ధర్మవరం వైఎస్సార్ సీపీ నేతలకు చెందిన వాహనాల ధ్వంసం కేసులో ఐదుగురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ అనంతరం ధర్మవరం ముదిగుబ్బలో టీడీపీ నేతలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఇక్కడ అరాచకంగా ప్రవర్తించిన పచ్చ పార్టీ శ్రేణులు ఓ అంబులెన్స్కు నిప్పుపెట్టారు. వైఎస్సార్సీపీ నేత నాగశేషుకు చెందిన జేసీబీ, హిటాచి వాహనాలు ధ్వంసం చేశారు.