బోరు బావిలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారి

మరో పసి ప్రాణం కోసం తల్లిదండ్రుల గుండెలవిసేలా విలపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో నాలుగేళ్ల ఓ చిన్నారి బోరు బావిలో పడిపోయింది. దేవాస్‌ జిల్లా ఉమరియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

తల్లిదండ్రులతో పోలానికి వెళ్లిన ఆ చిన్నారి.. ఆడుకుంటూ అటుగా వెళ్లి బావిలో పడిపోయింది. అది గమనించిన తల్లి గ్రామస్థులను అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి ఆ పాపను బయటికి తీసేందుకు యత్నిస్తున్నారు. సుమారు 40 అడుగుల లోతున బోర్‌ బావిలో పాప ఇరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top