ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టుకుంటున్నారు. బుధవారం జిల్లాలోని రైతులు వైఎస్ జగన్ని కలిశారు. ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నీటిని పర్చూరు తీసుకువస్తే, తీవ్ర కరువుతో అల్లాడుతున్న పరిసర గ్రామాలకు సాగు, తాగునీరు అందుతుందన్నారు. ఈమేరకు ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలంటూ జననేతకు వినతి పత్రం ఇచ్చారు. దివంగత నేత వైఎస్ఆర్ హాయాంలో కృష్ణా నీటిని తీసుకురావడానికి రూ.70 లక్షలతో సర్వే చేయించారని, ఆయన మరణం అనంతరం వచ్చిన ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదని రైతులు విన్నవించుకున్నారు.
సాగునీటి సమస్యపై వైఎస్ జగన్ను కలిసిన రైతులు
Mar 7 2018 11:02 AM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement