ఉబెర్‌ ఒప్పందానికి డ్రైవర్ల సెగ

అంతర్జాతీయ సంస్థ ఉబర్‌తో  హైదరాబాద్ మెట్రోరైలు అవగాహన ఒప్పందానికి డ్రైవర్ షాక్‌  తగిలింది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఉబెర్‌ డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో  గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా తమకు జీతాలు పెంచాలంటూ  డ్రైవర్లు నినదించారు. అలవెన్సులు  కూడా సరిగ్గా  ఇవ్వడం లేదని  విమర్శించారు. సుమారు17మంది డ్రైవర్లు డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోతే ఉబెర్‌ యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో సమావేశం మధ్యలోనుంచే  ఉబెర్‌ సీవోవో  బార్నీ హర్ఫర్డ్ నిష్క్రమించారు.   

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top