నకిలీ వీసాల దందా సాగిస్తున్న ముఠా గుట్టు రట్టు

నకిలీ వీసాల దందా సాగిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. వీసా, పాస్‌పోర్టుల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్‌ కన్సెల్టెన్సీల పేరుతో వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతుందన్నారు. కస్టమర్లకు నకిలీ పత్రాలు ఏర్పాటు చేయడం కోసం వీరు మూడు నుంచి నాలుగు లక్షలు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. కెనడా, అమెరికా, ఇటలీ, స్పెయిన్‌, అరబ్‌ దేశాలకు వెళ్లే వారే లక్ష్యంగా ఈ ముఠా కార్యకాలాపాలు సాగిస్తుందని పేర్కొన్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top