ఏ2 సెబాస్టియన్‌లు లక్ష్యంగా ఆదాయపు పన్ను శాఖ దాడుల నిర్వహించింది. ఓటకు నోటు విషయంలో తెలంగాణ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌కు ఇచ్చిన 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తున్నట్టు సమాచారం. ముందస్తు అంగీకారం ప్రకారం ఇచ్చిన రూ 50 లక్షలతో పాటు ఇవ్వాలనుకున్న నాలుగున్నర కోట్ల విషయంపైనా ఐటీ అధికారులు దృష్టి సారించారు. రేవంత్‌ రెడ్డికి సంబంధించిన భూపాల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌పైనా అధికారులు తనీఖీలు చేస్తున్నారు. గత కొంత కాలంగా ఓటుకు కోట్లు కేసు నత్తనడకన నడుస్తోందని, కేసు నీరుగారుతుందంటూ విమర్శలు వినిపిస్తున్నా తరుణంలో ఐటీ దాడులు రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. గురువారం ఉదయం నుంచి చేపట్టిన ఐటీ సోదాల్లో అసలు దోషులు బయటకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement