వరంగల్లో దారుణం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంలో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఈ విషాదం భద్రకాళి ఫైర్ వర్క్స్లో బుధవారం జరిగింది. భద్రకాళి ఫైర్ వర్క్స్ గోదాములో ఒక్కచోటు చిన్నగా నిప్పురాజుకోవడంతో బాణాసంచా కాలడం మొదలైంది. కొన్ని క్షణాల్లోనే పెద్ద ఎత్తున బాణాసంచా దగ్దం కావడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో గోదాముల పనిచేస్తున్న కార్మికులను రక్షించేందుకు వీలులేక పోవడంతో ఆరుగురు వ్యక్తులు మంటల్లో ఆహుతయ్యారు. ఇంకా పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.